AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 30 December 2017

అన్ని ప్రవేశ పరీక్షల కోసం జికె బిట్స్ 7

అన్ని ప్రవేశ పరీక్షల కోసం జికె బిట్స్ 7
1. రక్షణ రంగంలో సహకారం కోసం భారత్ - రష్యాలు ఏ పేరుతో సంయుక్తంగా సైనిక విన్యాసాలు నిర్వహించాయి ? 1) ముద్ర - 2017 2) ఇంధ్ర - 20173) యుద్ధ అభ్యాస్ - 2017 4) మైత్రీ - 2017 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం అనే అంశంపై ఇంధ్ర - 2017 పేరుతో భారత్ - రష్యా సంయుక్తంగా త్రివిధ దళాల విన్యాసాలు నిర్వహించాయి. రష్యాలోని సెర్గీవిస్కీ 249 కంబైడ్‌‌య ఆర్మీ రేంజ్, వ్లాదివోస్తోక్‌లోని జపాన్ సముద్ర జలాల్లో అక్టోబర్ 19 నుంచి 29 వరకు జరిగిన ఈ సైనిక విన్యాసాల్లో ఇరు దేశాల త్రివిధ దళాలు పాల్గొన్నాయి.
2. భారత్ - కజఖస్తాన్ ఇటీవల ఏ పేరుతో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి ?1) ప్రబల్ దోస్తిక్ - 2017 2) దోస్తీ - 20173) ఇండో - కజక్ - 20174) ఇంధ్ర - 2017 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: హిమాచల్‌ప్రదేశ్‌లోని బాక్‌లోహ్‌లో భారత్ - కజఖస్తాన్ రెండవ సంయుక్త సైనిక విన్యాసాలు జరిగాయి. మొదటి సంయుక్త సైనిక విన్యాసాలు 2016లో కజఖస్తాన్‌లో నిర్వహించారు. ప్రబల్ దోస్తిక్ (PRABAL DOSTYK) అంటే ధృడమైన స్నేహం అని అర్థం.
3. వ్యవసాయ రంగంలో ఏటా 4 శాతం వృద్ధిని సాధించేందుకు ప్రవేశపెట్టిన రాష్టీయ్ర కృషి వికాస్ యోజన పథకాన్ని ఎప్పటి వరకు పొడగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ? 1) 2017-18 2) 2019-203) 2020-214) 2021-22 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: రాష్టీయ్ర కృషి వికాస్ యోజన పథకాన్ని Rashtriya Krishi Vikas Yojana& Remunerative Approaches for Agriculture and Allied sector Rejuvenation (RKVY&RAFTAAR) పేరుతో 2019-20 వరకు పొడగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాగులో ప్రోత్సాహం, వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ కల్పించడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.15,722 కోట్లు కేటాయించింది.
4. పాకిస్తాన్‌లో భారత హై కమిషనర్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ? 1) అజయ్ బిసారియా 2) గౌతం బంబావాలే 3) ముఖ్తా తోమర్4) నవతేజ్ సర్నా 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: 1987 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి అజయ్ బిసారియా పాకిస్తాన్‌లో భారత హైకమిషనర్‌గా నియమితులయ్యారు. ఇంతకముందు పాక్‌లో భారత హైకమిషనర్‌గా ఉన్న గౌతం బంబావాలే ఇటీవలే చైనా రాయబారిగా వెళ్లారు.
5. ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరిగిన కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో స్వర్ణాన్ని సాధించిన భారత షూటర్ ఎవరు ? 1) జీతు రాయ్ 2) దీపక్ కుమార్ 3) గగన్ నారంగ్ 4) హీనా సిద్ధు 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: కామన్వెల్త్ షూటింగ్ చాంపియన్‌షిప్ 10 మీటర్ల ఎరుుర్ పిస్టల్ ఈవెంట్లో 626.6 స్కోరుతో తొలి స్థానంలో నిలిచిన హీనా సిద్ధు స్వర్ణాన్ని గెలుచుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫల్ ఈవెంట్లో దీపక్ కుమార్ రజతం గెలుచుకున్నాడు.
6. బ్లూ ఫ్లాగ్ - 2017 సైనిక విన్యాసాలను ఏ దేశం నిర్వహిస్తుంది ? 1) భారత్ 2) ఇజ్రాయెల్ 3) అమెరికా4) జర్మనీ 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: బ్లూ ఫ్లాగ్ పేరుతో ఇజ్రాయెల్ ఏటా రెండుసార్లు బహుళ సైనిక విన్యాసాలను నిర్వహిస్తుంది. 2017 నవంబర్‌లో ఇజ్రాయెల్‌లోని ఉడా ఎయిర్ ఫోర్స్‌బేస్‌లో ఈ విన్యాసాలు జరిగాయి. భారత్ ఈ విన్యాసాల్లో తొలిసారి పాల్గొంది. 45 మంది వాయుసేన సిబ్బందితో సీ-130 జే.. ఈ విన్యాసాల్లో పాల్గొంది. భారత్‌తో పాటు ఫ్రాన్స్‌, జర్మనీ కూడా ఈ విన్యాసాల్లో తొలిసారి పాల్గొన్నాయి.
7. కృష్ణ జింకల కోసం ప్రత్యేకంగా సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు ఇటీవల ఆమోదం తెలిపిన రాష్ట్రం ఏది ?1) తెలంగాణ 2) ఉత్తరప్రదేశ్ 3) ఆంధ్రప్రదేశ్ 4) మధ్యప్రదేశ్ 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: ఉత్తరప్రదేశ్ అలహాబాద్ యమునా నదీ తీరం వెంట ఉన్న మెజా అడవిలోని 126 హెక్టార్లలో కృష్ణ జింకల సంరక్షణ కేంద్రం ఏర్పాటుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ ప్రాంతంలో 350 వరకు కృష్ణ జింకలు ఉన్నాయి.
8. గ్లోబల్ జండర్ గ్యాప్ ఇండెక్స్ - 2017లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది ? 1) 100 2) 1043) 1084) 144 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ విడుదల చేసిన గ్లోబల్ జండర్ గ్యాప్ ఇండెక్స్ - 2017లో భారత్ 108వ స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే నివేదికలో 87వ స్థానంలో నిలిచిన భారత్ ఈ సారి 21 స్థానాలు దిగజారింది. విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవకాశాలు, రాజకీయ ప్రోత్సాహం వంటి అంశాల్లో పురుషులు, మహిళలకు ఉన్న అవకాశాల్లో తేడాల ఆధారంగా ఈ నివేదికను రూపొందిస్తారు. 
  • 2017 నివేదికలో ఐస్‌లాండ్ జండర్ ఈక్వల్ దేశాల్లో తొలిస్థానంలో నిలిచింది. నార్వే రెండో స్థానంలో, ఫిన్‌లాండ్ మూడో స్థానంలో, రువాండా నాలుగో స్థానంలో నిలిచాయి.
9. చెక్క బొమ్మల తయారీలో ప్రసిద్ధిగాంచిన ఏటికొప్పాక గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది ? 1) తెలంగాణ 2) కర్ణాటక3) ఆంధ్రప్రదేశ్ 4) తమిళనాడు 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: చెక్క బొమ్మల తయారీలో ప్రసిద్ధిగాంచిన ఏటికొప్పాక గ్రామం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో ఉంది. ది జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ(GIR) ఇక్కడ తయారయ్యే బొమ్మలకు ఇటీవల జియోగ్రాఫిక్ ఇండికేషన్ (GI) ఇచ్చింది. ఏపీ నుంచిఇంతకముందు కొండపల్లి బొమ్మలు, తిరుపతి లడ్డు, బొబ్బిలి వీణ, బంగినపల్లి మామిడికి జీఐ గుర్తింపు పొందాయి.
10. 2017 డిసెంబర్ 1 నుంచి అమ్ముడయ్యే కొత్త నాలుగు చక్రాల వాహనాలకు వేటిని తప్పనిసరి చేస్తు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ? 1) ఫాస్ట్‌టాగ్ 2) ఇన్సురెన్స్‌3) జీపీఎస్ 4) సీఎన్‌జీ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: 2017 డిసెంబర్ 1 నుంచి అమ్ముడయ్యే కొత్త నాలుగు చక్రాల వాహనాలకు ఫాస్ట్‌టాగ్‌లను తప్పనిసరి చేస్తు కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. టోల్‌గేట్ల వద్ద చెల్లింపులను డిజిటిల్ పద్ధతిలో చేసేందుకు ఉద్దేశించినవే ఫాస్ట్‌టాగ్‌లు. వీటిని వాహనం ముందు భాగంలోని అద్దంపై అమర్చుతారు. ప్రత్యేక నంబర్‌తో కూడిన ఈ ఫాస్ట్‌టాగ్‌లను ప్రీ పెయిడ్ పద్ధతిలో రీచార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా టోల్‌గేట్ల వద్ద టాక్స్ చెల్లింపు డిజిటల్ పద్ధతిలో చేయవచ్చు.
11. వరల్డ్ ఫుడ్ ఇండియా(WFI) - 2017 సమావేశాలు ఎక్కడ జరిగాయి ? 1) హైదరాబాద్ 2) న్యూఢిల్లీ3) అమృత్‌సర్ 4) విశాఖపట్నం 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా - 2017 సమావేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఫుడ్ ప్రాసెసింగ్‌లో భారీగా పెట్టుబడులు ఆకర్షించడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో ఈ సమావేశాలను నిర్వహించారు. జర్మనీ, జపాన్, డెన్మార్క్ దేశాలు ఈ సమావేశాల నిర్వహణలో భాగస్వామిగా వ్యవహరించాయి.
  • WFI 2017 Theme :Transforming the food economy
12. ప్రతిష్టాత్మక జ్ఞాన్‌పీఠ్ పురస్కారం - 2017ను ఎవరికి ప్రకటించారు ? Current Affairs 1) కృష్ణ సోబతీ 2) జుంపా లహరీ3) చేతన్ భగత్ 4) అనితా దేశాయ్ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: 53వ జ్ఞాన్‌పీఠ్ పురస్కారానికి ప్రముఖ హిందీ సాహితీవేత్త కృష్ణ సోబతీ ఎంపికయ్యారు. సాహిత్య రంగంలో అందించిన సేవలకుగాను ఆమెకు ఈ పురస్కారం ప్రకటించారు. సోబతీ ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న గుజరాత్‌లో జన్మించారు. ఆమె రాసిన దార్ సే బిఛుడీ, మిత్రో మర్జానీ, జిందగీనామా తదితర రచనలు ప్రఖ్యాతి గాంచాయి. కృష్ణ సోబతీ ఈ అవార్డు గెలుచుకున్న 8వ మహిళ. 
  • సాహిత్య రంగంలో అత్యున్నత పురస్కారమైన జ్ఞాన్‌పీఠ్‌ను 1961లో స్థాపించారు. 2016లో ఈ పురస్కారాన్ని బెంగాలీ రచయిత శంకాఘోష్‌కు ప్రకటించారు.
13. వరల్డ్ యూత్ ఫోరమ్ - 2017 ఎక్కడ జరిగింది ? 1) భారత్2) ఇండోనేషియా3) ఈజిప్ట్ 4) యూఏఈ 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: ఈజిప్టులోని షరమ్ ఎల్ షేక్ నగరంలో వరల్డ్ యూత్ ఫోరమ్ - 2017 జరిగింది. వ్యాపారం, ఆవిష్కరణ, భావి నాయకుల తయారీలో సవాళ్లు, లింగ సమానత్వం, మహళా సాధికారత అంశాల్లో యువత పాత్రపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చలు జరిపారు.
14. భారత ప్రభుత్వం ప్రపంచంలోనే ఎతైన రోడ్డు మార్గాన్ని ఏ ప్రాంతంలో నిర్మించింది ? 1) లడఖ్ 2) అరకు3) షిల్లాంగ్4) గుల్మార్గ్ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: జమ్ముకశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలో 19,300 అడుగుల ఎత్తులో భారత ప్రభుత్వం రోడ్డు మార్గాన్ని నిర్మించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎతైనది. ప్రాజెక్టు హిమాంక్‌లో భాగంగా బోర్డర్ రోడ్‌‌స ఆర్గనైజేషన్(BRO) ఈ రోడ్డు మార్గాన్ని పూర్తి చేసింది. లేహ్‌కు 230 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిసుమ్లే, దెమ్‌చోక్ గ్రామాలను కలుపుతూ నిర్మించిన ఈ రహదారి పొడవు 86 కిలోమీటర్లు.
15. సాంస్కృతికవారసత్వ పరిరక్షణ కార్యక్రమం కింద యునెస్కో నుంచి ఆసియా-పసిఫిక్ అవార్డు ఆఫ్ మెరిట్ పొందిన తమిళనాడులోని దేవాలయం ఏది ? 1) మధుర మీనాక్షి దేవాలయం 2) రామేశ్వరం రామనాథస్వామి దేవాలయం 3) తంజావూరు బ్రిహదీశ్వర దేవాలయం 4) శ్రీరంగం రంగనాథస్వామి దేవాలయం 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: శ్రీరంగం రంగనాథస్వామి దేవాలయానికి మెరిట్ విభాగంలో యునెస్కో ఈ అవార్డుని ప్రకటించింది. ఆలయ నిర్మాణం పునరుద్ధరణ, వాననీటి సంరక్షణ, మురుగు నీటి వ్యవస్థల అభివృద్ధికి చేపట్టిన చర్యలకు గాను ఈ దేవాలయానికి యునెస్కో ఈ సాంస్కృతిక వారసత్వ అవార్డుని ప్రకటించింది.
16. మహిళల ఆసియా హాకీ కప్ - 2017 టైటిల్ విజేత ఎవరు ? 1) చైనా2) భారత్ 3) మలేషియా4) పాకిస్తాన్ 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: జపాన్‌లో జరిగిన మహిళల ఆసియా హాకీ కప్ ఫైనల్లో చైనాను ఓడించి భారత్ మహిళల జట్టు విజేతగా నిలిచింది. తద్వారా రెండోసారి ఈ కప్‌ను కైవసం చేసుకుంది. మహిళల హాకీ జట్టు మొదటిసారి 2004లో ఆసియా కప్‌ను గెలుచుకుంది. 2017 అక్టోబర్‌లో పురుషుల హాకీ జట్టు ఆసియా హాకి కప్‌ను సొంతం చేసుకుంది.
17. చైనా సొంతంగా రూపొందించిన ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ పేరు ఏమిటి ? 1) బెయ్‌డూ 2) గగన్ 3) జీపీఎస్ 4) గ్లోనాస్ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: బెయ్‌డూ ప్రాజెక్టు మూడో దశలో భాగంగా చైనా ఇటీవల మార్చి - 3బీ రాకెట్ ద్వారా బెయ్‌డూ - 3M1, బెయ్‌డూ - 3M2 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. 2020 నాటికి ఈ వ్యవస్థ పూర్తిగా చైనాకు అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే అమెరికా(జీపీఎస్), రష్యా(గ్లోనాస్)కు సొంత నావిగేషన్ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి. భారత్ ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ (గగన్) పేరుతో సొంత నావిగేషన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది.
18. ఒడిశాలో ఏ రంగంలో అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రపంచ బ్యాంకుతో 119 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం కుదుర్చుకుంది ? 1) ఉన్నత విద్య 2) వ్యవసాయం3) పరిశ్రమలు 4) ప్రజా సేవలు 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: Odisha Higher Education Programme for Excellence and Equity(OHEPEE) ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో ఈ రుణ ఒప్పందం కుదుర్చుకుంది. ఉన్నత విద్య పరిపాలనా అభివృద్ధి, విద్యార్థులు ఉన్నత విద్యలో ఎన్నుకున్న విద్యా సంస్థల్లో ప్రవేశం పొందేలా చేయడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
19. డీఆర్‌డీఓ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసి ఇటీవల విజయవంతంగా పరీక్షించిన క్రూయిజ్ క్షిపణి నిర్భయ్ పరిధి ఎంత ?1) 0 - 1000 కిలోమీటర్లు 2) 1000 - 2000 కిలోమీటర్లు3) 2000 - 3000 కిలోమీటర్లు4) 3000 - 4000 కిలోమీటర్లు 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దేశంలో తయారైన అణ్యాయుధ సామర్థ్యం గల క్రూయిజ్ క్షిపణి నిర్భయ్‌ను భారత్ తొలిసారి విజయవంతంగా పరీక్షించింది. భూ ఉపరితలం నుంచి ప్రయోగించే ఈ సబ్ సోనిక్ క్షిపణి 300 కిలోల బరువు గల అణువార్ హెడ్లను మోసుకెళ్లగలదు.
20. భారత్‌లో ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య ఎంత ? 1) 152) 173) 194) 21 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: భారత్‌లో 21 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. వీటి సంఖ్యను తగ్గించి నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాన్ని పరిశీలిస్తోంది. విలీన ప్రతిపాదనలని పరిశీలించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.
21. ఇటీవల ఏ రాష్ట్రం హిందీ సత్యాగ్రహీలకు జీవితకాలం నెలకు పది వేల రూపాయల పింఛన్ ఇవ్వనున్నట్ల ప్రకటించింది ? 1) పంజాబ్ 2) హర్యానా3) అరుణాచల్ ప్రదేశ్ 4) ఉత్తరప్రదేశ్ 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: 1975లో దేశంలో అత్యయిక స్థితి సమయంలో హింధీ భాష ప్రచారం కోసం పంజాబ్ ఆర్య ప్రతినిధి సభ హిందీ సత్యాగ్రహ ఉద్యమాన్ని చేపట్టింది. ఈ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన రాష్ట్రానికి చెందిన హిందీ భాష ఉద్యమకారులకు జీవితకాలం నెలకు పది వేల రూపాయల పింఛన్ ఇవ్వనున్నట్లు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం వీరు 194 మంది వరకు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
22. కర్ణాటకలో తొలి మహిళా డీజీపీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ? 1) మీరా బోర్వన్కర్ 2) సంజుక్తా పరాషార్ 3) నీలమణి ఎన్ రాజు 4) అపరాజితా రాయ్ 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: ఆరే కే దుత్తా స్థానంలో 1983 ఐపీఎస్ బ్యాచ్ కర్ణాటక క్యాడర్‌కు చెందిన నీలమణి ఎన్ రాజు ఆ రాష్ట్ర డీజీ ఐజీపీగా ఇటీవల బాధ్యతలు చేపట్టారు. తద్వారా రాష్ట్ర పోలీసు శాఖలో అత్యున్నత పదవి చేపట్టిన మొదటి మహిళగా గుర్తింపు పొందిన ఆమె.. 2020 జనవరి వరకు ఈ పదవిలో ఉంటారు.
23. ద కొలిన్‌‌స డిక్షనరీ వర్డ్ ఆఫ్ ది ఇయర్ - 2017గా ఏ పదాన్ని ఎంపిక చేసింది ? 1) FAKE NEWS2) BREXIT3) UNICORN4) INSTA 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: The Collins Dictionary..Fake News అనే పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్ - 2017గా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగాల్లో తరచు వినిపించిన ఈ పదం తద్వారా ప్రాచుర్యంలోకి వచ్చింది. 2016లో బ్రెగ్జిట్ పదాన్ని వర్డ్ ఆఫ్ ద ఇయర్‌గా ప్రకటించారు.
24. భారత్‌లో అమెరికా రాయబారిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ? 1) రిచర్డ్ వర్మా 2) నిక్కీ హేలీ3) కెన్నెత్ జస్టర్ 4) నీల్ చటర్జీ 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: రిచర్డ్ వర్మ స్థానంలో కెన్నెత్ జస్టర్ ఇటీవల భారత్‌లో అమెరికా రాయబారిగా నియమితులయ్యారు. ఈయన ఇంతకముందు అంతర్జాతీయ ఆర్థిక వ్యవహారాల్లో అమెరికా అధ్యక్షుడికి డిప్యుటీ అసిస్టెంట్‌గా వ్యవహరించారు.
25. ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు ? 1) నవంబర్ 12) నవంబర్ 33) నవంబర్ 54) నవంబర్ 7 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: 2015 డిసెంబర్‌లో ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఏటా నవంబర్ 5న సునామీ అవగాహన దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించింది. సునామీ పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఈ ప్రకృతి విపత్తు సంభవించిన సమయంలో నష్టాన్ని తగ్గించాలన్నది ఈ దినోత్సవం నిర్వహించడం వెనక ముఖ్య ఉద్దేశం.
26. ప్రతిష్టాత్మక విష్ణుదాస్ భవే అవార్డు - 2017కు ఎవరు ఎంపికయ్యారు ? 1) మోహన్ జోషి 2) నాజర్ 3) నవాజుద్దీన్ సిద్ధిఖీ4) కై కాల సత్యనారాయణ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: ప్రముఖ సినీ, టెలివిజన్ నటుడు మోహన్ జోషి ఈ అవార్డుకి ఎంపికయ్యారు. ఆయన ప్రస్తుతం అఖిల భారత మరాఠీ నాట్య పరిషత్ చైర్మన్ గా ఉన్నారు. మరాఠీ థియేటర్‌ను స్థాపించిన విష్ణుదాస్ భవే పేరిట ఈ అవార్డుని ఏర్పాటు చేశారు. పురస్కారం కింద 25 వేల నగదు బహుమతి అందజేస్తారు.
27. కేంద్ర ప్రభుత్వం నుంచి ఉత్తమ సిటీ బస్ సర్వీస్ అవార్డుకి ఎంపికై న నగర పాలక సంస్థ ఏది ? 1) హైదరాబాద్ 2) చెన్నై3) బెంగళూరు4) సూరత్ 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: ప్రైవేటు వాహనాలు, ఆటోల్లో ప్రయాణిస్తున్న వారిలో 87 శాతం మందిని సిటీ బస్సుల వైపు ఆకర్షించినందుకుగాను సూరత్ నగర పాలక సంస్థ కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి ఉత్తమ సిటీ బస్ సర్వీస్ అవార్డుకి ఎంపికైంది. మెట్రో రైలు ప్రాజెక్టుని త్వరగా పూర్తి చేసినందుకుగాను కొచి బెస్ట్ అర్బన్ ట్రాన్‌‌సపోర్ట్ ఇనిషియేటివ్ అవార్డుకు ఎంపికైంది.
28. సంప్రితి(SAMPRITI) పేరుతో భారత్ - బంగ్లాదేశ్ సంయుక్తంగా చేపట్టే సైనిక విన్యాసాలను తొలిసారి ఏ సంవత్సరంలో నిర్వహించారు ? 1) 2011 2) 20133) 20154) 2017 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: భారత్ - బంగ్లాదేశ్ ఏడో ఎడిషన్ సంప్రితి సైనిక విన్యాసాలు మేఘలయాలోని ఉమ్రోయ్ కంటోన్మెంట్‌లో నవంబర్ 6 నుంచి నవంబర్ 11 వరకు జరిగాయి. భారత్ నుంచి 20 మంది సైనికులు, బంగ్లాదేశ్ నుంచి 14 మంది సైనికులు ఇందులో పాల్గొన్నారు. 2011లో తొలిసారి ఈ సైనిక విన్యాసాలను నిర్వహించారు.
29. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ? 1) అశోక్ లవస 2) హస్ముఖ్ అధియా3) సంజయ్ మిత్రా4) పీకే సిన్హా 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: అశోక్ లవస స్థానంలో హస్ముఖ్ అధియా ఆర్థిక శాఖ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఆయన ఇంతకముందు రెవెన్యు శాఖ కార్యదర్శిగా పనిచేశారు. హస్ముఖ్ 1981 ఐఏఎస్ బ్యాచ్ గుజరాత్ క్యాడర్‌కు చెందిన అధికారి.
30. అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్ ఎవరు ? 1) జెరోమ్ పావెల్ 2) జానెట్ యెలెన్3) బెన్ బెర్నాంకే 4) నీల్ చటర్జీ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్‌గా జెరోమ్ పావెల్ పేరుని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రస్తుతం ఫెడ్ చైర్మన్ జానెట్ యెలెన్ పదవీ కాలం 2018 ఫిబ్రవరితో ముగిసిన తర్వాత జెరోమ్ పావెల్ బాధ్యతలు చేపడతారు.
31. అంతర్జాతీయ వాతావరణ సదస్సు (COP 23) ఇటీవల ఎక్కడ జరిగింది ? 1) భారత్ 2) జర్మనీ3) ఫ్రాన్స్‌4) రష్యా 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: జర్మనీలోని బాన్‌లో అంతర్జాతీయ వాతావరణ సదస్సు (కాప్ 23) జరిగింది. వాతావరణ మార్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని భారత్ ఈ సమావేశాల్లో మరోసారి స్పష్టం చేసింది. 
  • కాప్ 23 భారత్ థీమ్ : Conserving now, preserving future
32. పేపర్ పరిశ్రమల 13వ అంతర్జాతీయ సమ్మేళనం ఇటీవల భారత్‌లోని ఏ నగరంలో జరిగింది ? 1) ముంబయి2) హైదరాబాద్3) న్యూఢిల్లీ4) విజయవాడ 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: ఈ సమ్మేళనాన్ని కేంద్ర సైన్స్‌ అండ్ టెక్నాలజీ, పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్దన్ ప్రారంభించారు. పూర్తి స్థాయిలో వ్యర్థాల రీసైకిల్ ద్వారా పేపర్ తయారీ, దేశ ఆర్థిక ప్రగతి, ఉద్యోగ కల్పనలో పేపర్ పరిశ్రమల పాత్ర వంటి అంశాలపై సమ్మేళనంలో చర్చించారు.
33. రాష్ట్రాలు, కేంద్రం మధ్య సమన్వయం కోసం ఏర్పాటు చేసిన అంతరాష్ట్ర మండలికి ఎవరు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు ? 1) రాష్ట్రపతి2) ప్రధానమంత్రి3) హోంమంత్రి4) రాజ్యసభ చైర్మన్ 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఏర్పాటైన అంతరాష్ట్ర మండలిని ఇటీవల పునర్ వ్యవస్థీకరించారు. ఇందులో ఆరుగురు కేంద్ర మంత్రులతో పాటు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. అంతరాష్ట్ర మండలిలో ఉన్న కేంద్ర మంత్రులు - రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, అరుణ్ జైట్లీ, నితిన్ గడ్కరీ, థావర్ చంద్ గెహ్లాట్, నిర్మలా సీతారామన్. మరో 8 మంది కేంద్ర మంత్రులు మండలిలో శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు.
34. ఇటీవల ఢిల్లీలో జరిగిన గ్రేట్ ఇండియా ఫుడ్ స్ట్రీట్ ఉత్సవంలో అక్షయపాత్ర అనే స్వచ్ఛంద సంస్థ తయారు చేసిన ఏ వంటకం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది ? 1) బిర్యానీ 2) మసాలా దోశ3) డోక్లా4) కిచిడీ 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: ఢిల్లీలో జరిగిన ఈ ఉత్సవంలో అక్షయ పాత్ర సంస్థ 918 కేజీలతో కిచిడీని తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. ప్రముఖ చెఫ్ సంజీవ్ కుమార్ నేతృత్వంలో 50 మంది బృందం ఈ కిచిడీని తయారు చేసింది.
35. ప్రపంచంలోనే అత్యంత ఎతైన రైలు వంతెనను భారత్‌లోని ఏ నదిపై నిర్మిస్తున్నారు ? 1) చినాబ్ 2) సట్లెజ్ 3) బ్రహ్మపుత్ర4) యుమన 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: కశ్మీర్ లోయలోగల చినాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ప్రపంచంలోనే అత్యంత ఎతైన రైలు వంతెన నిర్మాణ పనులను భారత్‌కు చెందిన కొంకణ్ రైల్వే ఇటీవల ప్రారంభించింది. ఉధమ్‌పూర్ - శ్రీనగర్ - బారాముల్లా రైల్ లింక్ ప్రాజెక్టులో భాగంగా ఈ రైల్వే వంతెనను నిర్మిస్తున్నారు.
36. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం ఏ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది ? 1) ఒడిశా 2) మహారాష్ట్ర3) ఆంధ్రప్రదేశ్ 4) కర్ణాటక 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: తెలంగాణ ప్రభుత్వం అంతరాష్ట్ర ప్రాజెక్టులపై మహారాష్ట్ర ప్రభుత్వంతో 2016 ఆగస్టులో ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టింది. ఇటీవల ఈ ఎత్తిపోతల పథకానికి అంతరాష్ట్ర అనుమతులు ఇస్తు కేంద్ర జల సంఘం ప్రకటన విడుదల చేసింది.
37. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ద్వారా వచ్చే 5 ఏళ్లలో ఎన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలన్నది లక్ష్యం ?1) రూ. 5 వేల కోట్లు 2) రూ. 15 వేల కోట్లు3) రూ. 20 వేల కోట్లు4) రూ. 30 వేల కోట్లు 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఫుడ్ ఇండియా - 2017 సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు విడుదల చేశారు. దీని ద్వారా వచ్చే 5 ఏళ్లలో 20 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు 25 వేల ఉద్యోగాల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ పాలసీ కాలపరిమితి ఐదేళ్లు.
38. దేశంలో అధిక బరువు సమస్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో తొలి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది ? 1) ఆంధ్రప్రదేశ్ 2) తెలంగాణ3) గోవా4) తమిళనాడు 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: దేశవ్యాప్తంగా 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల వయసున్న మహిళలు, పురుషుల్లో అధిక బరువు సమస్యలపై సర్వే నిర్వహించిన కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో ఈ వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం అధిక బరువు సమస్య ఎక్కువ ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో, తెలంగాణ రెండో స్థానంలో ఉన్నాయి.
39. వాస్తు శాస్త్రానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన గ్లిమ్ సెస్ ఆఫ్ వాస్తు అనే గ్రంథాన్ని రచించిన రచయిత ఎవరు ? 1) సోమేశ్ కే శర్మ 2) బీఎన్ రెడ్డి3) ఎక్కా యాదగిరి4) నందిని సిద్ధారెడ్డి 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: బీఎన్ రెడ్డిగా సుపరిచితులైన ప్రముఖ వాస్తు శిల్పి, రచయిత, మాజీ ఎంపీ బద్దం నర్సింహారెడ్డి ఇటీవల కన్నుమూశారు. ఆయన 1989, 1996, 1998లో కాంగ్రెస్ నుంచి మూడుసార్లు మిర్యాలగూడ ఎంపీగా గెలిచారు. ఆయన రాసిన పెళ్లి కాని పెళ్లి కథకు ఉత్తమ కథకుడిగా నంది పురస్కారం, రాజీవ్ గాంధీ పురస్కారం లభించాయి.
40. ఓడ రేవుల అభివృద్ధి, కొత్త ఓడ రేవుల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు పేరు ఏమిటి ? 1) సాగర్ మాల 2) భారత్ మాల3) జల్ సంచార్ 4) ఇండో ఓషన్ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: సాగర్‌మాల ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం 2015లో ప్రారంభించింది. ఈ పథకం కింద 2,302 కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ సహా ఎనిమిది రాష్ట్రాల్లో 47 ప్రాజెక్టులు చేపడుతున్నట్లు కేంద్రం ప్రకటించింది.
41. భారత రక్షణ శాఖ ఇటీవల విజయవంతంగా పరీక్షించిన తేలికపాటి గ్లెడ్ బాంబును అభివృద్ధి చేసిన సంస్థ ఏది ? 1) ఇమారత్ పరిశోధన కేంద్రం2) రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ3) వాయుసేన4) పై మూడు 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: తేలికపాటి గ్లెడ్ బాంబును ఈ మూడు సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ బాంబులను వాయుసేన విమానాల నుంచి జార విడుస్తారు. 70 కిలోమీటర్లకుపైగా దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదిస్తుంది.
42. జాతీయ అంధుల వన్డే క్రికెట్ టోర్నమెంట్- 2017ను ఏ జట్టు గెలుచుకుంది ? 1) గుజరాత్ 2) ఆంధ్రప్రదేశ్ 3) మహారాష్ట్ర4) కర్ణాటక 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: ముంబైలో జరిగిన టోర్నమెంట్ ఫైనల్లో గుజరాత్‌ను ఓడించి ఆంధ్రప్రదేశ్ జాతీయ అంధుల వన్డే క్రికెట్ టైటిల్‌ను గెలుచుకుంది. ప్రపంచ కప్‌ను గెలిచిన జట్టు సారథి అజయ్ రెడ్డి ఏపీ జట్టుకి కెప్టెన్‌గా ఉన్నాడు.
43. ఫోర్బ్స్ పత్రిక 2017 సంవత్సరానికి గాను ప్రకటించిన ప్రపంచ వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో చోటు సంపాదించిన భారతీయ మహిళలు ఎవరు ? 1) చందాకొచ్చర్ 2) రోష్ని నాడార్ మల్హోత్రా3) ప్రియాంకా చోప్రా4) పై ముగ్గురు 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: ఫోర్బ్స్ పత్రిక 2017 సంవత్సరానికిగాను ప్రకటించిన ప్రపంచ వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల జాబితాలో ఐదుగురు భారతీయ మహిళలు చోటు సంపాదించారు. ఐసీఐసీ బ్యాంక్ మేనేజింగ్ డెరైక్టర్ చందాకొచ్చర్, బాలీవుడ్ నటి ప్రియంకా చోప్రా, హెచ్‌సీఎల్ సీఈవో రోష్ని నాడార్ మల్హోత్రాతో పాటు బైయోకాన్ ఎండీ కిరణ్ మజుందర్ షా, హిందుస్తాన్ టైమ్స్ గ్రూప్ చైర్ పర్సన్ శోభన భర్తియా ఉన్నారు. 
  • ఈ జాబితాలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తొలిస్థానంలో, బ్రిటన్ ప్రధాని థెరెసా మే రెండో స్థానంలో, బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలు మిలిండా గేట్స్ మూడో స్థానంలో ఉన్నారు.
44. హిట్ రీఫ్రెష్ పుస్తక రచయిత ఎవరు ?1) సత్య నాదెళ్ల2) బిల్ గేట్స్ 3) సుందర్ పిచాయ్4) రఘురామ్ రాజన్ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల రాసిన హిట్ రీఫ్రెష్ పుస్తకాన్ని తెలుగు, హీందీ, తమిళ భాషల్లోకి అనువదించారు. హిందీ ఎడిషన్‌ను హార్పర్ కొలిన్స్.. తెలుగు, తమిళం ఎడిషన్లను వెస్ట్‌లాండ్ బుక్స్ పబ్లిష్ చేశాయి.
45. 2018 ఫిబ్రవరిలో భారత్‌లోని ఏ నగరంలో ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ జరగనుంది ? 1) చెన్నై2) బెంగళూరు3) పూణె4) ముంబై 
  • స‌మాధానం: 1
46. ఇంటర్ బ్రాండ్ ఇండియా తాజా నివేదిక ప్రకారం భారత్‌లో అత్యంత బ్రాండ్ విలువ కలిగిన సంస్థ ఏది ? 1) రిలయన్స్‌2) టాటా 3) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా4) మహీంద్రా 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: ఈ సంస్థ నివేదిక ప్రకారం టాటా బ్రాండ్ విలువ రూ.73,944 కోట్లు. రెండో స్థానంలో ఉన్న రిలయన్‌‌స బ్రాండ్ విలువ రూ.38,212 కోట్లు, మూడో స్థానంలో ఉన్న ఎయిర్ టెల్ బ్రాండ్ విలువ రూ. 36,927 కోట్లుగా ఉంది.
47. ఇటీవల ఏ దేశం అవినీతి ఆరోపణలతో 11 మంది రాజులు, నలుగురు మంత్రులు, 12 మందికిపైగా మాజీ మంత్రులను అరెస్టు చేసింది ? 1) సౌదీ అరేబియా2) నేపాల్ 3) మొనాకో 4) భూటాన్ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: సౌదీ అరేబియా రాజు మహమ్మద్ బిన్ సల్మాన్ అధ్యక్షతన కొత్తగా అవినీతి వ్యతిరేక కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అవినీతి ఆరోపణలపై విచారణ ప్రారంభించిన ఈ కమిషన్ పలువురు అత్యున్నత స్థాయి వ్యక్తులను సైతం అరెస్టు చేసింది.
48. భారత్‌లో జరిగిన పానసోనిక్ ఓపెన్ గోల్ఫ్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?1) అదితి అశోక్2) జీవ్ మిల్కా సింగ్ 3) శివ్ కపూర్ 4) అనిర్బన్ లహరి 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: భారత స్టార్ గోల్ఫర్ శివ కపూర్ ఢిల్లీలో జరిగిన పానసోనిక్ ఓపెన్ టోర్నీ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఈ ఏడాది శివకపూర్ కు ఇది రెండో ఆసియా టూర్ టైటిల్ కాగా భారత్‌లో మొదటిది.
49. విదేశాల్లో పనిచేసే భారతీయులకు ఏ సౌకర్యం కల్పించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది ? 1) ఈఎస్‌ఐ2) గృహ రుణం3) ఉచిత ప్రయాణ సౌకర్యం4) ప్రావిడెంట్ ఫండ్ 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: విదేశాల్లో పనిచేసే భారతీయులకు ప్రావిడెంట్ ఫండ్‌లో చేరే అవకాశాన్ని కల్పించనున్నట్ల కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ విభాగం వెల్లడించింది. దీని కోసం కేంద్రం 18 దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో చేరాలంటే ఆయా దేశాల్లో వారు పొందుతున్న సోషల్ సెక్యురిటీ పథకాన్ని వదులుకోవాల్సి ఉంటుంది.
50. న్యూ పెన్షన్ స్కీమ్(NPS)లో చేరేందుకు గరిష్ట వయోపరిమితిని కేంద్రం ఎంతకు పెంచింది ? 1) 60 ఏళ్లు2) 65 ఏళ్లు3) 68 ఏళ్లు4) 70 ఏళ్లు 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: న్యూ పెన్షన్ స్కీమ్‌లో చేరేందుకు60 ఏళ్లుగా ఉన్నగరిష్ట వయో పరిమితిని 65 ఏళ్లకు పెంచుతు పెన్షన్ ఫండ్ నియంత్రణ సంస్థ పీఎఫ్‌ఆర్‌డీఏ నిర్ణయం తీసుకుంది.

అన్ని పరీక్షల కోసం జికె బిట్స్ 2
1. కర్ణాటకలో నిర్వహించే సంప్రదాయ పశుక్రీడ పేరు ఏమిటి ? 1) జల్లికట్టు2) కంబాలా3) తబాలా4) సిరిమానోత్సవం 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: కర్ణాటకలో సంప్రదాయ పశు క్రీడ కంబాలాను నిషేధిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. దీనికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడంతో.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కంబాలా క్రీడ నిర్వహణ కోసం పెటా చట్టంలో మార్పులు చేస్తు ప్రత్యేక ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఈ ఆర్డినెన్స్‌ను నిలిపివేయాలంటూ కొందరు జంతు ప్రేమికులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. అయితే ఆర్డినెన్స్‌పై స్టే విధించేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు.. దాని చెల్లుబాటు అంశాన్ని మాత్రం పరిశీలిస్తామని ఇటీవల పేర్కొంది.
2. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో లైంగిక వేధింపులకు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్‌లైన్ వేదిక పేరు ఏమిటి ?1) SHe-Box2) Online Box 3) E-Women4) E-WCD 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: మహిళా ఉద్యోగులు పనిచేసే ప్రాంతాల్లో ఎదుర్కొనే లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసేందుకు షీ - బాక్స్ (సెక్సువల్ హరాస్‌మెంట్ ఎలక్టాన్రిక్ బాక్సు) అనే ఆన్‌లైన్ వేదికను కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసింది. 2017 జూలైలో మొదటిసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినుల కోసం ప్రారంభించిన ఈ వేదికను ఇటీవల ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగినులకు అందుబాటులోకి తెచ్చారు.
3. ఏ రంగానికి సంబంధించి ఇటీవల యునెస్కో చెన్నై నగరాన్ని క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో చేర్చింది ? 1) మీడియా 2) సినిమా3) సంగీతం4) సాహిత్యం 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: యునెస్కో ఇటీవల 44 దేశాల్లోని 64 నగరాలను కొత్తగా క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌లో చేర్చింది. దీంతో ఈ నెట్ వర్క్ జాబితా 72 దేశాలతో 180కి చేరింది. సంగీతం విభాగంలో చెన్నై నగరానికి ఇటీవల ఈ జాబితాలో చోటు దక్కింది. సిటీ ఆఫ్ మ్యూజిక్ విభాగంలో జైపూర్, సిటీ ఆఫ్ క్రాఫ్ట్ అండ్ ఫోల్క్ ఆర్ట్ విభాగంలో వారణాసి 2015 డిసెంబర్‌లో క్రియేటివ్ సిటీస్ నెట్ వర్క్‌లో చేరాయి. యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్‌వర్క్‌ను 2004లో ప్రారంభించారు.
4. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌ - 2017లో ఏ రాష్ట్రం తొలి స్థానంలో నిలిచింది ? 1) తెలంగాణ 2) హర్యానా3) ఒడిశా4) ఛత్తీస్ గఢ్ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: వ్యాపారానికి అనుకూలమైన సంస్కరణలు అమలు చేస్తున్న(business reforms action plan) రాష్ట్రాలకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌ను ఏటా ప్రకటిస్తున్నారు. 2017 సంవత్సరానికి గాను ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో తెలంగాణ 61.83 శాతం స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది. 54.03 శాతం స్కోరుతో హర్యానా రెండో స్థానంలో, 45.70 స్కోరుతో ఒడిశా మూడో స్థానంలో, 45.43 స్కోరుతో ఛత్తీస్‌గడ్ నాలుగో స్థానంలో నిలిచాయి.
5. 82వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న ప్లేయర్ ఎవరు ? 1) కిడాంబి శ్రీకాంత్ 2) హెచ్‌ఎస్ ప్రణయ్ 3) సాత్విక్ సాయిరాజ్ 4) సాయి ప్రణీత్ 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: 82వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో కిడాంబి శ్రీకాంత్‌ను ఓడించి హెచ్‌ఎస్ ప్రణయ్ టైటిల్ విజేతగా నిలిచాడు.
6. 82వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు ?1) పీవీ సింధు 2) రితుపూర్ణ దాస్ 3) సైనా నెహ్వాల్ 4) శ్రీ కృష్ణ ప్రియ 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: 82వ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధును ఓడించి సైనా నెహ్వాల్ టైటిల్‌ను గెలుచుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్‌ను సాత్విక్ సాయి రాజ్, అశ్విని పొన్నప్ప గెలుచుకున్నారు.
7. 2018 ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా ఎన్ని జిల్లాల్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు సేవలు అందుబాటులోకి రానున్నాయి ?1) 6502) 2503) 1004) 400 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: 2018 ఏప్రిల్ నాటికి దేశవ్యాప్తంగా 650 జిల్లాల్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు(IPPB) సేవలను ప్రారంభిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ బ్యాంకులను 1 లక్ష 55 వేల గ్రామీణ పోస్ట్ ఆఫీసులతో అనుసంధానం చేస్తారు.
8. కేంద్ర ప్రభుత్వం గోధుమల దిగుమతి సుంకాన్ని ఇటీవల ఎంతకు పెంచింది ? 1) 10 శాతం 2) 20 శాతం 3) 30 శాతం 4) 50 శాతం 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: గోధుమలపై ఉన్న 10 శాతం దిగుమతి సుంకాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (CBEC) ఇటీవల 20 శాతానికి పెంచింది. దేశీయంగా రైతులు పండించిన గోధుమ పంటకు మంచి ధరలు లభించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే బటానీల(peas) పై దిగుమతి సుంకాన్ని 50 శాతానికి పెంచింది.
9. ఆసియాన్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్- 2017లోపసిడి పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు ? Current Affairs1) కిమ్ హ్యాంగ్ మి 2) క్రిస్టీ మార్టిన్ 3) మేరీ కోమ్ 4) కవిత గోయట్ 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: ఆసియాన్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ లైట్ వెయిట్ కేటగిరీ ఫైనల్లో ఉత్తర కొరియాకు చెందిన కిమ్ హ్యాంగ్‌మిని ఓడించి భారత బాక్సర్ మేరీ కోమ్ విజేతగా నిలిచింది. మొత్తంగా ఆసియా మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆమెకిది 5వ స్వర్ణం.
10. పసిఫిక్, హిందూ మహాసముద్రాల్లో ఉండే ఆలివ్ రైడ్లీ తాబేళ్లు సంతానోత్పత్తి కోసం భారత్‌లోని ఏ రాష్ట్ర తీర ప్రాంతానికి అధికంగా వస్తాయి ? 1) ఆంధ్రప్రదేశ్ 2) గోవా 3) ఒడిశా 4) తమిళనాడు 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: ఆలివ్ రైడ్లీ తాబేళ్లు తమ సంతానోత్పత్తి కోసం ఒడిశా కేంద్రపారా జిల్లాలోని గహరిమాతా బీచ్‌కి అధిక సంఖ్యలో తరలివస్తాయి. జనవరి, ఫిబ్రవరిలో నెలల్లో అవి ఇక్కడ గుడ్లను పొదుగుతాయి. 2016-17లో 9.75 లక్షల ఆలివ్ రైడ్రీ తాబేళ్లు ఈ ప్రాంతానికి వచ్చాయి. ఈ తాబేళ్ల సంఖ్యరోజు రోజుకీ తగ్గిపోతున్నందున వీటిని IUCN ప్రమాదంలో ఉన్న జంతువుల జాబితాలో చేర్చింది. భారత్‌లో వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంఆలివ్ రైడ్లీ తాబేళ్ల సంరక్షణ చర్యలు చేపడుతున్నారు.
11. 19వ ఆర్గానిక్ వరల్డ్ కాంగ్రెస్ - 2017 ఎక్కడ జరిగింది ? 1) టర్కీ 2) చైనా 3) ఇండోనేషియా 4) భారత్ 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: న్యూఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో జరిగిన ఆర్గానిక్ వరల్డ్ కాంగ్రెస్ - 2017 సమావేశాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్ ప్రారంభించారు. ఈ సమావేశాలను మూడేళ్లకోసారి నిర్వహిస్తారు. 2014 సమావేశాలు టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరిగాయి. సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సమావేశాలను నిర్వహిస్తారు.
12. భారత్‌లో ప్రకృతి విపత్తుల సమయంలో సహాయక కార్యక్రమాల్లో ఉపయోగపడేందుకు డిజాస్టర్ మ్యాప్స్‌ను రూపొందించిన సంస్థ ఏది ? 1) ట్విటర్ 2) గూగుల్3) ఫేస్‌బుక్ 4) లింక్డిన్ 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: జాతీయ విపత్తు నిర్వహణ సంస్థతో కలిసి ఫేస్‌బుక్ తొలి డిజాస్టర్ రెస్పాన్స్‌ సమ్మిట్‌ను ఇటీవల నిర్వహించింది. ఈ సందర్భంగా భారత్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన డిజాస్టర్ మాప్స్‌ను విడుదల చేసింది.
13. నాస్కామ్ తొలి మహిళా ప్రెసిడెంట్‌గా ఇటీవల ఎవరు ఎంపికయ్యారు ? 1) చిత్రా రామకృష్ణ 2) చందా కొచ్చర్ 3) దేబ్ జానీ ఘోష్ 4) వనితా నారాయణన్ 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ (NASSCOM - National Association of sotware and services companies) ప్రెసిడెంట్‌గా దేబ్‌జానీ ఘోష్ ఎంపికయ్యారు. 2018 మార్చిలో ఆమె బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత అధ్యక్షుడు ఆర్ చంద్రశేఖర్ పదవీకాలం అప్పటితో ముగుస్తుంది. దేబ్‌జానీ ఘోష్ ఇంటెల్ దక్షిణాసియా విభాగం ఎండిగా పనిచేశారు.
14. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ముఖ్య విధులు ఏంటి ? 1) ప్రవేశ పరీక్షల నిర్వహణ2) బ్యాంకు పరీక్షల నిర్వహణ 3) స్కాలర్ షిప్ లబ్ధ్దిదారుల ఎంపిక4) ఉద్యోగ కల్పన 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: ఇటీవల కేంద్ర కేబినెట్ స్వయంప్రతిపత్తితో కూడిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇది ఉన్నత విద్యా సంస్థల కోసం ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుంది. ప్రారంభంలో సీబీఎస్‌ఈ నిర్వహిస్తున్న పరీక్షలని ఈ సంస్థ నిర్వహిస్తుంది. క్రమంగా మిగతా పరీక్షల నిర్వహణను చేపడుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
15. ప్రధానమంత్రి లడఖ్ పునరుత్పాతక ఇంధన కార్యక్రమంలో భాగంగా ఏ రాష్ట్రంలో తొలి జలవిద్యుత్ ప్రాజెక్టుని ప్రారంభించారు ?1) అరుణాచల్ ప్రదేశ్ 2) సిక్కిం3) ఉత్తరాఖండ్ 4) జమ్ము అండ్ కశ్మీర్ 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: ప్రధానమంత్రి లడఖ్ పునరుత్పాదక ఇంధన కార్యక్రమంలో భాగంగా జమ్ము కశ్మీర్ కార్గిల్ ప్రాంతంలోని బియారస్ డ్రాస్‌లో 1.5 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుని నిర్మించారు. కార్గిల్ పునరుత్పాదక ఇంధన అభివృద్ధి ఏజెన్సీ నిర్మించిన ఈ ప్రాజెక్టుని ఇటీవల ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ కోసం డీజిల్ వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుని చేపట్టారు.
16. దేశవ్యాప్తంగా ప్రతి పౌరుడికి సురక్షితమైన మంచి నీరు అందించే లక్ష్యంతో చేపట్టిన జాతీయ గ్రామీణ తాగునీటి సరఫరా కార్యక్రమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత నిష్పత్తిలో నిధులు వెచ్చిస్తాయి ?1) 70 : 30 2) 50 : 503) 60 : 40 4) 30 : 70 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: 2009లో ప్రారంభించిన జాతీయ గ్రామీణ తాగునీటి కార్యక్రమాన్ని(NRDWP) 2020 వరకు కొనసాగించాలని ఇటీవల కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ కార్యక్రమం కోసం రూ.23,050 కోట్లు మంజూరు చేసింది. అలాగే కార్యక్రమాన్ని పునర్ వ్యవస్థీకరించడం ద్వారా పైప్లైన్లతో అన్ని గ్రామాలకు నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. కార్యక్రమానికి అయ్యే నిధుల్లో చెరి సగం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి.
17. ఇటీవల ఏ రాష్ట్రం ఉర్దూని రెండో అధికారిక భాషగా గుర్తించింది ? 1) తెలంగాణ 2) ఆంధ్రప్రదేశ్ 3) కర్ణాటక4) మహారాష్ట్ర 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: తెలంగాణలో రెండో అధికారిక భాషగా ఉర్దూని గుర్తించేందుకు వీలుగా తెలంగాణ భాషల చట్ట సవరణకు రాష్ట్ర శాసనసభ ఆమోముద్ర వేసింది. వాస్తవానికి 1966లోనే ఉర్దూని రెండో భాషగా ప్రకటించినా అప్పట్లో అది జిల్లా యూనిట్‌గా అమలైంది. ఇప్పుడు చట్ట సవరణతో రాష్ట్ర యూనిట్ గా ఉర్దూ రెండో అధికారిక భాషగా అమలు కానుంది.
18. దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్రం హెపటైటిస్ - సీ వ్యాధితో బాధపడుతున్న వారికి ఉచితంగా ఓరల్ మెడిసన్ అందిస్తుంది ? 1) పంజాబ్2) పశ్చిమ బెంగాల్ 3) హర్యానా4) మధ్యప్రదేశ్ 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: హెపటైటిస్ - సీతో బాధపడుతున్న వారికి ఉచితంగా ఓరల్ మెడిసన్ అందిస్తున్న దేశంలోని తొలి రాష్ట్రంగా హర్యానా నిలిచింది. నెలకు 28 వేల నుంచి 30 వేల రూపాయల విలువ గల మందులను ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా ఉచితంగా అందిస్తుంది.
19. IBSF వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ - 2017ను గెలుచుకున్న క్రీడాకారుడు ఎవరు ?1) మైక్ రస్సెల్ 2) పంకజ్అద్వాని 3) గీత్ సేథి4) రుపేష్ షా 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: ఐబీఎఫ్ వరల్డ్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్ ఖతార్‌లోని దోహలో జరిగింది. ఈ టోర్నీ ఫైనల్లో భారత బిలియర్డ్స్ ప్లేయర్ పంకజ్ అద్వాని.. ఇంగ్లండ్‌కు చెందిన మైక్ రస్సెల్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకున్నాడు. పంకజ్ కు ఇది 17వ ప్రపంచ టైటిల్. దీంతో ఏ క్రీడలోనైనా భారత్ నుంచి అత్యధిక ప్రపంచ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుడిగా పంకజ్ అద్వాని నిలిచాడు.
20.ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్(APEC) సమావేశాలు ఇటీవల ఎక్కడ జరిగారుు ? 1) భారత్2) చైనా3) సింగపూర్ 4) వియత్నాం 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: వియత్నాంలోని డా నాంగ్‌లో ఆసియా - పసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్ సమావేశాలు జరిగాయి. ఈ సమ్మిట్‌ను వియత్నాం నిర్వహించడం ఇది రెండోసారి. 2018 సమావేశాలు పాపువా న్యూ గినియాలో జరుగుతాయి. 
  • APEC 1989లో సింగపూర్ ప్రధాన కార్యాలయంగా ఏర్పడింది. ఇందులో 21 దేశాలకు సభ్యత్వం ఉంది. 2011 నుంచి ఈ కూటమిలో పరిశీలక దేశంగా ఉన్న భారత్.. సభ్యత్వం కోసం దరఖాస్తు చేసింది.
21. యునెస్కో డెరైక్టర్ జనరల్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ? 1) ఇరినా బొకోవా 2) ఆడ్రే అజౌలే 3) సౌమ్యా స్వామినాథన్ 4) నిక్కీ హేలీ 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: ఫ్రాన్స్‌ సాంస్కృతిక శాఖ మాజీ మంత్రి ఆడ్రే అజౌలే యునెస్కో (UNESCO - United Nations Educational, Science and Cultural Organisation) 11వ డెరైక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. ఇరినా బొకోవా స్థానంలో ఆమె బాధ్యతలు చేపడతారు. ఈ సంస్థ కేంద్ర కార్యాలయం ఫ్రాన్స్‌లోని పారిస్‌లో ఉంది. 1945 నవంబర్ 16న యునెస్కో ఏర్పాటైంది.
22. ఇటీవల ఏ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ పేరిట వరి పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ? 1) ఫిలిప్పీన్స్‌ 2) ఇజ్రాయెల్ 3) చైనా 4) జపాన్ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలో ఉన్న ఇంటర్నేషనల్ రైస్ రీసర్చ్ ఇన్సిస్టిట్యూట్(IRI)లో Shri Narendra Modi Resilient Rice Field Laboratory ని ఏర్పాటు చేశారు. ఆసియాన్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు మనీలా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ పరిశోధక కేంద్రాన్ని సందర్శించి ప్రారంభించారు. ఇరిని 1960లో ప్రారంభించారు. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 17 ప్రాంతీయ కేంద్రాలు ఉన్నాయి.
23. 31వ ఆసియాన్ సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది ? 1) మనీలా2) వియత్నాం3) బ్యాంకాక్ 4) జకార్తా 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: 31వ ఆసియాన్ సదస్సు నవంబర్ 13 నుంచి 14 వరకు ఫిలిప్పీన్‌‌స రాజధాని మనీలాలో జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ఇండో - పసిఫిక్ ప్రాంతంలో నిబంధనల ఆధారిత ప్రాంతీయ భద్రతా విధానం ఎంతో అవసరమని చెప్పారు. ఆసియాన్‌లో థాయ్‌లాండ్, వియత్నాం, ఇండోనేషియా, మలేసియా, ఫిలిప్పీన్స్‌, సింగపూర్, మయన్మార్, కంబోడియా, లావోస్, బ్రూనైలు సభ్య దేశాలుగా ఉన్నాయి. భారత్, అమెరికా, చైనా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు చర్చల్లో భాగస్వాములుగా ఉన్నాయి. 
  • మనీలా వేదికగా ఇటీవల 12వ తూర్పు ఆసియా సదస్సు, 15వ ఆసియాన్ - భారత్ సదస్సులు కూడా జరిగాయి.
24. దేశంలో న్యాయ సేవల దినోత్సవాన్ని (legal services day) ఎప్పుడు నిర్వహిస్తారు ? 1) నవంబర్ 7 2) నవంబర్ 113) నవంబర్ 94) నవంబర్ 13 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: దేశంలో న్యాయ సేవల దినోత్సవాన్ని సుప్రీంకోర్టు 1995లో ప్రారంభించింది. ఏటా నవంబర్ 9న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా. ఆయన 45వ ప్రధాన న్యాయమూర్తి.
25. ఏ బ్యాంకింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల తిరస్కరించింది ?1) అభివృద్ధి బ్యాంకింగ్ 2) స్మాల్ ఫైనాన్స్‌ బ్యాంకింగ్ 3) ఇస్లామిక్ బ్యాంకింగ్ 4) పేమెంట్స్ బ్యాంకింగ్ 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: భారత్‌లో ఇస్లామిక్ బ్యాంకింగ్‌ను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల తిరస్కరించింది. షరియా నిబంధనలకు అనుగుణంగా పనిచేసే ఇస్లామిక్ బ్యాంకింగ్‌లో రుణాలపై వడ్డీ తీసుకోవడం నిషిద్ధం. ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అధ్యక్షతన ఆర్థిక సంస్కరణల కమిటీ దేశంలో ఇస్లామిక్ బ్యాంకింగ్‌ను ప్రవేశపెట్టాలంటూ 2008లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది.
26. దేశంలో తొలి గిరిజన ఎంట్రెప్రెన్యుర్‌షిప్ సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది ? 1) అరకు 2) దంతెవాడ3) అసిఫాబాద్ 4) ములుగు 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: ఛత్తీస్‌గఢ్ బస్తర్ ప్రాంతంలోని దంతెవాడలో దేశంలో తొలి గిరిజన ఎంట్రెప్రెన్యుర్‌షిప్ సదస్సు జరిగింది. నీతి ఆయోగ్, అమెరికా ప్రభుత్వం సంయుక్తంగా ఈ సదస్సుని నిర్వహించాయి. హైదరాబాద్ వేదికగా జరిగిన 8వ గ్లోబల్ ఎంట్రెప్రెన్యుర్‌షిప్ సదస్సులో భాగంగా ఈ సమ్మిట్‌ను నిర్వహించారు.
27. దేశ రాజధాని న్యూఢిల్లీలో 2018 ఏప్రిల్ 1 నుంచి ప్రవేశపెట్టనున్న వాహన ఇంధనం ఏది ? 1) బీఎస్ - 32) బీఎస్ - 43) బీఎస్ - 54) బీఎస్ - 6 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: న్యూఢిల్లీలో 2020 ఏప్రిల్ 1 నుంచి బీఎస్ - 6 వాహన ఇంధనాన్ని ప్రవేశపెట్టాలని గతంలో కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ నిర్ణయించింది. అరుుతే.. ఇటీవల ఢిల్లీలో వాయు కాలుష్యం విపరీతంగా పెరగడంతో.. ఈ ఇంధనాన్ని 2018 ఏప్రిల్ 1 నుంచే అందుబాటులోకి తీసుకురావాలని కేంద్రం నిర్ణయించింది. బీఎస్ - 4 ఇంధనలో సల్ఫర్ పరిమాణం 50 పార్‌‌ట్స పర్ మిలియన్‌గా ఉంటే.. బీఎస్ - 6 ఇంధనంలో ఇది 10 పీపీఎమ్‌గా ఉంటుంది.
28. పర్యావరణ హిత కార్యక్రమంలో భాగంగా భారతీయ రైల్వే ఏ సంస్థతో కలిసి బయో టైలెట్స్‌ను రూపొందించింది ?1) డీఆర్‌డీవో 2) బీహెచ్‌ఈఎల్3) ఇస్రో4) హెచ్‌ఏఎల్ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: భారతీయ రైల్వే, డీఆర్‌డీవోతో కలిసి పర్యావరణ హిత బయో టైయోలెట్స్‌ను రూపొందించింది. రైల్వే శాఖ 2018 డిసెంబర్ నాటికి అన్ని రైళ్లలో ఈ టైలెట్స్‌ను అమర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది.
29. పూర్తి విద్యుత్ శక్తి ఆధారంగా నడిచే ప్రపంచంలోనే తొలి సరకు రవాణా నౌకను రూపొందించిన దేశం ఏది ? 1) భారత్ 2) చైనా3) జపాన్ 4) రష్యా 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: చైనాలోని గుంజౌ షిప్‌యార్డ్ ఇంటర్నేషనల్ కంపెనీ ఈ నౌకను రూపొందించింది. 70.5 మీటర్ల పొడవైన నౌకలో 26 టన్నుల లిథియమ్ బేటరీలను అమర్చారు. రెండు గంటల చార్జింగ్‌తో ఈ నౌక 80 కిలోమీటర్లు ప్రయాణించగలదు. విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గుని రవాణా చేసేందుకు ఈ నౌకను వినియోగిస్తారు.
30. దేశంలో తొలి భారీ తీర ప్రాంత ఆర్థిక జోన్(Coastal economic zone)ను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది ? 1) ఆంధ్రప్రదేశ్ 2) మహారాష్ట్ర3) తమిళనాడు4) ఒడిశా 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: మహారాష్ట్రలోని జవహార్‌లాల్ నెహ్రూ పోర్ట్(JNPT) వద్ద కోస్టల్ ఎకనామిక్ జోన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఆటోమొబైల్, టెలికం, ఐటీ రంగాలకు చెందిన 45 కంపెనీలు ఇక్కడ తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయి. సాగర్‌మాల ప్రాజెక్టులో భాగంగా దేశవ్యాప్తంగా 14 కోస్టల్ ఎకనామిక్ జోన్‌లను ఏర్పాటు చేయాలని 2016లో కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
31. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎవరి అధ్యక్షతన రెండవ జాతీయ జ్యూడిషియల్ పే కమిషన్‌ను ఏర్పాటు చేసింది ? 1) జస్టిస్ పి. వెంకట రామారెడ్డి 2) జస్టిస్ ఎన్. వి. రమణ 3) జస్టిస్ జగదీశ్ సింగ్ ఖేహర్ 4) జస్టిస్ దీపక్ మిశ్రా 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: దిగువ కోర్టుల్లో విధులు నిర్వహిస్తున్న జడ్జీల వేతనాల పెంపును సిఫార్సు చేసేందుకు.. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వెంకటరామారెడ్డి అధ్యక్షతన రెండవ జాతీయ జ్యూడిషయల్ పే కమిషన్(SNJPC)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేరళ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఆర్. బసంత్ కమిషన్‌లో సభ్యులుగా ఉంటారు. ఈ కమిషన్ 18 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సులని అందజేస్తుంది.
32. జాతీయ కాలుష్య నియంత్రణ మండలి దేశంలోని ఏ నగరంలో ఇటీవల అత్యవసర పరిస్థితిని ప్రకటించింది ? 1) న్యూఢిల్లీ 2) బెంగళూరు3) కోల్‌కతా4) చెన్నై 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: ఢిల్లీని కాలుష్యంతో కూడిన పొగ మంచు కప్పేయడంతో జాతీయ కాలుష్య నియంత్రణ మండలి నవంబర్ 8న అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఢిల్లీ పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హరియాణాల్లో రైతులు వరి పంటను కోసిన తర్వాత రెల్లు గడ్డిని, వరి మొదళ్లను పాలాల్లో తగలబెడుతున్నారు. దీంతో వెలువడే పొగ ఢిల్లీ మీదుగా వ్యాపిస్తుంది.
33. కేంద్ర ప్రభుత్వంరూ. 25 వేల కోట్లతో ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది ? 1) విశాఖపట్నం 2) వారణాసి 3) రాయ్ పూర్ 4) ద్వారకా 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: ఎగ్జిబిషన్ మార్కెట్లో షాంఘై, హాంకాంగ్, సింగపూర్‌తో పోటీ పడేందుకు దేశ రాజధాని న్యూఢిల్లీ శివారు ప్రాంతం ద్వారకలో రూ. 25, 703 కోట్ల రూపాయలతో ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ కేంద్రం ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం, నాన్ - పీపీపీ పద్ధతిలో 2025 నాటికి దీని నిర్మాణాన్ని పూర్తి చేయనున్నారు.
34. జాతీయ హరిత ట్రిబ్యునల్ దేశంలోని ఏ దేవాలయంలోకి రోజుకి 50 వేల మందిని మాత్రమే అనుమతిస్తు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది ? 1) వైష్ణోదేవీ ఆలయం 2) బద్రీనాథ్ ఆలయం 3) స్వర్ణ దేవాలయం 4) కేదార్‌నాథ్ ఆలయం 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: కశ్మీర్‌లోని ప్రఖ్యాత వైష్ణోదేవీ ఆలయంలోకి రోజుకు 50 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు(ఎన్‌జీటీ) జారీ చేసింది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎన్‌జీటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్‌జీటీ చైర్మన్ జస్టిస్ స్వతంత్ర కుమార్.
35. ప్రపంచ మహిళల టెన్నిస్ చాంపియన్‌షిప్(ఫెడ్ కప్) - 2017ను ఏ జట్టు గెలుచుకుంది ? 1) అమెరికా2) జర్మనీ3) ఫ్రాన్స్‌ 4) బెలారస్ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: ఫెడ్‌కప్ ఫైనల్లో అమెరికా 3 - 2 తేడాతో బెలారస్‌ను ఓడించి టైటిల్ గెలుచుకుంది. అమెరికా జట్టులో యూఎస్ ఓపెన్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్‌, కోకో వాండెవె, షెల్బీ రోజర్స్, రిస్కీ సభ్యులుగా ఉన్నారు. గతంలో 2000 సంవత్సరంలో అమెరికా ఫెడ్‌కప్‌ను గెలుచుకుంది.
36. 37వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్ దేశంలోని ఏ నగరంలో జరిగింది ? 1) బెంగళూరు 2) న్యూఢిల్లీ3) హైదరాబాద్ 4) విశాఖపట్నం 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఏర్పాటు చేసిన 37వ ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నవంబర్ 14న ప్రారంభించారు. 14 రోజుల పాటు జరిగిన ఈ ఫెరుుర్‌ను ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ (ITPO) నిర్వహించింది.
37. బంధన్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ రైలు ఏ రెండు దేశాల మధ్య నడుస్తుంది ? 1) భారత్ - బంగ్లాదేశ్ 2) భారత్ - పాకిస్తాన్ 3) భారత్ - నేపాల్ 4) భారత్ - చైనా 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: బంధన్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ రైలు భారత్‌లోని కోల్‌కతా, బంగ్లాదేశ్‌లోని ఖుల్నా మధ్య నడుస్తుంది. వారానికోసారి నడిచే ఈ రైలుని ఇటీవల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా వీడియో కాన్ఫరెన్‌‌స ద్వారా ప్రారంభించారు.
38. ఇటీవల కన్నుమూసిన ఒగ్గు కథా పితామహుడు చుక్క సత్తయ్య ఏ రాష్ట్రానికి చెందినవారు ? 1) ఆంధ్రప్రదేశ్ 2) తెలంగాణ3) తమిళనాడు4) కర్ణాటక 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: ఒగ్గు కథా పితామహుడు, పల్లె సుద్దులకు జీవం పోసిన చుక్క సత్తయ్య ఇటీవల కన్నుమూశారు. తెలంగాణలోని జనగామ జిల్లా లింగాలఘణపురం మండలం మాణిక్యాపురంలో ఆయన జన్మించారు. సత్తయ్య 2004లో రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వంనుంచికళాసాగర్ అవార్డు పొందారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2015లో ఉత్తమ కళాకారుడి అవార్డు అందుకున్నారు.
39. తెలంగాణ డీజీపీగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ? 1) అనురాగ్ శర్మ2) తేజ్ దీప్ కౌర్ మీనన్ 3) మహేందర్ రెడ్డి4) రాజీవ్ త్రివేది 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: తెలంగాణ తొలి డీజీపీగా 2014 నుంచి సేవలందించిన అనురాగ్ శర్మ ఇటీవల పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో మహేందర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ఇంచార్జ్ డీజీపీగా నియమించింది. అలాగే... అనురాగ్ శర్మను రాష్ట్ర అంతర్గత భద్రతా సలహాదారుగా ప్రభుత్వం నియమించింది.
40. ఖాదీ ఇండియా జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్ - 2017ను ఎవరు గెలుచుకున్నారు ? 1) దెబాషిస్ దాస్ 2) అరవింద్ చిదంబరం 3) ఎస్ ఎల్ నారాయణన్ 4) లలిత్ బాబు 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్ మాస్టర్ ఎం.ఆర్.లలిత్ బాబు దేశవాళీ ప్రతిష్టాత్మక ఖాదీ ఇండియా జాతీయ ప్రీమియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచాడు. బిహార్‌లోని పట్నాలో జరిగిన ఈ టోర్నీలో లలిత్ బాబు 9.5 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచి టైటిల్‌ను గెలుచుకున్నాడు. 8.5 పాయింట్లతో అరవింద్ చిదంబరం రన్నరప్‌గా నిలిచాడు.
41. భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఇటీవల ఏ దేశంలో క్రికెట్ అకాడమీని ప్రారంభించాడు ? 1) భారత్ 2) యూఏఈ3) ఆస్ట్రేలియా 4) ఇంగ్లండ్‌ 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: యూనెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో ఎం.ఎస్.ధోని క్రికెట్ అకాడమీ(MSDCA) పేరుతో ధోని క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేశాడు. దుబాయ్‌కి చెందిన పసిఫిక్ స్పోర్‌‌ట్స క్లబ్, ఆర్కా స్పోర్‌‌ట్స క్లబ్‌తో కలిసి ధోని ఈ అకాడమీని నెలకొల్పాడు.
42. ఇటీవల జరిగిన బ్రెజిల్ గ్రాండ్ ప్రీ ఫార్ములా వన్ రేసు విజేత ఎవరు ? 1) సెబాస్టియన్ వెటెల్ 2) వాల్తెరి బొటాస్ 3) కిమీ రైకోనెన్ 4) లూయిస్ హామిల్టన్ 
  • స‌మాధానం: 1 
  • వివ‌ర‌ణ‌: బ్రెజిల్ గ్రాండ్ ప్రీ రేసులో ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ విజేతగా నిలిచాడు. రెండో స్థానంలో మెర్సిడీస్ డ్రైవర్ వాల్తెరీ బొటాస్ నిలిచాడు. ఈ విజయంతో డ్రైవర్స్ చాంపియన్ షిప్‌లో వెటెల్‌కు రెండో స్థానం ఖాయమైంది. మొదటి స్థానంలో లూయిస్ హామిల్టన్ ఉన్నాడు.
43. ఖైదీల ఆరోగ్యం మెరుగుపరచటంతో పాటు వారి శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఏ రాష్ట్రం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థతో అవాగహన ఒప్పందం కుదుర్చుకుంది ? 1) కర్ణాటక 2) మధ్యప్రదేశ్3) హర్యానా4) ఆంధ్రప్రదేశ్ 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: ఈ ఒప్పందం ప్రకారం హర్యానాలోని జైళ్లలోని ఖైదీల కోసం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ యోగా, ధ్యానం తదితర కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థను శ్రీ శ్రీ రవిశంకర్ ఏర్పాటు చేశారు.
44. మాంట్రియాల్‌లో జరిగిన దక్షిణ ఆసియాన్ చిత్రోత్సవం-2017లో ఉత్తమ షార్ట్ ఫిల్మ్ అవార్డు పొందిన భారతీయ షార్ట్ ఫిల్మ్ ఏది ?1) ఇల్యూషన్ 2) ద స్కూల్ బాగ్ 3) కై ట్.. ద మెసెంజర్ 4) చట్నీ 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: ద స్కూల్ బాగ్ చిత్ర దర్శకుడు ధీరజ్ జిందాల్. మాంట్రియాల్ నగరం కెనడాలో ఉంది.
45. శీతాకాల కాలుష్యాన్ని తగ్గించేందుకు ఏ నగరంలో ఐదు నెలల పాటు ఉక్కు కర్మాగారాలను మూసివేస్తున్నారు ? 1) ఢిల్లీ 2) ఇస్లామాబాద్ 3) బీజింగ్ 4) ఢాకా 
  • స‌మాధానం: 3 
  • వివ‌ర‌ణ‌: చైనాలోని బీజింగ్‌లో శీతాకాల కాలుష్యాన్ని తగ్గించేందుకు నగరంలోని స్టీల్ ప్లాంట్లను మూసివేయాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించింది. పీఎమ్ 2.5గా ఉన్న కాలుష్య పరిమాణాల్ని తగ్గించేందుకు ఈ చర్యలు చేపట్టింది.
46. ఇజ్రాయెల్ ప్రతిష్టాత్మక పురస్కారం జెనిసెస్ ప్రైజ్ - 2018కి ఎవరు ఎంపికయ్యారు ?1) కెయిరా నెట్లే2) చైర్లైజ్ థెరాన్3) ఎమ్మా స్టోన్ 4) నటాలియా పోర్ట్ మాన్ 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: నటి నటాలియా పోర్ట్ మాన్ 2018 జెనెసిస్ ప్రైజ్‌కు ఎంపికయ్యారు. అవార్డు కింద ఆమెకు 1 మిలియన్ డాలర్లు అందజేస్తారు.
47. ప్రముఖ సామాజిక మాధ్యమం ట్వీటర్ ఖాతాదారుల డిస్‌ప్లే నేమ్ పరిమితిని ఎన్ని అక్షరాలకు పెంచింది ? 1) 302) 503) 204) 40 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: 20 అక్షరాలుగా ఉన్న డిస్‌ప్లే నేమ్ పరిమితిని ట్వీటర్ ఇటీవల 50 అక్షరాలకు పెంచింది. పొడవైన పేర్లు కలిగిన వారు తమ పూర్తి పేరుని డిస్‌ప్లే నేమ్‌గా పెట్టుకునేందుకు వీలుగా ట్వీటర్ ఈ నిర్ణయం తీసుకుంది. ట్వీట్‌లో ఉండాల్సిన అక్షరాల పరిమితిని కూడా ట్వీటర్ ఇటీవల 140 నుంచి 280కి పెంచింది.
48. 2017 నవంబర్ 1 నుంచి అంతర్జాలం ద్వారా చేసే RTGS, NEFT లావాదేవీలకు ఎలాంటి చార్జీలు విధించబోమని ఏ బ్యాంకు ప్రకటించింది ? 1) YES Bank2) ICICI Bank3) Axis Bank4) HDFC Bank 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: ఆన్లైన్ లావాదేవీలపై విధించే చార్జీలను HDFC బ్యాంక్ ఇటీవల సవరించింది. సేవింగ్స్‌, సేలరీ ఖాతాదారులు నిర్వహించే ఆర్టీజీఎస్, నెఫ్ట్ లావాదేవీలకు నవంబర్ 1 నుంచి ఇకపై ఎలాంటి చార్జీలు వసూలు చేయబోమని ప్రకటించింది. దేశంలో డిజిటల్ ఎకనామీని ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
49. కింది వాటిలో ఏ సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డు సభ్య దేశంగా భారత్ ఇటీవల తిరిగి ఎన్నికై ంది ? 1) IFAO 2) WIPO3) UNIDO4) UNESCO 
  • స‌మాధానం: 4 
  • వివ‌ర‌ణ‌: ఇటీవల జరిగిన 39వ యునెస్కో సాధారణ సభలో భారత్‌కు సంస్థ ఎగ్జిక్యూటివ్ బోర్డులో తిరిగి స్థానం కల్పించారు. యునెస్కో కేంద్ర కార్యాలయం పారిస్‌లో ఉంది.
50. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్టాన్రిక్ హార్డ్‌వేర్ రంగానికి సంబంధించి ఇంటెల్, యూఎస్‌టీ గ్లోబల్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ? 1) రాజస్తాన్ 2) తెలంగాణ3) కేరళ4) ఆంధ్రప్రదేశ్ 
  • స‌మాధానం: 2 
  • వివ‌ర‌ణ‌: రాష్ట్రాన్ని ఎలక్టాన్రిక్ హార్డ్‌వేర్ తయారీ కేంద్రంగా మార్చేందుకు కేరళ ప్రభుత్వం ఇంటెల్, యూఎస్‌టీ గ్లోబల్ సంస్థతోఅవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం కేరళ ఎలక్టాన్రిక్స్ అండ్ హార్డ్‌వేర్ మిషన్‌ను ఏర్పాటు చేసింది.

అన్ని ప్రవేశ పరీక్షల కోసం జికె బిట్స్ 6

అన్ని ప్రవేశ పరీక్షల కోసం జికె బిట్స్ 6

1. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డెరైక్టర్ జనరల్ ఆఫ్ ప్రోగ్రామింగ్‌గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?
1) సౌమ్యా స్వామినాథన్
2) అక్కినేని అమల
3) డాక్టర్ అధానామ్ గెబ్రేసియస్
4) మేధా పాట్కర్ 

అన్ని పరీక్షల కోసం జికె బిట్స్ 2

1.5వ ఇండియా వాటర్ వీక్ - 2017 థీమ్ ఏంటి ?
1) Water and energy for inclusive growth
2) Water and india
3) water for tomorrow
4) indian lands and water 

అన్ని పరీక్షల కోసం జికె బిట్స్ 3

1. యూరోపియన్ యూనియన్ ఇటీవల ఏ దేశంపై ఆర్థిక ఆంక్షలు విధించింది ?
1) పాకిస్తాన్
2) సిరియా
3) ఉత్తర కొరియా
4) ఇరాక్ 

అన్ని పరీక్షల కోసం జికె బిట్స్ 4

1. అత్యవసర సమయాల్లో జాతీయ రహదారులను రన్‌వేలుగా వాడుకునేందుకు భారతీయ వాయుసేన ఇటీవల ‘‘టచ్ అండ్ గో’’ కసరత్తులను ఏ హైవేపై నిర్వహించింది ?
1) లక్నో-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ వే
2) హజ్రా-కోల్‌కతా హైవే
3) కటక్ - చెన్నై హైవే
4) హైదరాబాద్ - విజయవాడ హైవే