AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Monday 1 January 2018

చరిత్రలో ఈ రోజు డిసెంబరు 30


*💠చరిత్రలో ఈ రోజు/డిసెంబరు 30💠*


*🎈సంఘటనలు🎈*


🍓1906 : భారత్లో తమ ప్రయోజనాలు కాపాడుకోవడానికి జాతీయస్థాయిలో కాంగ్రెస్ లాంటి పార్టీ అవసరమని భావించిన ముస్లిం ప్రముఖులు ఢాకాలో సమావేశమై ముస్లిం లీగ్ పార్టీని స్థాపించారు.


🍓1922 : రష్యన్ సోవియట్ ఫెడరేషన్, ట్రాన్స్కకేషియన్, ఉక్రేనియన్, బెలారసియన్ సోవియట్ రిపబ్లిక్లు నాలుగూ కలిసి ద యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్గా ఏర్పడ్డాయి.


🍓1968 : ఐక్యరాజ్య సమితి మొదటి ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ట్రిగ్వేలీ మరణించాడు.


🍓1985 : తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా విడిపోవడానికి గల కారణాలలో ముఖ్యమైనది

జీ.వో.610ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం జారీచేసింది.

🍓2006 : ఇరాక్ మాజీ అధ్యక్షుడు సద్దామ్ హుసేన్ ను ఉరితీసారు.


🍓2008 : హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా

ప్రేమ్ కుమార్ ధుమాల్ ప్రమాణస్వీకారం.

🍓2009 : జార్ఖండ్ ముఖ్యమంత్రిగా

శిబూసోరెన్ ప్రమాణస్వీకారం చేశాడు.

*🎈జననాలు🎈*


🎀1865 : ప్రసిద్ధ ఆంగ్ల రచయిత మరియు కవి

రుడ్యార్డ్ కిప్లింగ్ జననం. (మ.1936)

🎀1879 : రమణ మహర్షి, బోధనలలో ప్రధానమైనది "మౌనము" లేదా "మౌనముద్ర". వీరు చాలా తక్కువగా ప్రసంగించేవారు


🎀1887 : కొప్పరపు సోదర కవులు , కొప్పరపు వేంకటరమణ కవి, అవధానంలో ప్రసిద్ధిచెందిన జంట సోదర కవులు


🎀1898 : యలమంచిలి వెంకటప్పయ్య , స్వాతంత్ర్య సమర యోధుడు. కాకినాడలో

1920 లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభలలో బ్రాహ్మణులకు ప్రత్యేక భోజన శాల ఉండటానికి వీల్లేదని అందరూ కలిసే తినాలనీ తీర్మానం చేయించాడు,

🎀1935 : భారతదేశపు ప్రముఖ చదరంగం ఆటగాడు మాన్యువెల్ ఆరన్ జననం.


🎀1948 : భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఎడమచేతి బ్యాట్స్మెన్ సురీందర్ అమర్నాథ్ జననం.


🎀1968 : హాట్ మెయిల్ ఈమెయిల్ సర్వీసు యొక్క సహ-వ్యవస్థాపకుడు సబీర్ భాటియా జననం.


🎀1984 : అమెరికన్ బాస్కెట్బాల్ క్రీడాకారుడు

లెబ్రాన్ జేమ్స్ జననం.

*🎈మరణాలు🎈*


🍋1955 : వేమూరి గగ్గయ్య , తెలుగు రంగస్థల మరియు సినిమా నటుడు. (జ.1895)


🍋1971 : విక్రం సారాభాయ్ , ప్రముఖ శాస్త్రవేత్త.


🍋1973 : చిత్తూరు నాగయ్య , ప్రసిద్ధ

తెలుగు సినిమా నటుడు.

🍋1992 : వడ్డాది పాపయ్య , ప్రముఖ చిత్రకారుడు.


🍋2006 : పేకేటి శివరాం , తెలుగు సినిమా నటుడు. (జ.1918)



[12/30/2017, 08:47] ‪+91 95020 29120‬: *🔵టీఆర్టీ ఓపెన్‌ కోటా పది జిల్లాలకు కామన్‌*

🔷టీఆర్టీలో సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకుని పరీక్ష రాస్తే చాలు

🔷మిగతా జిల్లాలకు నాన్‌లోకల్‌ అభ్యర్థిగా వర్తింపు.. మెరిట్‌ ఆధారంగా చాన్స్‌

♦ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నోటిఫికేషన్‌ ప్రకారం మీ జిల్లాలో మీ సబ్జెక్టుకు సంబంధించిన పోస్టులు లేవా? అందుకని దరఖాస్తు చేయకుండా మిన్నకుండి పోయారా? అయితే సరికాదు. సొంత జిల్లాలో ఒక్క పోస్టు కూడా లేకపోయినా.. మీరు దరఖాస్తు చేయవచ్చు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఏ జిల్లాలోనైనా ఓపెన్‌ కోటాలో ఉద్యోగం సాధించవచ్చు. ఇందుకు అవకాశం కల్పిస్తూ ఓపెన్‌ కోటాలో టీఎ్‌సపీఎస్సీ మార్పులు చేసింది.

♦గతంలో జిల్లాలవారీగా ఓపెన్‌ కోటా ఉండగా.. ప్రస్తుతం 10 జిల్లాలకు కలిపి ఒకే ఓపెన్‌ కోటాను ఇవ్వనుంది. ఈ కోటాకు అన్ని జిల్లాల అభ్యర్థులూ అర్హులవుతారు. ఇతర జిల్లాలో నాన్‌లోకల్‌ అభ్యర్థిగా పోటీపడేందుకు ప్రత్యేకించి ఆ జిల్లాలో దరఖాస్తు చేయనవసరం లేదు. 

♦అన్ని జిల్లాల అభ్యర్థులూ అభ్యర్థి సొంత జిల్లాలోనే దరఖాస్తు చేయాలి. జిల్లా స్థాయిలో మొత్తం పోస్టుల్లో 80శాతం లోకల్‌ అభ్యర్థులకు, 20శాతం ఓపెన్‌ కోటాకు కేటాయిస్తారు. ఈ మేరకు గతంలో సొంత జిల్లాలో పోస్టులు లేకపోయినా, తక్కువగా ఉన్నా.. అభ్యర్థులు ఎక్కువ పోస్టులు ఉన్న జిల్లాలో నాన్‌లోకల్‌ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకునేవారు. దీంతో ఆ అభ్యర్థి ఆ జిల్లాలో మాత్రమే పరీక్ష రాసేవారు. అనంతరం మెరిట్‌లో ఉంటే ఆ జిల్లాలోనే ఉద్యోగం వచ్చేది.

♦ అయితే ప్రస్తుతం అభ్యర్థులు పోస్టులు ఉన్నా, లేకపోయినా.. వారి సొంత జిల్లాలోనే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలోనూ నాన్‌లోకల్‌ ఆప్షన్‌ కనిపించదు. అనంతరం సాధించిన మార్కుల ఆధారంగా నాన్‌లోకల్‌ అభ్యర్థిగా ఓపెన్‌ కోటాలో ఇతర అన్ని జిల్లాలనూ ప్రాధాన్య క్రమంలో ఎంచుకునే అవకాశాన్ని అభ్యర్థికి కల్పిస్తారు.


♦మెరిట్‌ను బట్టి ఏ జిల్లాలో వస్తే ఆ జిల్లాలో ఉద్యోగమిస్తారు. అయితే ఈ నిబంధన మార్పుపై సమాచార లోపం నెలకొనడంతో కొందరు అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు.

♦వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ అభ్యర్థికి ఇదే సమస్య ఎదురైంది. ఆ జిల్లాలో ఎస్‌జీటీ పోస్టులు లేకపోవడంతో పోస్టులు ఎక్కువగా ఉన్న మరో జిల్లాలో నాన్‌లోకల్‌ అభ్యర్థిగా దరఖాస్తు చేయాలని భావించాడు. కానీ, దరఖాస్తు సమయంలో నాన్‌లోకల్‌ ఆప్షన్‌ కనిపించలేదు. దీంతో అయోమయానికి గురై.. ఇప్పటివరకు టీఆర్టీకి దరఖాస్తు చేయలేదు. ఇలా వందల మంది ఉన్నారు. 

♦దరఖాస్తులకు 30వ తేదీతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో వారు నష్టపోయే అవకాశం ఉన్నందున అభ్యర్థుల్లో అవగాహన కల్పించడంతోపాటు దరఖాస్తు సమయాన్ని పొడిగించాలనే డిమాండ్లు వస్తున్నాయి.🔵🌐☸☸☸🕉🕉⛔🌐☸🕉⛔
[12/30/2017, 08:47] ‪+91 95020 29120‬: *🌐రోడ్డున పడ్డ హిందీ పండిట్‌లు!*

 🔷కొత్తగా తెరపైకి జీవో 25..

🔷హిందీ డిగ్రీలు చెల్లవంటున్న టీఎస్‌ పీఎస్సీ

🔷విద్వాన్‌, విశారద, ప్రవీణకు అనర్హత..

🔷టీఆర్టీకి హెచ్‌పీటీ అభ్యర్థులు దూరం

🔷హైకోర్టును ఆశ్రయించినా దక్కని ఫలితం..

🔷అగమ్యగోచరంగా భవితవ్యం

🔷రేపటి వరకే దరఖాస్తుల స్వీకరణ..

🔷గడువు పెంచి అవకాశమివ్వాలని వినతి

♦(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌):హిందీ పండిట్‌లుగా ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకొని.. ఏళ్ల తరబడి డీఎస్సీ కోసం ఎదురుచూసిన అభ్యర్థులు రోడ్డున పడ్డారు. టీచర్‌ ఉద్యోగంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వేలాది మంది నిరుద్యోగుల ఆశలు అడియాసలు కానున్నాయి.

♦ ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) రాసేందుకు విద్వాన్‌, విశారద, ప్రవీణ హిందీ డిగ్రీలు చెల్లవని టీఎ్‌సపీఎస్సీ పేర్కొనడంతో హిందీ పండిట్‌ అభ్యర్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన జీవో 25 కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. న్యాయం చేయాలని కోరుతూ బాధితులు హైకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు.

♦దీంతో తమకు ఆత్మహత్యలే శరణ్యమని నిరుద్యోగులు అంటున్నారు. న్యాయం కోసం పోరాటానికి సిద్ధమవుతున్నారు.

♦ వాస్తవానికి విద్వాన్‌, విశారద, ప్రవీణ హిందీ డిగ్రీలు పూర్తి చేసినవారికి ప్రభుత్వాలు ఇప్పటివరకూ హిందీ పండిట్‌ ట్రైనింగ్‌ (హెచ్‌పీటీ)కు అవకాశం కల్పిస్తూ వస్తున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కూడా ఇచ్చాయి. హెచ్‌పీటీ పూర్తిచేసిన అభ్యర్థులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) రాసేందుకూ అవకాశమిచ్చాయి. టెట్‌లో అర్హత పొందిన అభ్యర్థులకు డీఎస్సీలోనూ అవకాశం కల్పించారు.

♦ అలా డీఎస్సీ రాసిన ఎంతో మంది ప్రభుత్వ పాఠశాలల్లో హిందీ ఉపాధ్యాయులయ్యారు. దాదాపుగా హిందీ ఉపాధ్యాయులంతా ఈ డిగ్రీలతో ఉద్యోగం పొందినవారే ఉన్నారు. వారిలో చాలామంది పదవీ విరమణ కూడా చేశారు. పైగా కొన్ని యూనివర్సిటీలు ఈ డిగ్రీలపైనే పీజీ చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో చాలా మంది పీజీలు కూడా పూర్తి చేశారు. నెల రోజుల క్రితం నిర్వహించిన టీజీటీ, పీజీటీకి ఈ డిగ్రీలనే అనుమతించారు. కానీ, తాజాగా టీఆర్‌టీకీ అనుమతించడం లేదు. ఈ డిగ్రీలతో టెట్‌ అర్హత సాధించి కూడా టీఆర్‌టీకి దరఖాస్తు చేయలేని పరిస్థితి నెలకొంది.

*♦స్పష్టతనివ్వని విద్యాశాఖ*
గత కొన్నేళ్లుగా టెట్‌ అర్హత పొందిన వేలాది మంది అభ్యర్థులు టీచర్‌ ఉద్యోగం కోసం అప్పులు చేసి, ఇంటిని వదిలి హాస్టళ్లలో ఉంటూ.. కోచింగ్‌ తీసుకుంటున్నారు. వారంతా న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా జీవో 25పై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ కేసును విద్యాశాఖ స్వీకరించి ఈ హిందీ డిగ్రీలు సాధారణ డిగ్రీలతో సమానమైతే.. హిందీ అభ్యర్థులకు న్యాయం చేయాలని ఆదేశించింది. వారం రోజుల్లో ఈ విషయమై ప్రకటన చేయాలని పేర్కొంది. 

♦కాగా, కోర్టు ఆదేశాలు జారీ చేసిన 10 రోజుల తర్వాత యూజీసీ నిబంధనల ప్రకారం 9, 10 తరగతులకు బోధించేవారికి (స్కూల్‌ అసిస్టెంట్లకు) హిందీ డిగ్రీలు.. సాధారణ డిగ్రీలతో సమానంగా ఉండాలని తేల్చారు. అయితే 6 నుంచి 8 తరగతుల (లాంగ్వేజ్‌ పండిట్‌ల) విషయంలో మాత్రం ఏమీ చెప్పలేకపోయారు. కానీ, లాంగ్వేజ్‌ పండిట్లకు హిందీ డిగ్రీలతో ఎలాంటి సం బంధం లేదని అభ్యర్థులు చెబుతున్నారు. ఈవిషయం లో విద్యాశాఖ, టీఎ్‌సపీఎస్సీ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.☸🔵🔵🌐🕉🔵🔵🔵
[12/30/2017, 08:47] ‪+91 95020 29120‬: *నేటితో ముగియనున్న టి.ఆర్.టి ధరకాస్తుల గడువు.పొడగింపు చేయాలో వద్దా అనేది ఈ రోజు సాయంత్రం నిర్ణయం వెలువడనున్నది.గడువు ఒక్క రోజే ఉండడం తో  ధరకాస్తుల సంఖ్య బారిగా పెరగనున్నాయి.ఇప్పటివరకు sgt 78వేలు s.a లక్ష 11వేల మంది అప్లికేషన్లూ చేసారు*.
[12/30/2017, 08:49] ‪+91 95020 29120‬: *🅾OSRAJU@*
*☯వెబ్సైట్లో సీడీపీవో ఈసీడీపీవో హాల్టికెట్లు*

🅾 తెలంగాణ: సీడీపీవో/ఈసీడీపీవో ఉద్యోగాలకు జనవరి 4న కంప్యూటర్ పరీక్షను నిర్వహించనున్నట్టు టీఎస్పీఎస్సీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

 ఇప్పటికే హాల్టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని.. పరీక్ష తేదీ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నది. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ నిబంధనలను తప్పకుండా పాటించాలని కోరింది. 

*🚫తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పోస్టుకు భర్తీ చేసుకున్న వారిలో తిరస్కారానికి గురైన అభ్యర్థుల వివరాలు వెబ్సైట్లో ఉంచినట్టు టీఎస్పీఎస్సీ ప్రకటించింది*.🅾✴☯🕉⛔☸🏀🛑🔵🕉☯🚫
[12/30/2017, 08:49] ‪+91 95020 29120‬: *✴OSRAJU@*
*🅾అరెరె.. పొరపాటున కొత్త ఫీచర్ ప్రత్యక్షం!*

లండన్: వాట్సాప్ మొబైల్ యాప్ రిప్లై ప్రైవేట్లీ అనే సదుపాయాన్ని పొరపాటున యాక్టివేట్ చేసింది. ఈ విధానంలో గ్రూపులో ఉంటూనే ఓ సభ్యుడికి గ్రూప్ నుంచి ఇతర సభ్యులకు తెలియకుండా సందేశం పంపొచ్చు. వాట్సప్ బీటా ఆప్డేట్లో ఈ సదుపాయం కనిపించిన కాసేపటికే మాయమైందని బ్రిటన్ మీడియా తెలిపింది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉందని, ఇతర ఫీచర్లతో కలిపి రిప్లై ప్రైవేట్లీని విడుదల చేస్తారని వెల్లడించింది. డెవలపర్లు పొరపాటును దీనిని యాక్టివేట్ చేసి ఉంటారని అభిప్రాయపడింది. కాగా, మరికొన్ని రోజుల్లో ఈ కొత్త ఫీచర్ను తమ యూజర్లకు తెచ్చే పనిలో యాజమాన్యం బిజీగా ఉండగా ఓ యూజర్ మొబైల్లో పొరపాటున ఈ ఫీచర్ కనిపించడం గమనార్హం.🅾🚫☯☯🅾☸☸🚫
[12/30/2017, 08:49] ‪+91 95020 29120‬: *☸OSRAJU@*
*☯1 నుంచి రక్షణశాఖ ఆన్లైన్ క్విజ్ పోటీలు*

*-హిందీ, ఇంగ్లిష్లో నిర్వహణ*

*- ప్రథమ బహుమతి రూ.లక్ష*

 ☸యువతలో దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడంలో భాగంగా ఆన్లైన్లో క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు రక్షణశాఖ వెల్లడించింది. ఈ క్విజ్ ప్రతిష్ఠాత్మకమైన పరమవీర్ చక్ర, మహావీర్ చక్ర, వీర్చక్ర, అశోక్చక్ర, కీర్తిచక్ర, శౌర్యచక్ర అంశాలపై నిర్వహిస్తున్నట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు.
 www.gallantryawards.gov.in వెబ్సైట్లో క్విజ్కు సంబంధించిన సమాచారం ఉంటుందని పేర్కొన్నారు. జనవరి 1 నుంచి పదో తేదీ వరకు క్విజ్ పోటీలను హిందీ, ఇంగ్లిష్లో ఆన్లైన్లో https://quiz.mygov.in వెబ్సైట్ ద్వారా నిర్వహిస్తున్నామని తెలిపారు. 

18 ఏండ్లలోపు వారికి, 18 ఏండ్లపైడినవారికి రెండు క్యాటగిరీలుగా పోటీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రెండు బ్యాచ్లకు ప్రథమ, ద్వితీయ, తృతీయ, రెండుప్రోత్సాహక అవార్డులు ఉంటాయని తెలిపారు. 

మొదటి బహుమతి రూ.లక్ష, రెండో బహుమతి రూ.75 వేలు, మూడో బహుమతి రూ. 50 వేలు, ప్రోత్సాహక బహుమతి (ఇద్దరికి) రూ.15 వేల చొప్పున ఇస్తున్నట్టు వెల్లడించారు. 

క్విజ్లో గెలిచినవారికి గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో బహుమతులు అందజేయనున్నట్టు తెలిపారు. 

దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు.☯☸🅾🅾🚫✴✴⛔⛔⛔
[12/30/2017, 08:49] ‪+91 95020 29120‬: *🌹🍋ఎస్టీయూ తెలంగాణ🍋🌹*

*🥦విక్రం సారాభాయ్ వర్ధంతి సందర్భంగా సమాచారం...🥦*

*🍡విక్రం అంబాలాల్ సారాభాయి ( ఆగస్టు 12 , 1919 – డిసెంబరు 30, 1971 ) భారతదేశపు భౌతిక శాస్త్రవేత్త. భారత అంతరిక్ష పరిశోధనా వ్యవస్థకు ఆద్యుడు.*

*👶బాల్యము👶*

🛍విక్రం సారాభాయ్ గుజరాత్ రాష్ట్రంలోని
అహ్మదాబాదులో జన్మించాడు. వారి కుటుంబం ధనవంతులైన వ్యాపారస్తుల
కుటుంబం . ఆయన తండ్రి అంబాలాల్ సారాభాయ్ అక్కడ పేరు పొందిన పారిశ్రామికవేత్త. ఆయనకు అక్కడ ఎన్నో మిల్లులు ఉండేవి. అంబాలాల్, సరళా దేవి దంపతులకు కలిగిన ఎనిమిది మంది సంతానంలో విక్రం సారాభాయ్ ఒకడు.
తన ఎనిమిది మంది పిల్లలను చదివించడానికి విక్రం సారాభాయి తల్లి మాంటిస్సోరీ తరహాలో ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటు చేసింది. వీరి కుటుంబం స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ ఉండటం మూలాన వారింటికి మహాత్మాగాంధీ , మోతీలాల్ నెహ్రూ ,
రవీంద్రనాథ్ ఠాగూర్, మరియు జవహర్లాల్ నెహ్రూ మొదలైన ఎంతో మంది ప్రముఖులు తరచూ వస్తూ ఉండేవారు. వీరు విక్రం సారాభాయ్ వ్యక్తిత్వాన్ని ఎంతగానో ప్రభావితం చేశారు.

*📚విద్య📚*

⛲విక్రమ్ తల్లి సరళాదేవి తన ఎనిమిదిమంది పిల్లల్ని చదివించేందుకు మాంటిస్సోరీ తరహాలో ఒక ప్రైవేటు పాఠశాలను ఏర్పాటుచేశారు. వీరి కుటుంబం స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీలకంగా పాల్గొంటూ ఉండటం మూలాన వారింటికి తరచుగా మహాత్మాగాంధీ, మోతీలాల్ నెహ్రూ, రవీంద్రనాథ్ ఠాగూర్, జవహర్లాల్ నెహ్రూ... తదితర ముఖ్య నాయకులందరూ వస్తుండేవారు. వీరందరూ విక్రమ్ సారాభాయ్ వ్యక్తిత్త్వాన్ని ఎంతగానో ప్రభావితం చేశారనటంలో అతిశయోక్తి లేదు అహమ్మదాబాదులోని గుజరాత్ కళాశాలలో మెట్రిక్ విద్యను పూర్తి చేసుకున్న విక్రమ్ సారాభాయ్... తరువాత పై చదువుల కోసం
ఇంగ్లండు లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్లారు. 1940వ సంవత్సరంలో అక్కడ నాచురల్ సైన్సెస్లో, ట్రిపోస్లో ఉత్తీర్ణులయ్యారు.

*🏕ఇంగ్లాండులో విద్య🏕*

🎭ఆ సమయంలో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభం కావటంతో భారతదేశానికి తిరిగివచ్చిన విక్రమ్ సారాభాయ్... బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో సర్ సీ.వీ.రామన్ పర్యవేక్షణలో కాస్మిక్ కిరణాలపై పరిశోధన మొదలుపెట్టారు. తదనంతరం రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత 1945వ సంవత్సరంలో తిరిగీ కేంబ్రిడ్జి యూనివర్సిటీకి వెళ్లి పీహెచ్డీ పట్టాను సాధించుకుని 1947లో తిరిగి భారత్ చేరుకున్నారు. అహ్మదాబాదులోని గుజరాత్ కళాశాల నుంచి మెట్రిక్ పాసయ్యాడు. తరువాతి చదువుల కోసం ఇంగ్లండులోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. 1940లో అక్కడ నుంచి నాచురల్ సైన్సెస్ లో ట్రిపోస్ లో ఉత్తీర్ణుడయ్యాడు. రెండవ ప్రపంచ యుద్ధం అప్పటికే ప్రారంభం అవడంతో భారతదేశానికి తిరిగి వచ్చి బెంగుళూరు లోని
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో సి.వి. రామన్ పర్యవేక్షణలో కాస్మిక్ కిరణాలపైన పరిశోధన మొదలుపెట్టాడు. రెండవ ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత 1945లో తిరిగి కేంబ్రిడ్జి వెళ్ళి పీహెచ్డీ పట్టా 1947లో సాధించుకుని వచ్చాడు.

*🥌పరిశోధన🥌*

🍱1957లో రష్యా మొట్టమొదటి శాటిలైట్ అయిన స్పుత్నిక్ను ప్రయోగించినపుడు... భారత భవిష్యత్ అవసరాలకు శాటిలైట్ల అవసరం గురించి ఎంతో విషయ సేకరణ చేయటమేగాకుండా, ఆ శాటిలైట్ యొక్క ఆవశ్యకతను అప్పటి ప్రధానమంత్రి అయిన జవహర్లాల్ నెహ్రూకు వివరించి, ఆయనను ఒప్పించారు సారాభాయ్. ఆ తరువాత 1962లో భారత అణుశక్తి వ్యవస్థ పితామహుడయిన హోమీ బాబా పర్యవేక్షణలో ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ (ఐఎన్సీఓఎస్పీఏఆర్) సెంటర్ను ఆయన ఏర్పాటు చేశారు. తదనంతరం ఆయన ఆదర్శాలకు అనుగుణంగా ఇస్రో ఎన్నో విజయాలను సాధించి భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపచేసింది.
*"భారత అంతరిక్ష రంగ పితామహుడు"*గా కీర్తి గడించిన సారాభాయ్ సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయనను 1962లో శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డుతో, 1966లో పద్మ భూషణ్ అవార్డుతో సత్కరించింది. జాతీయ స్థాయిలోను, అంతర్జాతీయంగానూ అర్థవంతమైన పాత్ర పోషించగలగాలంటే, ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని మానవ సమాజ సమస్యల పరిష్కారానికి ఉపయోగించుకోవడంలో మనం ఎవరికీ తీసిపోకుండా ఉండాలని” చెప్పి, ఆ దిశగా కృషి చేసిన సారాభాయ్ 1971, డిసెంబరు 31వ తేదీన పరమపదించారు.
గ్రామీణ ప్రజల కోసం ఉపగ్రహాలను రూపొందించటం విక్రమ్ సారాభాయ్ వ్యూహంలో ప్రధానమైనదిగా ఉండేది. సాంకేతిక పరిజ్ఞాన ఉపయోగాన్ని సామాన్యులకు అందుబాటులోకి తీసుకొని రావాలని, అప్పుడే మన దేశంలోని ఎన్నో సమస్యలను పరిష్కరించవచ్చని సారాభాయ్ తోటి శాస్త్రవేత్తలను ప్రొత్సహించేవారు.
సహజ వనరుల వివరాలు సేకరించే పరిజ్ఞానాన్ని రూపొందించటం, రిమోట్ సెన్సింగ్కు అవసరమైన సాధనాలను ఏర్పాటు చేసుకోవటం అనేవి అందులో కీలక భాగాలు. ఈ రంగాలను ఎలా ఉపయోగించుకోవాలి? అంతరిక్షంలోకి మానవుల్ని ఏలా పంపాలి? సంప్రదాయపద్ధతిలో ఉన్న వ్యవస్థల్లోకి అంతరిక్ష వ్యవస్థను ఎలా కలపాలి? అన్న విషయాలన్నీ విక్రమ్ సారాభాయ్ వ్యూహాల్లో భాగాలుగా ఉండేవి.

*👨‍👩‍👦‍👦కుటుంబం👨‍👩‍👦‍👦*

🍄విక్రమ్ సారాభాయ్ కుటుంబం విషయానికి వస్తే...ఇతని భార్య మృణాలిని సారాభాయ్ . ఆమె మంచి సాంప్రదాయ నర్తకి. అప్పట్లో వీరి పెళ్ళి చెన్నైలో జరిగింది. అయితే వీరి పెళ్ళికి విక్రం సారాభాయ్ తరపు బంధువులు అందరూ క్విట్ ఇండియా ఉద్యమంలో బిజీగా ఉండటంతో ఎవరూ హాజరుకాలేకపోయారు. వీరి కుమార్తె
మల్లికా సారాభాయ్ .ఈమె కూడా మంచి నర్తకి. కొడుకు కార్తికేయ. అప్పట్లో వీరి పెళ్ళి చెన్నై లో జరిగింది. ఇతని కుమారుని పేరు పేరు కార్తికేయ.

*🍋🍡🎈🌹STUTS🌹🎈🍡🍋💠*
[12/30/2017, 08:49] ‪+91 95020 29120‬: *🔵టీఆర్టీ ఓపెన్‌ కోటా పది జిల్లాలకు కామన్‌*

🔷టీఆర్టీలో సొంత జిల్లాలో దరఖాస్తు చేసుకుని పరీక్ష రాస్తే చాలు

🔷మిగతా జిల్లాలకు నాన్‌లోకల్‌ అభ్యర్థిగా వర్తింపు.. మెరిట్‌ ఆధారంగా చాన్స్‌

♦ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) నోటిఫికేషన్‌ ప్రకారం మీ జిల్లాలో మీ సబ్జెక్టుకు సంబంధించిన పోస్టులు లేవా? అందుకని దరఖాస్తు చేయకుండా మిన్నకుండి పోయారా? అయితే సరికాదు. సొంత జిల్లాలో ఒక్క పోస్టు కూడా లేకపోయినా.. మీరు దరఖాస్తు చేయవచ్చు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో ఏ జిల్లాలోనైనా ఓపెన్‌ కోటాలో ఉద్యోగం సాధించవచ్చు. ఇందుకు అవకాశం కల్పిస్తూ ఓపెన్‌ కోటాలో టీఎ్‌సపీఎస్సీ మార్పులు చేసింది.

♦గతంలో జిల్లాలవారీగా ఓపెన్‌ కోటా ఉండగా.. ప్రస్తుతం 10 జిల్లాలకు కలిపి ఒకే ఓపెన్‌ కోటాను ఇవ్వనుంది. ఈ కోటాకు అన్ని జిల్లాల అభ్యర్థులూ అర్హులవుతారు. ఇతర జిల్లాలో నాన్‌లోకల్‌ అభ్యర్థిగా పోటీపడేందుకు ప్రత్యేకించి ఆ జిల్లాలో దరఖాస్తు చేయనవసరం లేదు. 

♦అన్ని జిల్లాల అభ్యర్థులూ అభ్యర్థి సొంత జిల్లాలోనే దరఖాస్తు చేయాలి. జిల్లా స్థాయిలో మొత్తం పోస్టుల్లో 80శాతం లోకల్‌ అభ్యర్థులకు, 20శాతం ఓపెన్‌ కోటాకు కేటాయిస్తారు. ఈ మేరకు గతంలో సొంత జిల్లాలో పోస్టులు లేకపోయినా, తక్కువగా ఉన్నా.. అభ్యర్థులు ఎక్కువ పోస్టులు ఉన్న జిల్లాలో నాన్‌లోకల్‌ అభ్యర్థిగా దరఖాస్తు చేసుకునేవారు. దీంతో ఆ అభ్యర్థి ఆ జిల్లాలో మాత్రమే పరీక్ష రాసేవారు. అనంతరం మెరిట్‌లో ఉంటే ఆ జిల్లాలోనే ఉద్యోగం వచ్చేది.

♦ అయితే ప్రస్తుతం అభ్యర్థులు పోస్టులు ఉన్నా, లేకపోయినా.. వారి సొంత జిల్లాలోనే దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలోనూ నాన్‌లోకల్‌ ఆప్షన్‌ కనిపించదు. అనంతరం సాధించిన మార్కుల ఆధారంగా నాన్‌లోకల్‌ అభ్యర్థిగా ఓపెన్‌ కోటాలో ఇతర అన్ని జిల్లాలనూ ప్రాధాన్య క్రమంలో ఎంచుకునే అవకాశాన్ని అభ్యర్థికి కల్పిస్తారు.


♦మెరిట్‌ను బట్టి ఏ జిల్లాలో వస్తే ఆ జిల్లాలో ఉద్యోగమిస్తారు. అయితే ఈ నిబంధన మార్పుపై సమాచార లోపం నెలకొనడంతో కొందరు అభ్యర్థులు గందరగోళానికి గురయ్యారు.

♦వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ అభ్యర్థికి ఇదే సమస్య ఎదురైంది. ఆ జిల్లాలో ఎస్‌జీటీ పోస్టులు లేకపోవడంతో పోస్టులు ఎక్కువగా ఉన్న మరో జిల్లాలో నాన్‌లోకల్‌ అభ్యర్థిగా దరఖాస్తు చేయాలని భావించాడు. కానీ, దరఖాస్తు సమయంలో నాన్‌లోకల్‌ ఆప్షన్‌ కనిపించలేదు. దీంతో అయోమయానికి గురై.. ఇప్పటివరకు టీఆర్టీకి దరఖాస్తు చేయలేదు. ఇలా వందల మంది ఉన్నారు. 

♦దరఖాస్తులకు 30వ తేదీతో గడువు ముగుస్తున్న నేపథ్యంలో వారు నష్టపోయే అవకాశం ఉన్నందున అభ్యర్థుల్లో అవగాహన కల్పించడంతోపాటు దరఖాస్తు సమయాన్ని పొడిగించాలనే డిమాండ్లు వస్తున్నాయి.🔵🌐☸☸☸🕉🕉⛔🌐☸🕉⛔
[12/30/2017, 08:49] ‪+91 95020 29120‬: *🌐OSRAJU@*
*🌐సిండికేట్ బ్యాంకు ప్రొబేషనరీ ఆఫీసర్: 500 పోస్టులు.*

కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్.

 అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.

ఎంపిక: రాతపరీక్ష, గ్రూప్ డిష్కషన్, ఇంటర్వ్యూ ద్వారా.

 దరఖాస్తు: ఆన్లైన్.

చివరితేది: 17.01.2018

వెబ్సైట్: www.syndicatebank.in☸🔵☸☸🔵🔵🔵🕉
[12/30/2017, 08:49] ‪+91 95020 29120‬: *⛔OSRAJU@*
*🏀నయామోనూ..*

*-ఇంటి భోజనాన్ని తలపించేలా..*

*-ప్రభుత్వం నూతన సంవత్సర కానుక..*

*-విద్యార్థులకు పౌష్టికాహారం అందించడం కోసం చర్యలు*

*-కస్తూర్బా, మోడల్ స్కూల్, గురుకులాల్లో కొత్త మెనూ ప్రారంభం*

*-నెలకు ఐదు రోజులు చికెన్రెండు రోజులు మటన్*

*-రోజూ గుడ్డు, నెయ్యితో భోజనం*

*-హర్షం వ్యక్తం చేస్తున్న పిల్లలు, తల్లిదండ్రులు*

🔵తెలంగాణ : ప్రభుత్వ విద్యా వ్యవస్థ్ధను పటిష్ట్ట పరుస్తూ, కార్పొరేటు స్థాయికి దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థలను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభు త్వం తీవ్రంగా కృషి చేస్తోంది. గత పాలకుల హయాంలో ప్రభుత్వ పాఠశాలపై చిన్న చూపు చూడడంతో కనీస మౌ లిక సదుపాయలు కూడా లేక విద్యార్ధులు తీవ్ర ఇబ్బందు లు పడాల్సి వచ్చింది. కానీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. తాజాగా క స్తూర్బా, మోడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలల్లో నూతన సంవత్సర కానుకగా ప్రభుత్వం కొత్త మెనూలో భాగంగా విద్యార్థుకు భోజనంలో మటన్, నెయ్యి అందించాలని తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది.

 అంతేకాకుండా ప్రభుత్వ చర్యలతో ప్రభుత్వ విద్య సవంత్సరాల్లో చదివే విద్యార్ధుల సంఖ్య ఎటేటా పెరుగుతుంది.
కస్తూర్బా, మోడల్ స్కూళ్లతో పాటు అన్ని సంక్షేమ హాస్టళ్లలో చదివే విద్యార్థులకు నూతన సంవత్సర కానుకను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన ఆదేశాలను ప్రభుత్వం ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జనవరి 1 నుంచి విద్యార్థులకు నూతన మెనూ అందుబాలులోకి రానుంది.

 *🛑ఈ మెనూ ప్రకారం*

 నెలలో 5 రోజులు చికెన్, 
2 రోజులు మటన్, నిత్యం నెయ్యితో భోజనాన్ని అందించనున్నారు. అంతేకాకుండా ప్రతి రోజు సాయిత్రం (స్నాక్స్), చిరు ధాన్యాలను అందించనున్నారు.

*⛔నూతన మెనూ అమలయ్యే విధానం...*

ప్రభుత్వం నూతనంగా ప్రారంభించే మెనూ జనవరి 1 నుంచి అందుబాటులోకి రానుంది. 

నెలలో 1, 3, 5వ ఆదివారాలు(మధ్యాహ్నం)
 2, 4వ బుధవారాల్లో (రాత్రి) చికెన్తో భోజనం పెట్టనున్నారు. 

అదేవిధంగా నెలలో 2, 4వ ఆదివారాల్లో (మధ్యాహ్నం) మటన్ పెట్టనున్నారు. వారం లో ఆరు రోజులు (బుధవారం మినహా) అరటి పండు లే దా సీజనల్ పండ్లు అందించనున్నారు.

 శనివారాలు సా యంత్రం వరుసగా గులాబ్జామ్, సేమియా, రవ్వకేసరి, ఫ్రూట్ సలాడ్ ఇవ్వనున్నారు. 

ప్రతి రోజు ఉదయం బూస్ట్, బోర్న్మీటా, హార్లిక్స్, రాగి మాల్ట్ వంటివి ఒకటి (నెలలో 22 రోజులు) అందించనున్నారు.

 మధ్యాహ్న భో జనంతో వివిధ రకాల కూరగాయలు, పప్పుతోపాటు పెరుగు, నెయ్యి, రసం తప్పనిసరి.

 ప్రతి రోజు సాయత్రం ఉడికించిన బటానీ, పెసర్లు, అటుకుల మిక్చర్, స్వీట్ కా ర్న్, పల్లిపట్టి, నువ్వులపట్టితో స్నాక్స్, టీ ఇవ్వాల్సి ఉంటుంది.


*☯ఇప్పటికే అనేక సౌకర్యాలు..*

రాష్ట్ర ప్రభుత్వం కస్తూర్బా గాంధీ, మోడల్, గురుకుల పాఠశాలల్లో చదివే విద్యార్థ్ధుల సంక్షేమానికి అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. విద్యార్థ్ధుల సౌకర్యార్థం ట్రంక్ బాక్స్, పేట్లు, గ్లాసులు, బల్లాలు, వంట సామగ్రి, బెడ్షీట్లు, కార్పెట్స్, చెప్పులు, కాస్మోటిక్స్ వంటివి అందజేస్తోంది. అంతేకాకుండా విద్యార్థ్ధుల రక్షణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటు, డిజిటల్ క్లాసులు, కంప్యూటర్ విద్యను అందుబాటులోకి తీసుకువచ్చింది.

*✴రానున్న రోజుల్లో అనేక మార్పులు..*

ప్రభుత్వం రానున్న రోజుల్లో కస్తూర్బా విద్యాలయాలు, మోడల్ స్కూల్, గురుకుల పాఠశాల్లో అనేక మార్పులు తీసుకవచ్చేందుకు శ్రీకారం చూడుతోంది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన స్పెషలాఫీసర్ల సమావేశంలో డిప్యూటీ సీఎం, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. కస్తూర్బా విద్యాలయాల్లో ఇంటర్ విద్యను అందుబాటులో కి తీసుకరానున్నారు. అంతేకాకుండా విద్యార్థ్ధుల కోసం పడక మంచాల ఏర్పాటు, వసతి కోసం బిల్డింగ్లు నిర్మించునున్నారు. విద్యార్థులకు వేడినీటి సౌకర్యం కోసం సోలార్ వాటర్ హీటర్లు ఏర్పాటు, అక్రమాలకు తావు లేకుండా బయోమెట్రిక్ యంత్రాలు 🏀ఏర్పాటు చేయనున్నారు.
🏀☸☸🛑🛑⛔⛔🔵🔵🚫🚫
[12/30/2017, 08:49] ‪+91 95020 29120‬: *🅾OSRAJU@*
*🏀పారదర్శక పరిశీలన*
*----మహబూబాబాద్*

*-యూ-డైస్ సమాచారంపై సమగ్ర తనిఖీలు*

*-నెలాఖరుకు పూర్తిచేసేందుకు కార్యాచరణ*

*-పాఠశాలల్లో పర్యటిస్తున్న ప్రత్యేక బృందాలు*

*-2న జిల్లా కేంద్రంలో తనిఖీ బృందాలతో సమావేశం*

🛑ప్రభుత్వ పాఠశాలల సమగ్ర వికాసం కోసం ప్రభుత్వం సంస్కరణలు చేపడు తోంది. ఈ ప్రక్రియలో కీలక భూమిక పో షించే పాఠశాల విద్యా సమగ్ర సమాచారం (యూ-డైస్)లో పొందుపర్చే వివరాల పా రదర్శకతను పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను విద్యాశాఖ అధికారులు ఏ ర్పాటు చేశారు. 

జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్ర భుత్వ పాఠశాలల్లో కనీసం 25శాతం పాఠశాలలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించేలా బృందాలకు శిక్షణ ఇచ్చారు.

 ఈ నెలాఖరు నాటికి ప్రక్రియ పూర్తి చేసేందుకు కార్యచరణ సిద్ధం చేసినప్పటికీ కొన్ని మండలాల్లో ఇప్పటికీ మొద లు కాలేదు. యూ-డైస్ ఆధారంగానే పాఠశాలలకు సౌకర్యాల కల్పన, నిధుల విడుదల, విద్యార్థుల వాస్తవిక పరిస్థితులు తె లిసే అవకాశం ఉన్నందున ఇప్పటికే ప్రధానోపాధ్యాయులు ఇచ్చిన వివరాలు సరైన వేనా...
కాదా అనే అనుమానాలను ని వృత్తి చేయనున్నారు. 

ఈ ఏడాది సేకరించి న విద్యాసమగ్ర సమాచారంపై పునఃపరిశీలన చేయనున్నారు. ఇందుకు జిల్లాలో అన్ని మండలాలకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయగా, కొన్నింటిలో అవి సమాచారాన్ని సేకరించే పనిలో నిమగ్నమయ్యాయి. మరికొన్ని మండలాల్లో నేటికీ ప్రక్రియ మొదలు కాలేదు.

 జిల్లా విద్యాశాఖకు పంపించిన ఈ సమాచారాన్ని జనవరి 5వ తేదీ వరకు ప్రభుత్వానికి పంపించాల్సి ఉంటుంది.

 ఇందు కోసం జనవరి 2న తనిఖీ బృందాలతో జిల్లా కేంద్రంలో సమావేశాన్ని ఏర్పాటు చేయమన్నారు.

*🔵పాఠశాలల సమాచార సేకరణ*

ప్రతీ ఏడాది పాఠశాలల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యతో పాటు సర్కారు బడుల్లో అందుబాటులో ఉన్న మౌలిక వసతులు, సౌకర్యాలు, లేనివాటి సమాచారాన్ని సేకరిస్తున్నారు. సర్వశిక్షా అభియాన్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ తంతు కొనసాగుతోంది. వీటి ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు బడుల బలోపేతానికి నిధులు కే టాయిస్తున్నాయి. బడుల్లోని సమస్త సమాచారాన్ని ప్రత్యేక ప్రొఫార్మాలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పూర్తి చేసి వారి కాంప్లెక్స్ పరిధిలోని ప్రధానోపాధ్యాయులకు అందజేయాల్సి ఉంటుంది. వీరు మండల వనరుల కేంద్రం (ఎంఆర్సీ)లకు అందజేసి మండల వ్యాప్తంగా వివరాలు క్రోడీకరించి జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. వీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆయా వివరాలు పంపిస్తారు.

*⛔నిధుల కోసం వక్రమార్గాలు*

యూ-డైస్ విధానం ప్రతీ ఏడాదీ జరిగే తంతు. పలు రాష్ర్టాల్లు, వివిధ జిల్లాల్లో వి ద్యాశాఖ నుంచి వస్తున్న వివరాలపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల అసంతృప్తి వ్యక్తం చే సింది. పాఠశాలల్లో మూత్రశాలలు, వంట గదులు, అదనపు తరగతి గదులు, విద్యార్థుల సంఖ్యకు ఆధారంగా మధ్యాహ్న భో జన బిల్లుల చెల్లింపు వంటి ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో కొన్ని పాఠశాలల హెచ్ఎంలు వాస్తవిక పరిస్థితులకు విరుద్ధంగా యూ-డైస్లో వివరాలు నమోదు చేస్తున్నట్లు గుర్తించారు.

 కొన్ని పాఠశాలల్లో సౌకర్యాలు ఉన్నప్పటికీ లేనట్లు చూపించ డం, విద్యార్థుల సంఖ్య లేక పోయినా ఉ న్నట్లుగా చూపించడం లాంటివి జరుగుతున్నట్లు సమాచారం.
వీటికి అడ్డుకట్ట వేసి వాస్తవ వివరాలు స్వీకరించాలనే ఉద్దేశం తో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాలతో పాఠశాలలను తనిఖీ చేయాలని భావించిం ది. ఇందులో భాగంగా జిల్లాలో పరిశీలన కు 16 బృందాలను నియమించారు. ఒ క్కో బృందంలో ప్యానల్గ్రేడ్ హెచ్ఎంను గానీ, కాంప్లెక్స్ హెచ్ఎం, స్కూల్ అసిస్టెంట్ గానీ ఎస్జీటీ కలిసి బృందానికి ఇ ద్దరు చొప్పున ఉండేలా ఏర్పాటు చేశారు. వీరికి జిల్లాలోని 25 శాతం పాఠశాలల వివరాలను అందజేశారు. హెచ్ఎంలు అం దజేసిన ప్రొఫార్మాతో పాటు కొత్తగా మరో ప్రొఫార్మాను పాఠశాలలకు తీసుకెళ్లి వారు అందజేసిన వివరాలను సరిపోల్చుతారు. తప్పులు ఉన్నట్లయితే వెంటనే కొత్త ప్రొఫార్మాలో నమోదు చేస్తారు. మరో రెండు రో జుల్లో ఈ తతంగాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.

*🏀అక్రమాల నిరోధానికే.?*

సర్కారు బడుల బలోపేతానికి ప్రతీ ఏ డాది ప్రభుత్వం అందజేస్తున్న నిధుల దు ర్వినియోగాన్ని అడ్డుకునేందుకే ఈ పునః పరిశీలన చేపట్టిందని తెలుస్తోంది. పాఠశాలల్లోనే కాకుండా వసతిగృహాలు, ఆదర్శ, కస్తూర్బా విద్యాలయాలు, గురుకులాలు, వసతిగృహాలు తదితర వాటిల్లోనూ ఈ త నిఖీలు చేపట్టాలని భావించింది. కొన్ని పా ఠశాలల్లో విద్యార్థులకు సరిపడా భవనాలు ఉన్నప్పటికీ లేనట్లు చూపించి కొత్త వాటి కోసం ప్రతిపాదనలు పెడుతున్నట్లు సమాచారం. ఇలాంటి చోట్ల భవనాలు మంజూరైతే వృథా అవుతాయనే భావన వ్యక్తమవుతోంది. కొన్ని వసతిగృహాల్లో విద్యార్థుల సంఖ్యలో తేడాలు వస్తున్నట్లు తెలుస్తోంది. వారి పేరున వచ్చే సౌకర్యాలను పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.


*జిల్లాలో 312 పాఠశాలల పరిశీలనకు కార్యాచరణ*

*జిల్లాలోని 16 మండలాల్లో 312 పాఠశాలలను* పరిశీలించేందుకు మండలంలో పని చేసే బృందానికి సమీప మండలంలో ని బాధ్యతలను అధికారులు అప్పగించా రు. 

కేవలం పెద్దవంగర మండలానికి సం బంధించి మాత్రమే అదే మండలంలో ప ని చేస్తున్న బృందం తనిఖీలు చేపట్టనుంది.

 బయ్యారం మండలంలో 87 పాఠశాలలు ఉండగా 22 పాఠశాలల్లో, 

చిన్నగూడూరు మండలంలోని 23 పాఠశాలల్లో 6, 

దంతాలపల్లి మండలంలో 36 పాఠశాలల్లో 9, 

డోర్నకల్ మండలంలో 74 పాఠశాలల్లో 19, 

గంగారం మండలంలో 41 పాఠశాలలకు 10, 

గార్ల మండలంలో 66 పాఠశాలలకు 17, 

గూడూరు మండలంలో 107 పాఠశాలలకు 27,

 కేసముద్రం
మండలం లో 106 పాఠశాలలకు 27, 

కొత్తగూడ మండలంలో 73 పాఠశాలలకు 18, 

కురవి మండలంలో 93 పాఠశాలలకు 23,

 మహబూబాబాద్ మండలంలో 161 పాఠశాలలకు 40, 

మరిపెడ మండలంలో 127 పాఠశాలలకు 32,

 నర్సింహులపేట మండలంలో 54 పాఠశాలలకు 14,

 నెల్లికుదురు మండలంలో 74 పాఠశాలలకు 19,

 పెద్దవంగర మండలంలో 36 పాఠశాలలకు 9, 

తొర్రూరు మండలంలో ఉన్న 81 ప్రభుత్వ పాఠశాలల్లో 20 పాఠశాలకు 

సంబంధించిన యూ-డైస్ ఫారాలను పరిశీలించనున్నారు.

 మొత్తం జిల్లాలో ఉన్న 1239 ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి 312 పాఠశాలల్లో పరిశీలన కోసం 16 బృందాలను నియమించారు.🏀⛔⛔🛑🔵🔵⛔⛔🛑🔵🅾🅾🅾
[12/30/2017, 10:00] ‪+91 95020 29120‬: 🌷రైట్ ఛాయిస్ - కరెంట్ ఎఫైర్స్🌹            
                                                                   
1) 2017 ఐసీసీ ఎంపిక చేసిన ఉత్తమ మహిళ క్రికెట్ వన్డే జట్టులో చోటు దక్కించుకున్న భారతీయ క్రికెటర్లు ఎవరు ?

✅ మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్, ఏక్తా బిష్థ్


2) భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ జనరల్ మేనేజర్ గా ఎవరు నియమితులయ్యారు ?

✅ సబా కరీం


3) వచ్చే నెలలో దావోస్ లో జరిగే ప్రపంచ ఆర్థిక ఫోరం ( WEF) వార్షిక సదస్సుకు భారత్ తరపున ఎవరు హాజరవుతున్నారు ?

✅ ప్రధాని నరేంద్రమోడీ


4) వినూత్న ఆవిష్కరణలు, విప్లవాత్మక పరిశోధనల కోసం గూగుల్ ఎక్స్ కేంద్రాన్ని అమెరికా వెలుపల తొలిసారిగా ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?

✅ విశాఖపట్నం (ఏపీ)

5) హైదరాబాద్ లో మోనో రైలు మార్గాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికి నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ?

✅ మియాపూర్ – శిల్పారామం- గచ్చిబౌలి


6) జెరూసలెంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఇటీవల ఏ అంతర్జాతీయ సంస్థ తిరస్కరించింది ?

✅ ఐరాసలోని సర్వప్రతినిధి సభ


7) కేంద్ర కార్మిక రాజ్య బీమా సంస్థను ఏ విధంగా మార్చాలని కేంద్రం నిర్ణయించింది ?

✅ సహకార సంఘం (సొసైటీ)


8) 1997లో ఏ ప్రధాని దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక ఫోరంకు హాజరైన  తర్వాత ఇప్పుడు నరేంద్రమోడీ పాల్గొంటున్నారు ?

✅ అప్పటి ప్రధాని హెచ్.డి.దేవెగౌడ


9) మనదేశం వచ్చే ఏడాదే ప్రపంచంలోని అయిదు ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానం పొందుతుందని చెప్పిన సంస్థ ఏది ?

✅ సెంటర్ ఫర్ ఎకనామిక్స్అండ్ బిజినెస్ రీసెర్చ్ ( CEBR)



10) రాష్ట్రంలో శాతవాహన యూనవర్సిటీ ఎక్కడ ఉంది ?

 ✅ కరీంనగర్
[12/30/2017, 10:00] ‪+91 95020 29120‬: *✍కరెంటు అఫైర్స్...*

🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని తుళ్లూరులో రాష్ట్ర ఫోరెన్సిక్ ల్యాబ్ భవన సముదాయ నిర్మాణానికి డిసెంబర్ 28న ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దొంగతనం ఏ రూపంలో అయినా అది పోలీసు, ప్రభుత్వం ఉదాసీనత వల్లే జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఏ తప్పు చేసినా న్యాయస్థానాల్లో ఏదో రకంగా తప్పించుకోవచ్చని చాలా మంది అనుకుంటున్నారన్నారు. నేరాల ఆధారాలకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్ సమర్థంగా పనిచేసి తప్పు చేసిన వారు తప్పించుకోకుండా చేయాలని సూచించారు. రూ. 254 కోట్లతోఈ ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్మిస్తున్నారు.

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు భూమిపూజ
ఎప్పుడు : డిసెంబర్ 28 
ఎవరు : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 
ఎక్కడ : తుళ్లూరు, అమరావతి
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
నేపాల్‌తో కలసి సంయుక్తంగా ఎవరెస్ట్ శిఖరం ఎత్తును కొలిచేందుకు భారత్ పంపిన ప్రతిపాదన తిరస్కరణకు గురైంది.ఎవరెస్ట్ ఎత్తును తామే కొలుస్తామని.. భారత్, చైనాలు కేవలం కీలకమైన గణాంకాలను అందిస్తే చాలని నేపాల్ సర్వే విభాగం ఈ మేరకు స్పష్టం చేసింది.దీంతో ఈ వ్యవహారం వెనుక చైనా హస్తం ఉండి ఉంటుందని భారత్ భావిస్తోంది. 

2015 నాటి‘గోర్ఖా భూకంపం నేపాల్‌ను కుదిపేసింది. ఈ విలయం తర్వాత ఎవరెస్ట్ ఎత్తు తగ్గిందనే సందేహాలు సర్వత్రా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నేపాల్ సర్వే డిపార్ట్ మెంట్ తో కలసి ఎవరెస్ట్ ఎత్తును కొలిచేందుకు సర్వే ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు పంపింది. నేపాల్ మాత్రం నిర్మోహమాటంగా ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. నేపాల్ ప్రభుత్వంపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చి చైనా ఈ పని చేయించి ఉంటుందని భారత్ అధికారులు అంటున్నారు. 

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఎవరెస్ట్ ఎత్తును కొలిచేందుకు భారత్ పంపిన ప్రతిపాదనలు తిరస్కరణ 
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : నేపాల్
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో ‘మన్‌కీ బాత్’ కార్యక్రమం హ్యాష్‌ట్యాగ్ అగ్రస్థానంలో నిలిచింది.ఈ విషయాన్ని ట్విటర్ డిసెంబర్ 28న అధికారికంగా వెల్లడించింది. ఈ ఏడాది అత్యధికంగా ఏయే అంశాలకు సంబంధించిన విషయాల గురించి నెటిజన్లు చర్చించారనేది వెల్లడించింది. ప్రతి నెల చివరి ఆదివారం ఆలిండియా రేడియోలో ప్రసారమయ్యే మోదీ ‘మన్‌కీ బాత్’ కార్యక్రమం ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. దీనిపై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ హ్యాష్‌ట్యాగ్ మన్‌కీ బాత్ అని చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. హ్యాష్‌ట్యాగ్ జల్లికట్టు, జీఎస్టీ (వస్తు, సేవల పన్ను), ముంబై వరదలు, ట్రిపుల్ తలాక్ ఈ ఏడాది ట్విటర్ టాప్ ట్రెండింగ్‌గా నిలిచాయి.
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
చైనా అక్రమ చొరబాట్లకు అడ్డుకట్ట వేసేందుకు భారత సైన్యం ఒంటెల సేవలను ఉపయోగించుకోబోతోంది.లడఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి చొరబాట్లను నిరోధించేందుకు ఒంటెలను మోహరించాలని భారత సైన్యం నిర్ణయించింది. సరిహద్దుల్లో గస్తీ తిరగడంతోపాటు, పెద్ద ఎత్తున ఆయుధాలు, ఇతర వస్తువులను రవాణా చేసేందుకు వీటిని ఉపయోగించుకోబోతోంది. రెండు మూపురాలు ఉన్న ఒంటెలు సుమారు 180 నుంచి 220 కేజీల బరువును మోస్తాయి. ఈ ఒంటెలు రెండు గంటల సమయంలో సుమారు 15 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. ప్రస్తుతం మన సైన్యం కంచరగాడిదలు, గుర్రాలను ఉపయోగించుకుంటోంది. రెండు మూపురాలు ఉండే ఒంటెలు లడఖ్‌లోని నూబ్రా లోయలో మాత్రమే కనిపిస్తాయి. ప్రయోగాత్మక ప్రాజెక్టు సఫలమైతే ఒకే మూపురంగల ఒంటెలకు కూడా శిక్షణ ఇస్తారని తెలుస్తోంది.
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
మాజీ ప్రపంచ చాంపియన్, భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.సౌదీ అరేబియాలోని రియాద్‌లో జరిగిన టోర్నీలో ఆద్యంతం అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆనంద్ నిర్ణీత 15 రౌండ్లు ముగిసేసరికి 10.5 పాయింట్లతో వ్లాదిమర్ ఫెడసీవ్ (రష్యా)తో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. అయితే కచ్చితమైన ఫలితం కోసం ఇరువురి మధ్య నిర్వహించిన రెండు టైబ్రేక్ మ్యాచ్‌ల్లో విజయం సాధించిన ఆనంద్.. టైటిల్ విజేతగా నిలిచాడు. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్ పెంటేల హరికృష్ణ 9.5 పాయింట్లతో 16వ స్థానంలో నిలిచాడు. మహిళల విభాగంలో ద్రోణవల్లి హారిక 15 రౌండ్లు ముగిసేసరికి 9 పాయింట్లతో 22వ స్థానాన్ని సంపాదించింది. 

క్విక్ రివ్యూ:
ఏమిటి : వరల్డ్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : విజేత విశ్వనాథన్ ఆనంద్ 
ఎక్కడ : రియాద్, సౌదీ అరేబియా
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
అంతర్జాతీయంగా మొండిబకాయిల భారం (ఎన్‌పీఏ) మోస్తున్న దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో నిలిచింది.అలాగే... బ్రిక్స్ (బ్రిటన్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాల్లో భారత్‌తే మొదటి స్థానం. ఈ మేరకు డిసెంబర్ 28న ఓ నివేదిక విడుదల చేసిన కేర్ రేటింగ్స్..భారత బ్యాంకుల మొండి బకాయిల భారం రూ.9.5 లక్షల కోట్లని పేర్కొంది. మొత్తం రుణాల్లో ఈ పరిమాణం దాదాపు 10 శాతం. ఈ విషయంలో భారతదేశం హై రిస్క్ కేటగిరీలో నిలిచింది. 

యూరోపియన్ యూనియన్‌లో(ఈయూ) ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నాలుగు దేశాలు-గ్రీస్ (36.4%), ఇటలీ (16.4 శాతం), పోర్చుగల్ (15.5 శాతం), ఐర్లాండ్ (11.9 శాతం) మొండి బకాయిల భారాన్ని మోస్తున్నాయి. ఈ నాలుగు దేశాలు జాబితాలో మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. భారత్ తరువాత ఆరవ స్థానంలో రష్యా (9.7 శాతం), ఏడవ స్థానంలో స్పెయిన్ (5.3 శాతం) నిలిచాయి. 

ఎన్‌పీఏల సమస్యను కేర్ నాలుగు కేటగిరీలుగా (లో, వెరీ లో, మీడియం, హై లెవెల్) విభజించింది. కేవలం ఒక శాతం ఎన్‌పీఏలను ఎదుర్కొంటున్న దేశాల్లో (లో కేటగిరీ) ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, బ్రిటన్ ఉన్నాయి. చైనా, జర్మనీ, జపాన్, అమెరికాల్లో ఈ సమస్య రెండు శాతంగా (రెండవ కేటగిరీ) ఉంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు- బ్రెజిల్, ఇండోనేసియా, దక్షిణాఫ్రికా, టర్కీలు మూడవ కేటగిరీలో ఉన్నాయి. 

క్విక్ రివ్యూ:
ఏమిటి : మొండి బకాయిల్లో 5వ స్థానంలో భారత్ 
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : కేర్ రేటింగ్స్
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆస్తులను అన్న ముకేశ్ అంబానీ టెలికం కంపెనీ రిలయన్స్ జియో కొనుగోలు చేయనుంది.ఆర్‌కామ్‌కు చెందిన స్పెక్ట్రమ్, మొబైల్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్, మీడియా కన్వర్జన్స్ నోడ్స్ ను (ఎంసీఎన్) రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కొనుగోలు చేయబోతోంది. ఈ మేరకు ఒక నిశ్చయాత్మకమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని రిలయన్‌‌స జియో తెలిపింది. ఈ డీల్ విలువ రూ.24,000 - 25,000 కోట్ల శ్రేణిలో ఉండొచ్చని బ్యాంకింగ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ.45,000 కోట్ల రుణ భారంతో కుదేలైన ఆర్‌కామ్‌కు ఈ ఆస్తుల విక్రయంఊరటనిచ్చే విషయం. ఈ డీల్ వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య పూర్తయ్యే అవకాశాలున్నాయని అంచనా. 

క్విక్ రివ్యూ:
ఏమిటి : రిలయన్స్ కమ్యూనికేషన్స్‌ను కొనుగోలు చేయనున్న రిలయన్స్ జియో 
ఎప్పుడు : డిసెంబర్ 28 
ఎవరు : ఆర్‌కామ్, జియో మధ్య ఒప్పందం
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
హైదరాబాద్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డికి ‘ఐఎంఏ డాక్టర్ ఎంజీ గార్గ్ జీవిత సాఫల్య పురస్కారం’లభించింది.ముంబైలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.కె.అగర్వాల్ చేతుల మీదుగా డిసెంబర్ 28న ఆయన ఈ అవార్డు అందుకున్నారు. పురస్కార ప్రదాన కార్యక్రమానికి వెయి్యమంది ప్రసిద్ధ వైద్యులు హాజరయ్యారు. 

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐఎంఏ జీవిత సాఫల్య పురస్కారం 
ఎప్పుడు : డిసెంబర్ 28 
ఎవరు : డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
గగనతల రక్షణ కోసం దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన సూపర్‌సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతమైంది.తక్కువ ఎత్తు నుంచి (30 కిలోమీటర్ల లోపు) వచ్చే ఎటువంటి ఖండాంతర క్షిపణులనైనా ఇది ధ్వంసం చేయగలదు. ఈ ఏడాది ఇప్పటివరకు ఇలాంటి మూడు క్షిపణులను భారత్ విజయవంతంగా పరీక్షించింది. వివిధ ఎత్తుల్లో ఖండాంతర క్షిపణుల నుంచి పూర్తి స్థాయి రక్షణ కోసం ఈ ఏడాది మార్చి 1న, ఫిబ్రవరి 11న రెండు పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. 

డిసెంబర్ 28న నిర్వహించిన మూడోపరీక్షలో చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ప్రదేశం నుంచి పృథ్వీ క్షిపణిని ప్రయోగించారు. రాడార్స్ నుంచి సిగ్నల్స్ రాగానే బంగాళాఖాతంలోని అబ్దుల్ కలాం (వీలర్ ద్వీపం) ద్వీపంలో ఉన్న సూపర్‌సోనిక్ క్షిపణి వెంటనే పృథ్వీ క్షిపణిని అడ్డుకుని ధ్వంసం చేసిందని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. భూమికి సుమారు 15 కిలోమీటర్ల ఎత్తులోనే ఏఏడీ పృథ్వీని అడ్డుకుని ధ్వంసం చేసిందని పేర్కొన్నాయి. 7.5 మీటర్ల పొడవుండే ఈ క్షిపణిలో నావిగేషన్ సిస్టంతో పాటు హైటెక్ కంప్యూటర్‌ను కూడా అనుసంధానం చేశారు. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్ తర్వాత ఈ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్న నాలుగో దేశం భారత్.

క్విక్ రివ్యూ:
ఏమిటి : సూపర్‌సోనిక్ క్షిపణి పరీక్ష విజయవంతం 
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : భారత సైన్యం
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
తక్షణ ట్రిపుల్ తలాక్‌ను చట్టవ్యతిరేకంగా గుర్తించి భర్తకు మూడేళ్ల జైలుశిక్ష విధించే ‘ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు’కు డిసెంబర్ 28న లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది.బిల్లును వ్యతిరేకిస్తూ పలు పక్షాల ఎంపీల ఆందోళనల మధ్యే.. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చ సందర్భంగా ఒవైసీ సహా పలువురు విపక్ష సభ్యులు సూచించిన సవరణలను తిరస్కరించిన అనంతరం లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందింది. 

బిల్లులో ఏముంది..
ట్రిపుల్ తలాక్ చట్టంగా పేర్కొంటోన్న ముస్లిం మహిళల(వివాహ హక్కుల పరిరక్షణ )బిల్లులో పలు కఠిన నిబంధనల్ని పొందుపరిచారు. చట్టాన్ని అతిక్రమించి ముస్లిం పురుషుడు తక్షణం అమల్లోకి వచ్చే విడాకుల కోసం భార్యకు ట్రిపుల్ తలాక్ చెపితే మూడేళ్ల జైలు శిక్షకు అవకాశం కల్పించారు. బిల్లు చట్టంగా మారితే కశ్మీర్ తప్ప దేశమంతటా అమల్లోకి వస్తుంది. 

రాతపూర్వకంగా లేక మొబైల్, ఈ-మెయిల్ వంటి ఎలక్ట్రానిక్ విధానంలో సహా ఏ రూపంలో చెప్పినా ట్రిపుల్ తలాక్ చెల్లదు. అలాగే చట్ట వ్యతిరేకం కూడా.

బిల్లులో ట్రిపుల్ తలాక్‌ను కేసు పెట్టదగిన(కాగ్నిజబుల్), నాన్ బెయిలబుల్ నేరంగా పేర్కొన్నారు. భార్యకు తలాక్ చెప్పిన భర్తకు జరిమానాతో సహా గరిష్టంగా మూడేళ్ల వరకూ జైలు శిక్ష విధించవచ్చు. బాధిత మహిళ తన కోసం, పిల్లల కోసం భర్త నుంచి జీవన భృతిని కోరే హక్కును బిల్లులో కల్పించారు. కేసును విచారించే ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ జీవన భృతి మొత్తాన్ని నిర్ణయిస్తారు.

మైనర్ పిల్లల్ని తన కస్టడీకి అప్పగించమని బాధిత మహిళ కోరే హక్కును బిల్లులో పొందుపరిచారు. పిల్లల కస్టడీపై మేజిస్ట్రేట్ నిర్ణయం తీసుకుంటారు. - తక్షణం అమల్లోకి వచ్చే విడాకుల కోసం ముస్లిం పురుషుడు చెప్పే ట్రిపుల్ తలాక్ లేక ఇతర రూపాల్లో చెప్పే తలాక్ పద్ధతుల్ని బిల్లులో తలాక్‌గా నిర్వచించారు. ముస్లిం వ్యక్తిగత చట్టాలకు అనుగుణంగా ట్రిపుల్ తలాక్‌ను ఆచరిస్తున్నారు. దాని ప్రకారం.. ముస్లిం పురుషుడు తన భార్యకు అప్పటికప్పుడు మూడు సార్లు తలాక్ చెపితే తక్షణం విడాకులు మంజూరవుతాయి.

సుప్రీంకోర్టు ఏం చెప్పింది..
ట్రిపుల్ తలాక్ ద్వారా అప్పటికప్పుడు ముస్లిం పురుషుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధమని 2017 ఆగస్టు 22న సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ట్రిపుల్ తలాక్ ఖురాన్‌కు వ్యతిరేకమనీ ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. ధర్మాసనంలోని జస్టిస్ జోసెఫ్ కురియన్, జస్టిస్ నారిమన్, జస్టిస్ లలిత్‌లు ట్రిపుల్ తలాక్‌ను వ్యతిరేకించగా.. జస్టిస్ ఖేహర్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌లు మాత్రం ట్రిపుల్ తలాక్‌ను షరియా చట్టాలు ఆమోదిస్తున్నందున.. అది మత స్వేచ్ఛను ప్రసాదిస్తున్న ఆర్టికల్ 25 కిందకు వస్తుందని పేర్కొన్నారు. చివరకు 3-2 తేడాతో ట్రిపుల్ తలాక్ చెల్లదని సుప్రీం తీర్పునిచ్చింది.
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు రచించిన ‘బతుకుపోరు, విలువలు’పుస్తకాన్ని డిసెంబర్ 28న బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించారు.రాములు.. 90కిపైగా పుస్తకాలు రాసి బహుగ్రంథ కర్తగా పేరొందారు. తత్వశాస్త్రంతోపాటు తెలంగాణ వాస్తవ జీవన చిత్రంపై కథలు, నవలలు, కథానికలు, సాహిత్య విమర్శ, బీసీ సామాజిక వర్గాలపై రచనలు చేశారు. 

క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘బతుకుపోరు, విలువలు’ పుస్తకాన్ని ఆవిష్కరించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 
ఎప్పుడు : డిసెంబర్ 28
ఎవరు : రచయిత బీఎస్ రాములు
🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
[12/30/2017, 10:00] ‪+91 95020 29120‬: *రాష్ట్రీయం*

1) ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ప్రస్తుతం భారత్ లో జరుగుతోంది. అసలు ఈ సదస్సును మొదట ఎప్పుడు నిర్వహించారు ?
జ: 2010 వాషింగ్టన్ లో
(నోట్: ఇస్తాంబుల్, దుబాయ్, మరకేష్, నైరోబీ, కౌలాలంపూర్, సిలికాన్ వ్యాలీల్లో జరిగాయి)

2) హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు ఎన్నోవది ?
జ: ఎనిమిది

3) హైదరాబాద్ HICC లో ప్రపంచ పారిశ్రామిక సదస్సు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోంది ?
జ: నీతి ఆయోగ్

4) హైదరాబాద్ లో జరుగుతున్న 8వ ప్రపంచ పారిశ్రామిక సదస్సుకు ఎంత శాతం మంది మహిళా పారిశ్రామికవేత్తలు హాజరవుతున్నారు ?
జ: 52.5 శాతం

5) GES ప్రారంభోత్సవం తర్వాత 29నాడు ఇవాంక ఏ చర్చలో పాల్గొంటారు ?
జ: ఇన్నోవేషన్ ఆన్ వర్క్ ఫోర్స్ డెవలప్ మెంట్ అండ్ స్కిల్స్ ట్రైనింగ్
(నోట్: ఈ చర్చలో మోడరేటర్ గా మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తారు )

6) భారత్ లో అమెరికా రాయబారి ఎవరు ?
జ: కెన్నెత్ ఇ. జస్టర్

7) ప్రస్తుతం నీతి ఆయోగ్ CEO ఎవరు ?
జ: అమితాబ్ కాంత్

8) ప్రధాని నరేంద్రమోడీ, అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంక ట్రంప్ సహా ప్రముఖులకు ఎక్కడ తయారు చేయించిన జ్ఞాపికలను అందించనున్నారు ?
జ: కరీంనగర్ ఫిలిగ్రీ కళాకారులు

9) గ్రేటర్ మెట్రో రైలు ప్రాజెక్ట్ అంచనా వ్యయం ఎంత ?
జ: రూ.16,830 కోట్లు

10) హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును నిర్మిస్తున్న సంస్థ ఏది ?
జ:  L & T
(నోట్: ప్రపంచంలోనే పబ్లిక్ – ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మిస్తున్న అతి పెద్ద మెట్రో ప్రాజెక్ట్ ఇదే)

11) మెట్రో రైలు ప్రాజెక్టును మొదట ఎప్పుడు ప్రారంభించారు ?
జ: 2007 మే 14న

12) జాతీయ స్థాయిలో ఉత్తమ అవయవదాన అవార్డు అందుకున్న రాష్ట్రానికి చెందిన హాస్పిటల్ ఏది ?
జ: యశోదా హాస్పిటల్

*జాతీయం*

13) 15వ ఆర్థిక సంఘం ఛైర్మన్ గా ఎవరు నియమిస్తూ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు ?
జ: ఎన్ కే సింగ్
(నోట్: ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు )

14) 15వ ఆర్థిక సంఘం ఎప్పటి వరకూ కేంద్రానికి నివేదిక అందిస్తుంది ?
జ: 2019 అక్టోబర్

15) ఉగ్రవాదంపై పోరులో సహకరించుకోవాలని భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది ?
జ: రష్యాతో

(నోట్: 1993లో ఈ రెండు దేశాలమధ్య కుదిరిన ఒప్పందం స్థానంలో కొత్తది అమల్లోకి వస్తుంది )

16) లవ్ జిహాద్ కేసుగా పరిగణించి ఎవరు చేసుకున్న వివాహాన్ని కేరళ హైకోర్టు రద్దు చేసింది?
జ: హదియా

17) పంచాయతీయ రాజ్ సంస్థల్లో గెలిచిన మహిళా ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ఢిల్లీలో ఎవరు ప్రారంభించారు ?
జ: మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ
18) సూర్యుడిపై ప్రయోగాలకు భారత్ మొదటిసారి 2019లో పంపుతున్న శాటిలైట్ మిషన్ ఏది  ?
జ: ఆదిత్య L1 మిషన్

19) ఆదిచుంచనగిరి వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది ?
జ: కర్ణాటక

20) ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) కు డైరక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు ?
జ: సౌమ్యా స్వామినాథన్

21) మూడోసారి ప్రపంచ స్నూకర్ టైటిల్ ను ఎవరు గెలుచుకున్నారు ?
జ: భారత్ క్యూ స్పోర్ట్స్ (బిలియర్డ్స్, స్నూకర్) స్టార్ పంకజ్ అద్వానీ

22) 2017 IITF ఛాలెంజ్ స్పానిష్ ఓపెన్ సింగిల్స్ లో బంగారు పతకం గెలుచుకున్న సాతియాన్ జ్ఞానశేఖరన్ ఏ రాష్ట్రానికి చెందినవారు ?
జ: తమిళనాడు

23) ఆసియాన్ మారథాన్ ఛాంపియన్షిప్ ను గెలుచుకున్న మొదటి భారతీయుడు గోపీ తొనకాల్ ఏ రాష్ట్రానికి చెందినవారు ?
జ: కేరళ

*అంతర్జాతీయం*

24) విశ్వసుందరి 2017 కిరీటం దక్కించుకున్నది ఎవరు ?
జ: డెమీలే -నెల్ పీటర్స్ (దక్షిణాఫ్రికా)

25) భారత్ నుంచి విశ్వసుందరి కిరీటానికి పోటీ పడిన యువతి ఎవరు ?
జ: శ్రద్ధా శశిధర్

26) ఇండోనేషియాలోని బాలీలో ఏ అగ్నిపర్వతం నుంచి భారీ ఎత్తున లావా, దుమ్మూ ఎగసిపడుతున్నాయి ?
జ: అగుంగ్

27) బంగ్లాదేశ్ తిరుగుబాటు కేసులో 139మందికి విధించిన మరణశిక్ష, 146 మంది సైనికులకు పడిన యావజ్జీవ శిక్షలను బంగ్లాదేశ్ హైకోర్టు ఖరు చేసింది.  ఈ సంఘటన ఎప్పుడు జరిగింది ?

జ: 2009 ఫిబ్రవరిలో

No comments:

Post a Comment