AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Monday 1 January 2018

చరిత్రలో ఈ రోజు డిసెంబరు 31

*🌏 చరిత్రలో ఈరోజు 🌎*

*🌅డిసెంబరు 31*🌅*🏞సంఘటనలు*🏞

2010: ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టులో పరిష్కారం కాని కేసులు 1,98,056. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లోని మూడు ప్రాంతాల లోని (రాయలసీమ, కోస్తా, తెలంగాణ) దిగువ స్థాయి కోర్టులలో, పరిష్కారం కాని కేసులు 9,63,190.

*🌻🌻జననాలు*🌻🌻

1870: ఎంబా ఘోటో, 146 సంవత్సరాలు జీవించిన ఇండోనేషియా జాతీయుడు. (మ.2017)

1907: కొత్త సత్యనారాయణ చౌదరి, ప్రముఖ సాహితీ విమర్శకుడు, పండిత కవి, హేతువాది మరియు ఉభయ భాషా ప్రవీణుడు. (మ.1974)

1918: పిల్లలమఱ్ఱి వేంకట హనుమంతరావు, ప్రముఖ సాహితీవేత్త.

1928: కొంగర జగ్గయ్య, ప్రముఖ తెలుగు సినిమా నటుడు, రచయిత, పాత్రికేయుడు మరియు మాజీ పార్లమెంటు సభ్యుడు. (మ.2004)

1937: ఆంథోనీ హాప్కిన్స్, నటుడు.

1947: కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, నిరసన కవులలో ఒకడిగా ప్రసిద్ధుడు. (మ.2009)

1953: ఆర్.నారాయణమూర్తి, విప్లవ సినిమాల నిర్మాత, దర్శకుడు, నటుడు.

1964: విన్‌స్టన్ బెంజిమన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

1965: లక్ష్మణ్ శివరామకృష్ణన్, భారత క్రికెట్ జట్టు  మాజీ క్రీడాకారుడు.

1977: సుచేతా కడేత్కర్, సాహసయాత్రికురాలు. ఆసియాలో అతిపెద్దదైన గోబీ ఎడారిని విజయవంతంగా దాటింది.

1979: మలింగ బండార, శ్రీలంక క్రికెట్ జట్టుకు చెందిన క్రీడాకారుడు.

1988: వడ్ల అనిల్ కుమార్ చారి, సింగీతం గ్రామ నివాసి.

*🌹🌹మరణాలు*🌹🌹

1900: బుడ్డా వెంగళరెడ్డి,

1866 కాలంలో సంభవించిన కరువు కాలంలో తన ఆస్తినంతా ధారపోసి ఎంతోమంది ప్రాణాల్ని కాపాడిన మహా దాత. (జ.1840)

1965: వి. పి. మెనన్, భారత స్వాతంత్ర్య సమయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన భారతీయ సివిల్ సర్వీసెస్ అధికారి.(జ.1893)

2004: గెరాల్డ్ డిబ్రూ, ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత.

*🔷జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 🔷*

🔻వరల్డ్ స్పిరిట్యువల్ డే.

*🗓 నేటి పంచాంగం 🗓*

*తేది :  31, డిసెంబర్ 2017*
సంవత్సరం : హేవిళంబినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : పుష్యమాసం
ఋతువు : హేమంత ఋతువు
కాలము : శీతాకాలం
వారము : ఆదివారం
పక్షం : శుక్లపక్షం
తిథి : త్రయోదశి
(నిన్న రాత్రి 6 గం॥ 51 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 3 గం॥ 25 ని॥ వరకు)
నక్షత్రం : రోహిణి
(నిన్న రాత్రి 8 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 51 ని॥ వరకు)
యోగము : శుభము
కరణం : తైతిల
వర్జ్యం :
(ఈరోజు ఉదయం 10 గం॥ 45 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 10 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 10 గం॥ 46 ని॥ నుంచి నిన్న తెల్లవారుజాము 0 గం॥ 10 ని॥ వరకు)
అమ్రుతఘడియలు :
(ఈరోజు సాయంత్రం 3 గం॥ 0 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 4 గం॥ 25 ని॥ వరకు)
దుర్ముహూర్తం :
(సాయంత్రం 4 గం॥ 22 ని॥ నుంచి సాయంత్రం 5 గం॥ 6 ని॥ వరకు)
రాహుకాలం :
(సాయంత్రం 4 గం॥ 27 ని॥ నుంచి సాయంత్రం 5 గం॥ 50 ని॥ వరకు)
గుళికకాలం :
(సాయంత్రం 3 గం॥ 4 ని॥ నుంచి సాయంత్రం 4 గం॥ 27 ని॥ వరకు)
యమగండం :
(ఉదయం 12 గం॥ 17 ని॥ నుంచి మద్యాహ్నం 1 గం॥ 40 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 45 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 51 ని॥ లకు
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : వృషభము

*🤘 నేటి సుభాషితం🤘*

*మధుర వాక్కు కోపాన్ని చల్లబరుస్తుంది. కటిన వాక్కు రెచ్చగొడుతుంది.*

🔲 సూక్తులు

🔺నూనె లేని దీపం వెలగనట్లే భగవంతుడు లేని మనిషి జీవించలేడు.

🔺నెరసిన జుట్టు వయస్సుకు చిహ్నమే కాని, వివేకానికి కాదు.

🔺నేడు మీదగ్గర ఉన్న ఉత్తమమైన దాన్ని అందివ్వండి. అది రేపటి మంచి చిట్కాగా మారుతుంది.

🔺నేను గెలుస్తాను అనే నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. 

🔺నీ అపనమ్మకమే నీ అపజయానికి దారి తీస్తుంది.

🔺నేను జీవించి ఉన్నంతవరకు నేర్చుకుంటూనే ఉంటాను

☘ *ఒక మంచిమాట*☘

చూసే వాళ్ళు చుట్టూ లేకున్నా సరే, 

పుష్పం వికసించక మానదు. 

నీపని నువ్వు నిశ్శబ్దం గా చేసుకుంటూ వెళ్ళు,

నిన్ను ఇష్టపడే వాళ్లు
దారి వెతుక్కుంటూ వస్తారు...

*💟🌳🌹 BE POSITIVE 🌹🌳💟*

        --------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
        -------------------------
" నమ్మకం " అనేది ఒక చిన్న పదం దీనిని చదవడానికి ఒక సెకండ్ పడుతుంది. ఆలోచించడానికి ఒక నిమిషం పడుతుంది. అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది. కానీ నిరూపించుకోవడానికి ఒక జీవిత కాలం కావాలి..!
       --------------------------
🌹 _*నేటీ మంచి మాట*_ 🌹
      ---------------------------
" లోహం చల్లబడిన తర్వాత ఎన్ని దెబ్బలు కొట్టినా కావాలనుకొన్న రూపంలోకి మలచలేం 
వచ్చిన అవకాశాన్ని గుర్తించక చేజార్చుకొని ఎన్ని ప్రయత్నాలు చేసినా విజయం సాధించలెం. "

*💎 నేటి ఆణిముత్యం 💎*

ఇద్దఱు గూడుక యొక చో
నొద్దిక మాటాడుచుండ నొదిగి యొదిగి యా 
యొద్దకు జనగూడదు తన
పెద్దతనంబెల్ల నణఁగ బెట్టు గుమారీ! 
  
*భావం:*

ఓ కుమారీ!ఇద్దరు మాట్లాడుకొనునపుడు మద్యలో దూరి కల్పించుకొనరాదు.అట్టి స్థలమునకు బోగూడదు.వెళ్ళినచో తన గొప్పదనమెల్ల జెడిపోవును.

*✍🏼 నేటి కథ ✍🏼*

*గువ్వ కథ*

ఒక ఊర్లో గువ్వంట. అది గింజలు తింటూ ఉంటే దాని కాలిలో ముల్లు గుచ్చుకుందంట. ఆ గువ్వ ఒక పిల్లోడి దగ్గరకుపోయి "మనవడా! మనవడా! నా కాలిలో ముల్లు తీస్తావారా?" అని అడిగిందంట.

" నేను తీయను. నన్ను అవ్వ కొడుతుంది- పో " అన్నాడట వాడు.

"అట్లనా!" అని, ఆ గువ్వ అవ్వ దగ్గరకి పోయి, "అవ్వా! అవ్వా! నా కాలి ముల్లు తీస్తావా అవ్వా?", అని అడిగిందట.

"నన్ను తాత కొడతాడు. నేను రాలేను- పో" అని అవ్వ చెప్పిందంట.

"సరేలె"మ్మని, ఆ గువ్వ తాత దగ్గరకు పోయిందంట. పోయి, "తాతా! తాతా! నా కాల్లోంచి ముల్లు తీస్తావా తాతా?" అని అడిగిందట.

"నన్ను ఆవు కుమ్ముతుందిరా పిట్టా!" అని తాత అన్నాడట.

"సరే"నని ఆవుదగ్గరికెళ్లి, "ఆవూ! ఆవూ! నా కాలి ముల్లు తీస్తావా, ఆవూ?" అని అడిగిందట గువ్వ.

అప్పుడు ఆవు, "నన్ను దూడ కొడుతుంది" అని చెప్పిందట.

"సరే అయితే. నేను దూడని అడుగుతాను ఉండు" అని దూడ దగ్గరికెళ్లి, "దూడా! దూడా! నా కాల్లో ముల్లు తీస్తావా దూడా?" అని అడిగిందంట గువ్వ.

దూడేమో, "ఊ...నేను తేనీగతో ఆడుకోవాలమ్మా! లేకపోతే అది నన్ను తిట్టదూ?" అని చెప్పిందట.
"ఐతే నేను తేనీగను అడుగుతాలే" అని తేనీగ దగ్గరికెళ్లి తన గోడు చెప్పుకున్నదట గువ్వ.

"అయ్యో పాపం! నీ కాళ్లో గుచ్చుకున్న ముల్లును తీసెయ్యించడానికే ఇంత కథ నడిచిందా? ఉండు, నేను చూసుకుంటానుగానీ" అని, అది వెళ్లి దూడను కుట్టిందట. దూడ పోయి ఆవును కుమ్మిందట. ఆవుపోయి తాతను గుద్దిందంట. తాత పోయి అవ్వను కొట్టాడంట. అవ్వ పోయి మనవడ్ని వేళ్లతో పొడిచిందంట. మనవడు పోయి గువ్వ కాల్లో ఇరుక్కున్న ముల్లును తీసేశాడట.

ముల్లు బాధ పోయిన గువ్వ తేనీగకు ధన్యవాదాలు తెలుపుకుని ఎగిరిపోయిందంట!! 

*📖 మన ఇతిహాసాలు 📓*

*దుర్వాసుడు*

దూర్వాసుడు, హిందూ పురాణాలలో అత్రి మహర్షి, అనసూయ ల పుత్రుడు. ఇతడు చాలా ముక్కోపి. అలా కోపం తెప్పించినవారిని శపిస్తాడు. అందువల్లనే ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆయన్ను విపరీతమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆయన కోపానికి గురైన వారిలో అభిజ్ఞాన శాకుంతలంలో వచ్చే శకుంతల ఒకరు.

*అంబరీషుని కథ*

భాగవతంలో వచ్చే అంబరీషుని కథ చాలా ప్రాచుర్యం పొందింది. అంబరీషుడు గొప్ప విష్ణుభక్తుడు. సత్యసంధుడు. ఆయన ఒకసారి గొప్ప యజ్ఞాన్ని నిర్వహించి నారాయణుని మెప్పించి సుదర్శన చక్రాన్నే వరంగా పొందుతాడు. దానివల్ల ఆయన రాజ్యం సంపద, శాంతి సౌఖ్యాలతో విలసిల్లుతూ ఉంటుంది. రాజ్యానికి రక్షణ కవచంగా కూడా ఉంది. ఒక సారి అంబరీషుడు ద్వాదశి వ్రతం నిర్వహించాడు. ఈ వ్రతం ప్రకారం ఆయన ఏకాదశి ప్రారంభం కాగానే ఉపవాసం ప్రారంభించి, ద్వాదశి రోజున ముగించి ప్రజలందరికీ భోజనం పెట్టాల్సి ఉంటుంది.

*మహాభారతంలో*

మహాభారతంలో దుర్వాసుడు ఆయనను తమ భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి, అతిథిగా ఆదరించిన వారికి వరాలు అనుగ్రహిస్తుంటాడు. వాటిలో ముఖ్యమైన ఘట్టం కుంతీదేవి బాల్యంలో జరిగింది. కుంతీ చిన్నతనంలో తన పెంపుడు తండ్రియైన కుంతీభోజుడి దగ్గర పెరుగుతుంటుంది. ఒకసారి దుర్వాసుడు ఆయన దగ్గరకు అతిథిగా వస్తాడు. ఆయన దుర్వాసునికి మర్యాదలు చేయవలసిన బాధ్యత కుంతీ దేవికి అప్పజెపుతాడు. ఆమె దుర్వాసుడు ఎలాంటి కష్టాలు పెట్టినా ఓర్చుకుని బాగా సేవలు చేస్తుంది. దుర్వాసుడు అందుకు సంతుష్టుడవుతాడు. ఆయన తిరిగి వెళ్ళేటపుడు ఆమెకు అథర్వణ వేదం లోని దేవతా ఉపాసనా మంత్రాలను కొన్నింటిని ఉపదేశిస్తాడు. ఆ మంత్రాల సాయంతో ఆమె కోరుకున్న దేవతలను ప్రార్థించే వరం సంపాదిస్తుంది. దీని సాయంతోనే ఆమె ముగ్గురు పాండవులను సంతానంగా పొందుతుంది. పెళ్ళి కాక మునుపే సూర్యుణ్ణి ప్రార్థించి కర్ణుని సంతానంగా పొందుతుంది. కానీ అవివాహిత కావడంతో ఏమి చేయాలో పాలుపోక ఆ బిడ్డను నదిలో వదిలి వేస్తుంది.

*✅ తెలుసుకుందాం ✅*

*🐟చేపలు వినలేవా?*🐠

✳చేపలు శబ్దాలు చేయలేవని, వినలేవనే విషయాలు నిజం కాదు. అవి ఒక దానితో మరొకటి క్లిక్‌, క్లిక్‌ అనే శబ్దాలతోనూ, బొంగురుపోయిన గుర్‌, గుర్‌ అనే శబ్దాలతోను సంకేతాలు పంపించుకుంటాయి. మగ చేపలు గాలిని నింపుకునే సంచుల చుట్టూ ప్రత్యేకమైన కండరాలు ఉంటాయి. ఈ కండరాలను కుంచించడం ద్వారా అవి డ్రమ్ములను వాయించినపుడు వచ్చే శబ్దాలను అతి తక్కువ తీవ్రతలో ఉత్పన్నం చేయగలవు. చేపలు ఒకదానితో మరొకటి మాట్లాడుకోవాలనుకుంటే, గాలిని పీల్చుకుని ఆ గాలిని వ్యర్థ పదార్థాలను విసర్జించే మార్గం ద్వారా వెలువరిస్తూ శబ్దాలను చేస్తూ ఉంటాయి. ఆ విధంగా చేపలు 1.7 నుంచి 2.2 కిలో హెర్ట్జ్‌ పౌనఃపున్యం ఉండే శబ్దాలను వెలువరించగలవు. ఒక్కో శబ్దాన్ని 8 సెకండ్ల వరకు పట్టి ఉంచగలవు. అలా శబ్దాలు చేయగల శక్తి గల చేపలకు వినికిడి శక్తి ఉండటం సహజం. అవి గాలిని నింపుకొనే సంచికి అనుసంధానమై ఉండే లోపలి చెవి ద్వారా వినగలవు. ఆ చెవి శబ్దాలు వినడంలో కర్ణభేరి లాగా పనిచేస్తుంది.

*🅾ప్రీ ప్రైమరీ ప్రవేశాలకు షెడ్యూల్ వెల్లడి*

హైదరాబాద్: ప్రైవేటు పాఠశాలలో ప్రీ ప్రైమరీ ప్రవేశాలకు ప్రభుత్వం షెడ్యూల్ను ప్రకటించింది.

 నర్సరీ, ఎల్కేజీ, ఒకటో తరగతిలో ప్రవేశాలకు షెడ్యూల్ ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. 

ప్రైవేటు పాఠశాలలు జనవరి 2న ప్రవేశాల నోటిఫికేషన్ జారీ చేయాలని.. జనవరి 3 నుంచి 8 వరకు దరఖాస్తులు స్వీకరించాలని.. జనవరి 11న తల్లిదండ్రుల సమక్షంలో ప్రవేశాలు ఖరారు చేయాలని ప్రభుత్వం పేర్కొంది.

🔵హైదరాబాద్లో బ్లూవేల్ కలకలం*

🏀 హైదరాబాద్ : ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న బ్లూవేల్ భూతం హైదరాబాద్కు పాకింది. ఓ నిండు జీవితాన్ని బలితీసుకుంది. వివరాల్లోకి వెళ్తే రాజేంద్ర నగర్ సన్సిటీలోని మిఫుల్ టౌన్ విల్లాకు చెందిన వరుణ్(19) బ్లూవేల్ బారిన పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్ బిట్స్పిలానీలో రెండో సంత్సరం చదువుతున్న వరుణ్ సెలవుల కారణంగా వారం రోజులుగా ఇంట్లోనే ఉంటున్నాడు. గత మూడు రోజుల నుంచి తన రూమ్ నుంచి బయటకు రాకుండా బ్లూవేల్ గేమ్ ఆడుతున్నాడు. అయితే కుమారుడి ప్రవర్తను గమనించిన తల్లి పరిస్థితిని గురించి వరుణ్ తండ్రికి వివరించింది. విషయం తెలుసుకున్న వరుణ్ తండ్రి ఇంట్లో ఇంటర్నెట్ను తీసేయించాడు. దీంతో మనస్థాపానికి గురైన వరుణ్ తలకు ప్లాస్టిక్ కవర్, ఊపరి ఆడకుండా కొంతకు తాడుతో గట్టిగా బిగించుకుని గతరాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అయితే రోజు మొత్తం వరుణ్ బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు వరుణ్ గదిని తనిఖీ చేయగా విగతజీవుడిగా పడిఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వరుణ్ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. బ్లూవేల్ గేమ్ కారణంగానే వరుణ్ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. గదిలో వరుణ్ గేమ్స్ ఆడిన లాప్టాప్, మొబైల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉస్మానియా హాస్పిటల్లో పోస్టుమార్టం అనంతరం వరుణ్ మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.

*🚫పాఠశాల ప్రవేశాలకు నోటిఫికేషన్*

-సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, కేంబ్రిడ్జ్ అఫిలియేషన్ స్కూళ్లకే వర్తింపు..

-జనవరి 2 నుంచి అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభం

-3 నుంచి ఆన్లైన్ దరఖాస్తులు.. 8వ తేదీ తుదిగడువు..

-త్వరలో స్టేట్ సిలబస్ స్కూళ్లకు అడ్మిషన్ నోటిఫికేషన్

 🛑తెలంగాణ: రాష్ట్రంలోని సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ, కేంబ్రిడ్జ్ అఫిలియేషన్ పొందిన ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో 2018-19 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ నోటిఫికేషన్ను రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసింది. వచ్చే జనవరి 2 నుంచి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపింది. ఈ మేరకు శనివారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య జీవో విడుదలచేశారు. విద్యాహక్కు చట్ట ప్రకారం అన్నిరకాల ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలను కల్పించాల్సి ఉన్నదని, ఇందుకు క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేయొద్దని చట్టంలో పేర్కొన్నట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. ఫీజులు వసూలు చేసినట్టు ఫిర్యాదులొస్తే సంబంధిత పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని ఆ శాఖ డైరెక్టర్ జీ కిషన్ హెచ్చరించారు. రాష్ట్రస్థాయిలో ఉన్న ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు.

*🅾ప్రవేశాల షెడ్యూల్ వివరాలు:*

-2018 జనవరి 2న పాఠశాలవారీగా వెబ్సైట్లో ప్రవేశాల నోటిఫికేషన్ జారీ

-జనవరి 3న స్కూళ్లవారీగా ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం

-జనవరి 8వ తేదీ ఆన్లైన్ దరఖాస్తులకు తుది గడువు

-జనవరి 9, 10 తేదీల్లో దరఖాస్తుల పరిశీలన

-జనవరి 11న ర్యాండమ్ పద్ధతిలో అడ్మిషన్ల ఖరారు

-జనవరి 12న స్కూల్ వెబ్సైట్లో ఖరారైన ప్రవేశాల జాబితా⛔

*🛑రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి మృతి*

-మరో ముగ్గురు ఉపాధ్యాయులకు తీవ్రగాయాలు

మాల్: విధులకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ ఉపాధ్యాయుడు దుర్మరణం చెందగా మరో ముగ్గురు ఉపాధ్యాయులకు తీవ్రగాయాలయ్యాయి. 

ఈ ఘటన *నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం పోలేపల్లి రాంనగర్ గేట్* సమీపంలో శనివారం చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై నాగభూషణ్రావు కథనం ప్రకారం.. చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లి పంచాయతీలోని బోజ్యా తండాలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీరామ్ రమేశ్(32) తన కారులో హైదరాబాద్ నుంచి విధులకు వస్తున్నారు. అదే కారులో మండలంలోని తక్కెళ్లపల్లి, దేన్యాతండా పాఠశాలల్లో పనిచేస్తున్న రాధారాణి, సుమతి, సుమలత కూడా విధులకు వస్తుండగా పోలేపల్లి గేటు సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొంది. ఈ ఘటనలో శ్రీరాంరమేశ్కు బలమైన గాయాలు కావడంతో 108 లో తరలిస్తుండగా మృతిచెందారు.
గాయపడ్డ వారు చికిత్స పొందుతున్నారు.🛑✴✴✴

*🚩పిటిషనర్లను పరీక్షలకు అనుమతించాలి🌴*

 ♦టీఆర్టీ కటాఫ్ కేసులో హైకోర్టు ఉత్తర్వులు

 హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) పోస్టుల అర్హతల విషయంలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో కటాఫ్ మార్కులపై జీవో 25లోని నిబంధనలను సవాల్ చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌తోపాటు పలువురు డీఎడ్ అభ్యర్థులకు ఇంటర్మీడియట్‌లో కనీస మార్కుల నిబంధనలు విధించడంతో తమకు అవకాశం లేకుండా పోతున్నదంటూ వందమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

2007కు పూర్వం ఇంటర్మీడియట్ చేసిన విద్యార్థులకు కనీసమార్కులు 45 శాతం, తదనంతరం 50 శాతం విధించడంతో టీఆర్టీలో అవకాశం లేకుండా పోతున్నదంటూ ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పిటిషనర్ల టీఆర్టీ దరఖాస్తులను స్వీకరించడంతోపాటు 2018 ఫిబ్రవరిలో నిర్వహించే టీఆర్టీ పరీక్షలకు అనుమతించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. అయితే పిటిషనర్ల టీఆర్టీ పరీక్ష ఫలితాలను మాత్రం ప్రకటించవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

ఈ రోజు జి కె

1)👉 స్టీఫెన్ హాకింగ్ ఏ దేశానికి చెందిన ప్రముఖ ఆధునిక శాస్త్రవేత్త?
A: *ఇంగ్లాండ్*

2)👉 "రామప్ప దేవాలయం" ప్రపంచ వారసత్వ సంపద హోదా పొందేందుకు  అర్హతలున్నాయని చెప్పి నివేధిక ఇచ్చిన కమిటీ ఏది?
A': *నందగోపాల్ కమిటీ నివేదిక*

3)👉 భారతదేశంలో  సూర్యుడు  అస్తమించే రాష్ట్రం ఏది?
A: *గుజరాత్*

4)👉  "ఢిల్లీ సుల్తానుల"లో నిరక్షరాసుడు ఎవరు?
A: *అల్లావుద్ధీన్ ఖిల్జీ*

5)👉 జెనెటిక్ ఇంజనీరింగ్ పితామహుడు ఎవరు?
A: *పాలబెర్గ్*
               🍃✌🌺

🔲ప్రశ్న: నున్నటి చదునైన ప్రదేశాల్లో కూడా ఉడుము సులభంగా పరుగెత్తడమే కాకుండా గట్టిగా పట్టుకుని ఉండగలదు. ఇదెలా సాధ్యం?

జవాబు: ఉడుములు వరానిడే కుటుంబానికి చెందిన పెద్ద మాంసాహారులైన బల్లులు. వీటిలో అతిపెద్ద ఉడుము కొమొడొ డ్రాగన్. ఈ కుటుంబంలో ఉన్న ఒకే ప్రజాతి వరానస్.ఉడుము గాజులాంటి నున్నటి తలాలపై కూడా నిట్టనిలువుగా పరుగెత్త గలదు. పైకప్పులను గట్టిగా పట్టుకుని స్థిరంగా ఉండగలదు. వాటి పాదాల కింద ఉండే ప్రత్యేకమైన మెత్తలే (pads) ఇందుకు కారణం. వీటిపై లక్షలాది వెంట్రుకలు, వేలాది బొడిపెలు (bulges) ఉంటాయి. ఈ సూక్ష్మ వెంట్రుకల రాపిడి వల్ల దుర్బల స్థిర విద్యుత్‌ బలాలు (weak electrostatic forces) ఉత్పన్నమై అవి తలానికి అంటుకుని పోతాయి. ఒకో బొడిపె అతుక్కునే బలం (adhesive force) తక్కువే అయినా, వేలాది బొడిపెల వల్ల ఉత్పన్నమయ్యే బలం ఎక్కువవడంతో ఉడుము గట్టి పట్టును కలిగి ఉంటుంది. ఇలా దాని నాలుగు పాదాల వల్ల కలిగే బలం వల్ల దాదాపు 140 కిలోల బరువును కూడా లాగుతూ నిలువుగా ఎగబాకగలదు. అందుకే పూర్వం సైనికులు ఉడుముల నడుములకు తాళ్లను కట్టి వాటిని పట్టుకుని కోట గోడలను ఎక్కేవారు. 'ఉడుము పట్టు' వ్యవహారికంగా మారడానికి ఇదే కారణం.

ఈ రోజు జి కె

1)👉 గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ రూపానీ ఏ నియోజకవర్గం నుండి గెలిచారు?
A: *రాజ్ కోట్ వెస్ట్*

2)👉 ఇటీవల మెట్రోమార్గం సదుపాయం కల్పించబడిన  "నోయిడా పట్టణం" ఏ రాష్ట్రంలో కలదు?
A: *ఉత్తర ప్రదేశ్*

3)👉దేశంలోనే తొలిసారిగా "ఏసీ సబర్బన్ రైలు" ఏ నగరంలోకి  అందుబాటులోకి వచ్చింది?
A: *ముంబాయి*

4)👉 ఎవరు  రచించిన ఆత్మకథను వెన్న వల్లభరావు విరామమెరుగని పయణం గా తెలుగులో  అనువదించారు?
A: *అజీత్ కౌర్*

5)👉 హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో భాజపా ముఖ్యమంత్రి  అభ్యర్థిగా ఉండి ఓడిపోయింది ఎవరు?
A: *ప్రేమ్ కుమార్ ధుమాల్*
                 🍃✌🌺
*🔥SGT ఇంగ్లీష్ మిడీయం పోస్ట్ కి అప్లై చేయడానికి అర్హతలు*🔥

*1) 👉SSC లేదా ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ ఇంగ్లీష్ మిడీయం లో చదివి ఉండాలి*

*OR*

*2) 👉SSC లో 1ST లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయిన అయి ఉండాలి*

*OR*

*3)👉తెలుగు మీడియం ఇంటర్మీడియట్ పార్ట్ 1 ఇంగ్లీష్ అయిన అయి ఉండాలి*

*OR*

*4)👉తెలుగు మీడియం ఇంటర్మీడియట్ 2nd లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయిన అయి ఉండాలి*

*OR*

*5)👉తెలుగు మీడియం డిగ్రీలో ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ అయిన అయి ఉండాలి*

*NOTE*

*ప్రతి యొక్క తెలుగు మీడియం అభ్యర్థి పైన చెప్పిన అర్హత లలో ఎదో ఒకటి  కచ్చితంగా కలిగి ఉంటాడు .ఎక్కువ మంది  అబ్యర్డులు 3వ పాయిట్ కలిగి ఉంటారు*

*🔥TS TRT*🔥

*♦TRT కి అప్లై చేసిన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా 40 వేల మంది జిల్లా ఎడిట్ ఆప్షన్ ఇవ్వలేదు .వారి యొక్క అప్లికేషన్ లు తిరస్కరించబడతాయి అని TSPSC తెలిపింది.వీరి కోసం జనవరి 7 నుండి 10 వరకు మరో సారి ఎడిట్ ఆప్షన్ ఇవ్వనుంది.*

*డీఈడీ అభ్యర్థులకు హైకోర్టులో ఊరట*

🔳  *ఇంటర్‌ కనీస అర్హత మార్కులు లేవన్న కారణంతో ఉపాధ్యాయ నియామకపు పరీక్ష (టీఆర్‌టీ)కు అనుమతించకపోవడాన్ని సవాలు చేస్తూ పిటిషన్లు దాఖ లు చేసిన పలువురు డీఈడీ అభ్యర్థులకు హైకోర్టు ఊరటనిచ్చింది.* 

🔳  *ఇంటర్‌ మార్కులతో సంబంధం లేకుండా దర ఖాస్తులను స్వీకరించి, టీఆర్‌టీకి అనుమతించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.* 

🔳  *తాము ఉత్తర్వులు జారీ చేసేంత వరకు పిటిషనర్ల ఫలితాలను మాత్రం వెల్లడించవద్దంది.*

🔳  *ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.* 

🔳  *2007 తర్వాత డీఈడీ చేసిన అభ్యర్థుల్లో ఓపెన్‌ కేటగిరీవారు ఇంటర్‌లో 50%, ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులు, ఇతరులు 45% మార్కు లు సాధించి ఉంటేనే ఎస్‌జీటీ పోస్టులకు అర్హులుగా నిర్ణయించారు*. 

🔳  *ఇంటర్‌లో కనీస మార్కులు లేవని పలువురు టీఆర్‌టీ అభ్యర్థుల దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించారు.*    

🛑 🏫 *కోర్టుకు చెప్పకుండా అడ్మిషన్లు ఆమోదించం*🏫🛑

🔊 *హైకోర్టుకు విద్యాశాఖ వెల్లడి*

🌎 *హైదరాబాద్‌, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి):* 

🔳  *గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఏడు డీఈడీ కాలేజీల్లో జరిగిన అడ్మిషన్లను కోర్టుకు చెప్పకుండా అమోదించబోమని ఏపీ విద్యాశాఖ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపా రు*. 

🔳  *ఈ వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్న హైకోర్టు... వ్యాజ్యాన్ని ఎందుకు విచారణకు స్వీకరించరాదో చెప్పాలంటూ ఏపీ ప్రభుత్వానికి, అభియోగాలు ఎదుర్కొంటున్న డీఈడీ కాలేజీలకు షోకాజ్‌ నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను సంక్రాతి సెలవు ల తర్వాతకు వాయిదా వేసింది.*

🔳 *గుంటూరు జిల్లా వినుకొండ లోని ఎస్‌.ఆర్‌.డీఈడీ, జీఎస్‌ఆర్‌ డీఈడీ కాలేజీ(బాలికలు), సలామ్‌ డీఈడీ కాలేజీ, అమరావతి డీఈడీ కాలేజీ, ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలోని ఎస్‌ఆర్‌ డీఈడీ కాలేజీ, షారోన్‌ డీఈడీ కాలేజీ, పశ్చిమగోదావరి జిల్లా ఆత్రేయపురం లోని మహాత్మాగాంధీ డీఈడీ కాలేజీల్లో కనీస ప్రమాణాలు పాటించడం లేదంటూ ఎన్‌.మాధవరావు, మరికొందరు హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు*. 

🔳  *ఈ వ్యాజ్యాలపై హైకోర్టు శనివారం మరోసారి విచారించింది.*

*పీజీటీ ఫలితాల వెల్లడి*

 గురుకులాల్లో 475 పీజీటీ గణితం, జీవశాస్త్రము, సాంఘికశాస్త్రము మరియు ఫిజికల్ సైన్స్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ఫలితాలను టీఎస్‌పీఎస్సీ  వెల్లడించింది. 👇

*🔥ట్రాన్స్‌కోలో 1,604 కొలువులు🔥*

*♦నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (ట్రాన్స్‌కో)లో 1,604 పోస్టుల భర్తీకి శుక్రవారం ప్రకటన వెలువడనుంది. 330 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ (ఏఈ), 174 సబ్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌), 1,100 జూనియర్‌ లైన్‌మెన్‌ (జేఎల్‌ఎం) పోస్టుల భర్తీకి ట్రాన్స్‌కో ప్రకటన జారీ చేయనుంది. గురువారం విద్యుత్‌ సౌధలో ట్రాన్స్‌కో, జెన్‌కో సంస్థల సీఎండీ ప్రభాకర్‌రావు నేతృత్వంలో సమావేశమైన సంస్థ పాలక మండలి ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.*

*♦330 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల్లో 250 ఎలక్ట్రికల్, 49 సివిల్, 31 టెలికాం విభాగాల పోస్టులు ఉండనున్నాయి. ఆయా విభాగాల్లో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన అభ్యర్థులు ఏఈ పోస్టులకు, ఎలక్ట్రికల్‌ విభాగంలో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు సబ్‌ ఇంజనీర్‌ (ఎలక్ట్రికల్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. నిరుద్యోగ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రత్యేక వయోపరిమితి సడలింపు నిబంధనలను విద్యుత్‌ ఉద్యోగాల భర్తీలోనూ అమలు చేయనున్నట్లు ప్రభాకర్‌రావు తెలిపారు.*

*♦తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ (జెన్‌కో)లో ప్రస్తుతం ఖాళీలు లేవని, కాబట్టి జెన్‌కో నుంచి నియామక ప్రకటన ఉండదని పేర్కొన్నారు. కాగా, దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌), ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్‌)ల నుంచి కూడా జేఎల్‌ఎం, ఏఈ, సబ్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి వారం పది రోజుల్లో వేర్వేరు ప్రకటనలు జారీ కానున్నాయి.*

చరిత్రలో ఈ రోజు డిసెంబరు 30


*💠చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 30💠*


*🎈సంఘటనలు🎈*


🍓1906 : భారత్లో తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి జాతీయస్థాయిలో కాంగ్రెస్ లాంటి పార్టీ అవసరమని భావించిన ముస్లిం ప్రముఖులు ఢాకాలో సమావేశమై ముస్లిం లీగ్ పార్టీని స్థాపించారు.


🍓1922 : రష్యన్ సోవియట్ ఫెడరేషన్, ట్రాన్స్కకేషియన్, ఉక్రేనియన్, బెలారసియన్ సోవియట్ రిపబ్లిక్లు నాలుగూ కలిసి ద యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్గా ఏర్పడ్డాయి.


🍓1968 : ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ట్రిగ్వేలీ మరణించాడు.


🍓1985 : తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవడానికి గల కారణాలలో ముఖ్యమైనది

జీ.వో.610ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జారీచేసింది.

🍓2006 : ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దామ్ హుసేన్ ను ఉరితీసారు.


🍓2008 : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా

ప్రేమ్ కుమార్ ధుమాల్ ప్రమాణస్వీకారం.

🍓2009 : జార్ఖండ్ ముఖ్యమంత్రిగా

శిబూసోరెన్ ప్రమాణస్వీకారం చేశాడు.

*🎈జననాలు🎈*


🎀1865 : ప్రసిద్ధ ఆంగ్ల రచయిత మరియు కవి

రుడ్యార్డ్ కిప్లింగ్ జననం. (మ.1936)

🎀1879 : రమణ మహర్షి, బోధనలలో ప్రధానమైనది "మౌనము" లేదా "మౌనముద్ర". వీరు చాలా తక్కువగా ప్రసంగించేవారు


🎀1887 : కొప్పరపు సోదర కవులు , కొప్పరపు వేంకటరమణ కవి, అవధానంలో ప్రసిద్ధిచెందిన జంట సోదర కవులు


🎀1898 : యలమంచిలి వెంకటప్పయ్య , స్వాతంత్ర్య సమర యోధుడు. కాకినాడలో

1920 లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలలో బ్రాహ్మణులకు ప్రత్యేక భోజన శాల ఉండటానికి వీల్లేదని అందరూ కలిసే తినాలనీ తీర్మానం చేయించాడు,

🎀1935 : భారతదేశపు ప్రముఖ చదరంగం ఆటగాడు మాన్యువెల్ ఆరన్ జననం.


🎀1948 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఎడమచేతి బ్యాట్స్మెన్ సురీందర్ అమర్నాథ్ జననం.


🎀1968 : హాట్ మెయిల్ ఈమెయిల్ సర్వీసు యొక్క సహ-వ్యవస్థాపకుడు సబీర్ భాటియా జననం.


🎀1984 : అమెరికన్ బాస్కెట్బాల్ క్రీడాకారుడు

లెబ్రాన్ జేమ్స్ జననం.

*🎈మరణాలు🎈*


🍋1955 : వేమూరి గగ్గయ్య , తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు. (జ.1895)


🍋1971 : విక్రం సారాభాయ్ , ప్రముఖ శాస్త్రవేత్త.


🍋1973 : చిత్తూరు నాగయ్య , ప్రసిద్ధ

తెలుగు సినిమా నటుడు.

🍋1992 : వడ్డాది పాపయ్య , ప్రముఖ చిత్రకారుడు.


🍋2006 : పేకేటి శివరాం , తెలుగు సినిమా నటుడు. (జ.1918)



[12/30/2017, 08:47] ‪+91 95020 29120‬: *🔵టీఆర్టీ ఓపెన్‌ కోటా పది జిల్లాలకు కామన్‌*

🔷టీఆర్టీలో సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకుని పరీక్ష రాస్తే చాలు

🔷మిగతా జిల్లాలకు నాన్‌లోకల్‌ అభ్యర్థిగా వర్తింపు.. మెరిట్‌ ఆధారంగా చాన్స్‌

♦ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నోటిఫికేషన్‌ ప్రకారం మీ జిల్లాలో మీ సబ్జెక్టుకు సంబంధించిన పోస్టులు లేవా? అందుకని దరఖాస్తు చేయకుండా మిన్నకుండి పోయారా? అయితే సరికాదు. సొంత జిల్లాలో ఒక్క పోస్టు కూడా లేకపోయినా.. మీరు దరఖాస్తు చేయవచ్చు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఏ జిల్లాలోనైనా ఓపెన్‌ కోటాలో ఉద్యోగం సాధించవచ్చు. ఇందుకు అవకాశం కల్పిస్తూ ఓపెన్‌ కోటాలో టీఎ్‌సపీఎస్సీ మార్పులు చేసింది.

♦గతంలో జిల్లాలవారీగా ఓపెన్‌ కోటా ఉండగా.. ప్రస్తుతం 10 జిల్లాలకు కలిపి ఒకే ఓపెన్‌ కోటాను ఇవ్వనుంది. ఈ కోటాకు అన్ని జిల్లాల అభ్యర్థులూ అర్హులవుతారు. ఇతర జిల్లాలో నాన్‌లోకల్‌ అభ్యర్థిగా పోటీపడేందుకు ప్రత్యేకించి ఆ జిల్లాలో దరఖాస్తు చేయనవసరం లేదు. 

♦అన్ని జిల్లాల అభ్యర్థులూ అభ్యర్థి సొంత జిల్లాలోనే దరఖాస్తు చేయాలి. జిల్లా స్థాయిలో మొత్తం పోస్టుల్లో 80శాతం లోకల్‌ అభ్యర్థులకు, 20శాతం ఓపెన్‌ కోటాకు కేటాయిస్తారు. ఈ మేరకు గతంలో సొంత జిల్లాలో పోస్టులు లేకపోయినా, తక్కువగా ఉన్నా.. అభ్యర్థులు ఎక్కువ పోస్టులు ఉన్న జిల్లాలో నాన్‌లోకల్‌ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకునేవారు. దీంతో ఆ అభ్యర్థి ఆ జిల్లాలో మాత్రమే పరీక్ష రాసేవారు. అనంతరం మెరిట్‌లో ఉంటే ఆ జిల్లాలోనే ఉద్యోగం వచ్చేది.

♦ అయితే ప్రస్తుతం అభ్యర్థులు పోస్టులు ఉన్నా, లేకపోయినా.. వారి సొంత జిల్లాలోనే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలోనూ నాన్‌లోకల్‌ ఆప్షన్‌ కనిపించదు. అనంతరం సాధించిన మార్కుల ఆధారంగా నాన్‌లోకల్‌ అభ్యర్థిగా ఓపెన్‌ కోటాలో ఇతర అన్ని జిల్లాలనూ ప్రాధాన్య క్రమంలో ఎంచుకునే అవకాశాన్ని అభ్యర్థికి కల్పిస్తారు.


♦మెరిట్‌ను బట్టి ఏ జిల్లాలో వస్తే ఆ జిల్లాలో ఉద్యోగమిస్తారు. అయితే ఈ నిబంధన మార్పుపై సమాచార లోపం నెలకొనడంతో కొందరు అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు.

♦వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ అభ్యర్థికి ఇదే సమస్య ఎదురైంది. ఆ జిల్లాలో ఎస్‌జీటీ పోస్టులు లేకపోవడంతో పోస్టులు ఎక్కువగా ఉన్న మరో జిల్లాలో నాన్‌లోకల్‌ అభ్యర్థిగా దరఖాస్తు చేయాలని భావించాడు. కానీ, దరఖాస్తు సమయంలో నాన్‌లోకల్‌ ఆప్షన్‌ కనిపించలేదు. దీంతో అయోమయానికి గురై.. ఇప్పటివరకు టీఆర్టీకి దరఖాస్తు చేయలేదు. ఇలా వందల మంది ఉన్నారు. 

♦దరఖాస్తులకు 30వ తేదీతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో వారు నష్టపోయే అవకాశం ఉన్నందున అభ్యర్థుల్లో అవగాహన కల్పించడంతోపాటు దరఖాస్తు సమయాన్ని పొడిగించాలనే డిమాండ్లు వస్తున్నాయి.🔵🌐☸☸☸🕉🕉⛔🌐☸🕉⛔
[12/30/2017, 08:47] ‪+91 95020 29120‬: *🌐రోడ్డున పడ్డ హిందీ పండిట్‌లు!*

 🔷కొత్తగా తెరపైకి జీవో 25..

🔷హిందీ డిగ్రీలు చెల్లవంటున్న టీఎస్‌ పీఎస్సీ

🔷విద్వాన్‌, విశారద, ప్రవీణకు అనర్హత..

🔷టీఆర్టీకి హెచ్‌పీటీ అభ్యర్థులు దూరం

🔷హైకోర్టును ఆశ్రయించినా దక్కని ఫలితం..

🔷అగమ్యగోచరంగా భవితవ్యం

🔷రేపటి వరకే దరఖాస్తుల స్వీకరణ..

🔷గడువు పెంచి అవకాశమివ్వాలని వినతి

♦(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌):హిందీ పండిట్‌లుగా ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకొని.. ఏళ్ల తరబడి డీఎస్సీ కోసం ఎదురుచూసిన అభ్యర్థులు రోడ్డున పడ్డారు. టీచర్‌ ఉద్యోగంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వేలాది మంది నిరుద్యోగుల ఆశలు అడియాసలు కానున్నాయి.

♦ ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) రాసేందుకు విద్వాన్‌, విశారద, ప్రవీణ హిందీ డిగ్రీలు చెల్లవని టీఎ్‌సపీఎస్సీ పేర్కొనడంతో హిందీ పండిట్‌ అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీవో 25 కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. న్యాయం చేయాలని కోరుతూ బాధితులు హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు.

♦దీంతో తమకు ఆత్మహత్యలే శరణ్యమని నిరుద్యోగులు అంటున్నారు. న్యాయం కోసం పోరాటానికి సిద్ధమవుతున్నారు.

♦ వాస్తవానికి విద్వాన్‌, విశారద, ప్రవీణ హిందీ డిగ్రీలు పూర్తి చేసినవారికి ప్రభుత్వాలు ఇప్పటివరకూ హిందీ పండిట్‌ ట్రైనింగ్‌ (హెచ్‌పీటీ)కు అవకాశం కల్పిస్తూ వస్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా ఇచ్చాయి. హెచ్‌పీటీ పూర్తిచేసిన అభ్యర్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) రాసేందుకూ అవకాశమిచ్చాయి. టెట్‌లో అర్హత పొందిన అభ్యర్థులకు డీఎస్సీలోనూ అవకాశం కల్పించారు.

♦ అలా డీఎస్సీ రాసిన ఎంతో మంది ప్రభుత్వ పాఠశాలల్లో హిందీ ఉపాధ్యాయులయ్యారు. దాదాపుగా హిందీ ఉపాధ్యాయులంతా ఈ డిగ్రీలతో ఉద్యోగం పొందినవారే ఉన్నారు. వారిలో చాలామంది పదవీ విరమణ కూడా చేశారు. పైగా కొన్ని యూనివర్సిటీలు ఈ డిగ్రీలపైనే పీజీ చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో చాలా మంది పీజీలు కూడా పూర్తి చేశారు. నెల రోజుల క్రితం నిర్వహించిన టీజీటీ, పీజీటీకి ఈ డిగ్రీలనే అనుమతించారు. కానీ, తాజాగా టీఆర్‌టీకీ అనుమతించడం లేదు. ఈ డిగ్రీలతో టెట్‌ అర్హత సాధించి కూడా టీఆర్‌టీకి దరఖాస్తు చేయలేని పరిస్థితి నెలకొంది.

*♦స్పష్టతనివ్వని విద్యాశాఖ*
గత కొన్నేళ్లుగా టెట్‌ అర్హత పొందిన వేలాది మంది అభ్యర్థులు టీచర్‌ ఉద్యోగం కోసం అప్పులు చేసి, ఇంటిని వదిలి హాస్టళ్లలో ఉంటూ.. కోచింగ్‌ తీసుకుంటున్నారు. వారంతా న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా జీవో 25పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కేసును విద్యాశాఖ స్వీకరించి ఈ హిందీ డిగ్రీలు సాధారణ డిగ్రీలతో సమానమైతే.. హిందీ అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆదేశించింది. వారం రోజుల్లో ఈ విషయమై ప్రకటన చేయాలని పేర్కొంది. 

♦కాగా, కోర్టు ఆదేశాలు జారీ చేసిన 10 రోజుల తర్వాత యూజీసీ నిబంధనల ప్రకారం 9, 10 తరగతులకు బోధించేవారికి (స్కూల్‌ అసిస్టెంట్లకు) హిందీ డిగ్రీలు.. సాధారణ డిగ్రీలతో సమానంగా ఉండాలని తేల్చారు. అయితే 6 నుంచి 8 తరగతుల (లాంగ్వేజ్‌ పండిట్‌ల) విషయంలో మాత్రం ఏమీ చెప్పలేకపోయారు. కానీ, లాంగ్వేజ్‌ పండిట్లకు హిందీ డిగ్రీలతో ఎలాంటి సం బంధం లేదని అభ్యర్థులు చెబుతున్నారు. ఈవిషయం లో విద్యాశాఖ, టీఎ్‌సపీఎస్సీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.☸🔵🔵🌐🕉🔵🔵🔵
[12/30/2017, 08:47] ‪+91 95020 29120‬: *నేటితో ముగియనున్న టి.ఆర్.టి ధరకాస్తుల గడువు.పొడగింపు చేయాలో వద్దా అనేది ఈ రోజు సాయంత్రం నిర్ణయం వెలువడనున్నది.గడువు ఒక్క రోజే ఉండడం తో  ధరకాస్తుల సంఖ్య బారిగా పెరగనున్నాయి.ఇప్పటివరకు sgt 78వేలు s.a లక్ష 11వేల మంది అప్లికేషన్లూ చేసారు*.
[12/30/2017, 08:49] ‪+91 95020 29120‬: *🅾OSRAJU@*
*☯వెబ్సైట్లో సీడీపీవో ఈసీడీపీవో హాల్టికెట్లు*

🅾 తెలంగాణ: సీడీపీవో/ఈసీడీపీవో ఉద్యోగాలకు జనవరి 4న కంప్యూటర్ పరీక్షను నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

 ఇప్పటికే హాల్టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని.. పరీక్ష తేదీ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నది. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ నిబంధనలను తప్పకుండా పాటించాలని కోరింది. 

*🚫తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పోస్టుకు భర్తీ చేసుకున్న వారిలో తిరస్కారానికి గురైన అభ్యర్థుల వివరాలు వెబ్సైట్లో ఉంచినట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది*.🅾✴☯🕉⛔☸🏀🛑🔵🕉☯🚫
[12/30/2017, 08:49] ‪+91 95020 29120‬: *✴OSRAJU@*
*🅾అరెరె.. పొరపాటున కొత్త ఫీచర్ ప్రత్యక్షం!*

లండన్: వాట్సాప్ మొబైల్ యాప్ రిప్లై ప్రైవేట్లీ అనే సదుపాయాన్ని పొరపాటున యాక్టివేట్ చేసింది. ఈ విధానంలో గ్రూపులో ఉంటూనే ఓ సభ్యుడికి గ్రూప్ నుంచి ఇతర సభ్యులకు తెలియకుండా సందేశం పంపొచ్చు. వాట్సప్ బీటా ఆప్డేట్లో ఈ సదుపాయం కనిపించిన కాసేపటికే మాయమైందని బ్రిటన్ మీడియా తెలిపింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉందని, ఇతర ఫీచర్లతో కలిపి రిప్లై ప్రైవేట్లీని విడుదల చేస్తారని వెల్లడించింది. డెవలపర్లు పొరపాటును దీనిని యాక్టివేట్ చేసి ఉంటారని అభిప్రాయపడింది. కాగా, మరికొన్ని రోజుల్లో ఈ కొత్త ఫీచర్ను తమ యూజర్లకు తెచ్చే పనిలో యాజమాన్యం బిజీగా ఉండగా ఓ యూజర్ మొబైల్లో పొరపాటున ఈ ఫీచర్ కనిపించడం గమనార్హం.🅾🚫☯☯🅾☸☸🚫
[12/30/2017, 08:49] ‪+91 95020 29120‬: *☸OSRAJU@*
*☯1 నుంచి రక్షణశాఖ ఆన్లైన్ క్విజ్ పోటీలు*

*-హిందీ, ఇంగ్లిష్లో నిర్వహణ*

*- ప్రథమ బహుమతి రూ.లక్ష*

 ☸యువతలో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడంలో భాగంగా ఆన్లైన్లో క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు రక్షణశాఖ వెల్లడించింది. ఈ క్విజ్ ప్రతిష్ఠాత్మకమైన పరమవీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్చక్ర, అశోక్చక్ర, కీర్తిచక్ర, శౌర్యచక్ర అంశాలపై నిర్వహిస్తున్నట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు.
 www.gallantryawards.gov.in వెబ్సైట్లో క్విజ్కు సంబంధించిన సమాచారం ఉంటుందని పేర్కొన్నారు. జనవరి 1 నుంచి పదో తేదీ వరకు క్విజ్ పోటీలను హిందీ, ఇంగ్లిష్లో ఆన్లైన్లో https://quiz.mygov.in వెబ్సైట్ ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు. 

18 ఏండ్లలోపు వారికి, 18 ఏండ్లపైడినవారికి రెండు క్యాటగిరీలుగా పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రెండు బ్యాచ్లకు ప్రథమ, ద్వితీయ, తృతీయ, రెండుప్రోత్సాహక అవార్డులు ఉంటాయని తెలిపారు. 

మొదటి బహుమతి రూ.లక్ష, రెండో బహుమతి రూ.75 వేలు, మూడో బహుమతి రూ. 50 వేలు, ప్రోత్సాహక బహుమతి (ఇద్దరికి) రూ.15 వేల చొప్పున ఇస్తున్నట్టు వెల్లడించారు. 

క్విజ్లో గెలిచినవారికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు. 

దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు.☯☸🅾🅾🚫✴✴⛔⛔⛔
[12/30/2017, 08:49] ‪+91 95020 29120‬: *🌹🍋ఎస్టీయూ తెలంగాణ🍋🌹*

*🥦విక్రం సారాభాయ్ వర్ధంతి సందర్భంగా సమాచారం...🥦*

*🍡విక్రం అంబాలాల్ సారాభాయి ( ఆగస్టు 12 , 1919 – డిసెంబరు 30, 1971 ) భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త. భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు.*

*👶బాల్యము👶*

🛍విక్రం సారాభాయ్ గుజరాత్ రాష్ట్రంలోని
అహ్మదాబాదులో జన్మించాడు. వారి కుటుంబం ధనవంతులైన వ్యాపారస్తుల
కుటుంబం . ఆయన తండ్రి అంబాలాల్ సారాభాయ్ అక్కడ పేరు పొందిన పారిశ్రామికవేత్త. ఆయనకు అక్కడ ఎన్నో మిల్లులు ఉండేవి. అంబాలాల్, సరళా దేవి దంపతులకు కలిగిన ఎనిమిది మంది సంతానంలో విక్రం సారాభాయ్ ఒకడు.
తన ఎనిమిది మంది పిల్లలను చదివించడానికి విక్రం సారాభాయి తల్లి మాంటిస్సోరీ తరహాలో ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేసింది. వీరి కుటుంబం స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ ఉండటం మూలాన వారింటికి మహాత్మాగాంధీ , మోతీలాల్ నెహ్రూ ,
రవీంద్రనాథ్ ఠాగూర్, మరియు జవహర్లాల్ నెహ్రూ మొదలైన ఎంతో మంది ప్రముఖులు తరచూ వస్తూ ఉండేవారు. వీరు విక్రం సారాభాయ్ వ్యక్తిత్వాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు.

*📚విద్య📚*

⛲విక్రమ్ తల్లి సరళాదేవి తన ఎనిమిదిమంది పిల్లల్ని చదివించేందుకు మాంటిస్సోరీ తరహాలో ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటుచేశారు. వీరి కుటుంబం స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ ఉండటం మూలాన వారింటికి తరచుగా మహాత్మాగాంధీ, మోతీలాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, జవహర్లాల్ నెహ్రూ... తదితర ముఖ్య నాయకులందరూ వస్తుండేవారు. వీరందరూ విక్రమ్ సారాభాయ్ వ్యక్తిత్త్వాన్ని ఎంతగానో ప్రభావితం చేశారనటంలో అతిశయోక్తి లేదు అహమ్మదాబాదులోని గుజరాత్ కళాశాలలో మెట్రిక్ విద్యను పూర్తి చేసుకున్న విక్రమ్ సారాభాయ్... తరువాత పై చదువుల కోసం
ఇంగ్లండు లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్లారు. 1940వ సంవత్సరంలో అక్కడ నాచురల్ సైన్సెస్లో, ట్రిపోస్లో ఉత్తీర్ణులయ్యారు.

*🏕ఇంగ్లాండులో విద్య🏕*

🎭ఆ సమయంలో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభం కావటంతో భారతదేశానికి తిరిగివచ్చిన విక్రమ్ సారాభాయ్... బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో సర్ సీ.వీ.రామన్ పర్యవేక్షణలో కాస్మిక్ కిరణాలపై పరిశోధన మొదలుపెట్టారు. తదనంతరం రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 1945వ సంవత్సరంలో తిరిగీ కేంబ్రిడ్జి యూనివర్సిటీకి వెళ్లి పీహెచ్డీ పట్టాను సాధించుకుని 1947లో తిరిగి భారత్ చేరుకున్నారు. అహ్మదాబాదులోని గుజరాత్ కళాశాల నుంచి మెట్రిక్ పాసయ్యాడు. తరువాతి చదువుల కోసం ఇంగ్లండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. 1940లో అక్కడ నుంచి నాచురల్ సైన్సెస్ లో ట్రిపోస్ లో ఉత్తీర్ణుడయ్యాడు. రెండవ ప్రపంచ యుద్ధం అప్పటికే ప్రారంభం అవడంతో భారతదేశానికి తిరిగి వచ్చి బెంగుళూరు లోని
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో సి.వి. రామన్ పర్యవేక్షణలో కాస్మిక్ కిరణాలపైన పరిశోధన మొదలుపెట్టాడు. రెండవ ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత 1945లో తిరిగి కేంబ్రిడ్జి వెళ్ళి పీహెచ్డీ పట్టా 1947లో సాధించుకుని వచ్చాడు.

*🥌పరిశోధన🥌*

🍱1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్ను ప్రయోగించినపుడు... భారత భవిష్యత్ అవసరాలకు శాటిలైట్ల అవసరం గురించి ఎంతో విషయ సేకరణ చేయటమేగాకుండా, ఆ శాటిలైట్ యొక్క ఆవశ్యకతను అప్పటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూకు వివరించి, ఆయనను ఒప్పించారు సారాభాయ్. ఆ తరువాత 1962లో భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడయిన హోమీ బాబా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (ఐఎన్సీఓఎస్పీఏఆర్) సెంటర్ను ఆయన ఏర్పాటు చేశారు. తదనంతరం ఆయన ఆదర్శాలకు అనుగుణంగా ఇస్రో ఎన్నో విజయాలను సాధించి భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపచేసింది.
*"భారత అంతరిక్ష రంగ పితామహుడు"*గా కీర్తి గడించిన సారాభాయ్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను 1962లో శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డుతో, 1966లో పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. జాతీయ స్థాయిలోను, అంతర్జాతీయంగానూ అర్థవంతమైన పాత్ర పోషించగలగాలంటే, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని మానవ సమాజ సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవడంలో మనం ఎవరికీ తీసిపోకుండా ఉండాలని” చెప్పి, ఆ దిశగా కృషి చేసిన సారాభాయ్ 1971, డిసెంబరు 31వ తేదీన పరమపదించారు.
గ్రామీణ ప్రజల కోసం ఉపగ్రహాలను రూపొందించటం విక్రమ్ సారాభాయ్ వ్యూహంలో ప్రధానమైనదిగా ఉండేది. సాంకేతిక పరిజ్ఞాన ఉపయోగాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకొని రావాలని, అప్పుడే మన దేశంలోని ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చని సారాభాయ్ తోటి శాస్త్రవేత్తలను ప్రొత్సహించేవారు.
సహజ వనరుల వివరాలు సేకరించే పరిజ్ఞానాన్ని రూపొందించటం, రిమోట్ సెన్సింగ్కు అవసరమైన సాధనాలను ఏర్పాటు చేసుకోవటం అనేవి అందులో కీలక భాగాలు. ఈ రంగాలను ఎలా ఉపయోగించుకోవాలి? అంతరిక్షంలోకి మానవుల్ని ఏలా పంపాలి? సంప్రదాయపద్ధతిలో ఉన్న వ్యవస్థల్లోకి అంతరిక్ష వ్యవస్థను ఎలా కలపాలి? అన్న విషయాలన్నీ విక్రమ్ సారాభాయ్ వ్యూహాల్లో భాగాలుగా ఉండేవి.

*👨‍👩‍👦‍👦కుటుంబం👨‍👩‍👦‍👦*

🍄విక్రమ్ సారాభాయ్ కుటుంబం విషయానికి వస్తే...ఇతని భార్య మృణాలిని సారాభాయ్ . ఆమె మంచి సాంప్రదాయ నర్తకి. అప్పట్లో వీరి పెళ్ళి చెన్నైలో జరిగింది. అయితే వీరి పెళ్ళికి విక్రం సారాభాయ్ తరపు బంధువులు అందరూ క్విట్ ఇండియా ఉద్యమంలో బిజీగా ఉండటంతో ఎవరూ హాజరుకాలేకపోయారు. వీరి కుమార్తె
మల్లికా సారాభాయ్ .ఈమె కూడా మంచి నర్తకి. కొడుకు కార్తికేయ. అప్పట్లో వీరి పెళ్ళి చెన్నై లో జరిగింది. ఇతని కుమారుని పేరు పేరు కార్తికేయ.

*🍋🍡🎈🌹STUTS🌹🎈🍡🍋💠*
[12/30/2017, 08:49] ‪+91 95020 29120‬: *🔵టీఆర్టీ ఓపెన్‌ కోటా పది జిల్లాలకు కామన్‌*

🔷టీఆర్టీలో సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకుని పరీక్ష రాస్తే చాలు

🔷మిగతా జిల్లాలకు నాన్‌లోకల్‌ అభ్యర్థిగా వర్తింపు.. మెరిట్‌ ఆధారంగా చాన్స్‌

♦ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నోటిఫికేషన్‌ ప్రకారం మీ జిల్లాలో మీ సబ్జెక్టుకు సంబంధించిన పోస్టులు లేవా? అందుకని దరఖాస్తు చేయకుండా మిన్నకుండి పోయారా? అయితే సరికాదు. సొంత జిల్లాలో ఒక్క పోస్టు కూడా లేకపోయినా.. మీరు దరఖాస్తు చేయవచ్చు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఏ జిల్లాలోనైనా ఓపెన్‌ కోటాలో ఉద్యోగం సాధించవచ్చు. ఇందుకు అవకాశం కల్పిస్తూ ఓపెన్‌ కోటాలో టీఎ్‌సపీఎస్సీ మార్పులు చేసింది.

♦గతంలో జిల్లాలవారీగా ఓపెన్‌ కోటా ఉండగా.. ప్రస్తుతం 10 జిల్లాలకు కలిపి ఒకే ఓపెన్‌ కోటాను ఇవ్వనుంది. ఈ కోటాకు అన్ని జిల్లాల అభ్యర్థులూ అర్హులవుతారు. ఇతర జిల్లాలో నాన్‌లోకల్‌ అభ్యర్థిగా పోటీపడేందుకు ప్రత్యేకించి ఆ జిల్లాలో దరఖాస్తు చేయనవసరం లేదు. 

♦అన్ని జిల్లాల అభ్యర్థులూ అభ్యర్థి సొంత జిల్లాలోనే దరఖాస్తు చేయాలి. జిల్లా స్థాయిలో మొత్తం పోస్టుల్లో 80శాతం లోకల్‌ అభ్యర్థులకు, 20శాతం ఓపెన్‌ కోటాకు కేటాయిస్తారు. ఈ మేరకు గతంలో సొంత జిల్లాలో పోస్టులు లేకపోయినా, తక్కువగా ఉన్నా.. అభ్యర్థులు ఎక్కువ పోస్టులు ఉన్న జిల్లాలో నాన్‌లోకల్‌ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకునేవారు. దీంతో ఆ అభ్యర్థి ఆ జిల్లాలో మాత్రమే పరీక్ష రాసేవారు. అనంతరం మెరిట్‌లో ఉంటే ఆ జిల్లాలోనే ఉద్యోగం వచ్చేది.

♦ అయితే ప్రస్తుతం అభ్యర్థులు పోస్టులు ఉన్నా, లేకపోయినా.. వారి సొంత జిల్లాలోనే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలోనూ నాన్‌లోకల్‌ ఆప్షన్‌ కనిపించదు. అనంతరం సాధించిన మార్కుల ఆధారంగా నాన్‌లోకల్‌ అభ్యర్థిగా ఓపెన్‌ కోటాలో ఇతర అన్ని జిల్లాలనూ ప్రాధాన్య క్రమంలో ఎంచుకునే అవకాశాన్ని అభ్యర్థికి కల్పిస్తారు.


♦మెరిట్‌ను బట్టి ఏ జిల్లాలో వస్తే ఆ జిల్లాలో ఉద్యోగమిస్తారు. అయితే ఈ నిబంధన మార్పుపై సమాచార లోపం నెలకొనడంతో కొందరు అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు.

♦వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ అభ్యర్థికి ఇదే సమస్య ఎదురైంది. ఆ జిల్లాలో ఎస్‌జీటీ పోస్టులు లేకపోవడంతో పోస్టులు ఎక్కువగా ఉన్న మరో జిల్లాలో నాన్‌లోకల్‌ అభ్యర్థిగా దరఖాస్తు చేయాలని భావించాడు. కానీ, దరఖాస్తు సమయంలో నాన్‌లోకల్‌ ఆప్షన్‌ కనిపించలేదు. దీంతో అయోమయానికి గురై.. ఇప్పటివరకు టీఆర్టీకి దరఖాస్తు చేయలేదు. ఇలా వందల మంది ఉన్నారు. 

♦దరఖాస్తులకు 30వ తేదీతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో వారు నష్టపోయే అవకాశం ఉన్నందున అభ్యర్థుల్లో అవగాహన కల్పించడంతోపాటు దరఖాస్తు సమయాన్ని పొడిగించాలనే డిమాండ్లు వస్తున్నాయి.🔵🌐☸☸☸🕉🕉⛔🌐☸🕉⛔
[12/30/2017, 08:49] ‪+91 95020 29120‬: *🌐OSRAJU@*
*🌐సిండికేట్ బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్: 500 పోస్టులు.*

కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్.

 అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక: రాతపరీక్ష, గ్రూప్ డిష్కషన్, ఇంటర్వ్యూ ద్వారా.

 దరఖాస్తు: ఆన్లైన్.

చివరితేది: 17.01.2018

వెబ్సైట్: www.syndicatebank.in☸🔵☸☸🔵🔵🔵🕉
[12/30/2017, 08:49] ‪+91 95020 29120‬: *⛔OSRAJU@*
*🏀నయామోనూ..*

*-ఇంటి భోజనాన్ని తలపించేలా..*

*-ప్రభుత్వం నూతన సంవత్సర కానుక..*

*-విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం కోసం చర్యలు*

*-కస్తూర్బా, మోడల్ స్కూల్, గురుకులాల్లో కొత్త మెనూ ప్రారంభం*

*-నెలకు ఐదు రోజులు చికెన్రెండు రోజులు మటన్*

*-రోజూ గుడ్డు, నెయ్యితో భోజనం*

*-హర్షం వ్యక్తం చేస్తున్న పిల్లలు, తల్లిదండ్రులు*

🔵తెలంగాణ : ప్రభుత్వ విద్యా వ్యవస్థ్ధను పటిష్ట్ట పరుస్తూ, కార్పొరేటు స్థాయికి దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థలను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభు త్వం తీవ్రంగా కృషి చేస్తోంది. గత పాలకుల హయాంలో ప్రభుత్వ పాఠశాలపై చిన్న చూపు చూడడంతో కనీస మౌ లిక సదుపాయలు కూడా లేక విద్యార్ధులు తీవ్ర ఇబ్బందు లు పడాల్సి వచ్చింది. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. తాజాగా క స్తూర్బా, మోడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలల్లో నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం కొత్త మెనూలో భాగంగా విద్యార్థుకు భోజనంలో మటన్, నెయ్యి అందించాలని తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది.

 అంతేకాకుండా ప్రభుత్వ చర్యలతో ప్రభుత్వ విద్య సవంత్సరాల్లో చదివే విద్యార్ధుల సంఖ్య ఎటేటా పెరుగుతుంది.
కస్తూర్బా, మోడల్ స్కూళ్లతో పాటు అన్ని సంక్షేమ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు నూతన సంవత్సర కానుకను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను ప్రభుత్వం ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జనవరి 1 నుంచి విద్యార్థులకు నూతన మెనూ అందుబాలులోకి రానుంది.

 *🛑ఈ మెనూ ప్రకారం*

 నెలలో 5 రోజులు చికెన్, 
2 రోజులు మటన్, నిత్యం నెయ్యితో భోజనాన్ని అందించనున్నారు. అంతేకాకుండా ప్రతి రోజు సాయిత్రం (స్నాక్స్), చిరు ధాన్యాలను అందించనున్నారు.

*⛔నూతన మెనూ అమలయ్యే విధానం...*

ప్రభుత్వం నూతనంగా ప్రారంభించే మెనూ జనవరి 1 నుంచి అందుబాటులోకి రానుంది. 

నెలలో 1, 3, 5వ ఆదివారాలు(మధ్యాహ్నం)
 2, 4వ బుధవారాల్లో (రాత్రి) చికెన్తో భోజనం పెట్టనున్నారు. 

అదేవిధంగా నెలలో 2, 4వ ఆదివారాల్లో (మధ్యాహ్నం) మటన్ పెట్టనున్నారు. వారం లో ఆరు రోజులు (బుధవారం మినహా) అరటి పండు లే దా సీజనల్ పండ్లు అందించనున్నారు.

 శనివారాలు సా యంత్రం వరుసగా గులాబ్జామ్, సేమియా, రవ్వకేసరి, ఫ్రూట్ సలాడ్ ఇవ్వనున్నారు. 

ప్రతి రోజు ఉదయం బూస్ట్, బోర్న్మీటా, హార్లిక్స్, రాగి మాల్ట్ వంటివి ఒకటి (నెలలో 22 రోజులు) అందించనున్నారు.

 మధ్యాహ్న భో జనంతో వివిధ రకాల కూరగాయలు, పప్పుతోపాటు పెరుగు, నెయ్యి, రసం తప్పనిసరి.

 ప్రతి రోజు సాయత్రం ఉడికించిన బటానీ, పెసర్లు, అటుకుల మిక్చర్, స్వీట్ కా ర్న్, పల్లిపట్టి, నువ్వులపట్టితో స్నాక్స్, టీ ఇవ్వాల్సి ఉంటుంది.


*☯ఇప్పటికే అనేక సౌకర్యాలు..*

రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బా గాంధీ, మోడల్, గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థ్ధుల సంక్షేమానికి అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. విద్యార్థ్ధుల సౌకర్యార్థం ట్రంక్ బాక్స్, పేట్లు, గ్లాసులు, బల్లాలు, వంట సామగ్రి, బెడ్షీట్లు, కార్పెట్స్, చెప్పులు, కాస్మోటిక్స్ వంటివి అందజేస్తోంది. అంతేకాకుండా విద్యార్థ్ధుల రక్షణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటు, డిజిటల్ క్లాసులు, కంప్యూటర్ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చింది.

*✴రానున్న రోజుల్లో అనేక మార్పులు..*

ప్రభుత్వం రానున్న రోజుల్లో కస్తూర్బా విద్యాలయాలు, మోడల్ స్కూల్, గురుకుల పాఠశాల్లో అనేక మార్పులు తీసుకవచ్చేందుకు శ్రీకారం చూడుతోంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన స్పెషలాఫీసర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. కస్తూర్బా విద్యాలయాల్లో ఇంటర్ విద్యను అందుబాటులో కి తీసుకరానున్నారు. అంతేకాకుండా విద్యార్థ్ధుల కోసం పడక మంచాల ఏర్పాటు, వసతి కోసం బిల్డింగ్లు నిర్మించునున్నారు. విద్యార్థులకు వేడినీటి సౌకర్యం కోసం సోలార్ వాటర్ హీటర్లు ఏర్పాటు, అక్రమాలకు తావు లేకుండా బయోమెట్రిక్ యంత్రాలు 🏀ఏర్పాటు చేయనున్నారు.
🏀☸☸🛑🛑⛔⛔🔵🔵🚫🚫
[12/30/2017, 08:49] ‪+91 95020 29120‬: *🅾OSRAJU@*
*🏀పారదర్శక పరిశీలన*
*----మహబూబాబాద్*

*-యూ-డైస్ సమాచారంపై సమగ్ర తనిఖీలు*

*-నెలాఖరుకు పూర్తిచేసేందుకు కార్యాచరణ*

*-పాఠశాలల్లో పర్యటిస్తున్న ప్రత్యేక బృందాలు*

*-2న జిల్లా కేంద్రంలో తనిఖీ బృందాలతో సమావేశం*

🛑ప్రభుత్వ పాఠశాలల సమగ్ర వికాసం కోసం ప్రభుత్వం సంస్కరణలు చేపడు తోంది. ఈ ప్రక్రియలో కీలక భూమిక పో షించే పాఠశాల విద్యా సమగ్ర సమాచారం (యూ-డైస్)లో పొందుపర్చే వివరాల పా రదర్శకతను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను విద్యాశాఖ అధికారులు ఏ ర్పాటు చేశారు. 

జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్ర భుత్వ పాఠశాలల్లో కనీసం 25శాతం పాఠశాలలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించేలా బృందాలకు శిక్షణ ఇచ్చారు.

 ఈ నెలాఖరు నాటికి ప్రక్రియ పూర్తి చేసేందుకు కార్యచరణ సిద్ధం చేసినప్పటికీ కొన్ని మండలాల్లో ఇప్పటికీ మొద లు కాలేదు. యూ-డైస్ ఆధారంగానే పాఠశాలలకు సౌకర్యాల కల్పన, నిధుల విడుదల, విద్యార్థుల వాస్తవిక పరిస్థితులు తె లిసే అవకాశం ఉన్నందున ఇప్పటికే ప్రధానోపాధ్యాయులు ఇచ్చిన వివరాలు సరైన వేనా...
కాదా అనే అనుమానాలను ని వృత్తి చేయనున్నారు. 

ఈ ఏడాది సేకరించి న విద్యాసమగ్ర సమాచారంపై పునఃపరిశీలన చేయనున్నారు. ఇందుకు జిల్లాలో అన్ని మండలాలకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా, కొన్నింటిలో అవి సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యాయి. మరికొన్ని మండలాల్లో నేటికీ ప్రక్రియ మొదలు కాలేదు.

 జిల్లా విద్యాశాఖకు పంపించిన ఈ సమాచారాన్ని జనవరి 5వ తేదీ వరకు ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది.

 ఇందు కోసం జనవరి 2న తనిఖీ బృందాలతో జిల్లా కేంద్రంలో సమావేశాన్ని ఏర్పాటు చేయమన్నారు.

*🔵పాఠశాలల సమాచార సేకరణ*

ప్రతీ ఏడాది పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యతో పాటు సర్కారు బడుల్లో అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, సౌకర్యాలు, లేనివాటి సమాచారాన్ని సేకరిస్తున్నారు. సర్వశిక్షా అభియాన్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ తంతు కొనసాగుతోంది. వీటి ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు బడుల బలోపేతానికి నిధులు కే టాయిస్తున్నాయి. బడుల్లోని సమస్త సమాచారాన్ని ప్రత్యేక ప్రొఫార్మాలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పూర్తి చేసి వారి కాంప్లెక్స్ పరిధిలోని ప్రధానోపాధ్యాయులకు అందజేయాల్సి ఉంటుంది. వీరు మండల వనరుల కేంద్రం (ఎంఆర్సీ)లకు అందజేసి మండల వ్యాప్తంగా వివరాలు క్రోడీకరించి జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. వీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయా వివరాలు పంపిస్తారు.

*⛔నిధుల కోసం వక్రమార్గాలు*

యూ-డైస్ విధానం ప్రతీ ఏడాదీ జరిగే తంతు. పలు రాష్ర్టాల్లు, వివిధ జిల్లాల్లో వి ద్యాశాఖ నుంచి వస్తున్న వివరాలపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల అసంతృప్తి వ్యక్తం చే సింది. పాఠశాలల్లో మూత్రశాలలు, వంట గదులు, అదనపు తరగతి గదులు, విద్యార్థుల సంఖ్యకు ఆధారంగా మధ్యాహ్న భో జన బిల్లుల చెల్లింపు వంటి ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో కొన్ని పాఠశాలల హెచ్ఎంలు వాస్తవిక పరిస్థితులకు విరుద్ధంగా యూ-డైస్లో వివరాలు నమోదు చేస్తున్నట్లు గుర్తించారు.

 కొన్ని పాఠశాలల్లో సౌకర్యాలు ఉన్నప్పటికీ లేనట్లు చూపించ డం, విద్యార్థుల సంఖ్య లేక పోయినా ఉ న్నట్లుగా చూపించడం లాంటివి జరుగుతున్నట్లు సమాచారం.
వీటికి అడ్డుకట్ట వేసి వాస్తవ వివరాలు స్వీకరించాలనే ఉద్దేశం తో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలతో పాఠశాలలను తనిఖీ చేయాలని భావించిం ది. ఇందులో భాగంగా జిల్లాలో పరిశీలన కు 16 బృందాలను నియమించారు. ఒ క్కో బృందంలో ప్యానల్గ్రేడ్ హెచ్ఎంను గానీ, కాంప్లెక్స్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ గానీ ఎస్జీటీ కలిసి బృందానికి ఇ ద్దరు చొప్పున ఉండేలా ఏర్పాటు చేశారు. వీరికి జిల్లాలోని 25 శాతం పాఠశాలల వివరాలను అందజేశారు. హెచ్ఎంలు అం దజేసిన ప్రొఫార్మాతో పాటు కొత్తగా మరో ప్రొఫార్మాను పాఠశాలలకు తీసుకెళ్లి వారు అందజేసిన వివరాలను సరిపోల్చుతారు. తప్పులు ఉన్నట్లయితే వెంటనే కొత్త ప్రొఫార్మాలో నమోదు చేస్తారు. మరో రెండు రో జుల్లో ఈ తతంగాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.

*🏀అక్రమాల నిరోధానికే.?*

సర్కారు బడుల బలోపేతానికి ప్రతీ ఏ డాది ప్రభుత్వం అందజేస్తున్న నిధుల దు ర్వినియోగాన్ని అడ్డుకునేందుకే ఈ పునః పరిశీలన చేపట్టిందని తెలుస్తోంది. పాఠశాలల్లోనే కాకుండా వసతిగృహాలు, ఆదర్శ, కస్తూర్బా విద్యాలయాలు, గురుకులాలు, వసతిగృహాలు తదితర వాటిల్లోనూ ఈ త నిఖీలు చేపట్టాలని భావించింది. కొన్ని పా ఠశాలల్లో విద్యార్థులకు సరిపడా భవనాలు ఉన్నప్పటికీ లేనట్లు చూపించి కొత్త వాటి కోసం ప్రతిపాదనలు పెడుతున్నట్లు సమాచారం. ఇలాంటి చోట్ల భవనాలు మంజూరైతే వృథా అవుతాయనే భావన వ్యక్తమవుతోంది. కొన్ని వసతిగృహాల్లో విద్యార్థుల సంఖ్యలో తేడాలు వస్తున్నట్లు తెలుస్తోంది. వారి పేరున వచ్చే సౌకర్యాలను పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.


*జిల్లాలో 312 పాఠశాలల పరిశీలనకు కార్యాచరణ*

*జిల్లాలోని 16 మండలాల్లో 312 పాఠశాలలను* పరిశీలించేందుకు మండలంలో పని చేసే బృందానికి సమీప మండలంలో ని బాధ్యతలను అధికారులు అప్పగించా రు. 

కేవలం పెద్దవంగర మండలానికి సం బంధించి మాత్రమే అదే మండలంలో ప ని చేస్తున్న బృందం తనిఖీలు చేపట్టనుంది.

 బయ్యారం మండలంలో 87 పాఠశాలలు ఉండగా 22 పాఠశాలల్లో, 

చిన్నగూడూరు మండలంలోని 23 పాఠశాలల్లో 6, 

దంతాలపల్లి మండలంలో 36 పాఠశాలల్లో 9, 

డోర్నకల్ మండలంలో 74 పాఠశాలల్లో 19, 

గంగారం మండలంలో 41 పాఠశాలలకు 10, 

గార్ల మండలంలో 66 పాఠశాలలకు 17, 

గూడూరు మండలంలో 107 పాఠశాలలకు 27,

 కేసముద్రం
మండలం లో 106 పాఠశాలలకు 27, 

కొత్తగూడ మండలంలో 73 పాఠశాలలకు 18, 

కురవి మండలంలో 93 పాఠశాలలకు 23,

 మహబూబాబాద్ మండలంలో 161 పాఠశాలలకు 40, 

మరిపెడ మండలంలో 127 పాఠశాలలకు 32,

 నర్సింహులపేట మండలంలో 54 పాఠశాలలకు 14,

 నెల్లికుదురు మండలంలో 74 పాఠశాలలకు 19,

 పెద్దవంగర మండలంలో 36 పాఠశాలలకు 9, 

తొర్రూరు మండలంలో ఉన్న 81 ప్రభుత్వ పాఠశాలల్లో 20 పాఠశాలకు 

సంబంధించిన యూ-డైస్ ఫారాలను పరిశీలించనున్నారు.

 మొత్తం జిల్లాలో ఉన్న 1239 ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 312 పాఠశాలల్లో పరిశీలన కోసం 16 బృందాలను నియమించారు.🏀⛔⛔🛑🔵🔵⛔⛔🛑🔵🅾🅾🅾
[12/30/2017, 10:00] ‪+91 95020 29120‬: 🌷రైట్ ఛాయిస్ - కరెంట్ ఎఫైర్స్🌹            
                                                                   
1) 2017 ఐసీసీ ఎంపిక చేసిన ఉత్తమ మహిళ క్రికెట్ వన్డే జట్టులో చోటు దక్కించుకున్న భారతీయ క్రికెటర్లు ఎవరు ?

✅ మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్, ఏక్తా బిష్థ్


2) భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ జనరల్ మేనేజర్ గా ఎవరు నియమితులయ్యారు ?

✅ సబా కరీం


3) వచ్చే నెలలో దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం ( WEF) వార్షిక సదస్సుకు భారత్ తరపున ఎవరు హాజరవుతున్నారు ?

✅ ప్రధాని నరేంద్రమోడీ


4) వినూత్న ఆవిష్కరణలు, విప్లవాత్మక పరిశోధనల కోసం గూగుల్ ఎక్స్ కేంద్రాన్ని అమెరికా వెలుపల తొలిసారిగా ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?

✅ విశాఖపట్నం (ఏపీ)

5) హైదరాబాద్ లో మోనో రైలు మార్గాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?

✅ మియాపూర్ – శిల్పారామం- గచ్చిబౌలి


6) జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్థ తిరస్కరించింది ?

✅ ఐరాసలోని సర్వప్రతినిధి సభ


7) కేంద్ర కార్మిక రాజ్య బీమా సంస్థను ఏ విధంగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది ?

✅ సహకార సంఘం (సొసైటీ)


8) 1997లో ఏ ప్రధాని దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరంకు హాజరైన  తర్వాత ఇప్పుడు నరేంద్రమోడీ పాల్గొంటున్నారు ?

✅ అప్పటి ప్రధాని హెచ్.డి.దేవెగౌడ


9) మనదేశం వచ్చే ఏడాదే ప్రపంచంలోని అయిదు ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానం పొందుతుందని చెప్పిన సంస్థ ఏది ?

✅ సెంటర్ ఫర్ ఎకనామిక్స్అండ్ బిజినెస్ రీసెర్చ్ ( CEBR)



10) రాష్ట్రంలో శాతవాహన యూనవర్సిటీ ఎక్కడ ఉంది ?

 ✅ కరీంనగర్
[12/30/2017, 10:00] ‪+91 95020 29120‬: *✍కరెంటు అఫైర్స్...*

🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని తుళ్లూరులో రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్ భవన సముదాయ నిర్మాణానికి డిసెంబర్ 28న ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దొంగతనం ఏ రూపంలో అయినా అది పోలీసు, ప్రభుత్వం ఉదాసీనత వల్లే జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఏ తప్పు చేసినా న్యాయస్థానాల్లో ఏదో రకంగా తప్పించుకోవచ్చని చాలా మంది అనుకుంటున్నారన్నారు. నేరాల ఆధారాలకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ సమర్థంగా పనిచేసి తప్పు చేసిన వారు తప్పించుకోకుండా చేయాలని సూచించారు. రూ. 254 కోట్లతోఈ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మిస్తున్నారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు భూమిపూజ
ఎప్పుడు : డిసెంబర్ 28 
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 
ఎక్కడ : తుళ్లూరు, అమరావతి
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
నేపాల్‌తో కలసి సంయుక్తంగా ఎవరెస్ట్ శిఖరం ఎత్తును కొలిచేందుకు భారత్ పంపిన ప్రతిపాదన తిరస్కరణకు గురైంది.ఎవరెస్ట్ ఎత్తును తామే కొలుస్తామని.. భారత్, చైనాలు కేవలం కీలకమైన గణాంకాలను అందిస్తే చాలని నేపాల్ సర్వే విభాగం ఈ మేరకు స్పష్టం చేసింది.దీంతో ఈ వ్యవహారం వెనుక చైనా హస్తం ఉండి ఉంటుందని భారత్ భావిస్తోంది. 

2015 నాటి‘గోర్ఖా భూకంపం నేపాల్‌ను కుదిపేసింది. ఈ విలయం తర్వాత ఎవరెస్ట్ ఎత్తు తగ్గిందనే సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ సర్వే డిపార్ట్ మెంట్ తో కలసి ఎవరెస్ట్ ఎత్తును కొలిచేందుకు సర్వే ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు పంపింది. నేపాల్ మాత్రం నిర్మోహమాటంగా ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. నేపాల్ ప్రభుత్వంపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చి చైనా ఈ పని చేయించి ఉంటుందని భారత్ అధికారులు అంటున్నారు. 

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎవరెస్ట్ ఎత్తును కొలిచేందుకు భారత్ పంపిన ప్రతిపాదనలు తిరస్కరణ 
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : నేపాల్
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో ‘మన్‌కీ బాత్’ కార్యక్రమం హ్యాష్‌ట్యాగ్ అగ్రస్థానంలో నిలిచింది.ఈ విషయాన్ని ట్విటర్ డిసెంబర్ 28న అధికారికంగా వెల్లడించింది. ఈ ఏడాది అత్యధికంగా ఏయే అంశాలకు సంబంధించిన విషయాల గురించి నెటిజన్లు చర్చించారనేది వెల్లడించింది. ప్రతి నెల చివరి ఆదివారం ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే మోదీ ‘మన్‌కీ బాత్’ కార్యక్రమం ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. దీనిపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ హ్యాష్‌ట్యాగ్ మన్‌కీ బాత్ అని చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. హ్యాష్‌ట్యాగ్ జల్లికట్టు, జీఎస్టీ (వస్తు, సేవల పన్ను), ముంబై వరదలు, ట్రిపుల్ తలాక్ ఈ ఏడాది ట్విటర్ టాప్ ట్రెండింగ్‌గా నిలిచాయి.
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
చైనా అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు భారత సైన్యం ఒంటెల సేవలను ఉపయోగించుకోబోతోంది.లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చొరబాట్లను నిరోధించేందుకు ఒంటెలను మోహరించాలని భారత సైన్యం నిర్ణయించింది. సరిహద్దుల్లో గస్తీ తిరగడంతోపాటు, పెద్ద ఎత్తున ఆయుధాలు, ఇతర వస్తువులను రవాణా చేసేందుకు వీటిని ఉపయోగించుకోబోతోంది. రెండు మూపురాలు ఉన్న ఒంటెలు సుమారు 180 నుంచి 220 కేజీల బరువును మోస్తాయి. ఈ ఒంటెలు రెండు గంటల సమయంలో సుమారు 15 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ప్రస్తుతం మన సైన్యం కంచరగాడిదలు, గుర్రాలను ఉపయోగించుకుంటోంది. రెండు మూపురాలు ఉండే ఒంటెలు లడఖ్‌లోని నూబ్రా లోయలో మాత్రమే కనిపిస్తాయి. ప్రయోగాత్మక ప్రాజెక్టు సఫలమైతే ఒకే మూపురంగల ఒంటెలకు కూడా శిక్షణ ఇస్తారని తెలుస్తోంది.
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
మాజీ ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన టోర్నీలో ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆనంద్ నిర్ణీత 15 రౌండ్లు ముగిసేసరికి 10.5 పాయింట్లతో వ్లాదిమర్ ఫెడసీవ్ (రష్యా)తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. అయితే కచ్చితమైన ఫలితం కోసం ఇరువురి మధ్య నిర్వహించిన రెండు టైబ్రేక్ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఆనంద్.. టైటిల్ విజేతగా నిలిచాడు. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 9.5 పాయింట్లతో 16వ స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక 15 రౌండ్లు ముగిసేసరికి 9 పాయింట్లతో 22వ స్థానాన్ని సంపాదించింది. 

క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : విజేత విశ్వనాథన్ ఆనంద్ 
ఎక్కడ : రియాద్, సౌదీ అరేబియా
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
అంతర్జాతీయంగా మొండిబకాయిల భారం (ఎన్‌పీఏ) మోస్తున్న దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో నిలిచింది.అలాగే... బ్రిక్స్ (బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లో భారత్‌తే మొదటి స్థానం. ఈ మేరకు డిసెంబర్ 28న ఓ నివేదిక విడుదల చేసిన కేర్ రేటింగ్స్..భారత బ్యాంకుల మొండి బకాయిల భారం రూ.9.5 లక్షల కోట్లని పేర్కొంది. మొత్తం రుణాల్లో ఈ పరిమాణం దాదాపు 10 శాతం. ఈ విషయంలో భారతదేశం హై రిస్క్ కేటగిరీలో నిలిచింది. 

యూరోపియన్ యూనియన్‌లో(ఈయూ) ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నాలుగు దేశాలు-గ్రీస్ (36.4%), ఇటలీ (16.4 శాతం), పోర్చుగల్ (15.5 శాతం), ఐర్లాండ్ (11.9 శాతం) మొండి బకాయిల భారాన్ని మోస్తున్నాయి. ఈ నాలుగు దేశాలు జాబితాలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. భారత్ తరువాత ఆరవ స్థానంలో రష్యా (9.7 శాతం), ఏడవ స్థానంలో స్పెయిన్ (5.3 శాతం) నిలిచాయి. 

ఎన్‌పీఏల సమస్యను కేర్ నాలుగు కేటగిరీలుగా (లో, వెరీ లో, మీడియం, హై లెవెల్) విభజించింది. కేవలం ఒక శాతం ఎన్‌పీఏలను ఎదుర్కొంటున్న దేశాల్లో (లో కేటగిరీ) ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, బ్రిటన్ ఉన్నాయి. చైనా, జర్మనీ, జపాన్, అమెరికాల్లో ఈ సమస్య రెండు శాతంగా (రెండవ కేటగిరీ) ఉంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు- బ్రెజిల్, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, టర్కీలు మూడవ కేటగిరీలో ఉన్నాయి. 

క్విక్ రివ్యూ:
ఏమిటి : మొండి బకాయిల్లో 5వ స్థానంలో భారత్ 
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : కేర్ రేటింగ్స్
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తులను అన్న ముకేశ్ అంబానీ టెలికం కంపెనీ రిలయన్స్ జియో కొనుగోలు చేయనుంది.ఆర్‌కామ్‌కు చెందిన స్పెక్ట్రమ్, మొబైల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్, మీడియా కన్వర్జన్స్ నోడ్స్ ను (ఎంసీఎన్) రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కొనుగోలు చేయబోతోంది. ఈ మేరకు ఒక నిశ్చయాత్మకమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని రిలయన్‌‌స జియో తెలిపింది. ఈ డీల్ విలువ రూ.24,000 - 25,000 కోట్ల శ్రేణిలో ఉండొచ్చని బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.45,000 కోట్ల రుణ భారంతో కుదేలైన ఆర్‌కామ్‌కు ఈ ఆస్తుల విక్రయంఊరటనిచ్చే విషయం. ఈ డీల్ వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య పూర్తయ్యే అవకాశాలున్నాయని అంచనా. 

క్విక్ రివ్యూ:
ఏమిటి : రిలయన్స్ కమ్యూనికేషన్స్‌ను కొనుగోలు చేయనున్న రిలయన్స్ జియో 
ఎప్పుడు : డిసెంబర్ 28 
ఎవరు : ఆర్‌కామ్, జియో మధ్య ఒప్పందం
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి ‘ఐఎంఏ డాక్టర్ ఎంజీ గార్గ్ జీవిత సాఫల్య పురస్కారం’లభించింది.ముంబైలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.కె.అగర్వాల్ చేతుల మీదుగా డిసెంబర్ 28న ఆయన ఈ అవార్డు అందుకున్నారు. పురస్కార ప్రదాన కార్యక్రమానికి వెయి్యమంది ప్రసిద్ధ వైద్యులు హాజరయ్యారు. 

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఎంఏ జీవిత సాఫల్య పురస్కారం 
ఎప్పుడు : డిసెంబర్ 28 
ఎవరు : డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
గగనతల రక్షణ కోసం దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన సూపర్‌సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది.తక్కువ ఎత్తు నుంచి (30 కిలోమీటర్ల లోపు) వచ్చే ఎటువంటి ఖండాంతర క్షిపణులనైనా ఇది ధ్వంసం చేయగలదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఇలాంటి మూడు క్షిపణులను భారత్ విజయవంతంగా పరీక్షించింది. వివిధ ఎత్తుల్లో ఖండాంతర క్షిపణుల నుంచి పూర్తి స్థాయి రక్షణ కోసం ఈ ఏడాది మార్చి 1న, ఫిబ్రవరి 11న రెండు పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. 

డిసెంబర్ 28న నిర్వహించిన మూడోపరీక్షలో చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ప్రదేశం నుంచి పృథ్వీ క్షిపణిని ప్రయోగించారు. రాడార్స్ నుంచి సిగ్నల్స్ రాగానే బంగాళాఖాతంలోని అబ్దుల్ కలాం (వీలర్ ద్వీపం) ద్వీపంలో ఉన్న సూపర్‌సోనిక్ క్షిపణి వెంటనే పృథ్వీ క్షిపణిని అడ్డుకుని ధ్వంసం చేసిందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. భూమికి సుమారు 15 కిలోమీటర్ల ఎత్తులోనే ఏఏడీ పృథ్వీని అడ్డుకుని ధ్వంసం చేసిందని పేర్కొన్నాయి. 7.5 మీటర్ల పొడవుండే ఈ క్షిపణిలో నావిగేషన్ సిస్టంతో పాటు హైటెక్ కంప్యూటర్‌ను కూడా అనుసంధానం చేశారు. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ తర్వాత ఈ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న నాలుగో దేశం భారత్.

క్విక్ రివ్యూ:
ఏమిటి : సూపర్‌సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతం 
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : భారత సైన్యం
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
తక్షణ ట్రిపుల్ తలాక్‌ను చట్టవ్యతిరేకంగా గుర్తించి భర్తకు మూడేళ్ల జైలుశిక్ష విధించే ‘ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు’కు డిసెంబర్ 28న లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.బిల్లును వ్యతిరేకిస్తూ పలు పక్షాల ఎంపీల ఆందోళనల మధ్యే.. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా ఒవైసీ సహా పలువురు విపక్ష సభ్యులు సూచించిన సవరణలను తిరస్కరించిన అనంతరం లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందింది. 

బిల్లులో ఏముంది..
ట్రిపుల్ తలాక్ చట్టంగా పేర్కొంటోన్న ముస్లిం మహిళల(వివాహ హక్కుల పరిరక్షణ )బిల్లులో పలు కఠిన నిబంధనల్ని పొందుపరిచారు. చట్టాన్ని అతిక్రమించి ముస్లిం పురుషుడు తక్షణం అమల్లోకి వచ్చే విడాకుల కోసం భార్యకు ట్రిపుల్ తలాక్ చెపితే మూడేళ్ల జైలు శిక్షకు అవకాశం కల్పించారు. బిల్లు చట్టంగా మారితే కశ్మీర్ తప్ప దేశమంతటా అమల్లోకి వస్తుంది. 

రాతపూర్వకంగా లేక మొబైల్, ఈ-మెయిల్ వంటి ఎలక్ట్రానిక్ విధానంలో సహా ఏ రూపంలో చెప్పినా ట్రిపుల్ తలాక్ చెల్లదు. అలాగే చట్ట వ్యతిరేకం కూడా.

బిల్లులో ట్రిపుల్ తలాక్‌ను కేసు పెట్టదగిన(కాగ్నిజబుల్), నాన్ బెయిలబుల్ నేరంగా పేర్కొన్నారు. భార్యకు తలాక్ చెప్పిన భర్తకు జరిమానాతో సహా గరిష్టంగా మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చు. బాధిత మహిళ తన కోసం, పిల్లల కోసం భర్త నుంచి జీవన భృతిని కోరే హక్కును బిల్లులో కల్పించారు. కేసును విచారించే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జీవన భృతి మొత్తాన్ని నిర్ణయిస్తారు.

మైనర్ పిల్లల్ని తన కస్టడీకి అప్పగించమని బాధిత మహిళ కోరే హక్కును బిల్లులో పొందుపరిచారు. పిల్లల కస్టడీపై మేజిస్ట్రేట్ నిర్ణయం తీసుకుంటారు. - తక్షణం అమల్లోకి వచ్చే విడాకుల కోసం ముస్లిం పురుషుడు చెప్పే ట్రిపుల్ తలాక్ లేక ఇతర రూపాల్లో చెప్పే తలాక్ పద్ధతుల్ని బిల్లులో తలాక్‌గా నిర్వచించారు. ముస్లిం వ్యక్తిగత చట్టాలకు అనుగుణంగా ట్రిపుల్ తలాక్‌ను ఆచరిస్తున్నారు. దాని ప్రకారం.. ముస్లిం పురుషుడు తన భార్యకు అప్పటికప్పుడు మూడు సార్లు తలాక్ చెపితే తక్షణం విడాకులు మంజూరవుతాయి.

సుప్రీంకోర్టు ఏం చెప్పింది..
ట్రిపుల్ తలాక్ ద్వారా అప్పటికప్పుడు ముస్లిం పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమని 2017 ఆగస్టు 22న సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ట్రిపుల్ తలాక్ ఖురాన్‌కు వ్యతిరేకమనీ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ధర్మాసనంలోని జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ నారిమన్, జస్టిస్ లలిత్‌లు ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకించగా.. జస్టిస్ ఖేహర్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌లు మాత్రం ట్రిపుల్ తలాక్‌ను షరియా చట్టాలు ఆమోదిస్తున్నందున.. అది మత స్వేచ్ఛను ప్రసాదిస్తున్న ఆర్టికల్ 25 కిందకు వస్తుందని పేర్కొన్నారు. చివరకు 3-2 తేడాతో ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీం తీర్పునిచ్చింది.
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు రచించిన ‘బతుకుపోరు, విలువలు’పుస్తకాన్ని డిసెంబర్ 28న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించారు.రాములు.. 90కిపైగా పుస్తకాలు రాసి బహుగ్రంథ కర్తగా పేరొందారు. తత్వశాస్త్రంతోపాటు తెలంగాణ వాస్తవ జీవన చిత్రంపై కథలు, నవలలు, కథానికలు, సాహిత్య విమర్శ, బీసీ సామాజిక వర్గాలపై రచనలు చేశారు. 

క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘బతుకుపోరు, విలువలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : రచయిత బీఎస్ రాములు
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
[12/30/2017, 10:00] ‪+91 95020 29120‬: *రాష్ట్రీయం*

1) ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రస్తుతం భారత్ లో జరుగుతోంది. అసలు ఈ సదస్సును మొదట ఎప్పుడు నిర్వహించారు ?
జ: 2010 వాషింగ్టన్ లో
(నోట్: ఇస్తాంబుల్, దుబాయ్, మరకేష్, నైరోబీ, కౌలాలంపూర్, సిలికాన్ వ్యాలీల్లో జరిగాయి)

2) హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ఎన్నోవది ?
జ: ఎనిమిది

3) హైదరాబాద్ HICC లో ప్రపంచ పారిశ్రామిక సదస్సు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోంది ?
జ: నీతి ఆయోగ్

4) హైదరాబాద్ లో జరుగుతున్న 8వ ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు ఎంత శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు ?
జ: 52.5 శాతం

5) GES ప్రారంభోత్సవం తర్వాత 29నాడు ఇవాంక ఏ చర్చలో పాల్గొంటారు ?
జ: ఇన్నోవేషన్ ఆన్ వర్క్ ఫోర్స్ డెవలప్ మెంట్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్
(నోట్: ఈ చర్చలో మోడరేటర్ గా మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తారు )

6) భారత్ లో అమెరికా రాయబారి ఎవరు ?
జ: కెన్నెత్ ఇ. జస్టర్

7) ప్రస్తుతం నీతి ఆయోగ్ CEO ఎవరు ?
జ: అమితాబ్ కాంత్

8) ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్ సహా ప్రముఖులకు ఎక్కడ తయారు చేయించిన జ్ఞాపికలను అందించనున్నారు ?
జ: కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులు

9) గ్రేటర్ మెట్రో రైలు ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎంత ?
జ: రూ.16,830 కోట్లు

10) హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మిస్తున్న సంస్థ ఏది ?
జ:  L & T
(నోట్: ప్రపంచంలోనే పబ్లిక్ – ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మిస్తున్న అతి పెద్ద మెట్రో ప్రాజెక్ట్ ఇదే)

11) మెట్రో రైలు ప్రాజెక్టును మొదట ఎప్పుడు ప్రారంభించారు ?
జ: 2007 మే 14న

12) జాతీయ స్థాయిలో ఉత్తమ అవయవదాన అవార్డు అందుకున్న రాష్ట్రానికి చెందిన హాస్పిటల్ ఏది ?
జ: యశోదా హాస్పిటల్

*జాతీయం*

13) 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ గా ఎవరు నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు ?
జ: ఎన్ కే సింగ్
(నోట్: ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు )

14) 15వ ఆర్థిక సంఘం ఎప్పటి వరకూ కేంద్రానికి నివేదిక అందిస్తుంది ?
జ: 2019 అక్టోబర్

15) ఉగ్రవాదంపై పోరులో సహకరించుకోవాలని భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: రష్యాతో

(నోట్: 1993లో ఈ రెండు దేశాలమధ్య కుదిరిన ఒప్పందం స్థానంలో కొత్తది అమల్లోకి వస్తుంది )

16) లవ్ జిహాద్ కేసుగా పరిగణించి ఎవరు చేసుకున్న వివాహాన్ని కేరళ హైకోర్టు రద్దు చేసింది?
జ: హదియా

17) పంచాయతీయ రాజ్ సంస్థల్లో గెలిచిన మహిళా ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ఢిల్లీలో ఎవరు ప్రారంభించారు ?
జ: మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ
18) సూర్యుడిపై ప్రయోగాలకు భారత్ మొదటిసారి 2019లో పంపుతున్న శాటిలైట్ మిషన్ ఏది  ?
జ: ఆదిత్య L1 మిషన్

19) ఆదిచుంచనగిరి వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: కర్ణాటక

20) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కు డైరక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: సౌమ్యా స్వామినాథన్

21) మూడోసారి ప్రపంచ స్నూకర్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు ?
జ: భారత్ క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) స్టార్ పంకజ్ అద్వానీ

22) 2017 IITF ఛాలెంజ్ స్పానిష్ ఓపెన్ సింగిల్స్ లో బంగారు పతకం గెలుచుకున్న సాతియాన్ జ్ఞానశేఖరన్ ఏ రాష్ట్రానికి చెందినవారు ?
జ: తమిళనాడు

23) ఆసియాన్ మారథాన్ ఛాంపియన్షిప్ ను గెలుచుకున్న మొదటి భారతీయుడు గోపీ తొనకాల్ ఏ రాష్ట్రానికి చెందినవారు ?
జ: కేరళ

*అంతర్జాతీయం*

24) విశ్వసుందరి 2017 కిరీటం దక్కించుకున్నది ఎవరు ?
జ: డెమీలే -నెల్ పీటర్స్ (దక్షిణాఫ్రికా)

25) భారత్ నుంచి విశ్వసుందరి కిరీటానికి పోటీ పడిన యువతి ఎవరు ?
జ: శ్రద్ధా శశిధర్

26) ఇండోనేషియాలోని బాలీలో ఏ అగ్నిపర్వతం నుంచి భారీ ఎత్తున లావా, దుమ్మూ ఎగసిపడుతున్నాయి ?
జ: అగుంగ్

27) బంగ్లాదేశ్ తిరుగుబాటు కేసులో 139మందికి విధించిన మరణశిక్ష, 146 మంది సైనికులకు పడిన యావజ్జీవ శిక్షలను బంగ్లాదేశ్ హైకోర్టు ఖరు చేసింది.  ఈ సంఘటన ఎప్పుడు జరిగింది ?

జ: 2009 ఫిబ్రవరిలో

చరిత్రలో ఈ రోజు డిసెంబరు 29

*🌏 చరిత్రలో ఈరోజు 🌎*

*🌅డిసెంబరు 29*🌅*🏞సంఘటనలు*🏞

1530: బాబరు పెద్దకొడుకు హుమాయూన్‌ ఢిల్లీ  సింహాసనాన్ని అధిష్ఠించాడు.

1812: అమెరికాపై యుద్ధానికి దిగిన బ్రిటిష్‌ సేనలు బఫెలో, న్యూయార్క్‌ నగరాలను తగలబెట్టాయి.

1953: రాష్ట్రాల పునర్విభజన విషయమై ఫజల్‌ఆలీ కమీషన్‌ ఏర్పాటయింది. ( 1953 డిసెంబర్ 22 అని ఆదివారం ఆంధ్రభూమి 2011 జూన్ 19 పుట 10)

1965: భారత్ తయారుచేసిన మొదటి యుద్ధటాంకు, వైజయంత ఆవడి కర్మాగారం నుండి బయటకు వచ్చింది.

*🌻🌻జననాలు*🌻🌻

1808: ఆండ్రూ జాన్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు.

1901: పింగళి నాగేంద్రరావు, ప్రముఖ సినీ రచయిత.

1910: రోనాల్డ్ కోస్ ప్రముఖ ఆర్థికవేత్త.

1930: టీ.జి. కమలాదేవి, తెలుగు సినిమా నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి. (మ.2012)

1942: రాజేష్ ఖన్నా హిందీ సినిమా నటుడు, నిర్మాత మరియు రాజకీయ వేత్త. (మ.2012)

1960: డేవిడ్ బూన్, ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

*🌹🌹మరణాలు*🌹🌹

1994: కువెంపు, కన్నడ రచయిత మరియు కవి మరణం (జ.1904)

2014: బైరిశెట్టి భాస్కరరావు, ప్రముఖ సినీ దర్శకుడు. (జ.1936)

2016: కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు, ప్రముఖ సంస్కృతాంధ్ర పండితుడు, అవధాని. (జ.1937)

*🔷జాతీయ / అంతర్జాతీయ దినాలు*🔷

🔻ఐర్లాండ్ రాజ్యాంగ ఆమోద దినోత్సవం.

🔻మంగోలియా స్వాతంత్ర్య దినోత్సవం.

🙏         *శుభోదయం*      🙏
        --------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
        -------------------------
" కళ్ళకు నచ్చిన వారిని కన్ను మూసి తెరిచేలోగా మరిచిపోవచ్చు కానీ మనసుకి నచ్చిన వారిని మరణం వరకు మారువలేం. "
       --------------------------
🌹 *నేటీ మంచి మాట* 🌹
      ---------------------------
" ఒకడు డబ్బు సంపాదించడం మొదలుపెట్టి నీతో మాట్లాడడం మానేశాడు అంటే వాడికి పొగరు పెరిగింది అని కాదు, వాడి లైఫ్ లో వాడు బిజీ అయ్యాడు అని అర్ధం. "

*🤘 నేటి సుభాషితం🤘*

*మూర్ఖుడితో స్నేహం కన్నా బుద్దిమంతుడితో విరోధం మంచిది.*

*🗓 నేటి పంచాంగం 🗓*

*తేది :  29, డిసెంబర్ 2017*
సంవత్సరం : హేవిళంబినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : పుష్యమాసం
ఋతువు : హేమంత ఋతువు
కాలము : శీతాకాలం
వారము : శుక్రవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : ఏకాదశి
(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 13 ని॥ నుంచి ఈరోజు రాత్రి 9 గం॥ 49 ని॥ వరకు)
నక్షత్రం : భరణి
(ఈరోజు తెల్లవారుజాము 0 గం॥ 35 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 52 ని॥ వరకు)
యోగము : సిద్ధము
కరణం : వణిజ
వర్జ్యం :
(ఈరోజు ఉదయం 9 గం॥ 29 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 58 ని॥ వరకు)
అమ్రుతఘడియలు :
(ఈరోజు రాత్రి 6 గం॥ 24 ని॥ నుంచి ఈరోజు రాత్రి 7 గం॥ 53 ని॥ వరకు)
దుర్ముహూర్తం :
(ఉదయం 8 గం॥ 57 ని॥ నుంచి ఉదయం 9 గం॥ 41 ని॥ వరకు)(ఉదయం 12 గం॥ 39 ని॥ నుంచి మద్యాహ్నం 1 గం॥ 23 ని॥ వరకు)
రాహుకాలం :
(ఉదయం 10 గం॥ 53 ని॥ నుంచి ఉదయం 12 గం॥ 16 ని॥ వరకు)
గుళికకాలం :
(ఉదయం 8 గం॥ 7 ని॥ నుంచి ఉదయం 9 గం॥ 30 ని॥ వరకు)
యమగండం :
(సాయంత్రం 3 గం॥ 3 ని॥ నుంచి సాయంత్రం 4 గం॥ 26 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 44 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 50 ని॥ లకు
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : మేషము

*💎 నేటి ఆణిముత్యం 💎*

ఒక్కడు మాంసమిచ్చె మఱియొక్కడు చర్మము గోసి యిచ్చె వే
ఱోక్కరు డస్ధి నిచ్చొనిక నొక్కడు ప్రాణములిచ్చె వీరిలో
నొక్క నిపట్టునన్ బ్రదుక నోపక యిచ్చిరో కీర్తి కిచ్చిరో
చక్కగ జూడు మంత్రి కుల సంభవ! రాయన మంత్రి భాస్కరా! 

*భావము :*

ఒకడు మాంసమిచ్చెను. మరొకడు చర్మము కోసి ఇచ్చెను. వేరొకడు వెన్నెముక తీసి ఇచ్చెను. ఇంకొకడు ప్రాణములే ఇచ్చెను. వీరిలో ఒక్కరైనా, వాటిని తాము బ్రతుకలేక ఇచ్చారో, కీర్తి కోసం ఇచ్చారో గ్రహించు, ఓ రాయన మంత్రి!

*✍🏼 నేటి కథ ✍🏼*

*నోటిలో కొంగ*

బ్రాహ్మణుడొకడు ఒకనాడు ఒక పొలంగుండా నడుస్తూ ఇంటికి పోతున్నాడు. దారిలో అకస్మాత్తుగా అతనికి ఒక దగ్గు పొర వచ్చింది. దగ్గీ, దగ్గీ చివరికతను గట్టిగా నేలమీద ఉమ్మాడు. అయితే చూడగా, అతను ఉమ్మిన కళ్లెలో తెల్లటి ఈక ముక్క ఒకటి కనబడింది! అతనికి చాలా ఆశ్చర్యం వేసింది. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలీలేదు అతనికి.

ఇంకొంత సేపట్లో అతనికి ఇక కంగారు మొదలైంది. తను కొంగ ఈకను ఉమ్మాడన్న సంగతి అతని ఆలోచనను వదలకుండా వెంటబడింది. త్వరలో అది ఇక భరింపరానంత స్థాయికి చేరుకున్నది!

ఇంటికి చేరుకోగానే అతను భార్యను పిలిచి, "నన్ను ఒక సంగతి చాలా బాధిస్తున్నది. దాన్ని నేను ఎవరికో ఒకరికి చెప్పుకోవలసిందే- లేకపోతే నా తల పగిలిపోతుంది. నీకు నేను ఆ సంగతి చెప్తాను- అయితే దాన్ని ఇక వేరే ఎవ్వరికీ చెప్పనని ముందుగా మాట ఇస్తావా?" అని అడిగాడు.

"ఓ! నిర్భయంగా చెప్పు. నేను ఒక్క చీమకు కూడా తెలీనివ్వనని ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను" అన్నది భార్య. అప్పుడతను నిశ్చింతగా, తన ఉమ్మిలో కనబడ్డ తెల్లటి ఈక గురించి చెప్పాడు భార్యకు. అయితే, భార్య మాటైతే ఇచ్చింది కానీ, ఇంత పెద్ద విషయాన్ని ఎవ్వరికీ చెప్పకుండా దాయటం ఆమె వల్ల కాలేదు. ఆమె ఆలోచనల నిండా తెల్లటి ఈకలే మరి!

అందుకని, పొరుగింటి సుబ్బమ్మ కనబడగానే బ్రాహ్మణుడి భార్య ఆమెకు దగ్గరగా వెళ్లి- "నా మనసంతా ఒక రహస్యంతో నిండి పోయి ఉంది. నేను ఆగలేక పోతున్నాను. నీకు ఆ రహస్యం చెప్పేస్తాను- అయితే ముందు నాకు ఓ మాట ఇస్తావా? దాన్ని నువ్వు వేరే ఎవ్వరికీ చెప్పకూడదు- ఎవ్వరికీ తెలీనివ్వనని నేను మా వారికి మాట ఇచ్చాను, మరి!" అన్నది.

పొరుగింటి సుబ్బమ్మ ఒప్పుకున్నది. "నెను రహస్యాల్ని ఎంత చక్కగా కాపాడతానో నీకు తెలీదా? నేను చీమక్కూడా తెలీనివ్వను- చెప్పు!" అన్నదామె ఉత్సాహంగా.

"ఎవ్వరికీ చెప్పవు కదా?"
"నీకంత అపనమ్మకమైతే చెప్పకు. నేనెన్నడైనా నీ రహస్యాన్ని ఇతరులకు చెప్పానా?"

"సరే, సరే. చెప్పేస్తాను నీకు. నువ్వు మంచి స్నేహితురాలివని నాకు తెలుసు. నువ్వెవ్వరికీ చెప్పవు. మా ఆయన ఇంటికి వస్తూ పొలాన్ని దాటుతుండగా ఏమైందో తెలుసా? ఆయన ఏమి ఉమ్మేశాడో తెలుసా? ఆయన.. ఆయన ఉమ్మి నిండా కొంగ ఈకలు! ఎన్ని ఈకలో! ఆయనకు ఏమౌతోందో నాకు అర్థం కావట్లేదు. నాకు మాత్రం చాలా భయం వేస్తున్నది!" 

"అయ్యో నువ్వేమీ ఆందోళన పడకు. ఒక్కోసారి అలాంటివి జరుగుతూనే ఉంటాయి. మళ్లీ అన్నీ సర్దుకుంటాయి. కానీ, దాన్ని గురించి ఎవ్వరికీ తెలీకపోవడమే మంచిది. ఊరికే అందరూ పుకార్లు రేపుతారు, లేకుంటే".

కానీ ఆ రహస్యాన్ని ఐదు నిమిషాలపాటు దాచుకోవటం కూడా ఆమె వల్ల కాలేదు. అది ఆమెలోంచి తన్నుకొని బయటికి వచ్చేస్తున్నట్లు అనిపించిందామెకు. హడావిడిగా ఆమె ఇంకా ఇంటికి పరిగెత్తుతూ ఉండగానే 'తనకిప్పుడు ఎవరు కనబడతారో, వాళ్లకి ఈ రహస్యం చెప్తే ఎలా స్పందిస్తారో' అన్న ఊహ ఆమెను తబ్బిబ్బు పరిచింది. ఆమెకో మిత్రురాలు కనబడగానే ఆమె ఇక ఆపుకోలేక బయటికి కక్కేసింది.

"ఎవ్వరికీ చెప్పనని మాట ఇవ్వు ! నేను ఆమె రహస్యాన్ని కాపాడతానని బ్రహ్మణుడి భార్యతో ప్రమాణం చేశాను. ఇవ్వాళ ఏం జరిగిందో తెలుసా? పూజారిగారు పొలంలోంచి పోతూ పూర్తి కొంగనొకదాన్ని కక్కుకున్నారట! బ్రాహ్మణులు శాకాహారులేనని నేను అనుకునేదాన్ని. కానీ మనకేం తెలుసు, నిజానికి?" అన్నదామె. "పూర్తి కొంగనా? అంత పెద్ద పక్షి! ఎలా కక్కుకున్నాడబ్బా!? వింత మనిషే! కానీ- నేను ఎవ్వరికీ తెలీనివ్వనులే., నన్ను నమ్ము."

ఎంతో సేపు కాలేదు, వేరే ఒకాయనకు ఎవరో చెప్పగా తెలిసింది- పండితుడి నోట్లోంచి రెక్కలల్లార్చుకుంటూ అనేక కొంగలు వెలువడ్డాయని!

ఇక ఆరోజు సాయంత్రానికల్లా పట్టణమంతా తెల్సిపోయింది అందరికీ- పండితుడి నోట్లోంచి కొంగల గుంపులూ, బాతుల మందలూ, ఇంకా రకరకాల పెద్దపెద్ద పక్షులన్నీ ఎగురుకుంటూ బయటికి వస్తున్నాయని! చుట్టుప్రక్కల గ్రామాల్లో కూడా ఆ సంగతి ప్రచారమైంది- దాంతో గ్రామాలకు గ్రామాలే ఎద్దుల బండ్లు వేసుకొని ఈ భయంకర ఘటనను చూసేందుకు పండితుడుండే ఊరికి తరలి వచ్చాయి. ఇదేదో నిజంగా అద్భుతం గదా, మరి? - రకరకాల పక్షులు, అన్ని రంగులవీ, అన్ని సైజులవీ,- కొన్ని సుదూర పక్షులు కూడా- పండితుడి నోట్లోంచి ఊడిపడి, ఆకాశాన్ని కప్పేస్తున్నాయట!

బ్రాహ్మణుడికి పిచ్చెక్కినట్లయింది. అతను అందరి నుండీ‌ పారిపోయి కొండమీద, ఓ చెట్టు తొర్రలో దాక్కున్నాడు. ఈ పుకారు పూర్తిగా సద్దుమణిగి, ఇంకోటి తలెత్తేంత వరకూ బయట తిరిగే సాహసం చెయ్యలేదు! 

ఈ రోజు జికె 

1)👉 అంతర్జాతీయ టీ-20 మ్యాచ్ లలో  అత్యధిక సెంచరీలు సాధించిన భారతీయ క్రికెటర్ ఎవరు?
A: *రోహిత్ శర్మ*

2)👉ఇటీవల  వార్తల్లోకి వచ్చిన  బనస్ నది ఏ నదికి ఉపనది?
A: *చంబల్ నదికి*

3)👉 ప్రధాన మంత్రి మోడీచే  ఆగ్నేయాషియా దేశాల గేట్ వే గా అభివర్ణించబడి రాష్ట్రం ఏది?
A: *మిజోరాం*

4)👉 దేశంలో ఉత్తమ గ్రామ పంచయితీలుగా తొలి రెండు స్థానాలలో నిలిచిన పంచాయితీలు ఏవి?
A: *తెల్లాపూర్(తెలంగాణ), పరపట్ల(AP)*

5)👉 ఇటీవల ప్రకటించిన సాహిత్య  అకాడెమీ అవార్డులు-2017 లో దేవిప్రియ(ఖ్వాజా హుస్సేన్) రచించిన ఏ కవితా సంకలనానికి తెలుగు భాష తరుపున పురస్కారం లభించింది?
A: *గాలిరంగు*

*తెలంగాణ న్యూస్*

*🌷ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు*

హైదరాబాద్: *రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం కోసం వివిధ కోర్సులకు నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. అన్ని ప్రవేశ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు.*

 *మే 2 నుంచి 5 వరకు ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలు జరగనున్నాయి.*

*మే 9న ఈసెట్*

*మే 17న ఐసెట్*

*మే 20న పీఈసెట్*

*మే 25న లాసెట్*

*మే 25న పీజీఈసెట్*

*మే 26న పీజీ లాసెట్*

*మే 31న ఎడ్సెట్ నిర్వహించనున్నారు.*

 *ఎంసెట్, ఈసెట్ నిర్వహణ బాధ్యత జేఎన్టీయూహెచ్కు అప్పగించారు.*

*లాసెట్, పీజీలాసెట్, ఎడ్ సెట్, పీజీఈసెట్ను ఓయూ నిర్వహించనుంది.*

*ఐసెట్ నిర్వహణ బాధ్యతను కాకతీయ యూనివర్సిటీకి అప్పగించారు.*

*పీజీసెట్ నిర్వహణ బాధ్యత మహాత్మాగాంధీ యూనివర్సిటీకి అప్పగించారు.*

*🖊📝తెలుగు పెడగాగి🖊📝*

1)ఆంధ్ర పంచ కావ్యాలలో ఒకటిగా పేరెన్నిక గన్నది?

జ.పాండు రంగ మహత్యం 

2)పూర్వ పదార్థము ప్రధానంగా కలది

జ.అవ్యాయీ భావ సమాసం 

3)" పుడమి శునకము మీద బొలయు నెం డోకటే   " ఈ వాక్యంలో " ఒకటే " అనునది దీనిని తెలియజేస్తుంది.

జ.నిష్చయార్థకం 

4)" పుండరీకము " పదం యొక్క నానార్థములు

జ.తెల్ల తామర , పులి 

5)ప్రాచీన కావ్య భాష కు ఈ నాటికీ ప్రమాణంగా భావించే వ్యాకరణ గ్రంథం

జ.బాల వ్యారణం 

6)" ఒక విద్య యందు పూర్తి ప్రజ్ఞ వుండుట " అనే అర్థానిచ్చే జాతీయం

జ.అందే వేసిన చేయి

7)" చేయెత్తి జై కొట్టు తెలుగోడా " గేయ రచయిత

జ.వేముల పల్లి కృష్ణ 

 8)ప్రతి పాదం లో " మ,స,జ,స,త,త,గ " అనే గణములు గల వృత్తము

జ.శార్దూలము

9)" ప్రత్యేకము " పదమును విడదీసి వ్రాయగా

జ.ప్రతి+ ఏకము 

10)" సమరోత్సాహము " పదం లోని సమాసం

జ.సప్తమి తత్పురుష

11)" ఐ,ఔ,అర్ " లను ఏమంటారు

జ.వృద్దులు 

12)క్రింది వానిలో దంత్యములు

జ.త, థ,ద, ధ,న 

13)"  కవి సార్వభౌమ " అనే బిరుదు గల కవీంద్రుడు

జ.శ్రీ నాథుడు

14)పురుషులను ,వాని విశేషణములను తెలుపు పదములు

జ.మహద్వాచకములు 

15)కృత్యధార భోధన వల్ల ప్రయోజనం

జ.ప్రత్యక్షానుభవం కలుగుతుంది

16)ఈ భోధన వల్ల విద్యార్థుల్లో సాహిత్య అభిరుచి కలుగుతుంది

జ.పద్య భోధన 

17)విద్యార్థుల్లో లిఖిత రచనాశక్తి ని పెంపొందించు నది

జ.పత్రికా నిర్వహణ

18)పఠన ము నేర్పించుటకు శ్రేష్ఠ మైన పద్దతి

జ.పద పద్దతి 

19)నిర్దిష్టమైన భాషణమునకు మూలం 

జ.శ్రవణం 

20)వాస్తవ జీవనం తో బడి జీవితాన్ని మేళవింప చేయునవి

జ.క్షేత్ర పర్యటనలు 

December 29 is the 363rd day of the year (364th in leap years) in the Gregorian calendar. There are two days remaining until the end of the year. This date is slightly more likely to fall on a Tuesday, Thursday or Saturday (58 in 400 years each) than on Sunday or Monday (57), and slightly less likely to occur on a Wednesday or Friday (56).

Events
875 - Charles the Bald, King of the Franks, is crowned as Holy Roman Emperor Charles II.
1170 - Thomas Becket, Archbishop of Canterbury, is assassinated inside Canterbury Cathedral by followers of King Henry II; he subsequently becomes a saint and martyr in the Anglican Communion and the Catholic Church.
1427 - The Ming army begins its withdraw from Hanoi, ending the Chinese domination of Đại Việt.
1503 - The Battle of Garigliano (1503) was fought between a Spanish army under Gonzalo Fernández de Córdoba and a French army commanded by Ludovico II, Marquess of Saluzzo
1508 - Portuguese forces under the command of Francisco de Almeida attack Khambhat at the Battle of Dabul.
1778 - American Revolutionary War: Three thousand British soldiers under the command of Lieutenant Colonel Archibald Campbell capture Savannah, Georgia.
1812 - The USS Constitution under the command of Captain William Bainbridge, captures the HMS Java off the coast of Brazil after a three-hour battle.
1835 - The Treaty of New Echota is signed, ceding all the lands of the Cherokee east of the Mississippi River to the United States.
1845 - In accordance with International Boundary delimitation, the United States annexes the Republic of Texas, following the manifest destiny doctrine. The Republic of Texas, which had been independent since the Texas Revolution of 1836, is thereupon admitted as the 28th U.S. state.
1851 - The first American YMCA opens in Boston, Massachusetts.
1860 - The launch of HMS Warrior, with her combination of screw propeller, iron hull and iron armour, renders all previous warships obsolete.
1874 - The military coup of Gen. Martinez Campos in Sagunto ends the failed First Spanish Republic and the monarchy is restored as Prince Alfonso is proclaimed King of Spain.
1876 - The Ashtabula River railroad disaster occurs, leaving 64 injured and 92 dead at Ashtabula, Ohio.
1890 - Wounded Knee Massacre on Pine Ridge Indian Reservation, 300 Lakota killed by the United States 7th Cavalry Regiment.
1911 - Mongolia gains independence from the Qing dynasty, enthroning 9th Jebtsundamba Khutughtu as Khagan of Mongolia.
1911 - Sun Yat-sen becomes the provisional President of the Republic of China; he formally takes office on January 1, 1912.
1916 - A Portrait of the Artist as a Young Man, the first novel by James Joyce, was first published as a book by an American publishing house B. W. Huebschis after it had been serialized in The Egoist (1914-15).
1930 - Sir Muhammad Iqbal's presidential address in Allahabad introduces the two-nation theory and outlines a vision for the creation of Pakistan.
1934 - Japan renounces the Washington Naval Treaty of 1922 and the London Naval Treaty of 1930.
1937 - The Irish Free State is replaced by a new state called Ireland with the adoption of a new constitution.
1940 - World War II: In the Second Great Fire of London, the Luftwaffe fire-bombs London, England, killing almost 200 civilians.
1949 - KC2XAK of Bridgeport, Connecticut becomes the first Ultra high frequency (UHF) television station to operate a daily schedule.
1972 - Eastern Air Lines Flight 401 (a Lockheed L-1011 TriStar) crashes in the Florida Everglades on approach to Miami International Airport, Florida, killing 101 of the 176 people onboard.
1975 - A bomb explodes at LaGuardia Airport in New York City, killing 11 people and injuring 74.
1989 - Czech writer, philosopher and dissident Václav Havel is elected the first post-communist President of Czechoslovakia.
1992 - Fernando Collor de Mello, president of Brazil, tries to resign amidst corruption charges, but is then impeached.
1996 - Guatemala and leaders of Guatemalan National Revolutionary Unity sign a peace accord ending a 36-ye

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏

*🔹సుభాషిత వాక్కు*

*"జీవితానికి చేటు తెచ్చేవి నాలుగు!*
*" నేను -నాది" "నీవు -నీది"*
*వీటిని మరచిపోవాలి.*

*"The mind is a powerful force.* 
_It can enslave us or empower us. It can plunge us into the depths of misery or take us to the heights of ecstasy_. 
*Learn to use the power wisely.*

*♦మంచి పద్యం*

*ఆలికన్న అమ్మ అపురూపమైనది*
*అవని కన్న మిన్న అమ్మ ప్రేమ*
*అమ్మ పేరుకన్న అమృతము లేదురా*
*వాస్తవంబు వేమువారి మాట*

*❗భావం:-*

*భార్య కన్న మాతృమూర్తి అపురూపమైనది. అమ్మ ప్రేమకు అంతము లేదు. అమ్మ పేరుకన్నా అమృతము మరొకటి లేదు.*

*♦నేటి జీ కె*♦

 *ఖండాలు ఎత్తైన శిఖరాలు*

 *ఆసియా -- ఎవరెస్ట్*

 *ఆఫ్రికా -- కిలిమంజారో*

 *ఉత్తర అమెరికా — మెకిన్లి*

 *దక్షిణ అమెరికా — అకన్ కాగ్వా*

 *ఆస్ట్రేలియా — కోషియాష్కో*

 *ఐరోపా — ఎల్ బ్రజ్*

 *అంటార్కిటికా — విన్సన్ మాసిఫ్*

*📚✍హడావుడి చేశారు చల్లగా జారుకున్న అధికారులు*

*28 December 2017, 11:10 pm*

*💥ప్రజాశక్తి - అవనిగడ్డ* 

🌻గత రెండు రోజుల నుంచి అవనిగడ్డ ప్రగతి విద్యాసంస్థలపై ఐటి శాఖ దాడులతో దివిసీమలో ఉత్కంఠత రేపిన అధికారులు గురువారం తెల్లవారు జామున గుట్టుచప్పుడు కాకుండా చల్లగా జారుకున్నారు. బుధవారం ఉదయం 10గంటల నుంచి ప్రగతి విద్యాసంస్థల కార్యాలయం, సంస్థ డైరెక్టర్‌ సనకా పూర్ణచంద్రరావు ఇంటిపై దాడులు నిర్వహించారు. అవి రెండు రోజులపాటు రాత్రింబవళ్ళు కొనసాగగా మీడియానుమాత్రం పరిసరాలకు కూడా రానివ్వలేదు. 

🌻ఎంతో ఉత్కంఠత రేపిన ఈ సంఘటన దివిసీమకు మొట్టమొదటి సంఘటన కావడంతో ప్రజలంతా ఏం జరుగుతుందోననే ఆసక్తితో ఎదురుచూశారు. ఈ దాడుల నేపథ్యంలో విద్యార్థులు మూడు పూటల క్లాసులు కోల్పోయారు.

🌻ఈ దాడులుపై ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులు ఐటి అధికారులను కలిసి వివరాలు సేకరించే ప్రయత్నంచేసినప్పటికీ అవి నెరవేరకపోగా తాము ఎటువంటి వివరాలు వెల్లడించే అధికారంలేదని, తమ సంస్థ డైరెక్టర్‌ మాత్రమే ఈ వివరాలు వెల్లడిస్తారని అధికారులు చెప్పారు. అయినప్పటికీ సమాచారంకోసం వేచిచూసిన మీడియా ప్రతినిధులకు నిరాశే మిగిలింది. అయితే ఇంతకీ ఐటి అధికారులు దాడులుచేసి ఏం సాధించారనేది వేల మెదళ్ళను తొలుస్తున్న ప్రశ్న.

🌻 ఇది కేవలం తమకు ముడుపులు ముట్టచెప్పలేదనే అక్కసుతో అధికారపార్టీలో ఉన్న కొందరు నాయకులు దాడులు చేయించారని ప్రజలు బాహాటంగా చర్చించుకుంటున్నారు. మరోవైపు కాసులకోసమే దాడులుచేశారు తప్ప ఇది మరొకటి కాదంటూ వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. 

🌻గతంలో కూడా రెండుసార్లు ఈ సంస్థపై దాడులుచేసిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఈసారిమాత్రం పెద్ద ఎత్తున సిబ్బంది వచ్చి రెండు రోజులపాటు దాడులపేరుతో హడావుడిచేసి కొండను తవ్వి కనీసం ఎలుకనైనా పట్టారా అనే సందేహం ప్రజల్లో కలుగుతోంది. కేవలం అభివృద్ధి చెందుతున్న విద్యాసంస్థను అప్రతిష్టపాలుజేయటానికే ఇదంతా జరుగుతుందనే చర్చకూడా కొనసాగుతోంది. లేకపోతే ఐటి అధికారులు రెండు రోజులపాటు నిర్వహించిన దాడుల్లో వారి దృష్టికి వచ్చిన లోపాలను వెల్లడించకపోవడమే ఈ అనుమానాలకు కారణంగా చెప్పుకోవచ్చు. 

🌻కాగాసంస్థ నిర్వాహకుల నుంచి దాడులకు సంబంధించి ఎటువంటి సమాచారం వెల్లడించకపోగా తెల్లవారు జామున 4గంటలకు అధికారులు, సిబ్బంది అవనిగడ్డ నుంచి వెళ్ళిపోవటంతో ఇంకా దీనిపై ప్రజల్లో మాత్రం అనేక అనుమానాలు, అపోహలు కొనసాగుతూనే ఉన్నాయి. 

*♦-ముడుపులకోసమే దాడులు చేయించారా?*

🌻25 సంవత్సరాల క్రితం అవనిగడ్డలో ప్రగతి ట్యుటోరియల్‌ పేరుతో ప్రారంభమైన ప్రగతి విద్యాసంస్థలు దినదినప్రవర్తమానంగా అభివృద్ధి చెందుతూ ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయుల శిక్షణకు సంబంధించి ప్రధాన శిక్షణా సంస్థగా వెలుగొందుతోంది. ఇది కార్పొరేట్‌ సంస్థగా కాకుండా ఒక సామాన్యమైన విద్యాసంస్థగానే కొనసాగుతూ ఇప్పటివరకు వేలాది మంది ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడేందుకు శిక్షణ ఇచ్చి వారి జీవితాలకు భరోసా ఇచ్చిన సంస్థగా ఉభయ రాష్ట్రాల్లో పేరుప్రఖ్యాతలు గడించింది.

🌻 ప్రగతి విద్యాసంస్థల వల్ల దివిసీమకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు లభించాయి. విద్యారంగంలో అవనిగడ్డ ప్రధాన కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రగతి విద్యాసంస్థలకు ప్రభుత్వాలు డిఎస్సీ ప్రకటించినప్పుడల్లా రెండు రాష్ట్రాల నలుమూలల నుంచి వేలాది మంది విద్యార్థులు అవనిగడ్డకు వచ్చి అరకొర సౌకర్యాలతోనే శిక్షణ పొంది ఉపాధ్యాయ వృత్తి చేపట్టాలనే సంకల్పంతో ఇక్కడ శిక్షణ పొందితే తప్పకుండా ఉద్యోగం వస్తుందనే నమ్మకం కూడా ఈ ప్రాంతానికి రావటానికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మరోవైపు ఇతర ఉద్యోగాల్లో రిక్రూట్‌మెంట్‌ పడిపోవడంతో పాటు ఇంటర్వ్యూల్లో అవినీతికి ఎక్కువ తావుండే ఉద్యోగాలలో సామాన్యులు అటువైపు ఆసక్తిచూపక కేవలం ప్రతిభపైనే ఆధారపడి మార్కులు తెచ్చుకుంటే ఉద్యోగం సంపాదించొచ్చుననే ఆశతో ఉపాధ్యాయ వృత్తివైపు యువత ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు.

🌻 వేలాది మంది విద్యార్థులు ఉపాధ్యాయ శిక్షణకు తరలివచ్చి తమ అదృష్టాలను పరీక్షించుకుంటున్నారు. వారికి ఉత్తమ శిక్షణ ఇచ్చే కేంద్రంగా అవనిగడ్డ ప్రగతి కనబడటంతో ఎక్కువ మంది అందులో చెరేందుకే ఆసక్తిచూపుతున్నారు. దీంతో రెండు ప్రభుత్వాలు ఒకేసారి డిఎస్సి, టెట్‌ పరీక్షలకు నోటిఫికేషన్లు విడుదలచేయటంతో ఒక్కసారిగా వేలాది మంది ఎన్నడూలేని విధంగా అవనిగడ్డకు తరలివచ్చారు. కొందరు అధికార పార్టీ నాయకుల దృష్టికూడా ప్రగతిపై పడినట్లు తెలుస్తోంది. ఎక్కువ మొత్తంలో ముడుపులు కోరినట్లు కూడా సమాచారం.

🌻 ఇందుకు సంస్థ డైరెక్టర్‌ పూర్ణచంద్రరావు విముఖత చూపారని, అందువల్లే ఆయనను ఏదోరకంగా దెబ్బకొట్టాలనే సంకల్పంతో ఈ దాడులు చేయించారంటూ బాహాటంగా ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో శ్రీచైతన్య, నారాయణ వంటి కార్పొరేట్‌ విద్యాసంస్థలు ప్రభుత్వ విద్యారంగాన్ని తిమింగలాల్లా మింగేస్తూ వేలాది మంది తల్లిదండ్రుల రక్తాన్ని, చెమటను ఫీజుల రూపంలో పిండుకుంటున్నా, ఆ విద్యాసంస్థల్లో విద్యార్థులపై కొనసాగిస్తున్న అణచివేతకు తట్టుకోలేక విద్యార్థులు సీరియల్‌గా ఆత్మహత్యలు చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు ఉన్నాయి.

🌻 జీవితంపై ఆశతో ఇక్కడ శిక్షణ పొందితే ఉద్యోగం దొరుకుతుందనే నమ్మకంతో సామాన్యమైన ఫీజులతో వేలాది మందికి శిక్షణ ఇస్తున్న విద్యాసంస్థపై దాడులకు పూనుకోవడం పట్ల ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కార్పొరేట్‌ విద్యాసంస్థలు విద్యార్థులను తమ సంస్థల్లో చేర్చుకునేందుకు కల్లబొల్లి కబుర్లుచెప్పి తల్లిదండ్రులను మభ్యపెట్టి సంస్థల్లో చేర్చుకునేందుకు తీసుకువెళతారని, కానీ ప్రగతి విద్యాసంస్థ మాత్రం శిక్షణ ప్రారంభ తేదీని మాత్రమే ప్రకటించగానే వేలాదిమంది విద్యార్థులు స్వచ్ఛందంగా తరలివస్తారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

🌻 సీట్లులేవు, ఖాళీలేవని సంస్థ ప్రతినిధులు మొత్తుకున్నా వినకుండా తాము ఇక్కడే ఉండి శిక్షణ పొందుతామంటూ బీష్మించుకుని కూర్చునే వందలాది మంది అభ్యర్థులు ఇక్కడ కనిపిస్తారు. ఈ స్థాయిలో అభ్యర్థులు అవనిగడ్డ ప్రాంతానికి శిక్షణ కోసం వస్తే గ్రామంలో వారికి కల్పించాల్సిన సౌకర్యాలు తక్కువగా ఉండగా ప్రభుత్వం పూనుకుని ప్రత్యేక దృష్టిసారించి వేలాది మంది అభ్యర్థులకు శానిటేషన్‌, డ్రెయినేజీ సమస్య లేకుండా చేయటంతోపాటు ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. 

🌻దానిపై ఏమాత్రం ప్రభుత్వం, అధికారులు దృష్టిసారించిన పరిస్థితి కనిపించదు. తమకు శక్తిలేదు, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నవారికి కూడా చేయూతనిచ్చి శిక్షణ ఇస్తున్న సంస్థగా గుర్తింపు పొందగా దిక్కులేనివారిని సైతం చేరదీసి వారి జీవితాలకు భరోసా ఇస్తున్న సంస్థగా కూడా ప్రగతి విద్యాసంస్థలు దివిసీమలో గుర్తింపు పొందుతున్నాయి. అలాంటి విద్యాసంస్థలపై ఐటి అధికారులు దాడులపేరుతో కలకలంసృష్టించటం దివిసీమలో సంచలనంగానే మిగిలిపోయింది. 

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*✍కరంట్ అఫైర్స్...*

🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇
జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో అనీసా సయ్యద్ సరికొత్త జాతీయ రికార్డు నెలకొల్పింది.25 మీటర్ల పిస్టల్ షూటింగ్‌లో అనీసా (హరియాణా) 33 పాయింట్లతో జాతీయ రికార్డును తిరగరాయడంతో పాటు స్వర్ణ పతకాన్ని సాధించింది. శీతల్ శివాజీ థోరాట్, రాహీ సర్ణోబత్‌లు వరుసగా రజత, కాంస్య పతకాలు సాధించారు. 

క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ షూటింగ్ చాంపియన్‌షిప్ - 2017 
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో 33 పాయింట్లతో అనీసా జాతీయ రికార్డు 
ఎక్కడ : తిరువనంతపురం, కేరళ
🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇
సంప్రదాయ టెస్టుకు కాస్త భిన్ననంగా నాలుగు రోజుల టెస్ట్ మ్యాచ్ దక్షిణాఫ్రికా, జింబాబ్వేల మధ్య జరిగింది.దక్షిణాఫ్రికాలోని పోర్ట్ ఎలిజబెత్ వేదికగా డిసెంబర్ 26న ప్రారంభమైన ఈ డే అండ్ నైట్ టెస్టు కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. బలమైన దక్షిణాఫ్రికా చేతిలో ఇన్నింగ్‌‌స, 120 పరుగులతో జింబాబ్వే ఓడిపోయింది.

1972-73 తర్వాత ఐదు రోజులు కాకుండా ఒక టెస్టు నాలుగు రోజుల్లో జరగనుండటం ఇదే తొలిసారి. అంతకంటే ముందు ఆరు రోజులు, కొన్ని సార్లయితే మూడు నుంచి పది రోజుల టెస్టులు కూడా జరిగాయి. 1938-39లో చివరిసారిగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ల మధ్య డర్బన్‌లో జరిగిన పది రోజుల టెస్టు ‘డ్రా’గా ముగిసింది. 1972 సీజన్ తర్వాత టెస్టు ప్రామాణికంగా ఐదు రోజుల ఆటైంది. 

క్విక్ రివ్యూ:
ఏమిటి : సంప్రదాయ టెస్ట్‌కు భిన్నంగా నాలుగు రోజుల డే అండ్ నైట్ టెస్ట్ 
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : దక్షిణాఫ్రికా - జింబాబ్వే 
ఎక్కడ : పోర్ట్ ఎలిజబెత్, దక్షిణాఫ్రికా ఎందుకు : టెస్ట్ క్రికెట్‌కు ఆదరణ పెంచేందుకు
🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇
ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా నియమితులయ్యారు.ప్రస్తుత డీజీపీ సాంబశివరావు డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో మాలకొండయ్య 2018 జనవరి 1వ తేదీన డీజీపీగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌కు కొత్త డీజీపీ 
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : మాలకొండయ్య
🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇
బెటర్ ఇండియా ఏటా ప్రకటించే టాప్-10 ఐపీఎస్ అధికారుల జాబితాలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్ చోటు దక్కించుకున్నారు.విధుల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచినందుకు బెటర్ ఇండియా ఏటా టాప్-10 ఐపీఎస్ అధికారుల జాబితాను విడుదల చేస్తుంది. తాజా జాబితాలో తొలి, రెండు స్థానాల్లో మనీశ్‌శంకర్ శర్మ, ఆర్.శ్రీలేఖ ఉండగా.. మూడో స్థానంలో మహేశ్ భగవత్ ఉన్నారు. 

అక్రమ రవాణా బారి నుంచి చాలామంది మహిళలు, పిల్లలను రక్షించినందుకు మహేశ్ భగవత్‌కు ఇప్పటికే అమెరికా ప్రభుత్వం ట్రాఫికింగ్ ఇన్ పర్సన్‌‌స రిపోర్ట్ హీరోస్ అవార్డు-2017ను ప్రకటించింది. 

క్విక్ రివ్యూ:
ఏమిటి : బెటర్ ఇండియా టాప్-10 ఐపీఎస్ ఆఫీసర్స్ 
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : మూడో స్థానంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్
🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇
ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ ప్రాజెక్టును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 27న ప్రారంభించారు.వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ ప్రాజెక్టును ప్రజలకు అంకితమిచ్చారు. దీంతోపాటు రియల్‌టైమ్‌లో పరిపాలనను పర్యవేక్షించే డ్రోన్లు, సీసీటీవీ సర్వెయలెన్‌‌స ప్రాజెక్టుతోపాటు మారుమూల ప్రాంతాల వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ఎఫ్‌ఎస్‌ఓసీ ప్రాజెక్టును సైతం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ప్రాజెక్టు ద్వారా పౌర జీవనం నాణ్యంగా మారే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, తదితరులు పాల్గొన్నారు.

ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం తక్కువ ధరకు ప్రజలకు టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్ వంటి వసతులని కల్పిస్తుంది. 

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ ఫైబర్ నెట్ ప్రాజెక్టు ప్రారంభం 
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : ప్రారంభించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : తక్కువ ధరకు ప్రజలకు టీవీ ప్రసారాలు, ఇంటర్నెట్ వంటి వసతులని కల్పించేందుకు
🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జైరామ్ ఠాకూర్ (52) డిసెంబర్ 27న ప్రమాణస్వీకారం చేశారు.షిమ్లాలోని రిడ్‌‌జ గ్రౌండ్‌లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్.. సీఎంతోపాటుగా మరో 11 మంది మంత్రులతో ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, అగ్రనేత ఎల్‌కే అడ్వాణీతోపాటు రాజ్‌నాథ్, గడ్కరీ, నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 68 సీట్లకు గానూ బీజేపీ 44 స్థానాల్లో గెలిచింది. 

క్విక్ రివ్యూ:
ఏమిటి : హిమాచల్‌ప్రదేశ్‌లో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం 
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జైరామ్ ఠాకూర్
🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇
నకిలీ ఖాతాలను అరికట్టడంలో భాగంగా సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ కీలక నిర్ణయం తీసుకుంది.మొబైల్ ద్వారా కొత్తగా ఫేస్‌బుక్‌లో ఖాతాలు తెరిచేవారిని ఆధార్ కార్డులో ఉన్న పేరును ఇవ్వాల్సిందిగా ఆ సంస్థ కోరుతోంది. ‘ఆధార్ కార్డులో ఉన్న పేరును ఇవ్వండి’ అని ఫేస్‌బుక్‌లో ఓ ప్రాంప్ట్ వస్తోంది. దీంతోపాటు ‘మీ పేరేంటి? ఆధార్ కార్డులోని అసలు పేరు ఇవ్వడం ద్వారా స్నేహితులు మిమ్మల్ని సులభంగా గుర్తించగలరు. నకిలీల బెడద తగ్గుతుంది’ అన్న సందేశం తెరపై ప్రత్యక్షమవుతోంది. రెడిట్, ట్వీటర్ వాడుతున్న కొందరు యూజర్లు దీన్ని గుర్తించారు. అయితే.. వినియోగదారులు ఆధార్‌లోని తమ పేర్లను ఇవ్వాలన్నది ఐచ్ఛికమే. ప్రస్తుతం దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు ఫేస్‌బుక్ ప్రకటించింది.
🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇
ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం మణిపూర్‌కు తరలిపోయింది. కోల్‌కతాలో డిసెంబర్ 27న సమావేశమైన ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది.ఆంధ్ర విశ్వవిద్యాలయంతోపాటు ఏడు విశ్వవిద్యాలయాలు సమావేశాల నిర్వహణకు పోటీ పడ్డాయి. చివరికి మణిపూర్ విశ్వవిద్యాలయానికి ఈ అవకాశం దక్కింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం కూడా తాము ఈ సమావేశాలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపినప్పటికీ, అందుకు అసోసియేషన్ తిరస్కరించింది. 105వ ఇంటర్నేషనల్ సైన్‌‌స కాంగ్రెస్ 2018 మార్చి 18 నుంచి 22 వరకు ఇంఫాల్‌లోని మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీలో జరుగుతుంది. 

ముందుగా ప్రకటించిన షెడ్యుల్ ప్రకారం 2017 జనవరి మూడు నుంచి ఏడు వరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇండియన్ సైన్‌‌స కాంగ్రెస్ జరగాల్సి ఉంది. అయితే.. భద్రతా కారణాలతో సదస్సు నిర్వహణ బాధ్యతల నుంచి ఉస్మానియా తప్పుకుంది. 

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ సైన్స్ కాంగ్రెస్
ఎప్పుడు : 2018, మార్చి 18 - 22
ఎక్కడ : మణిపూర్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇంఫాల్
🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇🎇
గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట బైబిల్ మిషన్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న ‘ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ (ఐఈఏ)’ శతాబ్ది ఉత్సవాల సదస్సును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ డిసెంబర్ 27న ప్రారంభించారు.గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, సీఎం చంద్రబాబు, బంగ్లాదేశ్‌కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనిస్, ఐఈఏ కాన్ఫరెన్‌‌స అధ్యక్షుడు, సి.రంగరాజన్, భారత 14వ ఆర్థిక సంఘం చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డి, ఇంటర్నేషనల్ ఎకనామిక్ అసోషియేషన్ అధ్యక్షుడు కౌశిక్ బసు, ఐఈఏ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ థోరట్ తదితరులు సదస్సులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా.. 'ట్రాకింగ్ ది ఇండియన్ ఎకానమీ' పేరుతో డాక్టర్ సి. రంగరాజన్ రచించిన పుస్తక తొలి కాపీని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అందజేశారు. 

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ శతాబ్ది ఉత్సవాలు 
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : ప్రారంభించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : బైబిల్ మిషన్ ప్రాంగణం, ఏఎన్‌యూ
           🍃🌷🤗🌷🍃
I once asked a very successful woman to share her secret with me. She smiled and said to me.. "I started succeeding when I started leaving small fights for small fighters. I stopped fighting those who gossiped about me...I stopped fighting for a cheating partner...I stopped fighting for attention...I stopped fighting to meet public expectation of me...I left such fights for those who have nothing else to fight...And I started fighting for my vision, my dreams, my ideas and my destiny. The day I gave up on small fights is the day I started becoming successful."

Some fights are not worth your time.
Choose what you fight for wisely.

Let's be wise and let's pick our battles

Slang of the Day

*💥24/7*

✍🏾Definition :
All the time; always available; without a break

🔺Example 
1) In New York City, a lot of stores are open 24/7.

2) I had to move because my neighbors played loud dance music 24/7.

📌Etymology 
Some convenience stores are open 24 hours a day, 7 days a week. The phrase is used for anything that is always (or nearly always) available.

➰Synonyms 
around the clock
━━━━━━━━━━━
#Slang_of_the_day

*Idiom of the Day*

💥to beat a dead horse.

✍🏾Definition:  
to keep on doing something after there is no point in doing so

❗️Examples:

  🔺You're just beating a dead horse. He's never going to change his mind. 
 🔺I finally realized that I was beating a dead horse. Nothing I could say was going to make any difference. 
 🔺Relying on new or existing manufacturing jobs to save the day down the road isn't just beating a dead horse, it's laying down beside it. 
 🔺I also think that we may have reached the point of beating a dead horse ... so with thanks and love to all, I now respectfully close this thread. 

📝Explanation:  
The word beat in this idiom means hit. An alternative expression is to flog a dead horse. (Hitting a dead horse is not going to make it move!)
━━━━━━━━━
#Idiom_of_the_Day

*Phrasal Verb of the Day*

💥drive away

Meaning:
✍🏾to cause someone or something to leave a place

〰For example:

🔴drive sb/sth away 

🔺The government's strict new laws on currency trading will drive foreign investors away. 

⚫️drive away sb/sth 

▪️The farmers are using automatic air guns to drive away the birds.

━━━━━━━━━━━
#Phrasal_Verb_of_the_Day