AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Thursday 4 January 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 4 2018


*🌎చరిత్రలో ఈ రోజు/జనవరి 4*🌎

*🕘సంఘటనలు*🕘

❤1988:గామిట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్‍ఫర్ (GIFT) అనే ప్రక్రియ ద్వారా భారతదేశపు మొట్టమొదటి శిశువు జననం.

*❣జననాలు*❣

❤1643: ఐజాక్ న్యూటన్, సుప్రసిద్ధ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. (మ.1727)

❤1809: లూయీ బ్రెయిలీ, ఫ్రెంచ్ విద్యావేత్త మరియు బ్రెయిలీ లిపి సృష్టికర్త. (మ.1852)

❤1915: పాకాల తిరుమల్ రెడ్డి, ప్రముఖ చిత్రకారుడు. (మ.1996)

❤1926: కోటంరాజు సత్యనారాయణ శర్మ, బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగు రచయిత.

❤1942: మెట్ల సత్యనారాయణ రావు, ప్రముఖ రాజకీయనాయకుడు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు.(మ.2015)

❤1945: ఎస్.కె. మిశ్రో, నటుడు, నాటక రచయిత, దర్శకుడు.

❤1957: గురుదాస్ మాన్, పంజాబ్ కు చెందిన ప్రముఖ గాయకుడు, రచయిత, నృత్య దర్శకుడు, మరియు నటుడు.

❤1963: మే-బ్రిట్ మోసర్, నార్వే దేశానికి చెందిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త, నోబుల్ బహుమతి గ్రహీత.

❤1984: జీవా, ప్రముఖ భారతీయ నటుడు.

*🍃మరణాలు*🍃

❤1974: గోపాల
స్వామి దొరస్వామి నాయుడు, ప్రఖ్యాతి గాంచిన ఇంజనీరు,"భారతదేశపు ఎడిసన్"గా ప్రసిద్ధుడు. (జ.1893)

❤2007: కోరాడ నరసింహారావు, ప్రఖ్యాత కూచిపూడినాట్యాచార్యుడు. (జ.1936)

❤2015: ఆహుతి ప్రసాద్, ప్రముఖ తెలుగు సినీ నటుడు. (జ.1958)

❤2016: సరోష్ హోమీ కపాడియా భారత సుప్రీం కోర్టు 38వ ప్రధానన్యాయమూర్తి. (జ.1947)

*జాతీయ దినాలు*🇮🇳

❤వరల్డ్ బ్రెయిలీ దినోత్సవం

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏

 *🌺సుభాషిత వాక్కు🌺*

*"మనిషికి అహాంకారం ఉన్నా పరవాలేదు. అనుమానం మాత్రం ఉండకూడదు.  ఎందుకంటే... అహాంకారం కన్నా అనుమానం చాలా ప్రమాదం...!"*

*"If you want to know what a man's like, take a good look at how he treats his inferiors, not his equals."*

 *🌷మంచి పద్యం*

*ధనము గల్గి నెడల ధరపైన విలువలే&*
*గారవింతురెపుడు గరిమ చాటు*
*దాన గుణములేని ధనము వర్ధిల్లదు*
*మానవతను జాట మనుజు డగును.*

*❗భావం:*

 *డబ్బున్న వాడికే ఈ భూమ్మీద విలువెక్కువ.అతని గొప్పతనాన్ని అందరు కీర్తిస్తూ గౌరవిస్తారు.కాని దాన గుణం లేకపోతే అతని సంపద ఏవిధంగాను వృద్ధి చెందదు.మానవత్వం ఉన్నవాడే మనిషి అనిపించుకుంటాడు.అతనే అధిక సంపన్నుడు.*

*♦నేటి జీ కె*♦

*🌎ఐక్యరాజ్యసమితి సెక్రెటరి జనరల్స్*:🌎

*1. _ట్రిగ్విలీ (NORWAY) 1946-52_*

*2.  _డాగ్ హమ్మర్స్ జోల్డ్  (SWEEDEN) 1953-61_*

*3. _యూథాoట్  (MYANMAR) 1962-71_*

*4. _కుర్ట్ వాల్డెమ్ (AUSTRIA) 1972-81_*

*5. _జేవియర్ పెరిజ్ డిక్యూలర్ (PERU) 1982-91_*

*6. _బౌత్రోస్ ఘలీ (EGYPT) 1992-96_*

*7. _కోఫి అన్నన్  (GHANA) 1997-2007_*

*8. _బాన్ కి మూన్ (SOUTH KOREA)*

*9.ఆంటోనియో గుటేెరెస్ (పోర్చుగల్)*


[1/4, 07:55] జి కె అడ్మిన్: 🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿🌷🌿


*‬🎧మనం సంతోషంలో  ఉన్నపుడు పాటలను  వినాలి! బాధలో ఉన్నపుడు ఆపాటలను అర్ధం చేసుకోవాలి!*

*‬🍂అనాధ ఆశ్రమంలో పేదవారి చిన్నపిల్లలు ఉంటారు! వృద్ధా ఆశ్రమంలో ధనికుల తల్లిదండ్రులు ఉంటారు!*

*‬🏥చచ్చిపోతున్నా కూడా వైద్యం చేయనివి గవర్నమెంటు ఆసుపత్రులు. చచ్చిపోయినాక కూడా వైద్యం చేసేవి కార్పొరేట్ ఆసుపత్రులు.*

*🍁నువ్వు అర్థం అవ్వట్లేదు అంటే... వాళ్ళకి నువ్వు అవసరం లేదు అని అర్ధం. నీ మాటలు అర్ధం కావట్లేదు అంటే నిన్ను పరిగణలోకి తీసుకున్నదే లేదు అని వివరం.*

*‬🌻చిరునవ్వు చాలావరకు సమస్యలు పరిష్కరిస్తుంది! మౌనం అసలు సమస్యలు రాకుండా నివారిస్తుంది!*

*🌸పూజలుచేసి దేవుడికోసం మనం వెతుకుతాం. దానంచేస్తే ఆయన మనకోసం వెతుక్కుంటూ వస్తాడు*

*‬🍀గుడికి వెళ్లే మగవాళ్ల సంఖ్య, జిమ్ కు వెళ్లే ఆడవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతుంది*


*💟🌳 JOY OF SHARING 🌳💟*
[1/4, 07:55] జి కె అడ్మిన్: 🌷🌷 *Good morning* 🌷🌷

 A day without laughter is a day wasted.
[1/4, 07:56] జి కె అడ్మిన్: *🤘 నేటి సుభాషితం🤘*

*గొప్ప వంశంలో పుట్టడం కన్నా గొప్పగా ప్రజలచేత గుర్తుచేసుకోబడడం మెరుగైనది.*
[1/4, 07:57] జి కె అడ్మిన్: *Health tip*

🍌 *ఈ లాభాలు తెలిస్తే.. అర‌టి పండు తొక్క‌ను ఇక ప‌డేయ‌రు.*

*మ‌న‌కు అర‌టిపండ్లు ఏడాది పొడవునా ల‌భిస్తాయి. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు కూడా అర‌టిపండ్లు అందుబాటులో ఉంటాయి. ఎవ‌రికైనా వీటిని చూడ‌గానే తినాల‌ని అనిపిస్తుంది*. 

*అరటి పండ్ల‌లో అనేక పోషకాలు, కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ బి6, బి12, మెగ్నిషియం, పొటాషియం వంటి పోషకాలు అర‌టి పండ్ల‌లో పుష్కలంగా ఉంటాయి.* 

*దీంతో మ‌న శ‌రీరానికి సంపూర్ణ పోష‌ణ అందుతుంది. అయితే కేవ‌లం అర‌టి పండే కాదు, దాని తొక్క‌తో కూడా మ‌న‌కు ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.* 

*1. అరటి పండు తొక్క లోప‌లి వైపును దంతాల‌పై రుద్దితే దంతాలు తెల్ల‌గా మెరుస్తాయి.వరుసగా వారం రోజుల పాటు ఇలా రుద్దడం వల్ల దంతాలు తళ తళా మెరుస్తూ ఉంటాయి. దంతాలు పచ్చగా ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది*. 

*2. అరటి పండు తొక్క పులిపిర్లను తొలగించడంలో సహాయపడుతుంది. కొత్తవి రాకుండా చేస్తుంది.అందుకు ఏం చేయాలంటే.. పులిపిర్లు ఉన్న భాగంపై అరటి తొక్కతో రుద్దాలి. అనంత‌రం రాత్రంతా పులిపిర్లు ఉన్నచోట అరటి తొక్కను క‌ట్టుగా క‌ట్టాలి. దీంతో పులిపిర్లు త‌గ్గిపోతాయి.*

*3. మన దేశంలో ప‌లు ప్రాంత వాసులు అర‌టి పండు తొక్క‌ల‌ను చికెన్‌లో వేసి వండుతారు. అనంత‌రం తీసేస్తారు. దీంతో ఆ కూర‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయ‌ని విశ్వసిస్తారు.*

*4. అర‌టి పండు తొక్క‌ను ముఖంపై రోజూ 5 నిమిషాల పాటు రుద్దాలి. ఇలా వారం పాటు చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, మొటిమ‌లు పోతాయి.*

*5. అర‌టి పండు తొక్క‌ను, ఒక కోడిగుడ్డును తీసుకుని వాటిని మిక్సీలో వేసి ప‌ట్టి మిశ్ర‌మంగా చేసుకుని ముఖానికి రాయాలి. 20 నిమిషాలు ఆగాక క‌డిగేయాలి. వారంలో ఇలా రెండు సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది.ముఖంపై ఉండే ముడ‌త‌లు పోతాయి.* 

*6. శ‌రీరంలో ఏ భాగంలోనైనా నొప్పిగా ఉంటే దానిపై అర‌టి పండు తొక్క‌ను రుద్దాలి. దీంతో నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.*

 *7. దోమ‌లు, పురుగులు, కీట‌కాలు కుట్టిన చోట అర‌టి పండు తొక్క‌ను రుద్దితే నొప్పి, మంట‌, దుర‌ద త‌గ్గుతాయి. 8. షూస్, వెండి వ‌స్తువులు, తోలు దుస్తుల‌ను అర‌టి పండు తొక్క‌తో రుద్దితే అవి ప్ర‌కాశ‌వంతంగా మెరుస్తాయి.*

*9. కంటి ఆరోగ్యాన్ని సంర‌క్షించ‌డంలోనూ అర‌టి పండు తొక్క ప‌నిచేస్తుంది. అర‌టి పండు తొక్క‌ల‌ను క‌ళ్ల‌పై కొంత సేపు ఉంచుకుంటే సూర్యుని నుంచి వ‌చ్చే అతినీల లోహిత కిర‌ణాల ప్ర‌భావం నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.*
[1/4, 07:58] జి కె అడ్మిన్: సర్ ఐజాక్ న్యూటన్ ( జనవరి 4, 1643 - మార్చి 31, 1727) ఒక ఆంగ్లేయ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. ఒక సిద్ధాంత కర్త మరియు తత్వవేత్త కూడా. ఈ ప్రపంచంలో అందరి కంటే గొప్ప శాస్త్రజ్ఞుడని కొనియాడదగిన వాడు. ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం మరియు అది సైన్సుగా ఎలా పరిణామం చెందింది? అన్న అంశంపై ఆయన ఎనలేని కృషి చేశారు. అందువలననే ఆధునిక ప్రపంచం న్యూటన్ను సైన్సు పితామహుడిగా గౌరవస్తుంది. 1687లో ప్రచురితమైన ఆయన శాస్త్ర గ్రంథం en:Philosophiæ Naturalis Principia Mathematica, సైన్సు చరిత్రలో అత్యంత ముఖ్యమైన రచన. ఈ గ్రంథంలో గురుత్వాకర్షణ శక్తిగురించి, న్యూటన్ ప్రతిపాదించిన మూడు గమన నియమాల గురించి ప్రస్తావించాడు. తరువాతి మూడు శతాబ్దాల పాటు భౌతిక ప్రపంచానికి సైన్సు దృక్కోణంగా వెలుగొందిన యాంత్రిక శాస్త్రానికి తరువాత ఆధునిక ఇంజనీరింగ్ కూ ఈ గ్రంథమే పునాది. ఏదైనా ఒక వస్తువు యొక్క గమనం, భూమి మీదైనా లేక ఇతర గ్రహాలమీదైనా ఒకే రకమైన నియమాల మీద ఆధారపడి ఉంటుందని నిరూపించాడు. దీనికి ఆధారంగా కెప్లర్ నియమాలకూ మరియు గురుత్వాకర్షణ సిద్ధాంతాలకూ గల సామ్యాన్ని దృష్టాంతంగా చూపాడు. దీంతో సూర్య కేంద్రక సిద్ధాంతంపై పూర్తిగా అనుమానం తొలిగిపోవడమే కాకుండా ఆధునిక సైన్సు అభివృద్ధి కొత్త పుంతలు తొక్కింది.
ఐజాక్ న్యూటన్ జనవరి 4, 1643లో లింకన్ షైర్ కౌంటీకి చెందిన ఒక చిన్న కుగ్రామమైన Woolsthorpe Manor అనే గ్రామంలో జన్మించాడు. న్యూటన్ జన్మించే సమయానికి ఇంగ్లండు ప్రంపంచమంతా పాటించే క్యాలెండరును పాటించక పోవడం మూలాన ఆయన జన్మదినం డిసెంబరు 25, 1642గా నిక్షిప్తం చేయబడింది. న్యూటన్ తండ్రి చనిపోయిన మూడు మాసాలకు జన్మించాడు. నెలలు నిండక మునుపే పుట్టడం వలన పసికందుగా ఉన్నపుడు న్యూటన్ చాలా చిన్నగా ఉండేవాడు. న్యూటన్ తల్లి Hannah Ayscough ఆ పసికందు ఒక లీటర్ పాత్రలో పట్టగలడని చెప్పినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు. న్యూటన్ కు మూడు సంవత్సరాల వయసు రాగానే అతడి తల్లి, ఇతడిని ఆమె తల్లియైన Margery Ayscough సంరక్షణలో వదిలేసి వేరొక వ్యక్తిని (Barnabus Smith) పెళ్ళాడి అతనితో వెళ్ళిపోయింది. చిన్నప్పుడు న్యూటన్ తన పెంపుడు తండ్రిని ద్వేషించే వాడు. అంతేకాక అతన్ని పెళ్ళి చేసుకున్నందుకు తన తల్లి మీద కూడా ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఇది 19 ఏళ్ళ లోపు అతను చేసిన పొరపాట్ల జాబితా నుంచి వెల్లడి అయింది.

యాంత్రికశాస్త్రం మరియు గురుత్వాకర్షణ

"ఎడ్మండ్ హాలే ఆర్థిక సహాయంతో జూలై 1687 లో Principia ప్రచురించబడింది. ఈ పనిలో,న్యూటన్ మూడు సార్వత్రిక చట్టాలు(universal law of gravitation)ని పేర్కొన్నాడు. ఇది ఒక విప్లవాత్క్మక అవిష్కరణ.." Principia తో, న్యూటన్ అంతర్జాతీయంగా గుర్తించబడిన్నాడు.అతను స్విస్ జన్మించిన గణిత శాస్త్రజ్ఞుడు నికోలస్ Fatio డి Duillier తో తీవ్రమైన సంబంధం ఏర్పడింది, శాస్త్రజ్ఞుడు నికోలస్ Fatio డి Duillier సహా, అభిమానులతో ఒక సర్కిల్ ఏర్పాటు చేసుకున్నాడు.కాని ఇది ఆకస్మికంగా 1693 లో ముగిసింది, మరియు అదే సమయంలో న్యూటన్ నాడీ వ్యవస్థ దెబతింది.
[1/4, 07:58] జి కె అడ్మిన్: 💐ఋషి వాక్కు💐

చెట్టు తన పండు తాను తినదు, నది తన నీరు తాను త్రాగదు, అట్లే సత్పురుషులు చేయు పనులు పరుల కోసమే చేస్తారు.

💐💐💐💐💐
[1/4, 07:59] జి కె అడ్మిన్: *🗓 నేటి పంచాంగం 🗓*


*తేది :  4, జనవరి 2018*
సంవత్సరం : హేవిళంబినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : పుష్యమాసం
ఋతువు : హేమంత ఋతువు
కాలము : శీతాకాలం
వారము : గురువారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : తదియ
(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 41 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 36 ని॥ వరకు)
నక్షత్రం : పుష్యమి
(నిన్న ఉదయం 8 గం॥ 51 ని॥ నుంచి ఈరోజు ఉదయం 6 గం॥ 8 ని॥ వరకు)
యోగము : విష్కంభము
కరణం : వణిజ
వర్జ్యం :
ఈరోజు వర్జ్యం లేదు.
అమ్రుతఘడియలు :
(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 27 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 1 గం॥ 52 ని॥ వరకు)
దుర్ముహూర్తం :
(ఉదయం 10 గం॥ 29 ని॥ నుంచి ఉదయం 11 గం॥ 13 ని॥ వరకు)(మద్యాహ్నం 2 గం॥ 56 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 40 ని॥ వరకు)
రాహుకాలం :
(మద్యాహ్నం 1 గం॥ 43 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 6 ని॥ వరకు)
గుళికకాలం :
(ఉదయం 9 గం॥ 33 ని॥ నుంచి ఉదయం 10 గం॥ 56 ని॥ వరకు)
యమగండం :
(ఉదయం 12 గం॥ 20 ని॥ నుంచి మద్యాహ్నం 1 గం॥ 43 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 47 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 54 ని॥ లకు
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : కర్కాటకము
[1/4, 08:00] జి కె అడ్మిన్: *💎 నేటి ఆణిముత్యం 💎*


పెద్దలు విచ్చేసినచో 
బద్దకముననైన దుష్ట పద్ధతి నైనన్, 
హద్దెఱిఁగి లేవకున్నన్ 
మొద్దువలెం జూతు రతని ముద్దు కుమారా!

*తాత్పర్యం:*

 ఓ కుమారా! పెద్దలు నీ దగ్గరకు వచ్చినపుడు సోమరితనము చేతగానీ, దుర్మార్గవృత్తితో గానీ, మర్యాదతో లెవకున్న యెడల నిన్ను వారు మొద్దురీతిగా జూతురే గాని నీవొక ప్రాణము గల మనిషివని తలంపరు.

*✍🏼 నేటి కథ ✍🏼*

*అత్తగారి పెత్తనం*

రామవరం అనే గ్రామంలో కాంతమ్మ అనే ఆవిడా ఉండేది.ఆమె చాల గయ్యాళిది. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు.వాడి పేరు రంగడు. వాడంటే ఆమెకు చాలఇష్టం . కాని అడిగినవన్నీ ఇస్తే చెడిపోతాడని ఇచ్చేది కాదు.ఆ అలవాటు అందరి మీదకూడా చూపడం వచ్చింది .

కొన్ని రోజులకు అందరికి ఆవిషయం తెలిసి తమకు కావలసిన వాటిని ఆమెకు వ్యతిరేకంలో చెప్పి చేయించు కొనేవారు.  ఆపై నవ్వుకునేవారు . ఆవిషయం భర్త చెప్పిన వినిపించుకునేది కాదు . అలా జరుగుతుండగా రంగడికి పెళ్లీడు వచ్చింది. అదే గ్రామంలో విజయ అనే చక్కని పిల్ల ఉండేది.ఆమె అంటే రంగడికి చాలా ఇష్టం.కాని ఆ విషయం తల్లికి తెలిస్తే విజయతో పెళ్లి జరగానీయదని, స్నేహితుల దగ్గర విజయతో తనకు పెళ్లి ఇష్టం లేదని చెప్పాడు. ఆ విషయం కాంతమ్మకు తెలిసింది. విజయ తల్లి తండ్రులతో మాట్లాడి రంగడికి విజయకు పెళ్లిచేసింది.

కొత్తకోడలిపై కూడా తన పెత్తనం సాగించేది.రంగడు తన తల్లి మంచిదేనని,కాని ఆవిడకున్న అలవాటు సంగతి చెప్పి ఆమెను ఎప్పుడు బాధ పెట్టవద్దని చెప్పాడు. విజయ సరేనన్నది .కాంతమ్మ ఎదిచేబితే అదే చేసేది . అప్పటి నుండి విజయ తన ఇష్టా ఇష్టాలు అత్తకు తెలియనిచ్చేది కాదు. ఒకసారి విజయకు కాకర కాయ కూర తినాలనిపించింది. కాని అత్తకు తెలిస్తే తిననివ్వదని తెలిసి, అత్తా వినేటట్లుగా తనకు కాకర కాయ కూర అంటే అయిష్టమని ,పుట్టింట్లో కూడా కాకర కాయ కూర చేస్తే తినేదాన్నికాదని ,అమ్మ అరిస్తే కాకర కాయ కూర వేయించుకుని తండ్రికో ,చెల్లెళ్ళకో వేసేదాన్నని రంగడితో చెప్పింది .

కాంతమ్మ కాకర కాయ కూర చేసి కోడలితో తినమని చెప్పింది. విజయ తిననన్నది .  తినాల్సిందేనని కాంతమ్మ పట్టు పట్టింది .రంగడు వచ్చాక తింటానన్నదివిజయ. ఇప్పుడే తినాలని కాంతమ్మ పట్టు పట్టింది .

విజయ ఎడుస్తున్నట్లు నటిస్తూ కూర ఇష్టంగా తిన్నది. అలా తనకు కావలిన వాటిని సాధించుకునేది. కొద్ది సంవత్సరాల తర్వాత కాంతమ్మ జబ్బు చేసి చనిపోయంది  అప్పటినుండి విజయ తనకు కావలసినవన్నీ తను చేసుకునేది

*📖 మన ఇతిహాసాలు 📓*

*అర్జునుడు !*
.
మహావదాన్యుడు, ఇంద్రియనిగ్రహం గలవాడు, భయంకరమైన పరాక్రమం చేత శత్రువులను తరింపజేయగలవాడు, స్వచ్ఛమైన వర్చస్సు గలవాడు, ఎవరికినీ జయింప శక్యం కానివాడు. "అవశగతి గామరోషాదివికారము లొందినను మదిని ధర్మపథప్రవిహతి గానీడు" అంటూద్రుపది ప్రశంసిస్తుంది.
.
పొందు కోరి విఫలమనోరథయైన ఊర్వశి శాపం తెలిసి దేవంద్రుడు, "నీయట్టి ధైర్యవంతుని నే యుగములనైన గాన మెన్నండును ధర్మాయత్తమతివి మునులకు నీ ఇంద్రియ జయము కీర్తనీయము తండ్రీ" అంటాడు. నీవు ధర్మాత్ముడివి. నీవంటి ధైర్యవంతుని ఏ కాలంలోనైనా చూడలేము. నీవు ఇంద్రియాలపై సాధించిన విజయం ఋషీశ్వరులు కూడా ఉగ్గడించతగింది అంటూ కొడుకును శ్లాఘించాడు. 

అర్జునుని స్థిరవిజయసాధనకు కర్మకౌశలము, సౌశీల్యము ముఖ్యకారణములు. సభాపర్వంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుతో పార్థుడి రక్షాబలం, భీముడి భుజబలం, నా నీతిబలం నీకుండగా అసాధ్యమేముంది? అని అంటాడు. 

పురుషకారానికి దైవబలం తోడైతే విజయం తథ్యమని ఆంధ్రమహాభారతం పార్థుని చరిత్ర ద్వారా తెలియజేస్తున్నది. 

మహాప్రస్థాన సమయంలో అర్జునుడు యాత్ర సాగిస్తూ తన గాండీవాన్ని వదలక వెంట తీసుకుపోతున్నాడు. జీవితంలో గాండీవం అతనికంత కీర్తి నార్జించింది. అందుచేత దాని మీద అర్జునునకంత మమకారము! చివరకు అగ్నిదేవుడు హెచ్చరించిన గాని అర్జునుడు దానిని వదలలేదు.

*✅ తెలుసుకుందాం ✅*

*⭕చేపలు తలకిందులవుతాయేం?*

✳ఏ ప్రాణి చనిపోయిన తర్వాతైనా దాని శరీరం నిండా వాయువులు ఉత్పన్నమవుతాయి. చేపల్లో కూడా ఇలాగే జరుగుతుంది. తేలికైన ఈ వాయువుల కారణంగానే చనిపోయిన చేపలు నీటిపైన తేలుతాయి. వాయువులు ముఖ్యంగా చేపల కిందివైపు ఉండే ఉదరభాగంలో ఉత్పన్నమవుతాయి. ఫలితంగా ఉదరభాగం ఉత్ల్పవన (buoynacy) ప్రభావానికి గురవుతుంది. చేపల గరిమనాభి (centre of gravity) ఉదర భాగంలో కేంద్రీకరించి ఉండడంతో ఆ భాగం నీటి ఉపరితలానికి చేరుకుంటుంది. అందువల్లనే చనిపోయిన చేప తలకిందులై వెల్లకిలా తేలుతుంది. తర్వాత కొంత కాలానికి చనిపోయిన చేప విఘటనం (decay) చెంది దాని లోని వాయువులన్నీ విడుదలవడంతో అది నీటిలో మునిగిపోతుంది.

🙏         _*శుభోదయం*_    🙏
        --------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
        -------------------------
" జీవితంలో ధనం నష్టపోతే
కొంత కోల్పోయినట్టు, కానీ
వ్యక్తిత్వం కోల్పోతే సర్వస్వం పోగొట్టుకున్నట్టే. "

          *-స్వామి వివేకానంద*
       --------------------------
🌹 _*నేటీ మంచి మాట*_ 🌹
      ---------------------------
" ఉన్న వాటి విలువ అవి మన దగ్గర ఉన్నంత వరకు అర్థం కాదు...
ఒకసారి అవి చేజారిన తర్వాత అర్థమయినా ఏమి చేయలేం...
అది కాలమయినా...
 స్నేహితులైన...
 బంధువులైనా... 
చివరికి వస్తువులైనా... "

         💦🐬🐥🐳💦
*🚩ఇక నుంచి పాఠశాలల్లోనూ జీరో అవర్‌🌴*

బెర్హంపూర్‌(ఒడిశా): ఉరుకులు పరుగుల జీవితం. ప్రపంచంలో నిత్యం ఏదో ఒక చోట నూతన ఆవిష్కరణ. పొద్దున లేచింది మొదలు ప్రతి క్షణం కాలంతో పోటాపోటీగా ప్రయాణం చేస్తూనే ఉంటాం. ఈ క్రమంలో సమాజాన్ని సంస్కరించడంతోపాటు మనల్ని కూడా సంస్కరించుకుంటాం. కానీ చదువుల విషయంలో మాత్రం అవే పాతకాలపు ఆలోచనాధోరణులు. కిలోల కొద్దీ బరువుండే పుస్తకాలతో కుస్తీ పట్టి మరీ బట్టీ చదువులకే పరిమితమవుతున్నాం. ర్యాంకుల కోసం రాత్రింబవళ్లు నిద్రాహారాలు సైతం మానుకొని మరీ కళ్లజోడు పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇలా మిడిమిడి జ్ఞానంతో నేర్చుకున్న చదువుల వల్ల ఇంజినీరింగ్‌ చదివిన వాళ్లు సైతం ఇంటిపనులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది. ఈ పద్ధతికి టాటా చెప్పి పిల్లలను వారికి వారే నేర్చుకునేలా చేయాలని ఒడిశా ప్రభుత్వం సంకల్పించింది. 
జ్ఞానం అంటే కేవలం పుస్తకాల ద్వారానే కాదు. మన కళ్ల ముందున్న పరిసరాల ద్వారా కూడా పొందవచ్చని తెలియజేయాలని తలచింది. దానికోసం ప్రత్యేకంగా తరగతి గదుల్లో శూన్యగంట(జీరో అవర్‌) అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ‘‘పుస్తకాలల్లో ఉన్న దాన్ని చదువుకొని జ్ఞానం సంపాదించే రోజులు కావు. పిల్లలకేమి కావాలో వారు పరిశీలించిన దాని ద్వారానే నేర్చుకోవాలని’’ 
♦గంజాం కలెక్టర్‌ ప్రేమ్‌ చంద్రా చౌధురీ అన్నారు. పరీక్షలో పాసై, మంచి మార్కులు సాధించడం వలన పిల్లల్లో జ్ఞానాన్ని అంచనా వేయలేమని ఆయన తెలిపారు. జీరోఅవర్‌ కోసం ఒడిశా ప్రభుత్వం మొదటి దశలో జిల్లాలోని 350 పాఠశాలలను ఎంచుకుంది.
♦బరంపురం లో టౌన్ హైస్కూల్ లో ప్రారంభం అవుతుంది
 ఆ పాఠశాలల్లో పిల్లలకు వారానికో రోజులో ఒక గంట ప్రత్యేకంగా కేటాయిస్తారు. ప్రత్యేక ఉపాధ్యాయుని పర్యవేక్షణలో ఎలాంటి పాఠాలు చెప్పకుండా వారి ఇష్టానికి వదిలేస్తారు. ఆ సమయంలో పిల్లలే స్వతహాగా ఒక అంశాన్ని ఎంచుకొని, దానిపై చర్చించి, దాని గురించి పూర్తిగా పరిశోధిస్తారు.

 ‘‘జీరోఅవర్‌ వలన పిల్లల ఆలోచనా విధానం మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసం సైతం పెరిగి సులభంగా నేర్చుకోవాలనే ఆలోచన కలుగుతుందని’’ జిల్లా విద్యాశాఖాధికారి సతన్‌ పాండా తెలిపారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష్యా అభియాన్‌(ఆర్‌ఎంఎస్‌ఏ) దీనికి సంబంధించిన సదుపాయాలను కల్పిస్తుందని ఆయన అన్నారు.

*Jobs*

*ట్రాన్స్కోలో కొలువులు పదోతరగతి, ఐటీఐ వారికి జేఎల్ఎం*

ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (ట్రాన్స్కో) జూనియర్ లైన్మ్యాన్, సబ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

*-ట్రాన్స్కో*: 400 కేవీ సబ్స్టేషన్స్

-11, 220 కేవీ సబ్స్టేషన్స్

-72, 132 కేవీ సబ్స్టేషన్స్

-214తో ట్రాన్స్మిషన్ లైన్స్ను నిర్వహిస్తుంది. వీటికి అదనంగా మరికొన్ని 400, 220, 132 కేవీ సబ్స్టేషన్స్ను నిర్మిస్తున్నది. ట్రాన్స్కో ప్రధాన కార్యాలయం హైదరాబాద్లో ఉంది.

*జూనియర్ లైన్మ్యాన్*

-ఖాళీల సంఖ్య 1100.

-వీటిలో ఓసీ (జనరల్n 346, మహిళn 175), 

బీసీ ఏ (జనరల్n 54, మహిళn 28), 

బీసీ బీ (జనరల్n 58, మహిళn 42),

బీసీ సీ (జనరల్n 15), 

బీసీ డీ (జనరల్n 46, మహిళn 23), 

బీసీ ఈ (జనరల్n 26, మహిళn 15),

ఎస్సీ (జనరల్n 108, మహిళn 58), 

ఎస్టీ (జనరల్n 41, మహిళn 26), 

పీహెచ్సీ (జనరల్n 27, మహిళn 12) ఖాళీలు ఉన్నాయి.

*జోన్ల వారీగా ఖాళీల వివరాలు*

*సదరన్ జోన్:*

n ఎస్ఈ/ఓఎంసీ/ మెట్రోn సెంట్రల్ (హైదరాబాద్)n 105

-ఎస్ఈ/ ఓఎంసీ/ మెట్రో ఈస్ట్ (రంగారెడ్డి)n 166

-ఎస్ఈ/ఓఎంసీ/ సంగారెడ్డి n 141

-ఎస్ఈ/ఓఎంసీ/ మహబూబ్నగర్n 121

-ఎస్ఈ/ఓఎంసీ/ నల్లగొండn 127

*నార్తర్న్ జోన్:*

-ఎస్ఈ/ఓఎంసీ/ వరంగల్
-110

-ఎస్ఈ/ఓఎంసీ/ ఖమ్మంn
 6

-ఎస్ఈ/ఓఎంసీ/ కరీంనగర్n 122

-ఎస్ఈ/ఓఎంసీ/ నిజామాబాద్n 92

-ఎస్ఈ/ఓఎంసీ/ ఆదిలాబాద్n 56

*వయస్సు*: 2017, జూలై 1 నాటికి 18 n 35 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేండ్లు, పీహెచ్సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

*-పేస్కేల్*: రూ. 15585 n 305n 16500n 445n 18725n 580n 21625n 715n 25200

*-విద్యార్హతలు*: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి పదోతరగతి లేదా తత్సమాన కోర్సుతోపాటు ఐటీఐలో ఎలక్ట్రికల్/వైర్మ్యాన్ లేదా రెండేండ్ల ఇంటర్ (ఎలక్ట్రికల్) వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణత.

*-గమనిక*: విద్యుత్ (పోల్/టవర్) స్తంభం ఎక్కగలిగే సామర్థ్యం ఉండి, పరీక్షలో అర్హత సాధించినవారిని మాత్రమే జేఎల్ఎం పోస్టుకు ఎంపికచేస్తారు)

-ఫీజు: రూ. 100 /n (ప్రతి ఒక్కరు తప్పక చెల్లించాలి)

-ఎగ్జామినేషన్ ఫీజు: రూ. 120/n

-ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్సీ అభ్యర్థులకు ఎగ్జామినేషన్ ఫీజు లేదు.

-ఎంపిక: రాతపరీక్ష ద్వారా

-కాంట్రాక్టు/అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నవారికి పనిచేస్తున్న కాలాన్ని బట్టి 20 శాతం వెయిటేజీ ఇచ్చి మొత్తం 100 మార్కులకు మెరిట్ జాబితాను తయారుచేసి తుది ఎంపికచేస్తారు.

*-గమనిక*: రాతపరీక్షలో క్వాలిఫై అయిన కాంట్రాక్టు/అవుట్సోర్సింగ్ అభ్యర్థులకు మాత్రమే 20 వెయిటేజీ ఇస్తారు.

-ఇన్సర్వీస్ అభ్యర్థులకు ప్రతి ఆరు నెలలకు 1 మార్కు చొప్పున వెయిటేజీ ఇస్తారు

*రాతపరీక్ష:*

-రాతపరీక్ష 80 మార్కులకు ఉంటుంది. ఇవి మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో ఇస్తారు.

-ప్రతి ప్రశ్నకు 1 మార్కు. సెక్షన్ ఏలో 65 ప్రశ్నలు ఇస్తారు. ఇవి ఐటీఐలో కోర్ సబ్జెక్టు నుంచి వస్తాయి. సెక్షన్ బీలో 15 ప్రశ్నలు. ఇవి జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి ఇస్తారు.

-పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు (120 నిమిషాలు)

-రాతపరీక్షలో ఓసీ n 40, బీసీ n 35, ఎస్సీ/ఎస్టీ, పీహెచ్సీ అభ్యర్థులకు 30 శాతం మార్కులను క్వాలిఫయింగ్ మార్కులుగా నిర్ణయించారు.

*-గమనిక*: విద్యుత్ స్తంభం ఎక్కే పరీక్షలో తప్పనిసరిగా అర్హత సాధించాలి. లేదంటే తుది ఎంపికకు పరిగణనలోకి తీసుకోరు.

*ముఖ్య తేదీలు*

*-దరఖాస్తు*: ఆన్లైన్లో జనవరి 5 నుంచి ప్రారంభం

*-ఫీజు చెల్లించడం ప్రారంభం*: జనవరి 4

*-ఫీజు చెల్లించడానికి చివరితేదీ*: జనవరి 20

*-దరఖాస్తు దాఖలుకు చివరితేదీ*: జనవరి 20

*-హాల్టికెట్ల డౌన్లోడింగ్:* ఫిబ్రవరి 5

*-పరీక్షతేదీ*: ఫిబ్రవరి 11 (మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు)

*-పరీక్ష కేంద్రాలు:*

 జీహెచ్ఎంసీ పరిధిలోని పలు కేంద్రాల్లో నిర్వహిస్తారు

-వెబ్సైట్: http//tstransco.cgg.gov.in


*పాఠశాల అసెంబ్లీ కోసం*

                *సుభాషిత వాక్కు*

*"మనిషికి అహాంకారం ఉన్నా పరవాలేదు.*
*అనుమానం మాత్రం ఉండకూడదు.  ఎందుకంటే... అహాంకారం కన్నా అనుమానం చాలా ప్రమాదం...!"*

*"If you want to know what a man's like, take a good look at how he treats his inferiors, not his equals."*

                    *మంచి పద్యం*

*ధనము గల్గి నెడల ధరపైన విలువలే&*
*గారవింతురెపుడు గరిమ చాటు*
*దాన గుణములేని ధనము వర్ధిల్లదు*
*మానవతను జాట మనుజు డగును.*

*భావం:*

 *డబ్బున్న వాడికే ఈ భూమ్మీద విలువెక్కువ.అతని గొప్పతనాన్ని అందరు కీర్తిస్తూ గౌరవిస్తారు.కాని దాన గుణం లేకపోతే అతని సంపద ఏవిధంగాను వృద్ధి చెందదు.మానవత్వం ఉన్నవాడే మనిషి అనిపించుకుంటాడు.అతనే అధిక సంపన్నుడు.*

*నేటి జీ కె*

*ఐక్యరాజ్యసమితి సెక్రెటరి జనరల్స్*:

1. _ట్రిగ్విలీ (NORWAY) 1946-52_

2.  _డాగ్ హమ్మర్స్ జోల్డ్  (SWEEDEN) 1953-61_

3. _యూథాoట్  (MYANMAR) 1962-71_

4. _కుర్ట్ వాల్డెమ్ (AUSTRIA) 1972-81_

5. _జేవియర్ పెరిజ్ డిక్యూలర్ (PERU) 1982-91_

6. _బౌత్రోస్ ఘలీ (EGYPT) 1992-96_

7. _కోఫి అన్నన్  (GHANA) 1997-2007_

8. _బాన్ కి మూన్ (SOUTH KOREA)_


*✍STATE TEAMS VERIFY THE FOLLOWING*

  √ *pre/post papers*

   √ *able/unable students groups ( relevant registers should be maintained at school point)*

   √ *time table /teachers adaptations*

   √ *HMs review with staff every 10 days on progress*

  √ *CCE REGISTERS*

   √ *FORMATIVE /SUMMATIVE PAPERS*

  √  *Project works /lab records /other relevant records*

   √ *SCHOOL BAG LOAD (Weight of text books/note books/ guides, study materials /water bottles etc*

  *Hence all of you be ready with all relevant records*


*_✍డిపార్టమెంటల్‌ పరీక్షకు దరఖాస్తులు చివరి తేది 08-01-2018_*

ప్రభుత్వోద్యోగులు తమ పదవీ కాలంలో  పదోన్నతికి అర్హత సాధించేందుకు డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు రాసేందుకు సదవకాశం లభించింది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌  65/2017 తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌  విడుదల చేసింది. ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకు కలిపి 155 రకాల పేపర్‌ కోడ్‌లతో పరీక్షలు నిర్వహిస్తారు.  *18/12/2017నుంచి జనవరి 8వ తేదీలోపు* ఆన్‌లైన్లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి అవకాశం ఉంది.    
                        
*ఎవరు రాయాలి :*
    అప్రయత్న పదోన్నతి పథకం (ఏఏఎస్‌)లో భాగంగా *ఎస్‌జీటీ* లేదా ఎస్‌జీటీ సమాన క్యాడర్‌లో ఉన్న వారు, 12 ఏళ్ల స్కేలు పొందేందుకు ఎలాంటి పరీక్షలు రాయాల్సిన అవసరం లేదు. కానీ *24 ఏళ్ల స్కేల్‌* పొందడానికి జీవో, ఈవో పరీక్షలు తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాలి. *‘స్కూల్‌ అసిస్టెంట్‌* తత్సమాన క్యాటగిరీ ఉపాధ్యాయులు *12 ఏళ్ల* స్కేల్‌ పొందేందుకు డిగ్రీ, బీఈడీ విద్యార్హతలతో పాటు జీవో (గెజిటెడ్‌ ఆఫీసర్‌), ఈవో (కార్యనిర్వహణాధికారి) టెస్ట్‌  రెండింటిలోనూ తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలి. ‘స్కూల్‌ అసిస్టెంట్లు *గెజిటెడ్‌ హెచ్‌ఎంలుగా* పదోన్నతి పొందేందుకు జీఓ, ఈఓ పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి. ‘సర్వీస్‌లో ఒక్క ప్రమోషన్‌ కూడా తీసుకోని వారు 45 ఏళ్ల వయసు దాటితే పదోన్నతి పొందేందుకు ఎలాంటి శాఖాపరమైన పరీక్షలు ఉత్తీర్ణత పొందాల్సిన అవసరం లేదు.

*ఉత్తీర్ణత మార్కులు ఇలా :*
    డిపార్ట్‌మెంటల్‌ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ప్రతి పరీక్షలోనూ 40 శాతం మార్కులు సాధించాలి. అయితే జీవో టెస్ట్‌లో రెండు పేపర్లు ఉన్నాయి. కాబట్టి ప్రతి పరీక్షలోనూ 40 శాతం మార్కులు సాధించాలి.

*సిలబస్‌ :*
    *జీవోటి(కోడ్ 88) పేపర్ l:*
ఇన్‌స్పెక‌్షన్స్‌ కోడ్స్‌ ది గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కోడ్స్, ఎలిమెంటరీ స్కూల్‌ రూల్స్, పీఎఫ్‌ రూల్స్‌ ఫర్‌ నాన్‌ పెన్షనబుల్‌ సర్వీసులతో పాటు వర్తమాన అంశాలు ప్రిపేర్‌ అవ్వాలి.
*జీవోటి(కోడ్ 97):పేపర్  ll*
 టియస్ పాఠశాల విద్య, సర్వీస్‌ నిబంధనలు, టియస్ సీసీఏ రూల్స్,
 టియస్ మండల ప్రజా పరిషత్‌ చట్టం, టియస్ ఓఎస్‌ఎస్‌తో పాట వర్తమాన అంశాలు ఉంటాయి.
 *ఈవో పరీక్ష (కోడ్‌141) సిలబస్‌:*
 టియస్ బడ్జెట్‌ మాన్యువల్, టియస్ ఖజానా శాఖ కోడ్, టియస్ పింఛన్‌ కోడ్, భారత రాజ్యాంగ నిర్మాణం, కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌), పీఆర్‌సీకి సంబంధించిన అంశాలను ప్రిపేర్‌ అవ్వాలి.

*ఫీజు వివరాలు :*
    ప్రతి పేపర్‌కు రూ.200 వంతున ఫీజు చెల్లించాలి. జీవోటెస్ట్‌(GOT)కు రెండు పేపర్లకు రూ 400,ఈవోటెస్ట్‌(EOT)కు రూ.200 చొప్పున మొత్తం రూ.600 చెల్లించాలి. అలాగే ప్రతి పరీక్షకూ రూ.50 ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాలి.
    
*పరీక్ష తేదీలు :*

    జీవోటి (కోడ్‌ 88,) పేపర్‌–1 
*ఫిబ్రవరి 12‌ ఉదయం 9 గంటల నుంచి 11 గంటల* వరకు,జీవోటి(కోడ్ 97)పేపర్‌–2 *అదే రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల* వరకూ ఉంటుంది.

 ఈవోటి (కోడ్‌141) *ఫిబ్రవరి 14 ఉదయం 9 గంటల నుంచి 11 గంటల* వరకు ఉంటుంది.

స్పెషల్ లాంగ్వేజ్ టెస్టు(పేపర్ కోడ్ 37) తేది *ఫిబ్రవరి 14 మధ్యాహ్నం 2 నుంచి 4 గం.* వరకు ఉంటుంది.


*✍బడి పిల్లలకు వెజ్‌ బిర్యానీ*

*👉మధ్యాహ్న భోజనంలో ప్రతి శనివారం* 
*పెట్టాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం* 

*👉భోజన మెనూ మార్చాలని కేంద్ర బృందం సూచన*

*👉డీఈఓలకు ఆదేశాలిచ్చిన విద్యాశాఖ కమిషనర్‌*

*❇ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల మధ్యాహ్న భోజనంలో మార్పు చేశారు. ప్రతి శనివారం కూరగాయలతో(వెజిటబుల్‌) చేసిన బిర్యానీ పెట్టనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కిషన్‌ డీఈఓలకు ఆదేశాలు జారీ చేశారు. మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును ఇటీవల పరిశీలించిన కేంద్ర బృందం భోజనం మెనూను మార్చాలని సూచించింది. కూరగాయలు, బఠానీలు, శనగలు, మీల్‌మేకర్లు తదితర వాటితో చేసే బిర్యానీని విద్యార్థులు ఇష్టంగా తింటారని,   పోషకాలుంటే ఈ బిర్యానీ ఆరోగ్యానికి కూడా మంచిదని కేంద్ర బృందం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక రాష్ట్ర కార్యదర్శి రంజీవ్‌ ఆచార్య కేంద్ర బృందం సూచనలపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ కమిషనర్‌ కిషన్‌ను ఆదేశించారు.*

*❇కొత్త మెనూను గోడలపై రంగులతో రాయించాలని సూచించారు. ప్రతి శనివారం బిర్యానీ పెట్టాలని, దీనిపై వెంటనే ఎంఈఓలకు సూచనలివ్వాలని కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల్లోనే కూరగాయాలు పండేలా చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. రాష్ట్రంలో దాదాపు 24 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం వినియోగించుకుంటున్నారు. ప్రతిరోజూ అయ్యే ఖర్చుతోనే బిర్యానీ ఇవ్వొచ్చని గృహ విజ్ఞాన కళాశాల ఆహార పోషణ విభాగం ఆచార్యురాలు ఉమాదేవి చెప్పారు.*

*❇ మూడొంతులు మంది ఉదయం అల్పాహారం తీసుకోకుండా బడికి వస్తున్నందున దానిపై తల్లిదండ్రులకు ప్రధానోపాధ్యాయులు, వైద్యాధికారులు అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. అల్పాహారం తీసుకోకుంటే పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు.*

*👉శనివారం మెనూ ఇలా...*

*❇ప్రతి శనివారం ఒకే రకంగా కాకుండా మార్పు ఉండేలా కేంద్ర బృందం మెనూను సూచించింది. దాన్ని అమలు చేయాలని విద్యాశాఖ ఆదేశాలిచ్చింది.*

* 👉బఠానీ పలావ్‌+ కూరగాయలతో కుర్మా*

*👉కాబూలీ శనగలు, కూరగాయలతో  బిర్యానీ*

*👉మీల్‌మేకర్‌ బిర్యానీ+ కూరగాయలతో  కుర్మా*

*👉మునక్కాయ ఆకులు, పెసర పప్పుతో కిచిడి+ చట్నీ*

*👉అన్నం+ టమాటా, ఎండు బఠానీల కూర*

*👉అన్నం+ పెసర పప్పులు, సోయాచిక్కుడు కూర*


🔊 *విద్యారంగాన్ని పటిష్ఠం చేయడమే లక్ష్యం..*

🔷 *తెలంగాణ గురుకుల వ్యవస్థ దేశానికే ఆదర్శం* 

🛍 *15 రకాల వస్తువులతో ఆరోగ్య పరిశుభ్రత కిట్స్* 

🎙 *డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి*

🔮🛡 *సంగెం,(పర్వతగిరి) : విద్యారంగాన్ని పటిష్ఠం చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, మోడల్‌స్కూల్ విద్యార్థినులకు కేజీబీవీలో బుధవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి ఆరోగ్యపరిశుభ్రత కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, వసతి కల్పించి ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలో కొత్తగా 544 గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. దేశంలోనే తెలంగాణ గురుకుల వ్యవస్థను ఆదర్శంగా నిలిపామన్నారు. కేజీబీవీ, మోడల్‌స్కూల్స్‌లోని విద్యార్థినులు కోసం మూడునెలలకొక సారి 15 రకాల వస్తువులతో ఆరోగ్యపరిశుభ్రత కిట్స్‌ను అందజేస్తున్నట్టు తెలిపారు. వీటి కోసం ప్రభుత్వం ఏటా రూ. 15కోట్లు వెచ్చిస్తుందన్నారు.*

📝♦ *జనవరి 1 నుంచి కొత్త మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. వారానికి 4సార్లు చికెన్, రెండుసార్లు మటన్, గుడ్లు, రాగిమాల్ట్, నెయ్యి పిల్లలకు పెట్టాలని లేని పక్షంలో విద్యార్థులు డీఈవోకు ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో జేసీ హరిత, ఆర్‌జేడీ రాజీవ్, డీఈవో నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.*


🍃🌼♦ *తృణీకరణకు ఆస్కారం లేకుండా..! *

 🍜🍝 *మధ్యాహ్న భోజనంతో తృణధాన్య తీపి పదార్థాల వడ్డింపు*

 🍥 *నాలుగు జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నేటి నుంచి అమలుచేయనున్న ‘అక్షయపాత్ర*

🏆🎯 *ఈనాడు, సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి - నార్సింగి, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న దాదాపు లక్ష మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతోపాటు తృణ ధాన్యాలతో తయారుచేసిన తీపి వంటకాలు అందనున్నాయి. అక్షయపాత్ర ఫౌండేషన్‌ నేతృత్వంలో తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో వీటిని అందించడానికి ఏర్పాట్లు జరిగాయి. అక్షయపాత్ర ఫౌండేషన్‌ తెలంగాణలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని విజయవంతంగా సరఫరా చేస్తోంది. అయితే, అనేక మంది విద్యార్థులు పౌష్టికాహారం అందక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఇటీవల కేంద్ర ప్రభుత్వ పాఠశాలలపై జరిపిన సర్వేలో తేలింది.*

🎾 *ఈ సర్వేను పరిగణనలోకి తీసుకున్న అక్షయప్రాత ఫౌండేషన్‌ రంగంలోకి దిగింది. ఇక్రిశాట్‌, సీఎఫ్‌టీఆర్‌ఐ, ఐఐఎంఆర్‌* *లాంటి సంస్థలను సంప్రదించింది. దీంతో వివిధ తృణధాన్యాలు ఎక్కడ దొరుకుతాయన్న సమాచారంతోపాటు వీటి తయారీ విషయంలోనూ సాంకేతికంగా తోడ్పాటు అందించడానికి ఆయా సంస్థలు ముందుకొచ్చాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు* *మధ్యాహ్న భోజనంతోపాటు సజ్జలు, రాగులు, జొన్నలు, కొర్రలు వంటి వాటితో తయారు చేసిన పదార్థాలను అందించాలని అక్షయపాత్ర నిర్ణయించింది.*

  🚸 *పిల్లలు బాగా ఇష్టపడే తీపి పదార్థాలైన పాయసం, కాజా, లడ్డూ, బిస్కట్‌ వంటి 15 రకాల వంటకాలను ఎంపిక చేశారు. రోజూ ఒక్కో పదార్థాన్ని అందిస్తే.. విద్యార్థులు మధ్యాహ్న భోజనాన్ని మరింత ఇష్టపడతారని భావిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని గురువారం ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేతులు మీదుగా ప్రారంభించడానికి అక్షయపాత్ర ఫౌండేషన్‌  ఏర్పాట్లు చేసింది.*

♻ *దక్షిణాదిలో తొలి ప్రయత్నం:*

 ⚫ *దక్షిణ భారత దేశంలోనే తొలిప్రయత్నంగా లక్ష మంది విద్యార్థులకు ఈ అదనపు పోషకాహారం అందించడానికి ఏర్పాట్లు చేపట్టారు. నార్సింగిలోని అత్యాధునిక వంటశాలలో వీటి తయారీని మొదలుపెట్టారు. మొదటి దశలో ఒక్కో విద్యార్థికి 15 గ్రాముల నుంచి 20 గ్రాముల బరువున్న పదార్థాలను అందించనున్నారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం విజయవంతమైతే 13 రాష్ట్రాల్లో అక్షయపాత్ర ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో దశలవారీగా అమలు చేయాలని భావిస్తున్నారు.*


♻⭕ *పిపెట్‌, బ్యూరెట్‌ తెల్వదు:*

 🔬 *ప్రయోగాలకు దూరంగా ఇంటర్‌ విద్యార్థులు*

⏳ *అన్ని కాలేజీల్లోనూ ప్రాక్టికల్స్‌కు పాతర*

 🔷 *కార్పొరేట్‌ కాలేజీల్లో మరీ దారుణం*

 🍥 *ల్యాబ్‌లు ఉండవు.. ఉన్నా అరకొర*

🔰 *వార్షిక ప్రాక్టికల్స్‌ తూతూ మంత్రం*

 ⚠ *దాదాపు అందరికీ పూర్తి మార్కులు*

 ❇ *జేఈఈ, నీట్‌ కోసం థియరీకే ప్రాధాన్యం*

🔘 *_ఈ రోజుల్లో ఇంటర్‌ విద్యార్థులకు పిపెట్‌, బ్యూరెట్‌ అంటే ఏమిటో కూడా తెలియదు. కాలేజీల్లో ప్రాక్టికల్స్‌కు ప్రాధాన్యమే లేకుండా పోయింది. విద్యార్థులతో ప్రయోగాలు చేయించడం పూర్తిగా మానేశారు. కొన్ని కాలేజీల్లోనైతే అసలు ల్యాబ్‌ సౌకర్యమే లేదు. నేను అధ్యాపకుడిగా ఉన్నరోజుల్లో ప్రయోగాలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవాళ్లం. విద్యార్థులతో ప్రయోగాలు చేయించేవాళ్లం’’.. ఓ సమావేశంలో సాక్షాత్తు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలివి!!_*

 🌐 *హైదరాబాద్‌, జనవరి 3(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్‌ కాలేజీలు అనే తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కాలేజీల్లోనూ ప్రాక్టికల్స్‌కు పాతరేస్తున్నారు. విద్యార్థులతో ప్రాక్టికల్స్‌ చేయించకుండానే విద్యా సంవత్సరాన్ని పూర్తి చేయిస్తున్నారు. తెలంగాణలో దాదాపుగా 1,500 ప్రైవేటు కాలేజీలు, 402 ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. వీటిలో సైన్స్‌ గ్రూప్‌లో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థుల సంఖ్య సుమారుగా 2లక్షల వరకు ఉంటారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ తప్పనిసరి. అయితే ప్రాక్టికల్స్‌ అనే మాట విద్యా కేలండర్‌లో మాత్రమే కనిపిస్తోంది. ప్రాక్టికల్స్‌ను ప్రాధాన్యం లేని సబ్జెక్టుగా గుర్తిస్తున్నారు*. 

 ♦ *దీంతో విద్యార్థులకు ప్రాక్టికల్స్‌లో పూర్తిగా నాలెడ్జి లేకుండా పోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కెమిస్ట్రీ ప్రాక్టికల్స్‌లో పిపెట్‌, బ్యూరెట్‌లు ప్రాథమిక పరికరాలు. రసాయన ప్రయోగాలకు ఈ రెండింటి వినియోగమే ఎక్కువగా ఉంటుంది. అయితే, విద్యార్థులను ప్రాక్టికల్స్‌కు దూరం పెడుతుండడంతో వారికి పిపెట్‌, బ్యూరెట్‌ అంటే ఏమిటో కూడా తెలియకుండా పోతోంది. వచ్చే నెలలో ప్రాక్టికల్స్‌ ప్రారంభం కానున్నాయి. కానీ చాలా కాలేజీల్లో విద్యార్థులను ప్రయోగాలకు సిద్ధం చేయలేదు. ప్రాక్టికల్స్‌ విషయంలో కార్పొరేట్‌ కాలేజీలైతే మరీ దారుణం. ఒకరకంగా ఆ కాలేజీల్లో ప్రాక్టికల్స్‌ అనే మాట నిషిద్ధ పదం అయిపోయింది.*

 🍓🛡 *విద్యార్థులకు కాలేజీలో అసలు ప్రయోగశాల ఎక్కడ ఉంటుందో తెలియని స్థితి ఉందంటే అతిశయోక్తి కాదు. ఈ కాలేజీల్లో ఏడాదిలో ఒకసారైనా విద్యార్థులు ల్యాబ్‌ గడపతొక్కని పరిస్థితి ఉంది. ప్రాక్టికల్స్‌ను పూర్తిగా పక్కనబెడుతున్న కాలేజీలు ఆ సమయాన్ని జేఈఈ, నీట్‌ జాతీయ ప్రవేశ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయడానికి వినియోగిస్తున్నాయి. ప్రాక్టికల్స్‌పై దృష్టి పెట్టొద్దని, ఆ విషయం తాము చూసుకుంటామని విద్యార్థులకు అధ్యాపకులే నేరుగా చెబుతున్నారు. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ప్రాక్టికల్స్‌ కోసం ఎంపీసీ విద్యార్థులకు 60 మార్కులు(ఫిజిక్స్‌, కెమిస్ట్రీ 30 చొప్పున) మార్కులు కేటాయిస్తారు.*

 🦋🌺 *బైపీసీ విద్యార్థులకు 120 మార్కులు(ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీకి 30 మార్కుల చొప్పున) కేటాయిస్తారు. ఈ మార్కులు వార్షిక పరీక్షల్లో వచ్చే మొత్తం మార్కుల శాతాన్ని ప్రభావితం చేస్తాయి. దీంతో విద్యార్థులు సహజంగానే ప్రాక్టికల్స్‌ మార్కులపై ఎక్కువ దృష్టి పెడతారు. కానీ విద్యార్థులు ఏ విధమైనా ప్రాక్టికల్స్‌ చేయకుండానే పరీక్ష పరిశీలకులు(ఎక్స్‌టర్నల్స్‌) వారికి మార్కులు ఇస్తున్నారు. విద్యార్థి ప్రాక్టికల్‌ సామర్థ్యంతో సంబంధం లేకుండా అడ్డగోలుగా మార్కులు వేస్తున్నారు. తరగతిలో దాదాపు 70-80శాతం విద్యార్థులకు 100 శాతం మార్కులు వేస్తుండడం గమనార్హం. మిగతా 20 శాతం విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టులో 2-5 మార్కులు తక్కువగా వేస్తుంటారు. విద్యార్థులకు థియరీ నాలెడ్జి తప్ప ప్రాక్టికల్‌ నాలెడ్జి ఉండడం లేదని.. దీంతో కెరీర్‌లో వారు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.*

 🌼🌻 *ల్యాబ్‌లే కరువు:*

🌍💥 *కార్పొరేట్‌ కాలేజీల్లో అసలు ప్రాక్టికల్స్‌ నిర్వహించేందుకు కావాల్సిన ప్రయోగశాలలే లేకపోవడం గమనార్హం. రెండు మూడు బ్రాంచులకు కలిపి ఒకచోట చిన్న ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ విషయం ఇటీవల ఇంటర్‌బోర్డు అధికారుల తనిఖీల్లోనూ తేలింది. మెజారిటీ కాలేజీల్లో ల్యాబ్‌లే లేవని అధికారులే స్వయంగా తెలపడం గమనార్హం. చిన్న ప్రైవేటు కాలేజీల్లో ల్యాబ్‌లు ఉన్నప్పటికీ సౌకర్యాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రాష్ట్రంలోని దాదాపు 1500 ప్రైవేట్‌, కార్పొరేట్‌ కాలేజీల్లో 70-80 శాతం కాలేజీల్లో ల్యాబ్‌ సౌకర్యాలు అఽధ్వాన్నంగా ఉన్నట్టు సమాచారం. ప్రభుత్వ కాలేజీల్లోనూ అదే పరిస్థితి నెలకొంది.*


*💥సీపీఎస్ను రాష్ట్రమే రద్దు చేయొచ్చు*

♦ఆర్టీఐతో తెలుసుకున్నాం..

♦సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం వెల్లడి

♦హైదరాబాద్‌: లక్షల మంది ఉద్యోగులకు గుదిబండలా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం(సీపీఎ్‌స)ను రద్దుచేసే నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటుందని తెలంగాణ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం చెబుతోంది. తెలంగాణ సంఘం అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కలువల్‌ శ్రీకాంత్‌పాటు ఏపీ, కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులు సమాచార హక్కు చట్టం ద్వారా సీపీఎస్‌ నిర్ణయాధికారంపై వివరాలు సేకరించారు.

♦ ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004 సెప్టెంబరులో 653, 654, 655 నంబర్ల జీవోల ద్వారా అమల్లోకి వచ్చిన సీపీఎ్‌సను రద్దు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మరో జీవోను జారీ చేయాల్సి ఉంటుంది. 

♦దీంతోపాటు ‘సీపీఎ్‌సలో మేం కొనసాగబోం’ అని చెబుతూ పీఎ్‌ఫఆర్డీఏ(ప్రావిడెంట్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ)కి సమాచారమివ్వాల్సి ఉంటుంది’’ అని సంఘం నేతలు తెలిపారు.

♦సీపీఎస్‌ వద్దనుకుంటే రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తమ ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానమిచ్చిందని చెప్పారు.

*♦నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదేనని ఆర్టీఐ ద్వారా స్పష్టం కావడంతో దాని ఆధారంగా నిర్ణయం తీసుకొమ్మని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించమని సుప్రీంకోర్టును కోరతామని సంఘం నేతలు తెలిపారు.*


ఈ రోజు జి కె

1)👉 2017-18 రంజీ ట్రోఫీ విజేత ఎవరు?
A: *విదర్భ జట్టు*

2)👉రంజీట్రోఫీ "ఫైనల్ మ్యాచ్" ఎక్కడ జరిగింది?
A: *ఇండోర్(హోల్కర్ స్టేడియం)*

3)👉ఫైనల్ మ్యాచ్ లో "హ్యాట్రిక్" సాధించిన బౌలర్ ఎవరు?
A: *రజనీష్ గుర్బానీ*

4)👉టోర్నీలో  "అత్యధిక  పరుగులు" సాధించిన  ఆటగాడెవరు?
A: *మయంక్ అగర్వాల్*

5)👉టోర్నీలో  "అత్యధిక వికెట్లు" తీసిన బౌలర్ ఎవరు?
A: *జలాల్ సక్సేనా*

🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏🏏
Slang of the Day

💥up time

✍🏾Meaning:
time a computer system is operating

❗️For example:

🔺Before choosing a host for your website, check the average up time for their servers. 

🔺They claim to have an up time of 99.99 per cent, but I doubt that somehow.
━━━━━━━━━━━
#Slang_of_the_day


➖➖➖➖➖➖➖➖➖
*తెలంగాణ పాటలు రచయితలు*
➖➖➖➖➖➖➖➖➖➖
*పాటలు ~రచయితల పేర్లు*                            
*1. జయజహే తెలంగాణ                                                      -       అందెశ్రీ*

*2. నా తెలంగాణ కోటిరాత నాల వీణ                                       -     దాశరధి*

*3. పల్లెకన్నీరు పెడుతు డోయ్                                                -     గోరెటి ఎంకన్న*

*4. నాగేటిచాల్లా నా తెలం గాణ                                                -     నందిని సిద్ద రెడ్డి*

*5. తెలంగాణ గట్టుమీద సందమామయ                              -   ఆర్ .నారాయణమూర్తి*

*6. తల్లి తెలంగాణ-కిశోరె*                                                                    
*7. ఉస్మానియా క్యాంపుస్లో ఉదయించిన                                  --   అభినయ శ్రీనివాస్*

*8. బతుకమ్మ బతుకమ్మ                                                          --       గోరెటి ఎంకన్న*

*9. నీపాదం మీద పుట్టు మచ్చ                                                  --      గద్దర్*

*10 . పల్లెటూరి పిల్లగాడా                                                          ---   సుద్దాల హనుమంతు*

*11. ఊరు మనదిర వాడమ నాదిరా   ---  గూడ అంజన్న*

*[ జ్ఞ్యానపీటీ  అవార్డు అందుకొన్న తోలి కవి —  డా ” సి “నారాయణరెడ్డి ]*

*12 . గోల్కొండ పత్రిక సంపాదకులు – సురవరం ప్రతాపరెడ్డి*

*13 .అమ్మ తెలంగాణమా ఆకలికేకలు గానము   — గద్దర్*

*14 .మాయమయిపోతున్నాడమ్మా మనిషన్నవాడు   — అందెశ్రీ*

*15 .ఎచ్చమ్మ ముచ్చట్లు  / మా ఉరి కథలు   — యశోదారెడ్డి*

*16 .రాజిగ ఓ రాజిగ  ‘.. పుడితే ఒకటి సత్తే రెండు … ”  —- గూడ అంజన్న*

*17 .మంజీరా పత్రికను స్థాపించింది    —- నందిని సిద్దారెడ్డి*

*-----------------------------------*
*🌹వ్యక్తులు  వారి  బిరుదులు🌹*                                              
*1 . తెలంగాణ టైగర్*                              

 *నల్లనర్సింహులు*

*2. హైదరాబాద్ ప్రకాశము*
      
*స్వామిరామానంద తీర్థ*

*3. తెలంగాణ కాటన్*
     
*నవాబ్ అలీ నవాబ్ జంగ్*

*4. తెలంగాణ సర్దార్*
    
*జమలాపురం కేశవరావు*

*5. తెలంగాణ సరిహద్దు గాంధీ*

*జమలాపురం కేశవరావు*

*6. తెలంగాణ పితామహు డు*

 *కొండా వెంకట రంగారెడ్డి*

*7.తెలంగాణ గోర్కీ*
      
*వట్టికోట అశ్వరావు*

*------------------------------------*

*🌹తెలంగాణ రచనలు🌹*

*1 . కాళోజి నారాయణ రావు*

*నా గొడవ  , జీవన గీత*

*2 . వట్టికోట అశ్వరరావు*

 *— ప్రజల మనిషి*

*3 . దాశరధి కృష్ణమాచార్యు లు*

*— తిమిరంతో సమరం   , రుద్రవీణ , అగ్నిధార*

*4.సుంకర సత్యనారాయణ* –   — 
*మా భూమి*

 *---------------------------------*
     *తెలంగాణ రాష్ట్రము లో ముఖ్యమైన జాతరలు*
➖➖➖➖➖➖➖➖➖➖
*1 , సమ్మక్క -సారక్క       --  వరంగల్*

*2 . ఏడుపాయల జాతర  -- మెదక్*

*3 . కొండగట్టు జాతర       - కరీనగర్*

*4 . నాగోబా జాతర           --  ఆదిలాబాద్*

*5 . ఉర్సు                        --  నల్గొండ*

*6. పెద్దగట్టు జాతర          - నల్గొండ*

*7 .కొండగట్టు అంజన్న జాతర     - కరీంనగర్*

*8 .గొల్లగట్టు జాతర                -- నల్గొండ*

*9 .కొమురెల్లి జాతర            --  వరంగల్*

*10 .రామప్ప జాతర           -   -- వరంగల్*

*11.వేళల జాతర                 -- ఆదిలాబాద్*

*12.బెజ్జంకి జాతర               - కరీంనగర్*

*13.మన్నెంకొండ జాతర  -- మహబూబ్ నగర్.

*➖➖➖➖➖➖➖➖➖
*తెలంగాణ పాటలు రచయితలు*
➖➖➖➖➖➖➖➖➖➖
*పాటలు ~రచయిత ల పేర్లు*                            
*1. జయజహే తెలంగాణ                                                      -       అందెశ్రీ*

*2. నా తెలంగాణ కోటిరాత నాల వీణ                                       -     దాశరధి*

*3. పల్లెకన్నీరు పెడుతు డోయ్                                                -     గోరెటి ఎంకన్న*

*4. నాగేటిచాల్లా నా తెలం గాణ                                                -     నందిని సిద్ద రెడ్డి*

*5. తెలంగాణ గట్టుమీద సందమామయ                               -   ఆర్ .నారాయణమూర్తి*

*6. తల్లి తెలంగాణ-కిశోరె*                                                                    

*7. ఉస్మానియా క్యాంపుస్లో ఉదయించిన                                  --   అభినయ శ్రీనివాస్*

*8. బతుకమ్మ బతుకమ్మ                                                          --       గోరెటి ఎంకన్న*

*9. నీపాదం మీద పుట్టు మచ్చ                                                  --      గద్దర్*

*10 . పల్లెటూరి పిల్లగాడా                                                          ---   సుద్దాల హనుమంతు*

*11. ఊరు మనదిర వాడమ నాదిరా   ---  గూడ అంజన్న*

*[ జ్ఞ్యానపీటీ  అవార్డు అందుకొన్న తోలి కవి —  డా ” సి “నారాయణరెడ్డి ]*

*12 . గోల్కొండ పత్రిక సంపాదక


డిగ్రీ విద్యార్థులకు శుభవార్త........
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాలు....
ఫ్లయింగ్ మరియు గ్రౌండ్ డ్యూటీ పోస్ట్ లు....

యువతి/యువకులకు IAF లో ఆఫీసుర్లు గా చేరుటకు సువర్ణ అవకాశం 

Posts:- Officers-Flying
అర్హత:-Any Degree/BTech
Posts:- Ground Duty-Ad
అర్హత:-Any DEGREE

Posts:- Ground Duty-Log
అర్హత:-Any DEGREE

Posts:- Ground Duty-Acc
అర్హత:-B-Com 

Posts:- Ground Duty-Ed
అర్హత:- Any PG/ M.A, MSc, MBA, MCA
డిగ్రీ /పిజి విద్యార్థులు. / ఫైనల్ ఇయర్ విద్యార్థులు 01-07-2018 లోపు విద్యాఅర్హతలు పూర్తి చేయువారు కూడా అప్లై చేయవచ్చు......
జీత భత్యాలు;-
- Flying Branch:-Rs. 85,372/-
-Ground Duty(Tech):-Rs. 74,872/-
-Ground (Non-tech):-Rs. 71,872/-
ఇతర వివరాలు;-
http://shamsh.in/indian-air-force-recruitment-2017/.  దయచేసి ఈ మెస్సేజ్ మీకు అవసరం లేకపోతె ఎవరికైనా తెలిసిన వాళ్లకి పంపగలరు.


9వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ..

 -నోటిఫికేషన్ విడుదల చేసిన పోలీస్‌శాఖ
-సివిల్ విభాగంలో 1810 కానిస్టేబుల్ పోస్టులు
-ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో 2760 పోస్టులు
-ఎస్‌ఏఆర్సీపీఎల్‌లో 56, టీఎస్‌ఎస్పీలో 4065
-ఎస్పీఎఫ్‌లో 174, ఫైర్‌లో 416 పోస్టుల భర్తీ
-ఈ నెల 11 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు
-ఏప్రిల్ 3న ప్రిలిమినరీ పరీక్ష

భారీ సంఖ్యలో పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలకు నోటిఫికేషన్ వెలువడింది. పోలీస్ నియామకాలు భారీ స్థాయిలో చేపడ్తామని సీఎం కే చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ నేపథ్యంలో కొత్త సంవత్సర కానుకగా 9281 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పోలీస్‌శాఖ గురువారం రాత్రి నోటిఫికేషన్ జారీచేసింది. ఇందులో సివిల్ విభాగంలో 1810 కానిస్టేబుల్ పోస్టులు, ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో 2760 పోస్టులు, టీఎస్‌ఎస్‌పీలో 4065 పోస్టులు కూడా ఉన్నాయి. సివిల్ నియామకాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన మూస నియామక పద్ధతులకు స్వస్తి చెప్తూ ప్రిలిమినరీ పరీక్ష, తర్వాత సాధారణ దేహదారుఢ్య పరీక్ష, అనంతరం మెయిన్స్ నిర్వహించి నియామకాలు చేపట్టనున్నట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 

ఆన్‌లోన్ దరఖాస్తులు.. :

జనవరి 11నుంచి ఫిబ్రవరి 4 వరకు ఆన్‌లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో సూచించారు. తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లోనే దరఖాస్తు చేసుకోవాలని, WWW.TSLPRB.IN వెబ్‌సైట్‌లో సంబంధిత వివరాలను చూడవచ్చని రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచందర్‌రావు తెలిపారు. మరిన్ని వివరాల కోసం WWW.TSLPRB.IN వెబ్‌సైట్ సందర్శించాలని కోరారు. ఓసీ/బీసీ అభ్యర్థులకు రూ.400, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.200 ఫీజు ఉంటుందని, మీ సేవ, ఈసేవ, టీఎస్ ఆన్‌లైన్, ఏపీ ఆన్‌లైన్, పేమెంట్ గేట్‌వేద్వారా ఫీజు చెల్లించవచ్చని ఆయన తెలిపారు. ప్రిలిమినరీ పరీక్ష ఏప్రిల్ 3న ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.

పూర్తిగా మారిన నియామక పద్ధతులు 
మూడేండ్ల వయో పరిమితి పెంచడంతోపాటు నియామక పద్ధతులను పూర్తి స్థాయిలో మార్చినట్టు రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచందర్‌రావు తెలిపారు. ఐదు కిలోమీటర్లు, 2.5 కిలోమీటర్ల పరుగు పందెం రద్దు చేశామని వెల్లడించారు. 

-ముందుగా ప్రిలిమినరీ రాతపరీక్ష ఉంటుంది. ఈ పరీక్షల్లో ఓసీ అభ్యర్థులు 40%, బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30% మార్కులు సాధిస్తే సాధారణ అర్హత పొందుతారు. 
-ఈ నియామకాల్లో సివిల్ విభాగంలో 33%, ఏఆర్, ఎఫ్‌పీబీ, కమ్యూనికేషన్ విభాగంలో 10% మహిళలకు రిజర్వేషన్ ఉంటుంది.
-పురుషుల విభాగంలో నిర్వహించే ఐదు దేహదారుఢ్య పరీక్షల్లో మూడింటిలో ఉత్తర్ణీత సాధించాలని సూచించారు. మహిళలు మూడింటికిగాను రెండింటిలో ఉత్తర్ణీత సాధించాల్సి ఉంటుంది.

-పురుషుల విభాగంలో 800 మీటర్ల పరుగు పందెం, మహిళలకు 100 మీటర్ల పరుగుపందెం తప్పనిసరి.

-మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో గిరిజన అభ్యర్థులకు ఛాతి, ఎత్తు విషయంలో కొంత వెసులుబాటు ఉంటుంది. 

-జనరల్ విభాగంలో పోటీపడే పురుష అభ్యర్థుల ఎత్తు 167.6 సెంటీమీటర్లు ఉండాలి. ఛాతి 86.3 సెంటీమీటర్ల నుంచి ఊపిరి పీల్చినప్పుడు ఐదు సెంటిమీటర్లు పెరిగేలా ఉండాలి. మహిళ అభ్యర్థులకు ఎత్తు 152.5 ఉండాలి.

-ఎస్టీ పురుష అభ్యర్థులకు ఎత్తు 160 సెంటీమీటర్లు, ఛాతి 80సెంటీమీటర్లు, ఊపిరి పీల్చితే 3 సెంటిమీటర్లు పెరిగేలా ఉండాలి. మహిళ అభ్యర్థులకు ఎత్తు 150 సెంటీమీటర్లు సరిపోతుంది.

-చాకచక్యం, తెలివితేటలకు సంబంధించి చివరగా మరో పరీక్షను నిర్వహిస్తారు. పర్సనాలిటీ టెస్ట్ పేరిట రాత పరీక్ష ఉంటుంది. సామాజిక స్థితిగతులు, తెలంగాణ హిస్టరీపై ప్రశ్నలు ఉంటాయి. 

వయోపరిమితిపై స్పష్టత :

కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే సాధారణ అభ్యర్థులు 18 ఏండ్లనుంచి 25ఏండ్ల లోపు ఉండాలి. జూలై 1, 1990- జూలై 1,1997 మధ్య జన్మించి ఉండాలి. హోంగార్డు విషయంలోనూ కొంత వెసులుబాటు కల్పించారు. హోంగార్డుల నుంచి వచ్చిన వినతులు పరిశీలించిన ప్రభుత్వం వారికి కూడా కొంత మేర అవకాశం కల్పించింది. ప్రస్తుతం హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్న వారిలో కనీసం 360 రోజుల పాటు డ్యూటీలో ఉండి ఉండాలి. 18ఏండ్లనుంచి 33ఏండ్లవరకు హోంగార్డుల విషయంలో వయో పరిమితి ఉంటుందని రిక్రూట్‌మెంట్ బోర్డు చైర్మన్ తెలిపారు. 2, జూలై 1982- 1 జూలై 1997 మధ్య జన్మించిన వారై ఉండాలని నిబంధనల్లో పేర్కొన్నారు. అగ్నిమాపక శాఖలో ఫైర్‌మెన్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 ఏండ్ల నుంచి 33 ఏండ్లలోపు ఉండాలని సూచించారు. 2 జూలై 1982 , 1 జూలై 1997 మధ్య జన్మించి ఉండాలన్నారు.

సిలబస్ వివరాలు :

కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ప్రిలిమినరీ పరీక్షలో ఇంటర్మీడియట్ స్థాయికి సంబంధించిన 200 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటాయి.

సబ్జెక్ట్‌ల వివరాలు :

ఇంగ్లీషు, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్; ఇండియన్ జియోగ్రఫీ, పాలిటిక్స్ అండ్ ఎకానమీ; కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్; టెస్ట్ ఆఫ్ రిజనింగ్, మెంటల్ ఎబిలిటీ, కంటెంట్స్ ఆఫ్ పర్‌టెయినింగ్ టూ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇంగ్లీషుకు సంబంధించిన సిలబస్‌లో ప్రశ్నలన్నీ ఇంగ్లీషులోనే ఉంటాయి.
కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి ఫైనల్ రాత పరీక్ష ఇంటర్మీడియట్ స్థాయికి సంబంధించిన 200 ప్రశ్నలతో ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది.

ఫైనల్ రాత పరీక్ష సబ్జెక్ట్‌ల వివరాలు.. :

ఇంగ్లీషు, అర్థమెటిక్, జనరల్ సైన్స్, హిస్టరీ ఆఫ్ ఇండియా, ఇండియన్ కల్చర్, ఇండియన్ నేషనల్ మూవ్‌మెంట్; ఇండియన్ జియోగ్రఫీ, పాలిటిక్స్ అండ్ ఎకానమీ; కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్; టెస్ట్ ఆఫ్ రిజనింగ్, మెంటల్ ఎబిలిటీ, పర్సనాల్టీ టెస్టు (ఎథిక్స్, సెన్సిటివిటీ టూ జెండర్, బలహీన వర్గాలు, సామాజిక అవగాహన, ఎమోషనల్ ఇంటలిజెన్స్‌పై ప్రశ్నలు ఉంటాయి); కంటెంట్స్ ఆఫ్ పర్‌టెయినింగ్ టూ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఇంగ్లీషుకు సంబంధించిన సిలబస్‌లో ప్రశ్నలన్నీ ఇంగ్లీషులోనే ఉంటాయి.

విద్యార్హతలు :


కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఒకవేళ ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులైతే ఎస్సెస్సీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై, ఇంటర్మీడియట్ మొదటి లేదా రెండో సంవత్సరం చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నిబంధనల్లో పేర్కొంది.

Aptitude & Reasoning (ప్రకటనలు - ఊహలు(Announcements - Assumptions))

ప్రకటనలు - ఊహలు(Announcements - Assumptions)

ఇందులో మొదట ఒక ప్రకటన, దాని కింద రెండు ఊహలు ఇస్తారు. ఆ ఊహల ఆధారంగా అభ్యర్థులు సరైన సమాధానాన్ని గుర్తించాల్సి ఉంటుంది. మొదటగా ఇచ్చిన ప్రకటనను అర్థం చేసుకుని, ప్రకటనలో ప్రస్తావించిన విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి జవాబు గుర్తించాలి. ఈ విధానం అభ్యర్థి ఆలోచనా సరళిపై ఆధారపడి ఉంటుంది. మన నిత్య జీవితంలో జరిగే సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక సంఘటనల ఆధారంగా ఈ ప్రశ్నలను రూపొందిస్తారు.
ఈ విభాగంలో ప్రకటనను, మొదటి ఊహ మాత్రమే సంతృప్తిపరిస్తే సమాధానం
(1)గా, రెండో ఊహ మాత్రమే సంతృప్తిపరిస్తే సమాధానం
(2)గా, రెండూ సంతృప్తిపరిస్తే సమాధానం
(3)గా, రెండూ సంతృప్తిపరచకపోతే సమాధానం
(4)గా గుర్తించాలి. అయితే కొన్నిసార్లు ఛాయిస్‌లను మార్చవచ్చు. ప్రశ్నపత్రంలో ఇచ్చినదానికి అనుగుణంగా అభ్యర్థులు జవాబులను గుర్తించాల్సి ఉంటుంది.
Q. ప్రకటన: ఆత్మవిశ్వాసం అనేది విజయానికి మూలస్తంభం లాంటిది.
ఊహలు:
1) విజయానికి ఆత్మవిశ్వాసం తప్ప ఇంకేమీ అవసరం లేదు.
2) ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటాడు.
జ.(4)
వివరణ: ప్రకటనను 1, 2 (రెండూ) ఊహలు సంతృప్తిపరచలేవు. ఎందుకంటే విజయానికి ఆత్మవిశ్వాసం తప్ప ఇంకేమీ అవసరం లేదనేది తప్పుభావన. ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తులందరూ సొంత నిర్ణయాలు తీసుకుంటారనేది తప్పు. కొందరు తీసుకోవచ్చు. మరికొందరు తీసుకోకపోవచ్చు. కాబట్టి సరైన సమాధానం-4 అవుతుంది. 
Q. ప్రకటన: దేశంలోని 18 సంవత్సరాల వయసు పైబడిన నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలి.
ఊహలు:
1) భారతదేశంలోని చాలామంది నిరుద్యోగులు పేదవారే. వారికి ఆర్థిక సహాయం చేయాల్సిన అవసరం ఉంది.
2) నిరుద్యోగ యువతకు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర సరిపోయేంత నిధులు ఉన్నాయి.
జ.(1)
వివరణ: ఇచ్చిన ప్రకటనను మొదటి ఊహ మాత్రమే సంతృప్తిపరుస్తుంది. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వడం వల్ల వారిని కొంతవరకు ఆదుకున్నట్లు అవుతుంది. ప్రభుత్వం దగ్గర నిధులున్నాయనే ఊహ ఇచ్చిన ప్రకటనను సంతృప్తిపరచడం లేదు. కాబట్టి సరైన సమాధానం-1 అవుతుంది.
Q. ప్రకటన: ప్రభుత్వం ఇంధనం ధర పెంచినప్పటికీ ప్రైవేటు టాక్సీలవారు మీటరు రేటు పెంచలేదు.
ఊహలు:
1) ప్రైవేటు టాక్సీల మీటరు రేటు ఇంధనం రేటుపై ఆధారపడి ఉంటుంది.
2) ప్రైవేటు టాక్సీల మీటరు ధర పెంచడం ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది.
జ. (3)
వివరణ: ఇచ్చిన ప్రకటనను, రెండు ఊహలు సంతృప్తిపరుస్తాయి. ఎందుకంటే ప్రైవేటు టాక్సీ మీటరు రేటు దానికి అవసరమయ్యే ఇంధనం రేటుపై ఆధారపడి ఉంటుంది. టాక్సీ మీటరు రేటుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. టాక్సీవారు సొంతంగా పెంచుకోకూడదు. కాబట్టి సరైన సమాధానం-3 అవుతుంది.
Q. ప్రకటన: చాలావరకు చిన్నతరహా పరిశ్రమలన్నీ వాటి ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయడానికి ప్రయత్నిస్తున్నాయి.
ఊహలు:
1) ఎగుమతి వ్యాపారం చాలా లాభదాయకంగా ఉంటుంది.
2) వాటి ఉత్పత్తులకు భారతదేశంలో అంతగా మార్కెట్ లేదు.
జ. (1)
వివరణ: ఇచ్చిన ప్రకటనను మొదటి ఊహ మాత్రమే సంతృప్తిపరుస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎగుమతి వ్యాపారం లాభదాయకంగా ఉండటం వల్ల చిన్నతరహా పరిశ్రమలన్నీ ఎగుమతిపైనే దృష్టి సారిస్తున్నాయి. భారతదేశంలో వాటి ఉత్పత్తులకు అంతగా మార్కెట్ లేకపోవడమన్నది అసత్యం. కాబట్టి సరైన సమాధానం-1 అవుతుంది.
Q.ప్రకటన: రాత్రివేళల్లో మనం చెట్ల కింద నిద్రించకూడదు.
ఊహలు:
1) చెట్ల నుంచి రాలే ఆకులు మన దుస్తులను పాడుచేస్తాయి.
2) రాత్రివేళలో చెట్లు దివీ2ను విడుదల చేయడం వల్ల అది మన ఆరోగ్యానికి హానికరం.
జ.(2)
వివరణ: ఇచ్చిన ప్రకటనను రెండో ఊహ మాత్రమే సంతృప్తిపరుస్తుంది. ఎందుకంటే రాత్రివేళలో చెట్లు CO2ను విడుదల చేయడం వల్ల చెట్ల కింద నిద్రించడం ఆరోగ్యానికి హానికరం. చెట్ల నుంచి రాలే ఆకులు మన దుస్తులను పాడు చేస్తాయి అన్నది అసత్యం. కాబట్టి సరైన సమాధానం-2 అవుతుంది.
Q. ప్రకటన: ఒక కార్యాలయం నోటీస్ బోర్డులో కిందివిధంగా రాశారు. మధ్యాహ్నం 1.30 కల్లా మధ్యాహ్న భోజనం చేయాలి.
ఊహలు:
1) కార్యాలయంలో ఆ సూచనను అనుసరించకపోవడం.
2) కార్యాలయంలో వ్యక్తులు ఆ సూచనను చదివి అర్థం చేసుకుంటారని.
జ.(3)
వివరణ: ఇచ్చిన ప్రకటనలోని సూచనను రెండు ఊహలు సంతృప్తిపరుస్తాయి. ఎందుకంటే కార్యాలయంలో వ్యక్తులు మధ్యాహ్న భోజనం 1.30 కల్లా పూర్తిచేయకపోవడం వల్ల, ఆ సూచనను చదివి, అర్థం చేసుకుని అనుసరిస్తారని కాబట్టి సరైన సమాధానం-3 అవుతుంది.
Q. ప్రకటన: మానవుడు పుట్టుకతోనే స్వేచ్ఛాజీవి.
ఊహలు:
1) స్వేచ్ఛ అనేది మానవుడి జన్మహక్కు.
2) ప్రతి మానవుడికి మానవ హక్కులుంటాయి.
జ.(1)
వివరణ: ఇచ్చిన ప్రకటనను మొదటి ఊహ మాత్రమే సంతృప్తిపరుస్తుంది. రెండో ఊహ ఇచ్చిన ప్రకటనకు సంబంధించింది కాదు. కాబట్టి సరైన సమాధానం-1.
Q. ప్రకటన: ఈ రోజుల్లో అయిదుగురు ఆడపిల్లలున్న తండ్రి జీవితం నరకం లాంటిది.
ఊహలు:
1) ఆడపిల్లలను పెంచడం కష్టం.
2) ఆడప్లిలలకు వివాహాలు చేయడం చాలా ఖర్చుతో కూడిన పని.
జ.(3)
వివరణ: ఇచ్చిన ప్రకటనను రెండు ఊహలూ సంతృప్తి పరుస్తాయి. ఎందుకంటే ఈ రోజుల్లో అయిదుగురు ఆడపిల్లలను పెంచడం కష్టం, వారి వివాహాలు చాలా ఖర్చుతో కూడుకున్నవి. కాబట్టి సరైన సమాధానం-3 అవుతుంది.
Q. ప్రకటన: చాలామంది ఉదయం లేవగానే దినపత్రిక చదువుతారు.
ఊహలు:
1) ప్రజలకు సాయంకాల సమయంలో పత్రిక చదివేందుకు సమయం ఉండదు.
2) ప్రజలు ప్రపంచంలో కొత్తగా ఏం జరుగుతున్నాయో తెలుసుకోవాలన్న ఉత్సాహంతో పత్రిక చూస్తారు.
జ. (2)
వివరణ: ఇచ్చిన ప్రకటనను రెండో ఊహ మాత్రమే సంతృప్తిపరుస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో కొత్తగా ఏం జరుగుతున్నాయో తెలుసుకోవాలన్న ఉత్సాహంతో ప్రజలు పత్రిక చూస్తారు. వారికి సాయంకాల సమ యంలో పత్రిక చదివేందుకు సమయం ఉండదు అనేది అసత్యం. కాబట్టి సరైన సమాధానం-2 అవుతుంది.
Q. ప్రకటన: పిల్లలు ఐస్‌క్రీమ్‌లంటే చాలా ఇష్టపడతారు.
ఊహలు:
1) ఐస్‌క్రీమ్‌లన్నీ చాలా రుచికరంగా ఉంటాయి.
2) ఐస్‌క్రీమ్‌లన్నీ పాలతో తయారు చేస్తారు.
జ.(4)
వివరణ: ఇచ్చిన ప్రకటనను రెండు ఊహలు కూడా సంతృప్తిపరచవు.ఎందుకంటే ఐస్‌క్రీమ్‌లన్నీ రుచికరంగా ఉంటాయని చెప్పడం కష్టం. ఐస్‌క్రీమ్‌లన్నీ పాలతో తయారుచేసినంత మాత్రాన పిల్లలు ఇష్టపడతారని కూడా చెప్పలేం. కాబట్టి సరైన సమాధానం-4 అవుతుంది.
Q. ప్రకటన: ఒక కార్యాలయం నోటీస్ బోర్డులో కిందివిధంగా ఉంది.
''ఉద్యోగులందరూ సకాలంలో కార్యాలయానికి వచ్చి యాజమాన్యానికి సహకరించగలరు''
ఊహలు:
1) ఉద్యోగులు కార్యాలయానికి ఆలస్యంగా వస్తున్నారు.
2) ఉద్యోగులు ఈ నోటీస్ చూసి సకాలంలో రాగలరు.
జ.(3)
వివరణ: ఇచ్చిన ప్రకటనను రెండు ఊహలూ సంతృప్తిపరుస్తాయి. ఎందుకంటే ఉద్యోగులందరూ కార్యాలయానికి ఆలస్యంగా వస్తున్నారు. దాంతో యాజమాన్యం నోటీస్ బోర్డులో ప్రకటన పెట్టింది. అది చూసి ఉద్యోగులు సకాలంలో కార్యాలయానికి హాజరవుతారు. కాబట్టి సరైన సమాధానం-3.
Q. ప్రకటన: కార్యక్రమానికి అధిక డిమాండు ఉండటం వల్ల ఒక్కొక్కరికి 5 టిక్కెట్లు మాత్రమే ఇస్తున్నారు.
ఊహలు:
1) నిర్వాహకులు టిక్కెట్లు ఇవ్వడంలో పరిమితి పాటించడం లేదు.
2) 5 టిక్కెట్ల కంటే ఎక్కువ తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడటం లేదు.
జ. (1)
వివరణ: ఇచ్చిన ప్రకటనను మొదటి ఊహ మాత్రమే సంతృప్తిపరుస్తుంది. ఎందుకంటే నిర్వాహకులు టిక్కెట్లు ఇవ్వడంలో పరిమితి పాటించకపోవడంతో కార్యక్రమానికి డిమాండు పెరిగింది. ఈ కారణంగా ఒక్కొక్కరికి 5 టిక్కెట్లకు మాత్రమే పరిమితి ఇచ్చారు. 5 టిక్కెట్ల కంటే ఎక్కువ తీసుకోవడానికి ఎవరూ ఇష్టపడటంలేదు అన్నది అసత్యం. కాబట్టి సమాధానం-1 అవుతుంది.

Aptitude (Number System Tutorials & Tricks)

Number System Tutorials & Tricks

Introduction

A number is a mathematical object used to count, label, and measure. In mathematics, the definition of number has been extended over the years to include such numbers as 0, negative numbers, rational numbers, irrational numbers, real numbers, and complex numbers.

Formula for finding out Number System

 
1. Prime number: If number a divided another number b exactly, we say that a is a factor of b. A number which is not divisible by other numbers except the number itself and 1 is termed as prime number
2. Whole Number:Natural numbers with 0 are termed as whole number
3. Important Rules on Counting:-
Rule 1: Sum of first n natural numbers : = n(n+1)/2
Rule 2: Sum of first n odd numbers : = n*n/n2
Rule 3: Sum of first n even numbers = n(n+1)
Rule 4: Sum of squares of first n natural numbers : = n(n+1)(2n+1)/6
Rule 5: Sum of cubes of first n natural numbers : = [n(n+1)/2]2
Rule 6: If n is the number of numbers and n is even then n/2 numbers will be even and n/2 numbers will be odd among first n natural numbers.
Rule 7: If n is odd , then there are (n+1)/2 odd numbers and (n-1)/2 even numbers
Rule 8: The difference between the squares of two consecutive numbers is always an odd number. Eg. 92 - 82 = 17
Rule 9: The difference between the squares of two consecutive numbers is the sum of the two consecutive numbers
Rule 10: Dividend = (Divisor * Quotient) + Remainder
Rule 11: Sum of first n even numbers = n(n+1)

Sample Example

Ex

Find out the number of all even numbers from 1 to 300 ?

A
 Since 300 is an even number so total number of even numbers wil be (n/20) = (300/2) = 150 even numbers/ 
Ex

What is the sum of all the even numbers from 1 to 381

A
 Even numbers will be = (381-1)/2= 190 Sum of even numbers = n * (n+1) = 190 (190+1) = 36,290 
Ex

Find out of sum of all the odd numbers from 50 to 200?

A
 Required Sum = Sum of all odd numbers from 1 to 200 - Sum of all odd numbers from 1 to 50 : = 1002 - 252 = 9375
Ex

What least number must be added to 7963 to make it exactly divisible by 65 ?

A
 On dividing 7963 by 65 we get 33 as remainder, So the number to be added will be 65 - 33 = 32
Ex

What least number must be subtracted from 7963 to make it exactely divisible by 65 ?

A
 On dividing 7963 by 65 we get 33 as remainder, So the number to be subtracted will be 33

Aptitude (Compound Interest Tutorials & Tricks)

Compound Interest Tutorials & Tricks

Introduction

If P is Principal amount, R is Percentage Rate, n is number of years

Formula for finding out Compound Interest.

 
Rule 1: When interest is compound annually Amount = P(a+(R/100))n
Rule 2: If interest is compouned Half-yearly : Amount = P(1+((R/2)/100))2n
Rule 3: When interest is compounded Quarterly :Amount = P(1+((R/4)/100))4n
Rule 4: When rate of interest are X % , Y %, Z % for 1st, 2nd and third year respectively. Then amount will be : Amount = P(1+(x/100))(1+(y/100))(1+(z/100))
Rule 5: When interest is compounded annually but time is in fraction such as 5(2/3)years Amount = P(1+(R/100))5*(1+((2/3)R/100))

Sample Example

Ex

A sum of money doules itself at compound interest in 15 years. In how many years will it become eight times ?

A
 P(1+(R/100))15, Also P(1+(R/100))n = *P or (1+(R/100))n = {(1+(R/100))15*3}, so number of years = 45
Ex

The difference between compound interest and simple interest on an amount of Rs. 15, 000 for 2 years is Rs. 96. What is the rate of interest per annum ?

A
 [[1500*(1+(R/100))2] - [(15000*R*2)/100]=96] 15000[(1+(R/100))2 - 1 - 2R/100] = 96, R2 = (9

Aptitude (Clock Tutorials & Tricks)

Clock Tutorials & Tricks

Introduction

A clock is an instrument to indicate, keep, and co-ordinate time. The word clock is derived ultimately (via Dutch, Northern French, and Medieval Latin) from the Celtic words clagan and clocca meaning "bell".clock, instrument for measuring and indicating time. Predecessors of the clock were the sundial, the hourglass, and the clepsydra.

Formula for finding out Clock.

 
1. Minute Spaces: The face or dial of watch is a circle whose circumference is divided into 60 equal parts, called minute spaces.
2. Hour Hand and Minute Hand:A clock has two hands, the smaller one is called the hour hand or short hand while the larger one is called minute hand or long hand.
3. i)In 60 minutes, the minute hand gains 55 minutes on the hour on the hour hand. ii)In every hour, both the hands coincide once. iii)The hands are in the same straight line when they are coincident or opposite to each other. iv)When the two hands are at right angles, they are 15 minute spaces apart. v)When the hands are in opposite directions, they are 30 minute spaces apart. vi)Angle traced by hour hand in 12 hrs = 360° vii)Angle traced by minute hand in 60 min. = 360°. viii)If a watch or a clock indicates 8.15, when the correct time is 8, it is said to be 15 minutes too fast. On the other hand, if it indicates 7.45, when the correct time is 8, it is said to be 15 minutes too slow.
4. The hands of a clock will be in straight line but opposite in direction, 22 times in a day
5. The hands of a clock coincide 22 times in a day
6. The hands of a clock are straight 44 times in a day
7. The hands of a clock are at right angles 44 times in a day
8. The two hands of a clock will be together between H and (H+1) o' clock at (60H11)minutes past H o' clock.
9. The hands of a clock are at right angles 44 times in a day
10. Angle between Hands of a clockWhen the minute hand is behind the hour hand, the anglebetween the two hands at M minutes past H'o clock=30(H−M5)+M2 degreeWhen the minute hand is ahead of the hour hand, the anglebetween the two hands at M minutes past H'o clock=30(M5−H)−M2 degree
11. The two hands of the clock will be at right angles between H and (H + 1) o' clock at(5H±15)1211minutes past H 'o clock
12. The minute hand of a clock overtakes the hour hand at intervalsof M minutes of correct time. The clock gains or loses in a day by=(72011−M)(60×24M) minutes
13. Bbetween H and (H + 1) o' clock, the two hands of a clock are M minutes apart at(5H±M)1211minutes past H 'o clock

Sample Example

Ex

Find at what time between 9 and 10 o'clock will the hands of a clock be in the same straight line but not together ?

A
 At 9 o'clock hour hand 15 min space apart from minute hand. Also minute hand has gain of (30-15)= 15 min spaces apart over hour hand For both hand to be straight but not together they will be 30 min space apart. 55 min space gained by min hand in 60 min So, 15 min spaces will be gined in =((60/55)*15)min = (16*(4/11))min
Ex

At what time between 8 and 9 o'clock will the hands of a clock be at right angle ?

A
 At 8 o'clock min hands are 20 min space ahead the hour hand. Also when both hands are at right angled, they are 15 mins space apart. Case 1: when min hand 15 min space ahead the hour hand In this case min hand has a gain of (20-15)= 5 min now 55 min space is gained in 60 min So, 5 min space will be gined in = ((60/55)5)min = (5(5/11))min So both hands will be at right angled at 5(5/11)min. Case 2: When min hand 15 space behind the hour hand In this case min. hand has a gain of (20+15) = 35 min now 55 min space is gained in 60 min So, 35 space is gained by min hand in = ((60/55)35) = (38(2/11))min So both hands will be at right angled at 38(2/11)min.

Aptitude (Boats And Streams Tutorials & Tricks)

Boats And Streams Tutorials & Tricks

Introduction

In area-velocity method generally the discharge measurements are made by keepingthe boat stationary at the point of observation or vertical. Depth and velocity aremeasured by sculling the boat to this point. The drifting of the boat, time consumes instationary boat method and necessity of instant value of discharge during floods fortaking anti-damaging action of flood on the bridge piers and other structuresnecessitated the adoption of moving boat method.

Formula for finding out Boats and Streams.

 1. Downstream/Upstream: In water, the direction along the stream is called downstream. And, the direction against the stream is called upstream.
2. If the speed of a boat in still water is u km/hr and the speed of the stream is vkm/hr, then: Speed downstream = (u + v) km/hr. Speed upstream = (u - v) km/hr.
3. If the speed downstream is a km/hr and the speed upstream is b km/hr, then: Speed in still water = 1/2 (a + b) km/hr. Rate of stream = 1/2 (a - b) km/hr.
4. Stream: Moving water of the river is called stream.
5. Still Water:If the water is not moving then it is called still water.
6. Upstream:Upstream: If a boat or a swimmer moves in the opposite direction of the stream then it is called upstream.
7. Downstream: If a boat or a swimmer moves in the same direction of the stream then it is called downstream.
8. Points to remember When speed of boat or a swimmer is given then it normally means speed in still water.
Some Basic Formulas
Rule 1: If speed of boat or swimmer is x km/h and the speed of stream is y km/h then, Speed of boat or swimmer upstream = (x − y) km/h Speed of boat or swimmer downstream = (x + y) km/h Rule 2:Speed of boat or swimmer in still water is given by Speed of stream is given by

Sample Example

Ex

A man can row a boat in upstream at 6 kmph and downstream at 12 kmph. Find the man's rate in still water and the rate of current ?

A
 Rate in still water = 1/2(6+12) = 9 km/hr Rate of current = 1/2(12-6) = 3 km/hr
Ex

A man can row 15 km /hr in still water. It takes him twice as long to row upstream as to row downstream. Find the rate of stream ?

A
 Let man's rate in upstream be x km/hr, then his rate in downstream is = 2x kmph Rate in still water = 1/2(2x+x) = 3x/2 km/hr 3x/2 = 15, x = 10 km/hr So rate in down stream= 2x= 20 km/hr Rate of stream = 1/2(20-1

Banking (Money Market)

Money Market

BANKING PATHWAY 2016: MONEY MARKET

"Money Market" refers to the market for short-term requirement and deployment of funds. Money market instruments are those instruments, which have a maturity period of less than one year.
The most active part of the money market is the market for overnight call and term money between banks and institutions and repo transactions. Money Market is regulated by RBI.
Money Market can be further divided into 3 parts. These are:
a)       Call Money Market
b)       Term Money Market
c)       Notice Money Market
The market to get funds for 1 day only is called as Call Money Market. The market to get funds for 2 days to 14 days is called as Notice Money Market. The market to get funds for 15 days to 1 year is called as Term Money Market.
Some of the Money Market instruments are:
1) Commercial Paper
2) Certificate of Deposit
3) T-bills
4) Cash Management Bills
Commercial Papers-
a) A CP is a short term security (7 days to 365 days) issued by a corporate entity (other than a bank), at a discount to the face value.
b) Commercial Paper (CP) is an unsecured money market instrument issued in the form of a promissory note.
c) CPs normally give a higher return than fixed deposits & CDs.
d) CP can be issued in denominations of Rs. 5 lakh or multiples thereof. Amount invested by a single investor should not be less than Rs. 5 lakh (face value).
e) Only corporates who get an investment grade rating can issue CPs, as per RBI rules. It is issued at a discount to face value.
f) Bank and FI’s are prohibited from issuance and underwriting of CP’s.
Certificates of Deposit     
a) CDs are negotiable money market instrument issued in demat form or as a Usance Promissory Notes.
b) CDs issued by banks should not have the maturity less than seven days and not more than one year.
c) Financial Institutions are allowed to issue CDs for a period between 1 year and up to 3 years.
d) CDs are like bank term deposits but unlike traditional time deposits these are freely negotiable and are often referred to as Negotiable Certificates of Deposit.
e) CDs normally give a higher return than Bank term deposit.
f) All scheduled banks (except RRBs and Co-operative banks) are eligible to issue CDs.
g) CDs are issued in denominations of Rs. 1 Lac and in the multiples of Rs. 1 Lac thereafter.
h) Discount/Coupon rate of CD is determined by the issuing bank/FI.
i) Loans cannot be granted against CDs and Banks/FIs cannot buy back their own CDs before maturity
Treasury bills
a) Treasury Bills are short term (up to one year) borrowing instruments of the Government of India which enable investors to park their short term surplus funds while reducing their market risk.
b) They are auctioned by Reserve Bank of India at regular intervals and issued at a discount to face value.
c) Any person in India including Individuals, Firms, Companies, Corporate bodies, Trusts and Institutions can purchase Treasury Bills.
d) Treasury Bills are eligible securities for SLR purposes.
e) Treasury Bills are available for a minimum amount of Rs. 25,000 and in multiples of Rs. 25,000 thereafter.
f) At present, RBI issues T-Bills for three different maturities: 91 days, 182 days and 364 days.
Cash Management Bills (CMBs)
a) Government of India, in consultation with the Reserve Bank of India, has decided to issue a new short-term instrument, known as Cash Management Bills (CMBs), to meet the temporary mismatches in the cash flow of the Government.
b) The CMBs have the generic character of T-bills but are issued for maturities less than 91 days.
c) Like T-bills, they are also issued at a discount and redeemed at face value at maturity.
d) The tenure, notified amount and date of issue of the CMBs depends upon the temporary cash requirement of the Government.

Banking (Financial Inclusion)

Financial Inclusion

FINANCIAL INCLUSION

It is the delivery of financial services at affordable costs to vast sections of disadvantaged and low income groups
Financial inclusion involves
1) Give formal banking services to poor people in urban & rural areas.
2) Promote habit of money-savings, insurance, pension-investment among poor-people.
3) Help them get loans at reasonable rates from normal banks. So they don’t become victims in the hands of local moneylender.

Some Important initiatives for financial inclusion:
1) Lead banking scheme (LBS).
2) No frills account.
3) BSBDA
4) Business Correspondents (BC) system.
5) Swabhiman Campaign
6) PMJDY
Lead Bank Scheme
The Lead Bank Scheme, introduced towards the end of 1969, envisages assignment of lead roles to individual banks (both in public sector and private sector) for the districts allotted to them. A bank having a relatively large network of branches in the rural areas of a given district and endowed with adequate financial and manpower resources has generally been entrusted with the lead responsibility for that district. Accordingly, all the districts in the country have been allotted to various banks. The lead bank acts as a leader for coordinating the efforts of all credit institutions in the allotted districts to increase the flow of credit to agriculture, small-scale industries and other economic activities included in the priority sector in the rural and semi-urban areas, with the district being the basic unit in terms of geographical area.
No Frill Account
'No Frills 'account is a basic banking account. Such account requires either nil minimum balance or very low minimum balance. Charges applicable to such accounts are low. Services available to such account is limited. In what can be described as a watershed Annual Policy Statement, the RBI in 2005-06 called upon Indian banks to design a ‘no frills account’ – a no precondition, low ‘minimum balance maintenance’ account with simplified KYC (Know Your Customer) norms. But All the existing ‘No-frills’ accounts opened were converted into BSBDA in compliance with the guidelines issued by RBI in 2012 .
BSBDA
RBI in 2012 came out with fresh guidelines and asked banks to offer a ‘Basic Savings Bank Deposit Account’ which will offer following minimum common facilities to all their customers. These guidelines includes:-
(a) This account shall not have the requirement of any minimum balance.
(b) The services available in the account will include deposit and withdrawal of cash at bank branch as well as ATMs; receipt/credit of money through electronic payment channels or by means of deposit/collection of cheques drawn by Central/State Government agencies and departments;
(c ) While there will be no limit on the number of deposits that can be made in a month, account holders will be allowed a maximum of four withdrawals in a month, including ATM withdrawals; and
(d) Facility of ATM card or ATM-cum-Debit Card.
Business Correspondent
Business correspondents are bank representatives. They personally goes to the area allotted to them and carry out banking.
  • They help villagers to open bank accounts.
  • They help villagers in banking transactions. (deposit money, take money out of savings account, loans etc.)
  • The Business Correspondent carries a mobile device.
  • The villager gives his thumb impression or electronic signature, and get the money.
  • Business Correspondents get commission from bank for every new account opened, every transaction made via them, every loan-application processed etc.
Recently on Financial Inclusion
The Reserve Bank of India (RBI) has constituted a committee with the objective of working out a medium-term (five-year) measurable action plan for financial inclusion. The terms of reference will include reviewing the existing policy of financial inclusion, including supportive payment system and customer protection framework, taking into account the recommendations made by various committees set up earlier.
It will also study the cross-country experience in financial inclusion to identify key learnings, particularly in the area of technology-based delivery models, that could inform policies and practices. The committee will also suggest a monitorable medium-term plan for financial inclusion in terms of its various components like payments, deposit, credit, social security transfers, pension and insurance.
Deepak Mohanty, RBI executive director, will chair the committee. 

Banking (Foreign Exchange Reserves)

Foreign Exchange Reserves

A Brief on FOREIGN EXCHANGE RESERVES

As it was in the news that,  our country's foreign exchange reserves rose by $321.7 million to $353.648 billion in the week to July 24 on account of increase in foreign currency assets. The country's gold reserves remained unchanged at $19.074 billion. The special drawing rights with the International Monetary Fund were up by $5.8 million to $4.024 billion in the week under review, while the country's reserve position with the Fund also rose by $1.8 million to $1.304 billion.
Components of ForexAs on July 24, 2015
₹ Bn.US$ Mn.
12
Total Reserves22,551.8353,648.1
1.1 Foreign Currency Assets20,995.3329,245.4
1.2 Gold1,216.119,074.3
1.3 SDRs257.14,024.2
1.4 Reserve Position in the IMF83.31,304.3






Lets discuss What actually is FOREX?
Reserves are maintained by countries for meeting their international payment obligations — both short and long terms, including sovereign and commercial debts, financing of imports, for intervention in the foreign currency markets during periods of volatility, besides helping to boost the confidence of the market in the ability of a country to meet its external obligations and to absorb any unforseen external shocks, contingencies or unexpected capital movements.
India's foreign exchange reserves comprise foreign currency assets, gold and special drawing rights allocated to it by the International Monetary Fund (IMF) in addition to the reserves it has parked with the fund. Foreign exchange reserves are held and managed by the RBI.
The Foreign currency assets are investment mainly in instruments abroad which have the highest credit rating and which do not pose any credit risk. These include sovereign bonds, treasury bills and short-term deposits in top-rated global banks besides cash accounts.
The Special Drawing Right (SDR) is an interest-bearing international reserve asset created by the IMF in 1969 to supplement other reserve assets of member countries. The SDR is based on a basket of international currencies comprising the U.S. dollar, Japanese yen, euro and pound sterling. It is not a currency, nor a claim on the IMF, but is potentially a claim on freely usable currencies of IMF members. It can be held and used by member countries, the IMF, and certain designated official entities called "prescribed holders"—but it can not be held, for example, by private entities or individuals.