AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Wednesday 14 February 2018

ఆర్థిక వ్యవహారాలు ఎకానమీ 2012 సంవత్సరం మార్చి నుండి డిసెంబరు వరకు మొత్తం

ఆర్థిక వ్యవహారాలు ఎకానమీ 2012 సంవత్సరం మార్చి నుండి డిసెంబరు వరకు మొత్తం

ఆర్థిక వ్యవహారాలు
మార్చి 2012 ఎకానమీ
2011-12 ఆర్థిక సర్వే
2011-12 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మార్చి 15న పార్లమెంట్‌కు సమర్పించారు.
ముఖ్యాంశాలు: దేశ ఆర్థిక వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.9 శాతంగా అంచనా. 2012-13లో 7.6 శాతంగా, 2013-14లో 8.6 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.
తగ్గనున్న ద్రవ్యోల్బణం: 2012 మార్చి నాటికి 6.5-7 శాతంగా ఉంటుంది. 2011-12లో 250.42 మిలియన్ టన్ను లు దాటనున్న ఆహారధాన్యాల ఉత్పత్తి 
వ్యవసాయంలో వృద్ధి 2.5 శాతం 
2011-12లో పారిశ్రామికవృద్ధి 4-5 శాతం 
2011-12లో జీడీపీలో విత్తలోటు 4.6 శాతంగా అంచనా. 
2011-12లో 1,34,411 కోట్లుగా సబ్సిడీల వ్యయం. 
దీర్ఘకాలిక విదేశీ పెట్టుబడుల కోసం చర్యలు. 
వృద్ధి చెందనున్న విదేశీ మారక ద్రవ్య నిల్వలు. 
నాల్గో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించిన భారత్ అంతర్జాతీయంగా మరింత క్రియాశీలకంగా వ్యవహరించాల్సి ఉండటం.
2012-12 రైల్వే బడ్జెట్
 2012-13 సంవత్సరానికి రైల్వే బడ్జెట్‌ను కేంద్ర రైల్వే శాఖా మంత్రి దినేష్ త్రివేది మార్చి 14న లోక్‌సభలో ప్రవేశపెట్టారు.
ముఖ్యాంశాలు: 
మొత్తం రైల్వే ప్రణాళిక: రూ. 60,100 కోట్లు
2012-13లో స్థూల రైల్ ట్రాఫిక్‌ను 
రూ. 28,635 కోట్లు పెంచడం ద్వారా 
రూ. 1,32,552 కోట్లకు చేరుకోవాలని లక్ష్యం.
ప్రయాణీకుల చార్జీలు కి.మీ.కు 2 నుంచి 3 పైసల వరకు పెంపు
కొత్తగా 72 ఎక్స్‌ప్రెస్, 21 ప్యాసింజర్ రైళ్లు.
725 కి.మీ. కొత్త లైన్ల ఏర్పాటు, 700 కి.మీ. డబ్లింగ్.
2012-13లో లక్ష ఉద్యోగాల భర్తీ
స్టేషన్ల అభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు
స్వతంత్ర రైల్వే భద్రతా అథారిటీ ఏర్పాటు
నేషనల్ హైస్పీడ్ రైల్ అథారిటీ ఏర్పాటు
ప్రతి ఏటా పది మంది రైల్వే క్రీడాకారులకు ‘రైల్ ఖేల్ రత్న’ అవార్డు ప్రదానం
ప్రపంచంలో ఇండియన్ రైల్వేలు మూడో అతి పెద్ద రైల్ రోడ్ నెట్‌వర్‌‌కను కలిగి ఉన్నాయి. 64 వేల కి.మీ. విస్తరించిన ఈ నెట్‌వర్‌‌క ద్వారా 23 మిలియన్ల ప్రయాణీకులు, 2.65 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరుగుతోంది.

కేంద్ర బడ్జెట్ 2012 - 13
కేంద్ర బడ్జెట్ 2012-13ను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ మార్చి 16న పార్లమెంట్‌కు సమర్పించారు. ముఖర్జీ బడ్జెట్‌ను సమర్పించడం ఇది ఏడోసారి.
ముఖ్యాంశాలు:
మొత్తం బడ్జెట్ వ్యయం: రూ. 14,90,925 కోట్లు
ప్రణాళికా వ్యయం: రూ. 5,21,025 కోట్లు
ప్రణాళికేతర వ్యయం: రూ. 9,69,900 కోట్లు
2012-13లో పన్ను వసూళ్ల అంచనా: రూ. 7,71,071 కోట్లు
పన్నేతర రెవెన్యూ వసూళ్లు: రూ. 1,64,614
రుణేతర మూలధన వసూళ్లు: రూ. 41,650 కోట్లు
2012-13లో జీడీపీలో విత్తలోటు: రూ. 5.1 శాతం
(ఇది 2011-12లో 5.9 శాతం)
జీడీపీలో కేంద్ర ప్రభుత్వ రుణాలు: 45.5 శాతం
ఆదాయ పన్ను మినహాయింపు పరిమితి 2 లక్షల రూపాయలకు పెంపు
సర్వీస్ టాక్స్, ఎక్సైజ్ సుంకం 10 శాతం నుంచి 12 శాతానికి పెంపు
ప్రధాన కేటాయింపులు:
రక్షణ రంగం: రూ. 1,93,407 కోట్లు
జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్: రూ. 20,822 కోట్లు
విద్యా హక్కు అమలు కింద సర్వశిక్ష అభియాన్‌కు కేటాయింపు: రూ. 25,555 కోట్లు
ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన: రూ. 24,000 కోట్లు
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన: రూ. 9,217 కోట్లు
నేషనల్ హైవే అభివృద్ధి కార్యక్రమం: రూ. 25,360 కోట్లు

ఆర్థిక వ్యవహారాలు
జూలై 2012 ఎకానమీ
ఉపాధి, నిరుద్యోగ సర్వే-2012
భారత్‌లో నిరుద్యోగ సమస్యపై కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ ‘ఉపాధి, నిరుద్యోగం సర్వే-2012’ను విడుదల చే సింది. 2011-13లో దేశంలో నిరుద్యోగం రేటు 3.8 శా తంగా ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. పట్టణ నిరుద్యోగం 5 శాతం. కాగా, గ్రామీణ నిరుద్యోగం 3.4 శాతంగా ఉన్నట్లు తెలిపింది. పురుషుల్లో కంటే మహిళల్లోనే అధిక నిరుద్యోగం ఉందని పేర్కొన్నారు. మొత్తం 1.28 లక్షల కుటుంబాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నివేదికను రూపొందించినట్లు కార్మిక శాఖ వెల్లడించింది. 
నివేదికలోని ముఖ్యాంశాలు:
నిరక్షరాస్యుల్లో నిరుద్యోగం రేటు 1.2 శాతంగా ఉంది. గ్రాడ్యుయేట్లలో 9.4 శాతం, పోస్టు గ్రాడ్యుయేట్లలో 10 శాతం ఉంది. 
పట్టణ ప్రాంతాల్లోని గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం 8.2 శాతం, పీజీ చేసిన వారిలో 7.7 శాతంగా ఉంది. దేశంలో కార్మిక శక్తి భాగస్వామ్య రేటు (ఎల్‌ఎఫ్‌పీఆర్) 52.9 శాతం.
జాతీయ స్థాయిలో మహిళల్లో నిరుద్యోగ రేటు 6.9 శాతంగా అంచనా వేశారు. పురుషుల్లో ఇది 2.9 శాతంగా ఉంది. 
ఎస్సీ, ఇతర వెనుకబడిన తరగతుల్లో నిరుద్యోగం 3.2 శాతం, ఎస్టీల్లో 2.6 శాతం చొప్పున ఉంది. 
దేశంలో అత్యధికంగా 52.9శాతం మంది వ్యవసాయం, అటవీ, మత్స్య రంగంలోనే ఉపాధి పొంద గా.. సేవా రంగంలో 27.8 శాతం మంది, ఉత్పత్తి, నిర్మాణ రంగంలో 19.3 శాతం మంది ఉపాధి పొందుతున్నారు.

ఆర్థిక వ్యవహారాలు
ఆగష్టు 2012 ఎకానమీ
2012-13 లో 6.7 శాతం వృద్ధి 
2012-13లో స్థూల దేశీయోత్పత్తి వృద్ధిరేటు 6.7 శాతంగా ఉండగలదని సి. రంగరాజన్ నేతృత్వంలోని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి(పీఎంఈఏసీ) రూపొందించిన ఆర్థిక వ్యవస్థ అంచనాల నివేదిక అంచనా వేసింది. ఈ నివేదికను పీఎంఈఏసీ ఆగస్టు 17న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు సమర్పించింది. వ్యవసాయ వృద్ధిరేటు 0.5 శాతంగా (2011-12లో 2.8 శాతం), తయారీ రంగ వృద్ధి రేటు 4.5 శాతంగా (2011-12లో 2.5 శాతం), మైనింగ్ రంగంలో వృద్ధి 5.3 శాతంగా (2011-12లో 3.4 శాతం), సేవల రంగంలో వృద్ధి 8.9 శాతంగా(2011-12లో 3.4 శాతం) నమోదయ్యే అవకాశం ఉన్నట్లు నివేదిక పేర్కొంది. వాణిజ్య లోటు 18,110 కోట్ల డాలర్లుగా ఉండవచ్చని అంచనా వేసింది. దేశీయ పొదుపు రేటు 31.7 శాతంగా ఉంటుంద ని పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావం నుంచి మన ఆర్థిక వ్యవస్థ బయటపడి మళ్లీ పుంజుకోవాలంటే మౌలిక రంగంలో పెట్టుబడులను మరింత పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.

ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా రాజన్
కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా (సీఈఏ) రఘురాం జి.రాజన్ ఆగస్టు 11న నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రాజన్ గతంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు గౌరవ ఆర్థిక సలహాదారుగా, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్)లో ఆర్థిక వేత్తగా పని చేశారు.



ఆర్‌బీఐ -త్రైమాసిక పరపతి విధానం
త్రైమాసిక పరపతి విధానాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) జూలై 31న ప్రకటించింది. రెపో రేటు 8 శాతంగా, రివర్స్ రెపో రేటు 7 శాతం కొనసాగించింది. నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్)4.75లో కూడా మార్పు చేయలేదు. చట్టబద్ద ద్రవ్య నిష్పత్తి(ఎస్‌ఎల్‌ఆర్)ని మాత్రం 24 నుంచి 23 శాతానికి తగ్గించింది. బ్యాంకులు తమ వద్ద ఉన్న నిధుల్లో కొంత భాగాన్ని ప్రభుత్వ బాండ్లలో తప్పనిసరిగా పెట్టడాన్ని ఎస్‌ఎల్‌ఆర్ అంటారు. ఎస్‌ఎల్‌ఆర్ తగ్గించడం వల్ల ద్రవ్య సరఫరా పెరుగుతుంది. ప్రస్తుత తగ్గింపులో రూ. 68,000 కోట్లు అందుబాటులోకి రాగలవని అంచనా. 2012-13 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి అంచనాలను 6.5 శాతానికి తగ్గించింది. గతంలో 7.3 శాతం వృద్ధిని అంచనా వేసింది. మార్చినాటికి ద్రవ్యోల్బణం 7 శాతానికి పెరగవచ్చని అంచనా. గతంలో ఈ అంచనా 6.5 శాతం

ఆర్థిక వ్యవహారాలు
సెప్టెంబరు 2012 ఎకానమీ
0.25 శాతం సీఆర్‌ఆర్‌ను తగ్గించిన ఆర్‌బీఐ
రిజర్వుబ్యాంకు త్రైమాసిక మధ్యంతర ద్రవ్య, పరపతి సమీక్షను సెప్టెంబర్ 17న ప్రకటించింది. బ్యాంకులు తమ డిపాజిట్లలో రిజర్వు బ్యాంకు వద్ద ఉంచాల్సిన నగదు నిల్వ నిష్పత్తి(సిఆర్‌ఆర్)ని 0.25 శాతం తగ్గించింది. దీనివల్ల బ్యాంకుల దగ్గర రూ. 17,000 కోట్ల నిధులు అందుబాటులో ఉంటాయి. రెపో రేటును(స్వల్పకాలిక రుణాలపై బ్యాంకుల నుంచి రిజర్వు బ్యాంకు వసూలు చేసే వడ్డీ రేటు) యధాతధంగా 8 శాతంగానే కొనసాగించింది. రివర్స్ రెపోరేటు(బ్యాంకులు తన వద్ద ఉంచే డిపాజిట్లపై చెల్లించే రేటు)ను కూడా 7 శాతంగానే కొనసాగించింది. 

రీటైల్ రంగంలో ఎఫ్‌డీఐలు
మల్టీ బ్రాండ్ రిటైల్‌లో వ్యాపారంలో 51 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 14న అమోదం తెలిపింది. దీనివల్ల స్థానిక రీటైల్ నెట్‌వర్క్‌లో 51శాతం విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టవచ్చు. మల్టీ బ్రాండ్ రీటైల్ రంగంలో 51 శాతం ఎఫ్‌డీఐలకు అనుమతిస్తూ 2011 నవంబర్ 24న కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకించడంతో..ప్రభుత్వం ఈ అంశాన్ని నిలిపి వేసింది. దేశీయ విమానయాన రంగంలో విదేశీ సంస్థలు 49 శాతం పెట్టుబడులు, బ్రాడ్ కాస్టింగ్, కేబుల్ సర్వీసులు, మౌలిక సదుపాయాల్లో ఎఫ్‌డీఐల పరిమితిని 74 శాతానికి పెంచడం,  ప్రభుత్వ రంగ సంస్థలైన ఆయిల్ ఇండియా, హిందూస్థాన్ కాపర్, నాల్కో, ఎంఎంటీసీలలో వాటాల విక్రయాన్ని కూడా  ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది.

ఆర్థిక వ్యవహారాలు
అక్టోబరు 2012 ఎకానమీ
బీమా రంగంలోకి 49 శాతం ఎఫ్‌డీఐ
బీమా రంగంలో 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేంద్ర కేబినెట్ అక్టోబర్ 4న ఆమోదం తెలిపింది. దీంతో ప్రస్తుతమున్న 26 శాతం నుంచి 49 శాతానికి ఎఫ్‌డీఐలు పెరిగాయి. పింఛన్ రంగంలో కూడా 26 శాతం ఎఫ్‌డీఐలకు ఆమోదం తెలిపింది. అన్ని రంగాలను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా పరిధిలోకి తెచ్చే కాంపిటీషన్ చట్టం 2002 సవరణలకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వానికి సలహాలిచ్చేందుకు 20వ లా కమిషన్‌ను ఆమోదించింది. ఈ కమిషన్‌ను 2012 -15 కాలానికి ఏర్పాటు చేస్తారు.

No comments:

Post a Comment