AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Monday 5 February 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 11 2018

🛑 *🌏 చరిత్రలో ఈరోజు 🌎*

      🗓 *జనవరి 11* 🗓

     *🏞సంఘటనలు*🏞

1613: సూరత్‌లో వ్యాపారం చేసుకొనేందుకు అర్థించిన ఈస్టిండియా కంపెనీకి మొఘల్‌ చక్రవర్తి జహాంగీర్ అనుమతులిచ్చాడు.

1713: 9వ మొఘల్ చక్రవర్తిగా ఫర్రుక్‌సియార్  రాజ్యాధికారాన్ని చేపట్టాడు.

1922: మొదటిసారి చక్కెర వ్యాధి (డయాబెటిస్) రోగులకు ఇన్సులిన్ని ఉపయోగించారు.

1958: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ  ఏర్పడింది. 1932లోనే నిజాం ప్రభుత్వం సుమారు నాలుగు లక్షల రూపాయల పెట్టుబడితో 27 బస్సులూ 166 మంది సిబ్బందితో ట్రాన్స్‌పోర్ట్‌ సంస్థను నెలకొల్పినా అది నిజాంరైల్వేలో భాగంగా ఉండేది.

1960: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్ట మొదటి ముఖ్యమంత్రిగా నీలం సంజీవ రెడ్డి పదవీ విరమణ (1956 నవంబరు 1 నుంచి 1960 జనవరి 11 వరకు).

1960: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెండవ ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య ప్రమాణ స్వీకారం (1960 జనవరి 11 నుంచి 1962 మార్చి 29 వరకు).

*🌻🌻జననాలు*🌻🌻

1968: శ్రీనివాస్ రామడుగుల, కవి సంగమంలో కవిత్వం వ్రాస్తుంటారు, భోపాల్ లో నివసిస్తున్నారు. దూరదర్శన్ కేంద్రంలో ఇంజినీర్ గా పనిచేస్తున్నారు

1973: భారత క్రికెట్ జట్టు క్రీడాకారుడు రాహుల్ ద్రవిడ్.

*🌹🌹మరణాలు*🌹🌹

1966: లాల్ బహాదుర్ శాస్త్రి, భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి. (జ.1904)

1983: భారతపారిశ్రామిక వేత్త మరియు విద్యావేత్త ఘనశ్యాం దాస్ బిర్లా (జననం.1894)

2008: ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్గేతో కలిసి ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కాడు. (జ.1919)

2012: వీరమాచనేని మధుసూదనరావు, తెలుగు సినిమా దర్శకులు, ఫిలిం ఇన్ స్టిట్యూట్ స్థాపించి ఎందరో నటుల్ని తీర్చిదిద్దారు

2016: కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె, ప్రముఖ రచయిత, తెలుగు పండితులు. (జ.1936)

2016: పల్లెంపాటి వెంకటేశ్వర్లు ప్రముఖ పారిశ్రామికవేత్త, కాకతీయ సిమెంట్స్‌ వ్యవస్థాపకుడు. (జ.1927)

*జాతీయ / అంతర్జాతీయ దినాలు*🔷

🔻జాతీయ విద్యాదినోత్సవం
⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇⬇

🛑 *💎 నేటి ఆణిముత్యం 💎*

అవని విభుండు నేరుపరియై  చరియించిన గొల్చువార లె
ట్లవగుణులైన నేమి , పనులన్నియు జేకుఱు వారిచేతనే 
ప్రవిమల నీతి శాలియగు రాముని కార్యము మర్కటంబులే
తవిలి యొనర్పవే  జలధి దాటి సురారుల ద్రుంచి భాస్కరా !

 *భావము :*

భాస్కరా  ! ఈ భూమి మీద రాజు నేర్పరి యైతే సేవకులు చేతకాని వాళ్లైనా ఆ పనులన్నీ  చక్కగా సమకూరుతూనే ఉంటాయి. ఎలాగంటే గొప్ప రాజనీతిజ్ఞుడైన శ్రీరామచంద్రుని కార్యాన్ని , వానరులే పూనుకొని , సముద్రాన్ని దాటి  , రాక్షసుల చంపి , ఘనకార్యాన్ని సాధించారు కదా !

🛑 *🤘 నేటి సుభాషితం🤘*

*మనమాటల్లో ఇష్టాన్ని,మనకళ్ళలో కష్టాన్ని తెలుసుకొన్నవారే నిజమైన స్నేహితులు.*

🛑 *👬 నేటి చిన్నారి గీతం 👬*

*తాతా తాతా...*

తాతా తాతా
బడి కొస్తావా,
రాలే నయ్యా 
రాలే నయ్యా...
తాతా తాతా
పొల మొస్తావా,
రాలే నయ్యా 
రాలే నయ్యా...
తాతా తాతా
ఊ రొస్తావా,
రాలే నయ్యా 
రాలే నయ్యా...
తాతా తాతా
పెళ్ళాడతావా,
అట్టా గయ్యా 
వస్తా నయ్యా...

🛑  *✍🏼 నేటి కథ ✍🏼*

*సందేహం*

అనగనగా ఒక రోజు ఒక బడిలొ బాలుడికి ఒక సందేహం వచ్చింది. అతని గురువుని వెళ్ళి అడిగాడు – “గురువుగారు, యెక్కువ మాట్లాడితే మంచిదా, తక్కువ మాట్లాడితే మంచిదా?” 

గురువుగారు చిరునవ్వుతొ ఈ జవాబు చెప్పారు. “కప్పకూత రాత్రి-పగలు వినిపిస్తూనే వుంటుంది, అయినా దాన్ని యెవ్వరూ పట్టించుకోరు. కాని కోడి ఒక్కే ఒక్క సారి కూస్తే ఊరంతా నిద్ర లేస్తుంది. దీని వల్ల అర్ధమయ్యేది యేమిటంటే, యెక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు. మాట్లాడేది ఒక మాటే అయినా, అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు.”
సందేహం తీరిన కుర్రవాదు సంతోషంగా వెళ్ళాడు. 

🛑 *✅ తెలుసుకుందాం ✅*
*⭕జనాభా లెక్కలను ఎందుకు సేకరిస్తారు?*

✳ప్రపంచంలోని దేశాలన్నీ జనాభా లెక్కలను (census) సేకరిస్తాయి. మానవులు సమూహాలుగా నివసించడం మొదలైన దగ్గర్నుంచీ ఈ ప్రక్రియ మొదలైందని చెప్పవచ్చు. ప్రాచీన కాలంలో రాజులు తమ పాలనలో ఉన్న ప్రజల్లో ఎంత మంది యుద్ధం చేయడానికి తగిన సామర్థ్యం కలిగి ఉన్నారో తెలుసుకోడానికి, పన్నుల రూపంలో ఖజానాకు ఎంత ధనం సమకూరుతుందో అంచనా వేయడానికి జనాభా లెక్కలను సేకరించేవారు. ప్రస్తుత కాలంలో ఇందువల్ల ప్రభుత్వానికి విద్య, ఆరోగ్య, ఉద్యోగ సంబంధిత రంగాలలో ప్రణాళికలు వేయడానికి, ఒకో రంగానికి ఆర్ధిక వనరులు ఎలా సమకూర్చాలో తెలుసుకోడానికి వీలవుతుంది. దేశంలో జనాభా పెరుగుతోందో, తగ్గుతోందో తెలుస్తుంది. పట్టణ, పల్లె ప్రాంతాల్లో ఉండే ప్రజల నిష్పత్తి తెలుస్తుంది. ఎన్నికలలో ఎంత మంది ఓటర్లు పాల్గొంటారో తెలిస్తే ఆ మేరకు ఏర్పాటు చేయడానికి కుదురుతుంది. అలాగే ఆర్ధిక, సాంఘిక వ్యవస్థలను, శాంతిభద్రతలను మెరుగుపరిచే నిర్ణయాలను తీసుకోడానికి వీలవుతుంది. మన దేశంలో తొలిసారిగా 1872లో జనాభా లెక్కలను సేకరించారు. అప్పటి నుంచి ప్రతి పదేళ్లకు ఓసారి లెక్కించడం ఆనవాయితీగా ఉంది. 

🛑 *📖 మన ఇతిహాసాలు 📓*

*కుచేలుడు*

కుచేలుడు శ్రీ కృష్ణుడి సహాధ్యాయి. ఈయన అసలు పేరు సుధాముడు. కుచేలోపాఖ్యానము మహా భాగవతము దశమ స్కందములో వస్తుంది. కుచేలుడు శ్రీ కృష్ణునికి అత్యంత ప్రియమైన స్నేహితుడు. శ్రీ కృష్ణుడు సాందీపని వద్ద విద్యాభ్యాసము చేస్తారు. అప్పుడు శ్రీ కృష్ణుడికి సహాధ్యాయి కుచేలుడు. విద్యాభ్యాసము అయ్యాకా శ్రీ కృష్ణుడు ద్వారక చేరుకొన్నాడు. కుచేలుడు తన స్వగ్రామము చేరుకొన్నాడు. కుచేలుడికి వివాహం జరుగుతుంది. చాలా పెద్ద సంతానం కలుగుతుంది. బండెడు సంతానముతో దరిద్రబాధ అనుభవిస్తూ ఉంటే కుచేలుడి భార్య లోక రక్షకుడైన శ్రీకృష్నుడిని దర్శనం చేసుకొని రమ్మంటుంది. కుచేలుడు ద్వారకా నగరము బయలు దేరబోయే ముందు కుచేలుని భార్య ఒక చిన్నఅటుకుల మూట కట్టి ఇస్తుంది. కుచేలుడు ద్వారక నగరము చేరుకొని అక్కడ ఉన్న దివ్యమైన భవనాలు రాజప్రాకారాలు చూసి ఈ రాజధానిలో నన్ను శ్రీకృష్ణుడిని కలవనిస్తారా అని సందేహ పడతాడు. తన మదిలో లోక రక్షకుడిగా భావించే శ్రీకృష్ణుడి దర్శనం లభిస్తుంది. శ్రీ కృష్ణుడు కుచేలుడిని స్వయంగా రాజ సభలోకి ఆహ్వానించి ఉచితాసనం ఇచ్చి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు తన శిరస్సు పై చల్లుకొంటాడు. ఆ విధంగా ఉపచారాలు అందుకొంటున్న కుచేలుడిని చూసిన సభలో ఉన్నవారు కుచేలుడి అదృష్టాన్ని కొనియాడుతారు.

సపర్యలు అయ్యాక కుచేలుడీతో శ్రీకృష్ణుడు చిన్ననాటి జ్ఞాపకాలు జ్ఞప్తికి తెచ్చుకొని ఒకసారి మన గురు పత్ని దర్భలు తెమ్మని పంపితే వర్షము పడడం వల్ల ఎంతకు రాక పోవడం వల్ల మన గురువుగారు మనల గురించి ఎంత కంగారు పడ్డారు అని కుచేలుడితో అంటాడు. తరువాత శ్రీకృష్ణుడు కుచేలునితో తనకు ఏమైన తీసుకొని వచ్చావా అని అడుగుతాడు. కుచేలుడు సిగ్గుతో తాను తెచ్చిన అటుకుల మూట దాచు తుంటే శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికి ఆ అటుకులు తింటాడు. రెండవ మారు మళ్ళీ ఆటుకులు గుప్పెటితో తిన బోతుంగా రుక్మిణి స్వామి మీరు మొదటి సారి అటుకులు తినడంవల్లే కుచేలునికి సర్వసంపదలు కలిగాయి అని చెబుతుంది. ఆ తరువాత కుచేలునికి వీడ్కోలు పలుకుతాడు.
🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊
INSPIRATION 
--------------------------
జీవితంలో 
మనతో ఒకడు 
పోరాడాలనుకుంటాడు ,
మోసం చేయాలనుకుంటాడు 
ముంచాలనుకుంటాడు 
తొక్కాలనుకుంటాడు 
పోల్చుకుంటాడు 
వెటకారం చేస్తాడు 
అవమాన పరుస్తాడు 
చెడు ప్రచారం చేస్తాడు 
ఎదుగుదలను ఓర్వడు 
ద్రోహం చేస్తాడు 
వెన్నుపోటు పొడుస్తాడు
నటిస్తాడు 
తక్కువ చేసి మాట్లాడుతాడు 
బలం గురించి కంటే బలహీనత గురించే మోగిస్తాడు 
జాలి చూపిస్తున్నట్లు ఉంటాడు 
డబ్బుతో పోలుస్తాడు
మన నష్టంతో
సంతోష పడుతాడు 
డప్పు కొడుతాడు 
చాప్టర్ క్లోజ్ అంటాడు..
నమ్మడు 
చేతకానిది ఎందుకు చేయాలి అంటాడు 
అలాగే కావాలి అంటాడు
ఇలా.......
ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో సందర్భాలు ,ఎన్నో సంఘటనల మధ్య నుండి జీవితం దూసుకుపోవాలి ...

*🗓 నేటి పంచాంగం 🗓*

*తేది :  11, జనవరి 2018*
సంవత్సరం : హేవిళంబినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : పుష్యమాసం
ఋతువు : హేమంత ఋతువు
కాలము : శీతాకాలం
వారము : గురువారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : దశమి
(నిన్న సాయంత్రం 5 గం॥ 30 ని॥ నుంచి ఈరోజు రాత్రి 7 గం॥ 13 ని॥ వరకు)
నక్షత్రం : విశాఖ
(ఈరోజు తెల్లవారుజాము 5 గం॥ 2 ని॥ నుంచి మర్నాడు ఉదయం 7 గం॥ 26 ని॥ వరకు)
యోగము : శూలము
కరణం : వణిజ
వర్జ్యం :
(ఈరోజు ఉదయం 11 గం॥ 11 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 56 ని॥ వరకు)(ఈరోజు ఉదయం 11 గం॥ 12 ని॥ నుంచి ఈరోజు ఉదయం 12 గం॥ 57 ని॥ వరకు)
అమ్రుతఘడియలు :
(ఈరోజు రాత్రి 9 గం॥ 45 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 30 ని॥ వరకు)(ఈరోజు రాత్రి 9 గం॥ 46 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 31 ని॥ వరకు)
దుర్ముహూర్తం :
(ఉదయం 10 గం॥ 31 ని॥ నుంచి ఉదయం 11 గం॥ 15 ని॥ వరకు)(మద్యాహ్నం 2 గం॥ 59 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 43 ని॥ వరకు)
రాహుకాలం :
(మద్యాహ్నం 1 గం॥ 46 ని॥ నుంచి సాయంత్రం 3 గం॥ 9 ని॥ వరకు)
గుళికకాలం :
(ఉదయం 9 గం॥ 35 ని॥ నుంచి ఉదయం 10 గం॥ 58 ని॥ వరకు)
యమగండం :
(ఉదయం 12 గం॥ 22 ని॥ నుంచి మద్యాహ్నం 1 గం॥ 45 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 48 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 58 ని॥ లకు
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : తుల

*🤘 నేటి సుభాషితం🤘*

*మనమాటల్లో ఇష్టాన్ని,మనకళ్ళలో కష్టాన్ని తెలుసుకొన్నవారే నిజమైన స్నేహితులు*

*🌴🌱పాఠశాల అసెంబ్లీ కోసం🌴🌱*

*💧సుభాషిత వాక్కు*

*"ఆశించి జీవించే వ్యక్తి లో నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే వ్యక్తి లో ఆత్మీయత ఉంటుంది."*

*"Be thankful for the bad things in Life. They open.your eyes to see the Good things you weren't paying attention to before..."*

*🔸మంచి పద్యం*

*మంచి వారి నాట మంచి ముత్యము కదా !*
*మంచి కాని దేది మనకు వద్దు*
*మంచి చెడులు తెలిసి మసలుకో మానవా*
*వాస్తవంబు వేమువారి మాట*

*🔹భావం:*

*ఓ వేము ! మంచివారి మాట బంగారు ముత్యాలతో సమానము. చెడ్డవారి మాట మేడిపండుతో సమానము. మంచి చెడుల మధ్య తారతమ్యము తెలుసుకొని నడుచుకోవాలి.*

*♦నేటి జీ కె*

*పధకాలు — ప్రారంభపు తేదీలు*

1. *ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన* (పిఎంఎంబీబీ) 11 అక్టోబర్ 2014

2. *ప్రధాన్ మంత్రి Gram సిన్చాయి యోజన* (PMGSY) 01 జూలై 2015

3. *ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాన్ యోజనే* (PMGKY) ఏప్రిల్ 2015

4. *ప్రధాన్ మంత్రి జన వృద్ధ యోజన* (PMJAY) మార్చి 2016

5. *స్వచ్చ్ భారత్ అభియాన్* 02 అక్టోబర్ 2014

6. *కిసాన్ వికాస్ పత్ర* 03 మార్చి 2015 (మళ్లీ ప్రారంభించబడింది)
💟💟💟💟💟💟💟💟💟

        --------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
        -------------------------
" ఒక గొప్పవాని గొప్పతనం అతడు తనకంటే తక్కువ వారితో వ్యవహరించిన తీరును బట్టి తెలుస్తుంది. "

                     _*కార్లయల్*_

       --------------------------
🌹 _*నేటీ మంచి మాట*_ 🌹
      ---------------------------
" డబ్బే ముఖ్యము అనుకునేవారికి మంచితనం తక్కువ మంచితనమే ముఖ్యము అనుకునేవారికి డబ్బు తక్కువ. "
💟💟💟💟💟💟💟💟💟
*📚✍దేశమంతా ఒకే*
 *స్టాంప్‌ డ్యూటీ!✍📚*

🌻అమరావతి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): దేశమంతా ఒకే స్టాంప్‌ డ్యూటీ అమలు చేయాలని జీఎస్టీ మండలి సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇది రాష్ట్రానికో రకంగా ఉండటంతో భారీ స్థాయిలో పన్ను ఎగవేతలు జరుగుతున్నాయని భావిస్తోంది. ఈ మేరకు సిద్ధం చేసిన ప్రతిపాదనలపై అన్ని రాష్ట్రాలకు చెందిన వాణిజ్యశాఖ అధికారులు గురువారం ఢిల్లీలో సమావేశం కానున్నారు.

🌻 ‘ఒకే దేశం- ఒకే పన్ను’ లక్ష్యంతో జీఎస్టీని అమల్లోకి తెచ్చినప్పటికీ.. జీఎస్టీ పరిధిలోకి రాని ఇతర పన్నుల కారణంగా కేంద్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతోందని రాష్ట్ర వాణిజ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇందులో స్టాంప్‌ డ్యూటీ ముఖ్యమైందని అంటున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ఒకే స్టాంప్‌ డ్యూటీ అమలుకు జీఎస్టీ మండలి నిర్ణయించిందని వారు పేర్కొన్నారు. 

🌻అలాగే రివర్స్‌ చార్జీల విధానాన్ని కూడా కొంతమేర సవరించాలని నిర్ణయించారు. ప్రస్తుత విధానం ప్రకారం... నమోదు చేసుకోని డీలర్ల వద్దనుంచి నమోదు చేసుకున్న డీలర్లు కొనుగోళ్లు జరిపితే.. ఆ కొనుగోలుకు సంబంధించిన పన్ను భారం నమోదు చేసుకున్న డీలర్‌పై పడుతుంది. ఆ మొత్తానికి కేంద్రం నుంచి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ వస్తుంది. ఆ తర్వాత నమోదు చేసుకున్న డీలర్‌ తన విక్రయాలపై మళ్లీ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇంత సంక్లిష్టమైన ప్రక్రియను సులభతరం చేయాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది. 

🌻ఈ మేరకు సిద్ధమైన ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించనున్నారు. అలాగే, ఏదైనా కొనుగోళ్లకు సంబంధించి డీలర్లకు వచ్చిన అడ్వాన్సులపై పన్ను వసూలు చేస్తున్నారు. సరఫరా పూర్తయిన తర్వాత ఇవ్వాల్సిన బ్యాలెన్స్‌పై కూడా పన్ను వేస్తున్నారు. ఇలా ఒకే కొనుగోలుపై రెండుసార్లు కాకుండా ఒకేసారి పన్ను వసూలు చేయాలని ప్రతిపాదనలు వచ్చాయి. 

🌻ఈ సమావేశంలో చర్చల అనంతరం ఇచ్చే నివేదికపై జీఎస్టీ మండలి ఈనెల 18న తుది నిర్ణయం తీసుకోనుంది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍కేంద్రీయ విద్యాలయాల్లో.. హిందూ ప్రార్థనాగీతమే ఎందుకు?*

 *♦కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు*

🌻న్యూఢిల్లీ, జనవరి 10: కేంద్రీయ విద్యాలయాల్లో మైనార్టీ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మనోభావాలకు విరుద్ధంగా హిందూ ప్రార్థనాగీతాన్ని అనుమతించడంపై సమాధానమివ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. 

🌻మధ్యప్రదేశ్‌కు చెందిన వీనాయక్‌ షా అనే వ్యక్తి ఈ మేరకు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌, జస్టిస్‌ నవీన్‌ సిన్హాలతో కూడిన ధర్మాసనం బుధవారం స్వీకరించింది. 

🌻వీనాయక్‌ తన పిటిషన్‌లో చేసిన అభియోగాలపై వైఖరేంటో తెలపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆ నోటీసుల్లో కోరింది. ‘సాంతం భగవంతుడు, హిందూ మతానికి సంబంధించిన ఈ ప్రార్థనాగీతం విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్కోణాన్ని దెబ్బతీసేలా ఉంది.

🌻 దీంతోపాటు, ఇది మైనార్టీ వర్గాలు, నాస్తికుల భావాలకు విరుద్ధంగా ఉంది. ఈ ప్రార్థనను దేశంలోని అన్ని కేంద్రీయ విద్యాలయాల్లో ఉదయం వేళల్లో ఆలపిస్తున్నారు’ అని వీనాయక్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

🌻 ఈ తరహా ప్రార్థనలు రాజ్యాంగ స్ఫూర్తికి, ఆర్టికల్‌ 28, 28 (1)లకు విరుద్ధమని పేర్కొన్నారు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍పిఎస్‌ఎల్‌వి-సి 40 ప్రయోగానికి నేడు కౌంట్‌డౌన్ ప్రారంభం*

🌻సూళ్లూరుపేట, జనవరి 10: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపడుతున్న నూరో ప్రయోగానికి అంతా సిద్ధమైంది. స్వదేశీ ఉపగ్రహ ప్రయోగంలో సెంచరీకి సమాయత్తమైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శుక్రవారం ఉదయం 9గంటల 28నిమిషాలకు పిఎస్‌ఎల్‌వి-సి 40 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. 

🌻ఈ ప్రయోగానికి సంబంధించిన మిషన్ రెడీనెస్ రివ్యూ సమావేశం (ఎంఆర్‌ఆర్) బుధవారం సాయంత్రం షార్‌లోని బ్రహ్మప్రకాష్ హాలులో జరిగింది.
ఈ సమావేశంలో సీనియర్ శాస్తవ్రేత్తలు పాల్గొని ప్రయోగం పై సుదీర్ఘంగా చర్చించారు. ఎంఆర్‌ఆర్ అనంతరం షార్ డైరెక్టర్ పి కున్హికృష్ణన్ అధ్యక్షతన లాంచింగ్ ఆథరైజేషన్ బోర్డు (ఎల్‌ఎబి) సమావేశమై ప్రయోగానికి సంసిద్ధత తెలిపారు.

🌻 ప్రయోగానికి సంబంధించిన కౌంటౌడౌన్ గురువారం ఉదయం 5గంటల 28నిమిషాలకు ప్రారంభం కానుంది. ఈ రాకెట్ ద్వారా 710 కిలోల బరువుగల స్వదేశీ వందో ఉపగ్రహమైన కార్టోశాట్-2ఇఆర్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. దీంతోపాటు మరో 30 ఉపగ్రహాలను ఒకేసారి రోదసీలోకి పంపనున్నారు.

🌻కార్టోశాట్‌తోపాటు పిఎస్‌ఎల్‌వి-సి 40 రాకెట్ మోసుకెళ్తున్న మరో 30 ఉపగ్రహాల్లో ఇంకో రెండు భారత్‌కు చెందినవే. ఇందులో ఒకటి మైక్రో శాటిలైట్ కాగా రెండోవది నానో శాటిలైట్. మిగిలిన 28 ఉపగ్రహాల్లో అమెరికా,ఫ్రాన్సు, కెనడా,రిపబ్లిక్ ఆఫ్ కొరియా, బ్రిటన్, ఫిన్‌లాండ్ దేశాలకు చెందిన 3మైక్రో, 25నానో శాటిలైట్లు ఉన్నాయి. 

🌻వీటి మొత్తం బరువు1323కిలోల బరువు. స్వదేశీ ఉపగ్రహ ప్రయోగాల్లో వందోది కావడంతో ఇస్రో చరిత్రలో ఈ ప్రయోగం కూడా చరిత్రాత్మకం కానుంది. గురువారం ప్రారంభమైన కౌంట్‌డౌన్ సజావుగా 28గంటలు కొనసాగినంతరం షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్‌ఎల్‌వి-సి 40 రాకెట్ 31 ఉపగ్రహాలను మోసుకొని నింగిలోకి దూసుకెళ్లనుంది.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
*📚✍ప్రయివేటు మెడికల్‌ కాలేజీలకు పండగ✍📚*

*♦- సామాన్యులకు వైద్య విద్య దూరం* 

*♦- ఎన్‌ఎంసి బిల్లుతో ఇష్టారాజ్యంగా సీట్లు, ఫీజుల పెంపు* 

*♦- బ్రిడ్జి కోర్సుతో సంప్రదాయ వైద్యానికి లైసెన్సులు*

*♦- ఐఎంసి నిబంధనలకు విరుద్ధమంటున్న నిపుణులు* 

*♦- బిల్లును వ్యతిరేకిస్తున్న వైద్యులు*

*💥ప్రజాశక్తి - అమరావతి బ్యూరో:*

🌻ప్రజల ప్రాణాలు కాపాడే వైద్య విద్యను అభ్యసించడం రానున్న రోజుల్లో సామాన్యులకు అందని ద్రాక్షలా మారే ప్రమాదమేర్పడుతోంది. మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ( ఎంసిఐ ) స్థానంలో జాతీయ మెడికల్‌ కమిషన్‌ ( ఎన్‌ఎంసి )ను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

🌻ఎన్‌ఎంసి బిల్లును వ్యతిరేకిస్తూ ఇప్పటికే దేశవ్యాప్తంగా వైద్యులు ఆందోళనలు చేశారు. ఎంసిఐ తనిఖీల్లో లోపాలు, పలు అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో దానిని రద్దు చేసి, ఎన్‌ఎంసిని తీసుకొస్తామని కేంద్రం చెబుతోంది. ఈమేరకు క్యాబినెట్‌లో కూడా ఆమోదించింది. అయితే ఎన్‌ఎంసి ముసాయిదా బిల్లులో పొందు పరిచిన అంశాల్ని పరిశీలిస్తే ఎంసిఐ కంటే మరింత అవినీతికి ఆస్కారమున్నట్లు పలువురు వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఎన్‌ఎంసి లో వైద్య రంగం కంటే ప్రభుత్వం నామినేట్‌ చేసిన సభ్యులే ఎక్కువగా ఉండడం ప్రధాన లోపంగా కనిపిస్తోంది. దీంతో వైద్యరంగం నాణ్యత మరింత తగ్గుతుందని వైద్య సంఘాలు ఆందోళన వక్తం చేస్తున్నాయి. 

🌻ప్రతి ఏటా వైద్య కళాశాలలకు అడ్మిషన్లు ఇచ్చే ప్రక్రియలో ఆయా కాలేజీల్ని ఎంసిఐ తనిఖీ చేసి తగిన సదుపాయాలున్నాయా, తగినంత మంది బోధనా సిబ్బంది ఉన్నారా లేదా అనే అంశాల్ని పరిశీలించి అనుమతులిస్తుంది. అయితీ కేంద్రం తీసుకువచ్చే ఎన్‌ఎంసి ద్వారా అసలు మెడికల్‌ కాలేజీలకు తనిఖీ, లైసెన్సు రెన్యువల్‌ లేకుండానే ఒకేసారి అనుమతులొస్తాయి. దీని ద్వారా వైద్య విద్య నాణ్యత మరింత తగ్గుతుందని పలువురు నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాక ఎన్‌ఎంసితో ప్రయివేటు మెడికల్‌ కాలేజీల్లో ఫీజుల్ని ఆయా యాజమాన్యాలు తమ ఇష్ట ప్రకారం నిర్ణయించుకోవచ్చు. దీంతో ప్రయివేటు కాలేజీలు ఇష్టారాజ్యంగా ఫీజుల దోపిడీకి మార్గం సులువవుతుంది.

🌻బ్రిడ్జి కోర్సుతో ప్రజల ప్రాణాలకు ముప్పు 
సంప్రదాయ వైద్య విధానాలైన ఆయుష్‌ ( ఆయుర్వేదం, యోగ, సిద్ధ, యునాని, హోమియోపతి ) వైద్య విద్యను అభ్యసించేవారు అల్లోపతి ( ఆధునిక వైద్యం ) చేసేందుకు అర్హులుగా బ్రిడ్జి కోర్సును కేంద్రం ఈ బిల్లులో ప్రతిపాదించింది. అయితే అల్లోపతి వైద్యులంతా ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ చట్టం సెక్షన్‌ 15 ప్రకారం ఈ నిర్ణయం విరుద్ధమని పలువురు నిపుణులు చెబుతున్నారు. సంప్రదాయ వైద్య కోర్సు చేసిన వారికి రిజిస్ట్రేషన్‌ అర్హత పరీక్ష ద్వారా వారికి లైసెన్స్‌ ఇచ్చి ఆధునిక వైద్యం చేసేందుకు అనుమతులివ్వడం ప్రజల ప్రాణాలకే ముప్పు అని చెబుతున్నారు. ఇప్పటికే పలువురు హోమియో, ఆయుర్వేద వైద్యులు అనధికారికంగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేకుండానే ఆధునిక వైద్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. వాటి పై ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా ఎలాంటి పర్యవేక్షణ, నియంత్రణ లేదు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో అనధికారిక ప్రాక్టీస్‌కు ప్రభుత్వమే అధికారికంగా చేసుకునే వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేస్తోందని విమర్శిస్తున్నారు.

*👉ఎన్‌ఎంసిలో ప్రధానాంశాలు:*

🌻- సంప్రదాయ వైద్య విద్య అభ్యసించిన గ్రాడ్యుయేట్లు బ్రిడ్జి కోర్సుతో రిజిస్ట్రేషన్‌ చేసుకుని అధికారికంగా ఆధునిక వైద్యం చేసుకునేందుకు వెసులుబాటు
- ప్రయివేటు కళాశాలల్లో కేవలం 40 శాతం సీట్లపై మాత్రమే ప్రభుత్వ నియంత్రణ ఉంటుంది. మిగిలిన సీట్ల ఫీజుల్ని ఆ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా నిర్ణయించుకోవచ్చు.

- ప్రస్తుతం ఎంసిఐ నిబంధనల ప్రకారం విదేశాల్లో వైద్య విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు మన దేశంలో ప్రాక్టీస్‌ చేయాలంటే ఎంసిఐ రిజిస్ట్రేషన్‌ కోసం తప్పనిసరిగా పరీక్ష పాసవ్వాలి. కానీ ఎన్‌ఎంసి వస్తే ఈ నిబంధనకు స్వస్తి చెప్పనున్నారు. దీంతో ఇతర దేశాల్లో వైద్య విద్యార్థులు కూడా మన దేశంలో ఇష్టమొచ్చినట్లు మెడికల్‌ ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు.

- ఎన్‌ఎంసిలో ప్రభుత్వం నామినేట్‌ చేసే వారంతా వైద్యరంగానికి చెందినవారు కాకుండా న్యాయ శాఖ, చార్టర్డ్‌ అకౌంట్‌ వంటి ఇతర రంగాలకు సంబంధించిన వారు ఉంటారు. 
- వైద్యులు తమ రంగం నుంచి నామినేట్‌ చేసి, సభ్యుల్ని ఎన్నుకునే హక్కును కోల్పోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్‌ఎంసిలో 25 మంది సభ్యులుంటే కేవలం ఐదుగురే వైద్య రంగం నుంచి ఎన్నికైన వారుంటారు. 

- వైద్య విద్య, సీట్ల విషయంలో రాష్ట్రాలు తమ హక్కును కోల్పోయే ప్రమాదముంది.
- రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ స్వతంత్రతను కోల్పోయి పూర్తిగా ఎన్‌ఎంసి కింద పనిచేయాల్సి వస్తుంది.

- రాష్ట్రాల్లోని ఆరోగ్య విశ్వవిద్యాలయాలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు లేకుండా నామమాత్రమైన వైద్య సలహా మండలిలో మాత్రమే చోటు ఉంటుంది. ఎన్‌ఎంసిలో హెల్త్‌ యూనివర్శిటీలకు ప్రాతినిధ్యం లేదు.
🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇
✅ *ఎవ్వరికి వారే ఆధార్ వెరిఫికేషన్*✅
⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨⌨
🔊  *మీరు వాడుతున్న మొబైల్ నంబర్‌ను మీ ఆధార్ నంబర్‌తో రీ-వెరిఫై చేసుకోవాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతోంది.* 

🔊  *దీనికి తగ్గట్టుగానే ఆయా టెలీకాం కంపెనీలు కస్టమర్లను ఆధార్‌తో మీ మొబైల్ నంబర్‌ను రీ-వెరిఫై చేసుకోవాలని కోరుతున్నాయి.* 

🔊  *చాలా మంది ఇప్పటికే తాము వాడుతున్న నెట్‌వర్క్‌కు చెందిన రిటైల్ స్టోర్లకు వెళ్లి ఆధార్‌తో మొబైల్ నంబర్‌ను వెరిఫై చేసుకున్నారు.అయితే ఇంకా చేసుకోవాల్సిన వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు.* 

🔊  *అందుకే ఇప్పుడు ఈ ప్రక్రియను కేంద్రం మరింత సులభతరం చేసింది. ఇంటి నుంచే మీ మొబైల్ నంబర్‌కు ఆధార్ అనుసంధానం చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.* 

🔊  *ఐవీఆర్ పద్ధతి ద్వారా మీ ఫోన్ నుంచే ఈ ప్రక్రియను పూర్తిచేయొచ్చు.మీరు ఏ నెట్‌వర్క్ వాడుతున్నా ఒకే నెంబర్‌కు ఫోన్ చేసి ఆధార్‌ను లింక్ చేయొచ్చు.* 
🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊
🛑 *అదేలాగో ఇప్పుడు చూద్దాం.* 

🔊  *మీ వెరిఫై చేసుకోవాల్సిన మొబైల్ నంబర్ నుంచి 14546కు కాల్ చేయాలి.* 

🔊  *అప్పుడు మీరు భారత పౌరుడా లేదా ఎన్ఆర్ఐ కస్టమరా అని అడుగుతుంది.*

🔊 *మీరు ఒక ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత 1ని ప్రెస్ చేసి మీ ఆధార్ నంబర్‌ను పొందుపరచాలి.* 

🔊 *ఆధార్ నంబర్‌ను ఖరారు చేసుకోవడానికి మరొకసారి 1ని ప్రెస్ చేయాలి.* 

🔊 *ఇప్పుడు మీ మొబైల్‌కి ఒక వన్‌టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) వస్తుంది.*

🔊 *ఇప్పుడు మీ ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.* 

🔊 *యూఐడీఏఐ డాటా బేస్ నుంచి మీ పేరు, ఫొటో, పుట్టినతేదీని మీ ఆపరేటర్ తీసుకోవడం మీకు సమ్మతమేనా అని ఇక్కడ అడుగుతుంది.*
@@@@@
*🛑పెన్షన్’ ఇక నో టెన్షన్!*
ప్రభుత్వ ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం మరోసారి వరాల జల్లు కురిపించనుంది. ఈ ఏడాదిలోనే మరో రెండు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. 

పదకొండో వేతన సవరణ సంఘం ఏర్పాటుకు సన్నద్ధమవుతూనే మధ్యంతర భృతి ప్రకటించాలని యోచిస్తోంది.

 దీంతోపాటు *కొత్త ఉద్యోగులకు సంబంధించిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని(సీపీఎస్) రద్దు చేయాలని భావిస్తోంది*. 

మరో రెండు నెలల్లో ప్రవేశపెట్టనున్న 2018–19 రాష్ట్ర వార్షిక బడ్జెట్లో ఈ అంశాలను పొందుపరిచే అవకాశాలున్నాయి.

*🅾గ్రాట్యుటీ వద్దు.. రద్దే ముద్దు*

ఆర్థికంగా భారమైనప్పటికీ ఉద్యోగుల ప్రయోజనాల దృష్ట్యా సీపీఎస్ రద్దుకే సీఎం కేసీఆర్ మొగ్గుచూపుతున్నారు.

 సీపీఎస్ను రద్దు చేసి తమకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. 

2004 సెప్టెంబర్ 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన వారందరికీ సీపీఎస్ వర్తిస్తోంది. రాష్ట్రంలో దాదాపు 1.20 లక్షల మంది ఉద్యోగులు దీని పరిధిలో ఉన్నారు. వీరిలో పదవీ విరమణ చేసినవారికి పింఛన్ అందకపోగా.. చనిపోయిన కుటుంబాలకు కనీస ఆర్థిక సాయం కూడా అందటం లేదు.

అందుకే *కొత్త పెన్షన్ స్కీంను రద్దు చేసి వారిని పాత పెన్షన్ పథకంలో చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది.* అయితే ఇది ఆర్థిక భారమని పేర్కొంటూ ఆర్థిక శాఖ ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లింది. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు చెల్లిస్తున్నట్లుగా సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యుటీ చెల్లింపులను సిఫారసు చేసింది. కానీ భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా ఉద్యోగులు కోరినట్లుగానే పాత పెన్షన్ విధానంలో చేర్చేందుకు తగిన చర్యలు చేపట్టాలని, సాధ్యాసాధ్యాలపై నివేదిక అందించాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు సమాచారం.

*✡జూన్తో ముగియనున్న పీఆర్సీ గడువు*

పీఆర్సీకి సంబంధించి ఆర్థిక శాఖ పంపించిన ఫైలు ఇప్పటికే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు పరిశీలనలో ఉంది. ఇటీవలే అధికారులతో సీఎం ఈ విషయంపై చర్చించారు. ఈ సందర్భంగా పీఆర్సీ ఏర్పాటుతోపాటు మధ్యంతర భృతి (ఇంటీరియమ్ రిలీఫ్) ఇచ్చే అంశం చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటైన పదో పీఆర్సీ సిఫారసులే కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. 1998 నుంచి అమల్లో ఉన్న ఆనవాయితీ ప్రకారం అయిదేళ్లకోసారి ప్రభుత్వ ఉద్యోగుల వేతనాన్ని సవరిస్తారు. దీని ప్రకారం పదో పీఆర్సీ గడువు ఈ ఏడాది జూన్ 30తో ముగియనుంది.
జూలై ఒకటో తేదీ నుంచి పదకొండో వేతన సవరణ అమల్లోకి రావాల్సి ఉంటుంది. సాధారణంగా ఆర్నెళ్ల ముందే పీఆర్సీని ఏర్పాటు చేసి ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు వ్యవహారాలు, జీతభత్యాలు, పెన్షన్, గ్రాట్యుటీ ప్రయోజనాలన్నింటిపై సిఫారసులు స్వీకరించాల్సి ఉంటుంది. దీంతో కొత్త పీఆర్సీ ఎప్పుడు ఏర్పాటవుతుంది.. వేతన సవరణ ఏ మేరకు ఉంటుంది? అని ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరలోనే పీఆర్సీని ఏర్పాటు చేసేందుకు సీఎం సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిసింది.

*⚛జూలై నుంచే మధ్యంతర భృతి*
సాధారణంగా పీఆర్సీ వేయటం ఆలస్యమైన సందర్భాల్లో ప్రభుత్వం ముందస్తుగా మధ్యంతర భృతిని చెల్లిస్తుంది. ఆ తర్వాత పీఆర్సీ అమల్లోకి వచ్చిన తర్వాత ఇచ్చే ఫిట్మెంట్ (వేతన సవరణ) నుంచి ఇంటీరియమ్ రిలీఫ్ను సర్దుబాటు చేసుకుంటుంది. కొత్త పీఆర్సీ సిఫారసులు ఎప్పుడు అమల్లోకి వచ్చినా ఈ ఏడాది జూలై నుంచి ఉద్యోగులకు వేతన సవరణ చేయాల్సి ఉంటుంది. అందుకే జూలై నుంచే 25 శాతం నుంచి 30 శాతం వరకు మధ్యంతర భృతి ఇచ్చే ప్రత్యామ్నాయాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించినట్లు తెలిసింది. దాదాపు 5 లక్షల మంది ఉద్యోగులతో ముడిపడిన అంశమైనందున ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది? బడ్జెట్లో ఎంత మేర నిధులు కేటాయించాలన్న అంశాలపై నివేదిక రూపొందించాలని ఆర్థిక శాఖను ఆదేశించినట్లు సమాచారం.🌐🛑☯⛔🎾🌐🕉🕉🛑🛑☯⚛
*🤔ప్రాథమిక పాఠశాలల్లో కనీస విద్యా సామర్థ్యాలేవీ?*

🔷‘3ఆర్‌’పై దృష్టి పెట్టని ఉపాధ్యాయులు 

🔷పాఠశాల విద్యా శాఖ తనిఖీల్లో వెల్లడి 

🔷నిర్లక్ష్యంగా ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం

🔷ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలు పెరిగాయి

🔷మళ్లీ 19, 20 తేదీల్లో సమీక్ష

♦ సర్కారు బడుల్లో చదివే విద్యార్థుల్లో కనీస విద్యా సామర్థ్యాలు పెంచాలన్న లక్ష్యంతో తెలుగు, ఆంగ్లం, గణితంపై 3ఆర్‌ (రీడింగ్‌-రైటింగ్‌-అర్థమెటిక్‌) కార్యక్రమాన్ని చేపట్టినా.. ప్రాథమిక పాఠశాలల్లో అది సక్రమంగా అమలు కాలేదని తేలింది. అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో 3ఆర్‌ కార్యక్రమం ఎలా అమలైంది, పుస్తకాల in బరువు ఎలా ఉంది తదితర అంశాలను 10 బృందాలు ఈ నెల 3 నుంచి 9వ తేదీ వరకు తనిఖీ చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 500 బడులను తనిఖీ చేశారు. 

♦తనిఖీల్లో పాల్గొన్న వారితో విద్యాశాఖ కమిషనర్‌ కిషన్‌ బుధవారం సమీక్ష నిర్వహించారు. ప్రాథమిక పాఠశాలల్లో ఎక్కువ మంది ఉపాధ్యాయులు 3ఆర్‌పై దృష్టి పెట్టలేదన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమైంది. ఈ క్రమంలో ఆయా ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ వెల్లడించినట్లు సమాచారం.

♦ సీసీఈ విధానంలో ప్రాజెక్టులు, పుస్తక సమీక్షలను తగ్గించాలని పలువురు ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కోరినట్లు ప్రస్తావనకు వచ్చింది. పుస్తకాల బరువు తగ్గలేదని, గతంలో 10వ తరగతికి గైడ్లు ఉండగా.. ఇప్పుడు 6వ తరగతి నుంచే గైడ్లకు అలవాటుపడుతున్నారని తనిఖీల్లో గుర్తించారు. 

♦మరోవైపు ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాలు పెరిగాయని తనిఖీల్లో పాల్గొన్న వారు కమిషనర్‌కు వివరించారు. మళ్లీ 19, 20 తేదీల్లో ఈ అంశంపై సమీక్షించాలని నిర్ణయించారు.
@@@@
*👉మధ్యంతర భృతి?*

🔷పిఆర్‌సికి ముందే 30% మధ్యంతర  భృతి?

🔷జూన్ లేదా జులై నుంచి రాష్ట్ర ఉద్యోగులకు ఇవ్వాలని యోచన

🔷మూడున్నర లక్షల మంది సిబ్బంది, ఉపాధ్యాయులు, రెండు లక్షల మంది పదవీ విరమణ చేసిన వారికి లబ్ధి

 ♦ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు త్వరలో తీపి కబురు అందనుంది. కొత్త వేతన సవరణ సంఘం (పిఆర్‌సి) చేసే సిఫారసులతో సం బంధం లేకుండా రానున్న జూన్ లేదా జులై మాసం నుంచి వర్తించే విధంగా 30 శాతం మధ్యంతర భృతిని ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది.

♦ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఏర్పాటైన పదవ పిఆర్‌సి పదవీకాలం ఈ ఏడాది జులై 1వ తేదీతో ముగుస్తున్నందున 11వ పిఆర్‌సి ని ప్రభుత్వం త్వరలోనే ఏర్పాటు చేయనుంది. నిర్ధిష్టమైన అధ్యయనం చేసి సిఫారసులతో కూడిన నివేదికను అందజేయడానికి కనీసం ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉన్నందున ఈ నెలాఖరుకల్లా పిఆర్‌సి ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గత పిఆర్‌సి 29 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫారసు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఎం కెసిఆర్ ఉద్యోగులను, ఉపాధ్యాయులను ఆశ్చర్యపర్చే రీతిలో 43 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించా రు. ఆర్‌టిసి సిబ్బందికి కూడా ఇదే తరహాలో ఫిట్‌మెంట్‌ను ప్రకటించారు. 

♦తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే తరహాలో నిర్ణయం తీసుకోకతప్పలేదు. పదవ పిఆర్‌సి చేసిన సిఫారసులతో సంబంధం లేకుండా కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదే తరహాలో కొత్త పిఆర్‌సి సిఫారసులు ఎలా ఉన్నా ఉద్యోగులను, ఉపాధ్యాయులను సంతృప్తి పర్చే విధంగా ఫిట్‌మెంట్ ప్రకటన కూడా ఆశ్చర్యపర్చేలా ఉండనున్నట్లు సమాచారం. అందులో భాగంగా మధ్యంతర భృతిగా 30 శాతం ఫిట్‌మెంట్‌ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో ఏ మేరకు ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందో ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులను సిఎం సంప్రదించినట్లు తెలిసింది.

♦ ప్రస్తుతం పనిచేస్తున్న సుమారు మూడున్నర లక్షల ప్రభు త్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు పదవీ విరమణ చేసిన సుమారు రెండు లక్షల మందికి కూడా ఇది వర్తిస్తుంది. ఈ నెలాఖరుకల్లా 11వ పిఆర్సిని ఏర్పాటు చేసే ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

♦ ఉద్యోగుల వేతనాలు, ఆర్థిక అంశాలపై అవగాహన ఉన్న పదవీ విరమణ చేసిన సీనియర్ ఐఏఎస్ అధికారిని పిఆర్సి ఛైర్మన్‌గా ప్రకటించే అవకాశం ఉంది. గత మూడు దశాబ్దాలుగా ప్రతి ఐదేళ్ళకోసారి రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సిని ఏర్పాటుచేస్తూ ఉంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వి.కె. అగర్వాల్ నేతృత్వంలో పదవ పిఆర్సి 2013లో ఏర్పాటైంది. ఈ ఏడాది జూలై 1వ తేదీకల్లా దాని గడువు పూర్తికానుంది. అప్పటికి కొత్త పిఆర్సి ఉనికిలోకి రావాల్సి ఉన్నందున నిర్దిష్టమైన సిఫారసులను కూడా తయారుచేయడానికి వీలుగా ఈ నెలాఖరుకే దీనిపై ప్రకటన చేయాలని సిఎం భావిస్తున్నట్లు తెలిసింది.

♦ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పాటు వారి సంఘాల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపి లోతుగా అధ్యయనం చేసి తగిన సిఫారసులతో కూడిన నివేదికను రూపొందించడానికి పట్టే ఆరు నెలల సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వీలైనంత తొందరలోనే పిఆర్సి ఏర్పాటుపై ప్రకటన చేసే అవకాశం ఉంది. 

♦సిఫారసులతో సంబంధం లేకుండా వెంటనే 30% ఐఆర్ ప్రకటించాలని సిఎం భావిస్తున్నట్లు తెలిసింది. మూల వేతనంలో పెరిగే ఈ ఐఆర్, దానికి అదనంగా వచ్చే కరువు భత్యం తదితరాలన్నీ కలిపితే ప్రభుత్వంపై పడే ఆర్థికభారం గణనీయంగానే ఉండే అవకాశం ఉంది.

*♦ఉద్యోగుల వివరాల క్రోడీకరణ :* ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన వివరాలు ప్రభుత్వం దగ్గర సిద్ధంగానే ఉన్నా కొన్ని కార్పొరేషన్లు, విశ్వవిద్యాలయాలు తదితర సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, డైలీవేజ్, ఔట్‌సోర్సింగ్, కంటింజెంట్, వర్క్‌ఛార్జ్‌డ్, ఫుల్‌టైం, పార్ట్ టైమ్, అంగన్‌వాడీ… ఇలా అనేక పేర్లతో కొనసాగుతున్నవారి వివరాలన్నింటినీ సమర్పించాల్సిందిగా ఆర్థిక శాఖ కోరింది. వీరికి వేతనాలు, ప్రత్యేక అలవెన్సుల రూపంలో ఏ మేరకు చెల్లించబడుతుందో ప్రభుత్వం దగ్గర వివరాలు లేవు. ఒక విశ్వవిద్యాలయానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్న గ్రాంట్లలోంచి ఇలాంటి ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నందువల్ల ప్రభుత్వం దగ్గర వీటికి సంబంధించిన వివరాలు ఉండడంలేదు.

♦ కొన్ని కార్పొరేషన్లు కూడా వాటి అవసరాలకు అనుగుణంగా కొద్దిమంది ఉద్యోగులను వివిధ రూపాల్లో చేర్చుకుంటూ ఉన్నందువల్ల వారికి చెల్లిస్తున్న వేతనాల వివరాలు కూడా ప్రభుత్వం దగ్గర లేవు. ఇలాంటివాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని వేతనాలు, అలవెన్సులు తదితరాలకు ఎంత మొత్తంలో చెల్లింపు జరుగుతుందో పూర్తి వివరాలను సమర్పించాల్సిందిగా ఆర్థిక శాఖ కోరింది. రానున్న బడ్జెట్‌లో ఆయా సంస్థలకు ఏ మేరకు వార్షిక గ్రాంట్లను ఇవ్వాల్సి ఉంటుందో, వాటి వినియోగం ఏ అవసరాలకు వెచ్చిస్తున్నారో తెలుసుకోడానికి ఇది దోహదపడుతుంది.
@@@@
*📚జాతీయ పరీక్షలకు తగ్గట్టుగా పాఠ్యాంశాలు!*

🔷జేఈఈ, నీట్‌కు అనుగుణంగా మార్పుల యోచనలో విద్యాశాఖ

🔷త్వరలో సబ్జెక్టు నిపుణులు, ఎస్సీఈర్టీ అధికారులతో సమావేశం

♦రాష్ట్ర విద్యావిధానంలో అమలవుతున్న పాఠ్యాంశాల్లో సమూల మార్పులు తీసుకొచ్చే దిశగా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తున్నది. జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలైన నీట్, జేఈఈలకు అనుగుణంగా పాఠ్యాంశాల్లో మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్నది. నేషనల్ కరిక్యులం ఫ్రేంవర్క్ (ఎన్సీఎఫ్) ప్రమాణాలకు ఆటంకం కలుగకుండా మార్పులు చేయాల్సిన అవసరాన్ని ఇప్పటికే విద్యాశాఖ మంత్రి, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పలుసార్లు పాఠశాల విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకొచ్చారు

♦. మార్పులపై పాఠశాల విద్యాశాఖ, రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధన మండలి (ఎస్సీఈఆర్టీ) అధికారులు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. కేవలం గణితం, సామాన్యశాస్త్రం, భౌతికశాస్త్రం, జీవ శాస్త్రంలో మార్పులు చేయాలని భావిస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి పాఠ్యాంశాల్లో కూడా మార్పులు తీసుకొస్తే మంచి ఫలితాలు వస్తాయని విశ్లేషిస్తున్నారు. ఈ మేరకు త్వరలో సబ్జెక్టు నిపుణులు, ఎస్సీఈర్టీ అధికారులతో సమావేశం కానున్నారు. 2019-2020 విద్యాసంవత్సరం నుంచి నూతన పాఠ్యాంశాలు అమల్లోకి తీసుకొచ్చే ఆలోచనలో అధికారులు ఉన్నారు. 

♦రాష్ట్రంలో 840 గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలో కలిపి 1.08 లక్షల మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలో చదువుతున్నారు. కానీ వీరికి అకడమిక్ పద్ధతితోపాటు ప్రవేశ పరీక్షల తరహాలో పాఠ్యాంశాలను బోధిస్తే జాతీయస్థాయిలో జేఈఈ, నీట్, ప్రాంతీయ ఇంజినీరింగ్ కాలేజీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో సీట్లు సాధించడం తేలికవుతుంది. ఇప్పటికే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే ప్రతిభావంతులకు వేసవి సెలవుల్లో జేఈఈ, నీట్, ఎంసెట్‌కు ప్రత్యేకంగా కోచింగ్ ఇవ్వాలన్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆదేశాలతో ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు చేపట్టింది. ప్రతి జిల్లాకు రెండు వేల మందిని ఎంపిక చేసి, ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

*రేపటి నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు*

*-జూ.కళాశాలలకు 13 నుంచి 15 వరకు*

 ✡తెలంగాణ: రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బడులకు ఈ నెల 12 నుంచి 16 వరకు ఐదురోజులు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నది. 

ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలలకు 13 నుంచి 15 వరకు సెలవులను ప్రకటిస్తున్నట్టు ఇంటర్బోర్డు తెలిపింది.

*ఆ దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్లో గందరగోళం*

హైదరాబాద్ : ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) దరఖాస్తుల ఎడిట్ ఆప్షన్ ప్రక్రియలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఒక దరఖాస్తును మాత్రమే సవరించుకొనేలా వెబ్సైట్లో అవకాశం కల్పించారు.

 దీంతో ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ఎడిట్ చేసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 

అన్ని దరఖాస్తులను సవరించుకొనేలా తమకు అవకాశం ఇవ్వాలంటూ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. 

ఉపాధ్యాయ నియామక పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న వారు వాటిలో తమ వ్యక్తిగత వివరాలు సరిగా నమోదు చేయకపోతే వాటిని సరిచేసుకునేందుకు ఈనెల 8 నుంచి 11వ తేదీ వరకు ఆన్లైన్లో అవకాశమివ్వనున్నట్లు టీఎస్పీఎస్సీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

*సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాల వెల్లడి*

యూపీఎస్సీ వెబ్సైట్లో అర్హత సాధించిన అభ్యర్థుల రోల్నంబర్లు

తెలుగు రాష్ర్టాల నుంచి 300 మంది ఇంటర్వ్యూకు సెలెక్ట్

వచ్చే నెల 19 నుంచి ఇంటర్వ్యూలు

 తెలంగాణ: సివిల్ సర్వీసెస్-2017 మెయిన్స్ ఫలితాలను యూనియన్ సర్వీస్ పబ్లిక్ కమిషన్(యూపీఎస్సీ) బుధవారం ప్రకటించింది.

 మెయిన్స్లో అర్హత సాధించిన అభ్యర్థుల రోల్నంబర్ వివరాలను కమిషన్ వెబ్సైట్ (www. upsc.gov.in)లో పొందుపర్చింది. 

వీరికి వచ్చే నెల 19 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశముంది.

 ఇంటర్వ్యూలకు ఎంపికైన వారిలో తెలుగు రాష్ర్టాల అభ్యర్థులు 300 మంది ఉన్నట్లు సమాచారం.

 ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 18 నుంచి కమిషన్ వెబ్సైట్లో ఇంటర్వ్యూ లెటర్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

 గతేడాది అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 మధ్య మెయిన్స్ పరీక్షలను యూపీఎస్సీ నిర్వహించింది.

 ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్(ఐఏఎస్), ఇండియన్ ఫారెన్ సర్వీస్(ఐఎఫ్ఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్) తదితర విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ప్రతియేటా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షలను నిర్వహిస్తున్నది. ఇంటర్వ్యూల అనంతరం ఫైనల్ ఫలితాలను ప్రకటించాక మెయిన్స్కు అర్హత సాధించని అభ్యర్థుల మార్కుల జాబితాను కమిషన్ వెబ్సైట్లో పొందుపర్చుతారు. అయితే మెయిన్స్లో మొత్తం ఎంతమంది అర్హత సాధించారన్న విషయాన్ని యూపీఎస్సీ ప్రకటించలేదు.
💐💐💐💐💐💐💐💐
*మార్చి 5 నుంచి సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలు*

న్యూఢిల్లీ- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)లో చదువుతున్న 10, 12వ తరగతుల విద్యార్థులకు వార్షిక పరీక్షలు మార్చి 5 నుంచి జరుగనున్నాయి. 

ఈ పరీక్షలకు దాదాపు 16,38,552 మంది 10వ తరగతి విద్యార్థులు హాజరుకానున్నారు. 

వీరి పరీక్షలు ఏప్రిల్ 4న పూర్తవుతాయి. 12వ తరగతి పరీక్షలను 11,86,144 మంది విద్యార్థులు రాయనున్నారు. వీరి పరీక్షలు ఏప్రిల్ 12 వరకు జరుగుతాయి.
@@@@
*నేటి మన టీ వి క్లాస్సెస్*

*తేదీ*:-- *12--01--2018* 
*బ?గురువారము*

*********************************

*తరగతి*:- *10 వ*

*సబ్జెక్టు*:- *సాంఘీకశాస్త్రం*

*విషయం:-* *సుస్థిర అభివృద్ధి సమానత -II*

*సమయం*:- *10.30 ని,,ల నుండి*

          ★★★★★★★

*తరగతి*:- *9 వ*

*సబ్జెక్టు*:- *జీవశాస్త్రం*

*విషయం*:-  *నేల - కాలుష్యం*

*సమయం*:- *11.30ని,,

          ★★★★★★★

*తరగతి*:- *8 వ*

*సబ్జెక్టు*:- *భౌతికశాస్త్రం*

*విషయం*:- *కొన్ని సహజ దృగ్విషయాలు భూకంపం*

*సమయం*:- *2.00pm

          ★★★★★★★

*తరగతి*:- *7 వ*

*సబ్జెక్టు*:- *హిందీ*

*విషయం*:- *కబీర్ కె దోహా-II* 

*సమయం*:- *2.45 pm 

          ★★★★★★★

*తరగతి*:- *6 వ*

*సబ్జెక్టు*: *గణితం*

*విషయం*:- *లైన్ సైమెట్రి - II*

*సమయం*:- *3.40 pm
          ★★★★★★★
*🔥తెలుసుకుందాం*_🔥*

*1⃣ప్రశ్న:*  _*బార్ కోడ్స్ఎందుకు ఉపయోగిస్తారు?:*_

*🌀జవాబు:*  _*రకరకాల ఫ్యాన్సీ, స్టేషనరీ వస్తువుల నుండి పచారీ సరుకుల వరకు అన్నింటి ప్యాకింగ్‌లపై ఈ మధ్య కనిపిస్తున్న నల్లని గీతలను 'బార్ కోడ్స్' అంటారు.*_ 

_*🌀వీటిలో ఆయా వస్తువులకు సంబంధించిన వివరాలు నిక్షిప్తమై ఉంటాయి. బార్ కోడ్‌లోని వివరాలను స్కానర్ లేదా రీడర్ అనే యంత్రం సాయంతో తెలుసుకోవచ్చు. కంప్యూటర్‌తో అనుసంధానించి ఉండే ఈ స్కానర్ ద్వారా వివరాలు 0,1 సంఖ్యలు ఉండే బైనరీకోడ్ రూపంలో తెరపై పడతాయి.*_

_*🌀3ఈ కోడ్‌తో సరితూగే సమాచారాన్ని కంప్యూటర్ అందిస్తుంది. వస్తువులపై ఉండే బార్‌కోడ్‌ను స్కానర్ ఎదుట పెట్టగానే, స్కానర్ నుంచి వచ్చే లేజర్ కిరణాలు దానిపై పడి పరావర్తనం చెందుతాయి. స్కానర్‌లోని దర్పణం ఆ సంకేతాలను కంప్యూటర్‌కు పంపుతుంది. కంప్యూటర్‌లో ఇవి విద్యుత్‌సంకేతాలుగా మారి తెరపై 0,1 సంఖ్యల రూపంలో కనిపిస్తాయి.*_

_*🌀బార్ కోడ్‌లో ఆ వస్తువు ఏ దేశంలో ఎప్పుడు తయారైనదో, ఎవరు దానిని ఉత్పత్తి చేశారో, ధర ఎంతో లాంటి వివరాలు ఉంటాయి. బార్ కోడ్‌లలో అనేక రకాలు ఉంటాయి. కోడ్‌లలో గీతలకింద సంఖ్యలతో సూచిస్తారు. ఉదాహరణకు సాధారణంగా మార్కెట్లో కనిపించే వస్తువులకు చెందిన కోడ్ (యూనివర్సల్ ప్రోడక్ట్ కోడ్) 12 అంకెల్లో ఉంటుంది.*_

_*🌀ఇందులో మొదటి అంకె ఆ వస్తువు తయారైన దేశపు కోడ్‌ను, తర్వాత అయిదు అంకెలు ఉత్పత్తిదారు కోడ్‌ను, ఆ తర్వాత అయిదు అం2కెలు వస్తువు వివరాలను తెలుపుతాయి. చివరి అంకె ఆ కోడ్ కచ్చితత్వాన్ని చెబుతుంది. కంప్యూటర్‌లోకి ముందుగానే ఎక్కించిన వివరాలన్నీ ఈ కోడ్‌ను స్కానర్ చదవగానే తెరపై కనిపిస్తాయి.*_

*🌀ఈ విధానం వల్ల ఒక్కో వస్తువు ధరను వేరువేరుగా చూసుకోవడం, వాటి ధరలను విడివిడిగా రాయడం వంటి పనులు తప్పి సమయం ఆదా అవుతుంది. రోజు మొత్తం మీద ఏయే వస్తువులు అమ్ముడయ్యాయో, ఆదాయమెంతో లాంటి వివరాలు కూడా కచ్చితంగా క్షణాలమీద తెలుస్తుంది.*_

 _*🔥సాలెపురుగుకు గూడెందుకు ?*_🔥

_*🕷🕸సాలెపురుగు గోడల మూలల్లో, చెట్ల కొమ్మల్లో గూళ్ళు కడతాయి*_.  _*ఇవి తమ ఆహారమైన పురుగులను పట్టుకునేందుకు ఇలా గూళ్ళు కడతాయి. గూడు కట్టేందుకు అవసరమైన దారాన్ని వాటి శరీరం నుండి ఉత్పత్తి చేస్తాయి*_  
_*🕸ఆ దారపు పోగుల్లోని పొడి దారం తో గూడులో చిక్కుకున్న కీటకాలను బంధించి ఆ తరువాత ఆహారము గా తీసుకుంటుంది . తమ గూటిలో తమ కాళ్ళు మాత్రం చిక్కుకోకుండా వెళ్ళగలిగిన నేర్పు సాలెపురులకు ఉన్నది . సాలెపురుగు ద్రవరూపం లోనే తన ఆహారము తీసుకుంటుంది*_. 
_*.🕷🕸వాటి లో స్రవించే ద్రవాలు వలన గూడులో చిక్కుకున్న కీటకము ద్రవరూపం లోనికి మారుతుంది . . అప్పుడు ఆ కీటకద్రవాన్ని నోటిలో పీల్చుకుంటుంది . ద్రవరూపమ్లోనికి మారని కీటక అవశేషాలు ఆ వెబ్ లోనే మచ్చలుగా కనిపిస్తాయి.*_
@@@@@
*3⃣🔥సహారా ఎడారి ప్రత్యేకతలు 🔥*

*🌳 ప్రపంచంలోని మూడవ అతిపెద్ద ఎడారి ప్రాంతం ‘సహారా’. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఎడారి ప్రాంతాలను పరిగణలోకి తీసుకుంటే సహారా మొదటి స్థానంలో ఉంటుంది. *

* 🌳సహారా విస్తీర్ణం 92 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇది దాదాపు చైనా లేదా అమెరికా సంయుక్త రాష్ట్రాలకు సమానం. *

* 🌳 సహారాలో కొంతభాగం రాతి ప్రదేశం. మిగిలిన ప్రాంతమంతా ఇసుక తిన్నెలు. మద్యధరా సముద్ర తీరప్రాంతాన్ని మినహాయిస్తే, మిగిలిన ఆఫ్రికా ఉత్తర భాగంలో మెజార్టీ ప్రాంతం సహారా ఎడారే.GSRAO*

* 🌳 అల్జీరియా, ఛాద్‌, ఈజిప్టు, లిబియా, మాలి, మారిటానియా,  మొరాకో, నైగర్‌, సూడాన్‌, టునీసియా దేశాల్లో సహారా ఎడారి విస్తరించి ఉంది.*

*🌳సహారా’ అనేది అరబిక్‌ పదం. ఎడారి అని దీనికి అర్ధం.*
@@@@@
*✍సివిల్స్‌-2017 మెయిన్స్‌ ఫలితాలు విడుదల*

*👉న్యూఢిల్లీ : సివిల్స్‌-2017 మెయిన్స్‌ ఫలితాలు విడుదలయ్యాయి.*

*❇యూనియన్‌ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌(యూపీఎస్‌సీ) ఈ ఫలితాలను తన అధికారిక వెబ్‌సైట్లో ప్రకటించింది. గతేడాది అక్టోబర్‌ 28 నుంచి నవంబర్‌ 3 మధ్యలో సివిల్స్‌ మెయిన్స్‌ ఎగ్జామ్‌ జరిగిన సంగతి తెలిసిందే. మూడు స్టేజీల్లో సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ను యూపీఎస్‌సీ నిర్వహిస్తోంది. ఒకటి ప్రిలిమినరీ, రెండు మెయిన్స్‌, మూడు ఇంటర్వ్యూ.*

*❇మెయిన్స్‌ ఎగ్జామ్‌ను క్లియర్‌ చేసిన అభ్యర్థుల రోల్‌ నెంబర్లను www.upsc.gov.in పొందుపరిచినట్టు యూపీఎస్‌సీ పేర్కొంది. ఈ ఎగ్జామ్‌లో ఎంపికైన వారికి ఫిబ్రవరి 19 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించే అవకాశముందని యూపీఎస్‌సీ తెలిపింది. జనవరి 18 నుంచి ఈ వెబ్‌సైట్‌లో ఇంటర్వ్యూ లెటర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది.* 

*❇ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు వయసు, విద్యార్హతల సర్టిఫికేట్లు, కమ్యూనిటీ, ఫిజికల్‌ హ్యాండిక్యాప్‌ వంటి ఇతర ఒరిజనల్‌ డాక్యుమెంట్లను పట్టుకుని రావాల్సి ఉంటుందని యూపీఎస్‌సీ తెలిపింది. క్వాలిఫై కానీ అభ్యర్థుల మార్కు షీట్లను కూడా తుది ఫలితాల వెల్లడి నుంచి 15 రోజుల్లో యూపీఎస్‌సీ తన వెబ్‌సైట్‌లో పెట్టనుంది.*
@@@@@@
*🎈భారతదేశ రెండవ ప్రధాని  లాల్ బహాదుర్ శాస్త్రి వర్ధంతి సందర్భంగా సమాచారం...🎈*

*🏵బాల్యం🏵*

🍄ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొగల్ సరాయ్ గ్రామంలో లాల్ బహదూర్ 1904 అక్టోబర్ 2న శారదా ప్రసాద్, రామ్దులారీ దేవీలకు జన్మించాడు. తండ్రి శారదాప్రసాద్ రాయ్ ఒక నిరుపేద. బతకలేక బడిపంతులు అని అనుకుంటున్న ఆ రోజుల్లో ఆయన బడిపంతులు వృత్తిని చేపట్టి అతికష్టంగా తన కుటుంబాన్ని పోషిస్తూ కాలం గడిపేవాడు. ఇద్దరు ఆడపిల్లల తరువాత జన్మించిన లాల్ బహదూర్ ను చూసుకొని ఆ తల్లిదండ్రులెంతో మురిసిపోయారు.

🛍నిరాడంబరతకు తోడు ఎంతో అభిమానవంతుడైన లాల్ బహదూర్ స్కూలుకు వెళ్ళటానికి ప్రతి రోజు గంగానదిని దాటి వెళ్ళవలసి ఉండేది. నది దాటించే పడవ వాడికి ప్రతి రోజు కొంత పైకం యివ్వాలి. అది స్వల్పమే అయినా లాల్ బహదూర్ దగ్గర అప్పుడప్పుడు ఉండేదికాదు. పడవ మనిషిని అడిగితే ఊరికే నది దాటించగలడు. అయినా అభిమానవంతుడైన లాల్ బహదూర్ అలా ప్రాధేయపడటం ఇష్టంలేక తన బట్టలను విప్పి, వాటిలో పుస్తకాలను చుట్టి మూటలా కట్టి, తన వీపునకు తగిలించుకుని, ప్రాణాలను సైతం తెగించి అవతలి ఒడ్డుకు ఈదుకుని వెళ్ళేవాడు. 

🌀దురదృష్టవశాత్తు కొడుకు పుట్టిన ఏడాదిన్నరకే లాల్ బహదూర్ తండ్రి మరణించడంతో, ఆ కుటుంబం దిక్కులేని నావలా నిరాధారమైంది. ఆ కుటుంబాన్ని లాల్ బహదూర్ తాత ఆదుకుని వారికి ఆశ్రయం కలిగించాడు.
తాతగారింట భయభక్తులతో పెరిగిన లాల్ బహదూర్ తన పాఠశాలలో ఎంతో నిరాడంబరంగా ఉంటూ ఉపాధ్యాయుల ప్రేమాభిమానాలను చూరగొన్నాడు. తోటి విద్యార్థులు తనకు తండ్రి లేడని గేలిచేస్తూ హేళన చేస్తున్నప్పటికీ ఆ దు:ఖాన్ని దిగమింగి, ఉపాధ్యాయులకు ఫిర్యాదు చేయక, వారితో పాటు ఆడుతూ, పాడుతుండేవాడు. అది గమనించిన టీచర్లకు లాల్ బహదూర్ పై ప్రేమ ఇంకా ఎక్కువైంది.

*📚తొలి జీవితము మరియు స్వాతంత్ర్యోద్యమము📚*

🛍శాస్త్రీజీ, యునైటెడ్ ప్రావిన్స్ (ప్రస్తుత ఉత్తర ప్రదేశ్ ) లోని మొఘల్ సరాయిలో జన్మించాడు. 1921లో మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణోద్యమములో పాల్గొనుటకై కాశీలోని జాతీయవాద కాశీ విద్యాపీఠములో చదవడము ప్రారంభించాడు. అక్కడ విద్యాభ్యాసము అనంతరము 1926లో శాస్త్రి అనే పట్టభద్రుడయ్యాడు. స్వాంతంత్ర్యోద్యమ పోరాట కాలములో మొత్తము తొమ్మిది సంవత్సరాలు జైలులోనే గడిపాడు. సత్యాగ్రహ ఉద్యమము తర్వాత 1940 నుండి 1946 వరకు ఈయన జైళ్లోనే ఉన్నాడు. 

*🎳రాజకీయ జీవితము🎳*

🌎స్వాతంత్ర్యము తర్వాత, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి గోవింద్ వల్లభ్ పంత్ మంత్రివర్గములో గృహ మంత్రిగా పనిచేశాడు.
1951లో లోక్ సభ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు. ఆ తరువాత కేంద్ర రైల్వే శాఖా మంత్రిగా పనిచేశాడు. తమిళనాడులోని
అరియళూరు వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశాడు. సాధారణ ఎన్నికల తర్వాత తిరిగి కేంద్ర మంత్రివర్గములో చేరి తొలుత రవాణా శాఖ మంత్రిగా తర్వాత 1961 నుండి గృహ మంత్రిగా పనిచేశాడు 

*🏕ప్రధాన మంత్రిగా🏕*

🌹1964లో అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూతరువాత అతని స్థానాన్ని పూరించడానికై, లాల్ మొరార్జీదేశాయ్ సిద్దంగా ఉండగా, అప్పటి కాంగ్రేసు పార్టీ ప్రెసిడెంటు కామరాజ్ సోషలిస్టు భావాలున్న లాల్ బహదూర్ శాస్త్రీకి మద్దతుపలికి ప్రధానమంత్రిని చేయడంలో సఫలీకృతుడయ్యాడు. లాల్ బహాదుర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యేనాటికి దేశంలో తీవ్రమైన ఆహార సంక్షోభం నెలకొని ఉంది. ఈ సంక్షోభమును తాత్కాలికంగా పరిష్కరించడానికై విదేశాల నుండి ఆహారాన్ని దిగుమతి చేసాడు. తరువాత దీర్ఘకాలిక పరిష్కారానికై దేశంలో వ్యవసాయ విప్లవానికై (గ్రీన్ రెవల్యూషన్) బాటలుపరిచాడు.

🍋1965 ఆగస్టులో, పాకిస్తాన్ తన సేనలను ప్రయోగించి జమ్మూ కాశ్మీరులోని కచ్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది, తద్వారా జమ్మూ కాష్మీరులోని ప్రజలు ఉద్యమించి, భారతదేశం నుండి విడిపోతారని ఆశించింది. కానీ అటువంటి ఉద్యమం పుట్టలేదు. పాకిస్తాన్ ఆక్రమణ గురించి తెలుసుకున్న లాల్ బహదూర్ శాస్త్రి వెంటనే త్రివిధ దళాలకు నియంత్రణ రేఖను దాటి లాహోరును ఆక్రమించుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశారు.భారత సైన్యం విజయదుందుభికి చేరువలో ఉండగా శాస్త్రి గారి పై అమెరికా తీవ్ర ఒత్తిళ్లు తెచ్చింది. ఐక్యరాజ్యసమితి మధ్యవర్తిత్వం మేరకు సోవియట్ లోని టాష్కెంట్లో ఒప్పందం పై సంతకం చేసి అక్కడే మరునాడు మృతిచెందారు. శాస్త్రి గారి మరణం ఇప్పటికీ మిస్టరీయే.. ఈ దేశంలో అలాంటి నాయకుడిని మళ్లీ చూస్తామా?? దేశ ప్రధాని కాకముందు లాల్ బహదూర్ శాస్ర్తీ గారు ఉత్తరప్రదేశ్లో అలహాబాద్ మునిసిపల్ ఎన్నికలలో గెలిచారు. దానితో సహజంగా ‘‘అలహాబాద్ ఇంప్రూవ్మెంట్ ట్రస్టు’’కు కూడా ట్రస్టీ అయ్యారు. అపుడు అక్కడ ‘టాగూర్నగర్’ అనే పేరుతో 1/2 ఎకరా భూమిని ప్లాట్లుగా విభజించి వేలానికి పెట్టారు. శాస్ర్తీగారు వూళ్ళో లేని సమయంలో, ఆయన అంతరంగిక మిత్రుడొకాయన కమీషనర్ను కలిసి ‘శాస్ర్తీ’గారికి సొంత ఇల్లులేదు. కాబట్టి ట్రస్టు సభ్యులందరూ ఒక్కో ప్లాటు దక్కించుకొనేలాగా ఒప్పించి, తనకు శాస్ర్తీగారికి ఒక్కో ప్లాటు సంపాదించగలిగాడు. ఆ విషయాన్ని శాస్ర్తీగారి భార్య లలితాశాస్ర్తీగారితో చెపితే ‘‘పోనీలెండి, అన్నయ్యగారూ, మీ ప్రయత్నం కారణంగా ఇన్నేళ్ళకు ‘స్వంత ఇల్లు’ అనే మా కల నెరవేరబోతుంది అని సంతోషించారట. రెండురోజుల తరువాత అలహాబాద్ తిరిగొచ్చిన శాస్ర్తీగారికి ఈ విషయం తెలిసింది. ఆయన చాలా బాధపడ్డారు. 

🍓తన ఆంతరంగిక మిత్రుడిని పిలిచి ‘‘నాకు ఈ విషయం తెలిసినప్పటినుండి రాత్రిళ్ళు నిద్రపట్టడం లేదు. మనం ప్రజాప్రతినిధులం. ప్రజలముందు నిజాయితీగా నిలవాల్సిన వాళ్ళం. నేను నా ప్లాటును వాపసు ఇచ్చేస్తున్నాను. మీరుకూడా వాపసు ఇచ్చేయండి. లేదా రాజీనామాచేసి, సాధారణ పౌరుడిగా వేలంపాటలో పాల్గొని, కావాల్సి వుంటే ప్లాటును దక్కించుకోండి,’’అని చెప్పి ప్లాటును ట్రస్టుకే వాపసు ఇచ్చేసారట. జీవితాంతం స్వంత ఇల్లులేకుండానే జీవించారు. లాల్ బహదూర్శాస్ర్తీ దేశ ప్రధానమంత్రి అయిన తరువాత కూడా ఆయన కొడుకులు సిటీ బస్సుల్లోనే ప్రయాణించేవారు. కొందరు స్నేహితులు ఈ విషయంగా కొంచెం గేలిచేయడంతో, కారు కొనమని వాళ్ళు తండ్రి (శాస్ర్తీగారు) మీద వొత్తిడిచేస్తే ఇష్టంలేకపోయినా, ఆయన అక్కడక్కడ అప్పులుచేసి ఒక ఫియట్కారు కొన్నారు. కారు కొనేందుకు చేసిన అప్పు ఇంకా 4600 రూపాయలుండగా శ్రీ శాస్ర్తీగారు మరణించారు. ఈ విషయం దినపత్రికల్లో వచ్చిందట. దేశవ్యాప్తంగా శాస్ర్తీగారి అభిమానులు, ఆయన భార్య శ్రీమతి లలితాశాస్ర్తీగారికి మనీఆర్డర్ చేశారట. రెండు సంవత్సరాలపాటు ఆమె మనిఆర్డర్లు అందుకొన్నారట. కానీ ఆమె, డబ్బు పంపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలతో ఉత్తరం వ్రాస్తూ, డబ్బును కూడా వాపసు పంపించేసారట. మరో సందర్భంలో, లాల్బహదూర్శాస్ర్తీ ప్రధానిగా ఉన్న సమయంలో వారి పెద్దకొడుకు హరికృష్ణశాస్ర్తీ అశోక్ లేలాండ్ సంస్థలో ఉద్యోగం చేస్తుండేవారు. ఆ సంస్థవారు హరికృష్ణశాస్ర్తీకి సీనియర్ జనరల్ మేనేజర్గా ప్రమోషన్ ఇచ్చారు. సంతోషించిన హరికృష్ణశాస్ర్తీ మరుసటిరోజు, లాల్ బహదూర్ శాస్ర్తీ గారికి ఈ విషయం తెలిపారు. ఒక నిమిషం ఆలోచించి, ‘‘హరీ, ఆ సంస్థ, ఆకస్మాత్తుగా నీకెందుకు ప్రమోషన్ ఇచ్చిందో నేనూహించగలను. కొన్నిరోజుల తరువాత, ఆ కంపెనీవాళ్ళు ఏదో ఒక సహాయంచేయండని నాదగ్గరకు వస్తారు. నేను వారికాసహాయం చేస్తే దేశ ప్రజలు దాన్నెలా అర్ధంచేసుకుంటారో నాకు తెలుసు, నీకూ తెలుసు. పాలకుల యొక్క నిజాయితీని ప్రజలు శంకించేలాగా జీవించడానికి నేను వ్యతిరేకం. కాబట్టి నీవు వెంటనే ఆ సంస్థలో నీ ఉద్యోగానికి రాజీనామా చేయి. నేను ప్రధానిగా వున్నంతకాలమూ నీవు ఆ సంస్థలో ఉద్యోగం చేయడానికి లేదు’’ అన్నారట. అటువంటి వ్యక్తిత్వాన్ని నేటి వ్యవస్థలో చూస్తామా? ప్రజల సొమ్ము చేతికి అంటకుండా బ్రతకగల నాయకులు మళ్లీ ఈ నేల మీద పుడతారా? పుట్టినా మనగలరా?? ఆలోచించాల్సిన విషయమే కదా...!

🍓బోస్కు, గాంధీ అనుచరులకు మధ్య సైద్ధాం తిక వైరుద్యాలున్నాయన్నది జగద్వితం. హిట్లర్కు సహక రించడంతో బ్రిటీష్ ప్రభుత్వం బోస్పై కక్షగట్టింది. వారి మెప్పు కోసం గాంధీ అనుచరులు కూడా బోస్ను దేశద్రోహిగా చిత్రించే యత్నం చేశారు. దేశంలో దీర్ఘకాలం గాంధీ, నెహ్రూ వారసులే పాలకులుగా ఉన్నారు. దీంతో బోస్ మరణం ఇప్పటికీ చరిత్రలో ఓ రహస్యంగానే ఉండిపోయింది. దీన్ని ఛేదించే ప్రయత్నం ఇంతవరకు జరగలేదు. కానీ లాల్ బహదూర్ శాస్త్రి విషయం వేరు. ఆయన గాంధీ అనుచరుడు. నెహ్రూకు సహచరుడు. నెహ్రూ తర్వాత దేశ రెండో ప్రధానిగా ఆయన వ్యవహరించారు. ప్రధాని హోదాలోనే అప్పటి సోవి యట్ వె ళ్ళారు. అదికూడా పాక్తో జరుగుతున్న యుద్ద విరమణ ఒప్పందంపై సంత కాలు చేసేందుకు. తాష్కెంట్ (ఇది ప్రస్తుతం ఉజ్బెకిస్థాన్లో ఉంది) లో 1966జనవరి 10న ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఆ మర్నాడే జనవరి 11న ఆయన హృద్రోగంతో అక్కడే మరణించారు. ఓ దేశాధినేత అదీ మరో దేశానికి అతిధిగా ఒప్పందాలపై సంతకాలు చేసేం దుకెళ్ళి అక్కడే అసహజ, అనుమానాస్పదంగా మృతి చెందడం చరిత్రలో అంతకుముందెప్పడూలేదు.. ఆ తర్వాతె ప్పుడూ జరగలేదు. అయినా ఇంతవరకు శాస్త్రి మరణంపై సమగ్ర దర్యాప్తు చేపట్టలేదు. ఒకట్రెండు దర్యాప్తులు జరిగినా వాటి ఫలితాలు వెల్లడికాలేదు. ఆఖరకు వాటికి సంబంధించిన పత్రాలు కూడా ఇప్పుడు అందుబాటులో లేవు. వాస్తవానికి శాస్త్రి అనంతరం సొంత పార్టీ నేతలే దీర్ఘకాలం అధికారంలో ఉన్నారు. వారెవరికీ శాస్త్రి మరణం పట్టలేదు. కనీసం మరణం వెనుక ర హస్యాన్ని ఛేదించాలన్న ఆలోచన కూడా రాలేదు. ఎన్డిఎ అధికారంలోకొచ్చాక ఒక్కొక్కటిగా చరిత్రను తవ్వుతోంది. చరిత్రలోని లోపాల్ని సవరించేందుకు పూనుకుంది. చారిత్రక అవశేషాలుగా మిగిలిన పలు శేష ప్రశ్న లకు సమగ్ర దర్యాప్తుకు పూనుకుంది. ఇందులో భాగంగానే బోస్ కుటుంబీకులపై నెహ్రూ ప్రభుత్వం ఉంచిన దీర్ఘకాలపు నిఘాను పత్రాల్తో సహా బట్టబయలుచేసింది. ఇదే రీ తిలో శాస్త్రి మరణంపై ఉన్న సందేహాల నివృతికి కూడా మోడి ప్రభుత్వం ప్రయత్నించాలన్న డిమాండ్ వెల్లువెత్తుతోంది. తాష్కెంట్ ఒప్పందం చేసుకున్న మర్నాడే శాస్త్రి మరణించారు. ఈ మరణం హృద్రోగం వల్ల సంభవించిందని సోవియట్ ప్రభుత్వం ప్రకటించింది. భారత ప్రభుత్వం దీన్నే ధ్రువీకరించింది. కానీ ఆధారాల మేరకు శాస్త్రి బౌతికఖాయా నికి పోస్టుమార్టం నిర్వహించలేదు. 

🍓అంతకుముందెప్పుడూ శాస్త్రికి ఎలాంటి అనారోగ్యం లేదు. విషప్రయోగం వల్లే శాస్త్రి మరణించారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.దీనిపై కేంద్రం రాజ్నారాయణ్ కమిటీని నియమించింది. ఈ కమిటీ అధ్య యనం నివేదిక ఇప్పటివరకు వెలుగుచూడలేదు. ఆఖరకు ఇది భారత పార్లమెంట్ లైబ్రరీలో కూడా అందుబాటులో లేదు. దీన్ని కావాలనే మరుగున పర్చారు.. లేదా ధ్వంసం చేసుంటారన్న ఆరోపణలున్నాయి. వాస్తవానికి పాక్తో యుద్ధం చివరిదశకొచ్చింది. భారత్ విజయంవైపు దూసుకు పోతోంది. ఈ దశలో ఐక్యరాజ్యసమితి పాక్తో విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించింది. అప్పటికే శాస్త్రి యుద్ద వీరుడిగా దేశంలో జేజేలందుకుంటున్నారు. ఈ దశలో ఒప్పందానికి అంగీకరించే విధంగా శాస్త్రిపై తాష్కెంట్లో తీవ్ర ఒత్తిళ్ళొచ్చా యన్న ఆరోపణలున్నాయి. భారత్కు తెచ్చిన శాస్త్రి భౌతికకాయం నీలంరంగులోకి మారుంది. శరీరంపై కొన్ని గాట్లు కూడా గమనించినట్లు ఆయన భార్య లలితాశాస్త్రి గుర్తిం చారు. శాస్త్రి ఆఖరుగా ఆయన కుమార్తె సుమన్తో మాట్లా డారు. ఫోన్లో మాట్లాడుతూ పాలుతాగి పడుకుంటానని చెప్పారు. ఈలోగా ఫోన్లైన్ డిస్కనెక్ట్ అయింది. తర్వాత దాదాపు పదిహేనునిమిషాలకు పైగా సుమన్లైన్ కోసం ప్రయత్నించారు. ఆ తర్వాత లైన్ దొరికింది కానీ శాస్త్రి ఎత్తలేదు. సోవియట్కు చెందిన ఓ అధికారి ఫోన్ ఎత్తారు. మీ తండ్రిగారు ఇప్పుడే మరణించారని సుమన్కు చెప్పారు. అంతవరకు ఎలాంటి అరోగ్యకర ఇబ్బందుల్లేని వ్యక్తికి ఒకవేళ గుండెపోటు సంభవించినా కేవలం పదిహేనునిమిషాల్లో మృత్యువాత పడతాడా అన్న సందేహాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. శాస్త్రి వెంట ఆయన వ్యక్తిగత వైద్యుడు ఆర్ఎన్ చుగ్ కూడా తాష్కంట్ వెళ్ళారు. ఆయనా పక్కగదిలోనే ఉన్నారు. కనీసం శాస్త్రికి గుండెపోటు వచ్చిందన్న విషయాన్ని ఆయన వ్యక్తిగత వైద్యుడికి కూడా సోవియట్ అధికారులు వెల్లడించలేదు. మరణించిన తర్వాతే ఆ విషయాన్ని చెప్పారు. 

🍋stu1977లో శాస్త్రి మరణంపై దర్యాప్తుకు ఓ కమిటీని నియమించారు. ఈ కమిటీ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు డాక్టర్ చుగ్ బయలుదేరారు. కారులో ఢిల్లిd వైపు ప్రయాణిస్తుండగా ఎదురుగా ఓ లారీ వచ్చి ఢీ కొట్టింది. చుగ్ అక్కడికక్కడే మరణించారు. అలాగే శాస్త్రి వ్యక్తిగత సేవకుడు రామ్నాధ్ కూడా ఆయన్తో పాటు తాష్కండ్ వెళ్ళాడు. మృతదేహం వెంటే ఆయనా తిరిగొచ్చారు. ఆయన్నుకూడా కమిటీ సాక్షిగా పరిగణించింది. వాంగ్మూలం నమోదుకు పిల్చింది. మోతీలాల్నెహ్రూ మార్గ్లోని తన నివాసం నుంచి ఆయన ఒక్కడుగు బయటకేయగానే ఎదురుగా ఓ వాహనం వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రామ్నాధ్ రెండుకాళ్ళూ నుజ్జునుజ్జు అయ్యాయి. తలకు బలమైన గాయాలయ్యాయి. ఆయన గతాన్ని మర్చిపోయారు. 2009లో దక్షిణాసియాపై సిఐఎ దృష్టి పేరిట అనుజ్ధార్ అనే రచయిత పుస్తకం రాసేందుకు ఉపక్రమించారు. ఇందుకోసం శాస్త్రి మరణానికి సంబంధించిన పత్రాలు కావాలంటూ సమాచారహక్కు చట్టం క్రింద భారత ప్రధాని కార్యాలయానికి దరఖాస్తు చేసుకున్నారు. వీటి జారీకి పిఎమ్ఓ నిరాకరించింది. పైగా ఈ పత్రాల జారీ భారత సార్వభౌమత్వానికి, అంతర్గత భద్రతకు, ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని అతనికిచ్చిన రాతపూర్వకలేఖలో పిఎమ్ఓ అధికారులు పేర్కొ న్నారు. పైగా వీటిని ఓ డాక్యుమెంట్గానే పరిగ ణిస్తున్నట్లు పిఎమ్ఓ వెల్లడించింది. భారత ప్రధాని అసహజ, అనుమానాస్పద మరణానికి సంబం ధించిన అత్యంత విలువైన సమాచారాన్ని సాధారణ డాక్యుమెంట్గా పిఎమ్ఓ పరిగణించడం కూడా అనేక సందేహాలకు తావిస్తోంది. శాస్త్రి మరణం నాటికే భారత్, సోవియట్ల మధ్య విస్తృతమైన మైత్రిబంధముంది. దీంతో మరణం వెనుక సోవియట్ హస్తాన్ని ఎవరూ సందేహించలేదు. అప్పటికే యుద్ధంలో పాక్ ఓటమిదశకు చేరుకుంది. నిబంధనలు అడ్డురావడంతో ప్రత్యక్షంగా సాయం చేయకపోయినా అమెరికా పరోక్షంగా పాక్కు అండగా నిల్చింది. ఈ కారణంగా సిఐఎ ప్రమేయాన్ని కూడా తక్కువగా అంచనావేయలేం. పైగా ఆ సమయంలో సిఐఎలో డైరెక్టర్ ఆఫ్ ప్లాన్స్గా ఉన్న రోబర్డ్ క్రోలీ అమెరికాకు చెందిన గ్రెగరీడగ్లస్ అనే జర్నలిస్ట్కు ఇంటర్వ్యూ ఇస్తూ శాస్త్రితో పాటు భారత అణు పితామహుడు డాక్టర్ హోమీబాబా మరణాలకు సిఐఎ ప్రణాళికలు రచించి అమలు చేసిందని వెల్లడించారు. అయితే తన మరణానంతరమే ఈ ఇంటర్వ్యూను ప్రచురించాలని ఆయన డగ్లస్ను కోరారు. శాస్త్రి, హోమీబాబా మరణాలు ఒకేనెల్లో జరిగాయి. రెండిం టికి మధ్య రెండు వారాల వ్యవధే ఉంది. పైగా ఈ రెండు దేశానికి వెలుపలే చోటు చేసుకున్నాయి. శాస్త్రి మరణంలో హృద్రోగాన్ని సాకుగా చూపితే బాబా మరణానికి పైలెట్ తప్పిదాన్ని కారణంగా ప్రచారం చేశారు. 60వ దశకంలో అమెరికాకు సహకరించని వివిధ దేశాల నేతల్ని హతమార్చడం సిఐఎ పనిగా పెట్టుకుంది. 1960నుంచి 65మధ్యలో క్యూబా అధ్యక్షుడు ఫెడరల్ క్యాస్ట్రోపై అనేక సార్లు దాడులు చేసింది. భారత్ అణు కార్యక్రమాన్ని నిలిపేయడానికి అంగీకరించలేదు. పైగా అమెరికాకు సహకరించే పాక్పై విజయానికి చేరువలో ఉంది. ఈ రెండు కార ణాలు శాస్త్రిపై సిఐఎ పగపెంచుకోవడానికి దారితీసుం టాయన్న సందేహాలున్నాయి.

*🏆పురస్కారాలు🏆*

🎖భారతదేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారతరత్న పురస్కారాన్ని, భారతదేశ ప్రభుత్వం వీరి మరణానంతరం 1966లో ప్రకటించింది

*🔥వరల్డ్ జాగ్రఫీ బిట్స్🔥*

*1) . అక్షాంశాలు రేఖాంశాలను మొదట గుర్తించిన శాస్త్రవేత్త ఎవరు?*

*జ: హిప్పార్కస్ (ఆస్ట్రలోబ్ అనే పరికరాన్ని రూపొందించాడు)*

*2) . భూమిపై గల అక్షాంశాలలో అతి పెద్దది ఏది?*

*జ: భూ మధ్యరేఖ*

*3) . ఉత్తర దక్షణ ధృవాలను కలుపుతూ భూమధ్యరేఖను ఖండిస్తూ గీయబడిన అర్ద వృత్తాలను ఏమంటారు?*

*జ: రేఖాంశాలు*

*4) . ప్రపంచంలోఎక్కువ కాల మండలాలు గల దేశం ఏది?*

*జ: ఫ్రాన్స్ (12)*

*5) . ప్రపంచంలో సూర్యుడు మొదటగా ఉదయించే దేశం ఏది?*

*జ: జపాన్*

*6).  ప్రపంచంలో సూర్యుడు చివరగా అస్తమించే దేశం ఏది?*

*జ: అమెరికా (అలస్కా)*

*7) . గ్రీనిచ్ దగ్గర సూర్యుడు నడినెత్తిన ప్రకాశించినపుడు పగలు 12 గంటలు చూపే గడియారాన్ని ఏమంటారు?*

*జ: కాలమాపకం*

*8) . కాల మాపకాన్ని ఎవరు ఏ సంవత్సరంలో కనుగొన్నారు?*

*జ: జాన్ హరిసన్ 1737.*

*9) . 0 డిగ్రీ అంక్షాంశం అంటే ఏంటి ?*

*జ: భూమధ్య రేఖ*

*10) . 23 1/2 డిగ్రీల ఉత్తర అక్షాంశం, దక్షిణ అక్షాంశం ఏది ?*

*జ: ఉత్తర అక్షాంశం – కర్కట రేఖ, దక్షిణ అక్షాంశం – మకర రేఖ*

*11) . 66 1/2 డిగ్రీల ఉత్తర అక్షాంశం, దక్షిణ అక్షాంశం ఏవి ?*

*జ: ఉత్తర – ఆర్కిటిక్ వలయం, దక్షిణం – అంటార్కిటిక్ వలయం*

*12) . అంతర్జాతీయ దిన రేఖ అని దేన్ని పిలుస్తారు ?*

*జ: 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని*

*13).  0 డిగ్రీల రేఖాంశాన్ని ఏమంటారు ?*

*జ: గ్రీనిచ్ రేఖాంశం ( ప్రధాన రేఖాంశం)*

*14) . అంతర్జాతీయ దిన రేఖ పసిఫిక్ మహాసముద్రం గుండా ప్రయాణించేటప్పుడు ఏ జలసంధిని ఖండిస్తుంది ?*

*జ: బేరింగ్ జలసంధి*

*15) . గ్రీనిచ్ రేఖ ప్రయాణించే దేశాలు ఏంటి ?*

*జ: బ్రిటన్, ఫ్రాన్స్, స్పెయిన్, అల్జీరియా, మాలి, బర్మినోపోసో, ఘనా*

*16) . భారత్ కాలమానం 82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంశం ఆధారంగా నిర్ణయించారు. అయితే ఇది గ్రీనిచ్ కాలమానం కంటే ఎన్ని కంటే ముందు ఉంటుంది ?జి సైదేశ్వర రావు*

*జ: ఐదున్నర గంటలు*

*17) . ఏయే దేశాలు 82 1/2 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ప్రమాణికంగా తీసుకున్నాయి ?*

*జ: భారత్, నేపాల్, శ్రీలంక*

*18) . 82 1/2తూర్పు రేఖాంశం మన దేశంలో ఏయే పట్టణాల గుండా పోతుంది ?*

*జ: అలహాబాద్, జబల్ పూర్, రాయ్ పూర్, కోరాపుట్, యానాం, కాకినాడ*

*19) . భూమి తన చుట్టూ తాను ఒక డిగ్రీ తిరడానికి పట్టే కాలం కాలం ఎంత ?*

*జ: నాలుగు నిమిషాలు*

*20) . భారత్ లో టైమ్ ఉదయం 10 అయితే, లండన్ లో ఎంతవుతుంది ?*

*జ: ఉదయం 4.30*

రాష్ట్రీయం:

1) హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ఎన్ని రేడియల్ రోడ్లను నిర్మిస్తున్నారు?
జ: 35
2) శీతల పానీయాల సంస్థ పార్లే ఆగ్రో కంపెనీకి చెందిన ప్రూటీకి ఎవరు బ్రాండ్ అంబాసిడార్ గా నియమితులయ్యారు ?
జ: అల్లు అర్జున్

జాతీయం
3) ప్రపంచం నలుమూలలా ఉన్న భారతీయ సంతతి పార్లమెంటేరియన్ల తొలి సదస్సు ఢిల్లీలో జరిగింది.  ఈ సదస్సును ఎవరు ప్రారంభించారు ?
జ. ప్రధాని నరేంద్ర మోడీ
(మొత్తం 24 దేశాలకు చెందిన 134 మంది ప్రజాప్రతినిధులు హాజరయ్యారు)
4) గాంధీ మహాత్ముడు దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చి 102 యేళ్ళు (జనవరి 9) పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమం ఏంటి ?
జ: భారత సంతతి పార్లమెంటేరియన్ల సదస్సు
5) భారత్ లో ప్రవాస భారతీయ దివస్ ను ఎప్పుడు జరుపుకుంటారు ?
జ: జనవరి 9
(నోట్: 1915లో గాంధీ మహాత్ముడు దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన రోజు)
6) ప్రతి యేటా జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుతారు ?
జ: జనవరి 25
7) ఆధార్ సమాచార భద్రత, ఎదుర్కోవాల్సిన సవాళ్ళపై ‘బయో మెట్రిక్, భారత్ లో దాని ప్రభావం’ పేరుతో నివేదిక రూపొందించినది ఎవరు ?
జ: ఎస్ .అనంత్ ( ది ఇనిస్టిట్యూట్ ఫర్ డెవలప్ మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ లో అధ్యాపకుడు)
8) పాపులర్ రమ్ బ్రాండ్ ఓల్డ్ మంక్ వ్యవస్థాపకుడు చనిపోయారు. ఆయన పేరు ఏది
జ: కపిల్ మోహన్
9) ఇస్రో తన 100వ ఉపగ్రహాన్ని ఈనెల 12న నెల్లూరులోని శ్రీహరి కోట నుంచి ప్రయోగించనుంది. అందుకోసం ఉపయోగిస్తున్న వాహక నౌక ఏది
జ: PSLV-C40
10) దేశంలోనే అత్యంత వేగవంతమైన మొదటి మల్టీ పెటా ఫ్లాప్స్ సూపర్ కంప్యూటర్ ప్రత్యూష్ ను ఎక్కడ నెలకొల్పారు ?
జ: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటలర్జీ, పుణె
11) ఏ సామాజిక మాద్యమం ద్వారా ఇండేన్ గ్యాస్ రీఫిల్ బుక్ చేసే సదుపాయం అందుబాటులోకి తెచ్చారు ?
జ: ఫేస్ బుక్, ఇండేన్
12) అమర్ నాథ్ యాత్రను ఎప్పటి నుంచి ప్రారంభించనున్నట్టు బోర్టు ప్రకటించింది ?
జ: జూన్ 28 నుంచి
13) విద్యార్థులకు ఆరోగ్యకర ఆహారంపై భారత ఆహార ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) రూపొందించిన పుస్తకం ఏది ?
జ: ఎల్లో బుక్
14) బాలికలకు పీజీ వరకూ ఉచిత విద్య అందించాలని సిఫార్సు చేసిన కేంద్ర సలహామండలి ( సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ – కేబ్ ) ఉపసంఘం ఛైర్మన్ ఎవరు ?
జ: కడియం శ్రీహరి
15) ఫ్రాన్స్ దేశ అత్యున్నత పురస్కారం లీజియన్ ఆఫ్ హానర్ ను 42వ అంతర్జాతీయ కోల్ కతా బుక్ ఫెయిర్ 2018 లో ఎవరికి బహుకరించారు ?
జ: సౌమిత్రా ఛటోపాధ్యాయ్ ( నటుడు)
16) దేశంలో రెండో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ?
జ: అరుణాచల్ ప్రదేశ్
(నోట్: మొదటిది పుణేలో ఉంది.  దీనికి ప్రస్తుతం అనుపమ్ ఖేర్ ఛైర్మన్ గా ఉన్నారు )
17) డోపింగ్ టెస్టులో పట్టుబడి ఐదు నెలల నిషేధానికి గురైన భారతీయ క్రికెటర్ ఎవరు ?
జ: యూసుఫ్ పఠాన్

అంతర్జాతీయం
18) ప్రపంచంలో అత్యంత ఉష్ణోగ్రతలతో మండిపోయే ఏ ఎడారి ఇప్పుడు మంచు దుప్పటి కప్పుకుంది ?
జ: సహారా ఎడారి
19) ఎన్నాళ్ళ నుంచో శత్రుత్వంగా ఉన్న ఉత్తర కొరియా, దక్షిణ కొరియా దేశాల అధికారుల మధ్య చర్చలు ఎక్కడ జరిగాయి ?
జ: పాన్ ముంజోమ్ (సరిహద్దు ప్రాంతం)
20) భారత్ కు చెందిన హజ్ యాత్రికుల సంఖ్యను సౌదీ అరేబియా ఎంతకు పెంచింది ?
జ: 5 వేల మంది ( మొత్తం 1,75,025 మంది వెళ్ళే అవకాశం ఉంటుంది )

■Current Affairs:

National News

 1. Important,  Cabinet Approvals- 10th January 2018

 i. The,  Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has given the following set of approvals. The important Cabinet Approvals are given as follows-
The Cabinet has approved-
 1. MoU,  between India and Canada for cooperation in the field of Science & Technology. The  MoU will provide a mechanism and help to foster scientific cooperation between R&D and academic institutions of India and Canada.
 2. Implementation,  of CCEA decision on the closure of Tungabhadra Steel Products Limited.
3. Fixed term for Chairperson and Members of the National Trust- Cabinet approved the proposal to amend Section 4(1) and Section 5(1) of the National Trust for the Welfare of Person with Autism, Cerebral Plasy, Mental Retardation and Multiple Disabilities Act, 1999 to fix the term of the Chairperson and Members of the Board of National Trust for three years.

 2. Karnataka,  Tops States with Investment Intentions of Rs. 1.49 lakh crore

i. Karnataka topped all states with investment intentions of Rs. 1.49 lakh crore till October 2017,  according to R V Deshpande, Karnataka Minister for Large, Medium Industries and Infrastructure Development
 ii. The,  investment was 43 percent of the country's total investment intentions. Karnataka has topped in FDI inflows and has performed well in exports, contributing about 40 percent in electronics and software services.

Static/Current Takeaways Important for-Karnataka CM- Siddaramaiah, Governor- Vajubhai Vala.

 3. India, 's 1st All-Women Railway Station in Mumbai Enters Limca Records

i. The Matunga suburban station on the Central Railway (CR) has found its way into the Limca Book of Records for having an all-woman staff.
 ii. The,  achievement comes six months after Matunga became the first railway station in the country to be run by an all-woman  staff. The,  station is being manned exclusively by women staffers since July 2017, a first on the Indian Railways.

Static/Current Takeaways Important for-Matunga station is situated in Mumbai, Maharashtra.

Banking/ Economy/ Business News

 4. Paytm,  Launches Investment Arm, to Invest $10 million

i. Paytm has set up a new entity called Paytm Money Ltd that will offer investment and wealth management products and will invest close to $10 million upfront in the new entity.
 ii. Paytm,  Money is the fourth product from One97’s stable after Paytm Mall, Paytm Payments Bank and Paytm wallet. It will be available as a separate mobile application to users.

Static/Current Takeaways Important for-Paytm is run by One97 Communications  Ltd.Vijay,  Shekhar Sharma is the founder of One97 Communications.

 5. Cabinet,  Approves Amendments in FDI Policy, Policies Further Liberalized

 i. In,  the financial year 2016-17, total FDI of US $ 60.08 billion has been received, which is an all-time high. The Cabinet chaired by PM Narendra Modi has approved amendments in FDI Policy and further liberalized few of the policies of FDI.
ii. Key Highlights-

100% FDI under automatic route for Single Brand Retail Trading.100% FDI under automatic route in Construction  Development.Foreign,  airlines allowed to invest up to 49% under approval route in Air  India.FIIs/FPIs,  allowed to invest in Power Exchanges through primary  market.Definition,  of ‘medical devices’ amended in the FDI Policy.

Government approval no longer required for FDI in Single Brand Retail Trading (SBRT)
Extant FDI policy on SBRT allows 49% FDI under automatic route, and FDI beyond 49% and up to 100% through Government approval route. It has now been decided to permit 100% FDI under automatic route for SBRT.

Civil Aviation
As per the extant policy, foreign airlines are allowed to invest under Government approval route in the capital of Indian companies operating scheduled and non-scheduled air transport services, up to the limit of 49% of their paid-up capital. However, this provision was presently not applicable to Air India, thereby implying that foreign airlines could not invest in Air  India. It,  has now been decided to do away with this restriction and allow foreign airlines to invest up to 49% under approval route in Air India.

Construction Development: Townships, Housing, Built-up Infrastructure and Real Estate Broking Services
It has been decided to clarify that real-estate broking service does not amount to real estate business and is, therefore, eligible for 100% FDI under the automatic route.

Power Exchanges
The extant policy provides for 49% FDI under automatic route in Power Exchanges registered under the Central Electricity Regulatory Commission (Power Market) Regulations, 2010. It has now been decided to do away with this provision, thereby allowing FIIs/FPIs to invest in Power Exchanges through the primary market as well.

 6. Flipkart, 's PhonePe Inks Pact with FreeCharge

i. Flipkart’s payments arm PhonePe has partnered mobile wallet company FreeCharge to allow the latter’s customers pay for transactions at PhonePe’s partner merchants.
 ii. According,  to the deal terms, PhonePe has now enabled its users to link their existing FreeCharge wallets to the PhonePe app. Once linked, PhonePe customers will be able to spend their FreeCharge wallet balance at all online and offline merchant outlets that accept payments via PhonePe.

Static/Current Takeaways Important for-Phone Pe Chief Executive Officer (CEO)- Sameer  Nigam.CEO,  of Freecharge- Sangram Singh, Owner- Axis bank.

 7. PNB,  Ties up with NSFDC for Assisting SC Families

i. Punjab National Bank (PNB) and National Scheduled Castes Finance and Development Corporation (NSFDC) have tied up to provide financial assistance for economic empowerment of persons belonging to Scheduled Caste (SC) families living below Double Poverty Line (DPL).
 ii. A,  Memorandum of Agreement (MoA) to this effect was signed between PNB and NSFDC. Under this tie-up, PNB would act as a channelising agent for the loan schemes of NSFDC.

Static/Current Takeaways Important for-PNB Chairman- Sunil Mehta, Headquarters- New Delhi.

 8. World,  Bank Projects India’s Growth Rate at 7.3% in 2018

i. World Bank has projected India’s growth rate at 7.3 percent in 2018 and 7.5 for the next two  years. According,  to the 2018 Global Economics Prospect release, despite initial setbacks from demonetisation and Goods and Services Tax (GST), India’s economy is estimated to have grown at 6.7 percent in 2017. 
 ii. India’s,  growth potential will be around 7 percent for the next 10 years. In comparison with China, which is slowing, the World Bank is expecting India to gradually accelerate.

Static/Current Takeaways Important for-World Bank's Prospects Group Director- Ayhan  Kose.Jim,  Yong Kim is the 12th President of the World Bank  Group.World,  Bank Headquarters in Washington DC, USA.

Appointments

 9. Dilip,  Asbe Appointed MD & CEO of NPCI

i. National Payments Corporation of India (NPCI) has appointed Dilip Asbe as Managing Director and CEO of the organisation.
 ii. Prior,  to this, Asbe was CEO-in-charge of  NPCI. He,  had come in place of AP Hota.

Static/Current Takeaways Important for-NPCI is an umbrella organisation for retail payment systems in  India.NPCI, 's Registered Office is in Mumbai.

Sports

10. Aditya Mehta Wins Kolkata Open 2018 International Invitation Snooker Championship

i. Professional player Aditya Mehta won the Kolkata Open 2018 International Invitation Snooker Championship in the capital city of West Bengal Kolkata.
 ii. This,  is his third Kolkata Open title since it’s inception. In the thrilling final he defeated Englishman Professional Player Alfie Burden.

11. Anchal Thakur Bags Bronze, India's 1st International Medal in Skiing

i. Aanchal Thakur made history as she won India's first ever international medal in  skiing. The,  21-year-old Manali resident clinched bronze in the coveted Alpine Ejder 3200 Cup.
 ii. The,  Championship was organised by the Federation Internationale de Ski (skiing's international governing body) in Erzurum,  Turkey. She,  won the medal in the slalom race category.

Static/Current Takeaways Important for-Turkey Capital- Ankara, Currency- Turkish lira.

*✅ తెలుసుకుందాం ✅*

*⭕జనాభా లెక్కలను ఎందుకు సేకరిస్తారు?*

✳ప్రపంచంలోని దేశాలన్నీ జనాభా లెక్కలను (census) సేకరిస్తాయి. మానవులు సమూహాలుగా నివసించడం మొదలైన దగ్గర్నుంచీ ఈ ప్రక్రియ మొదలైందని చెప్పవచ్చు. ప్రాచీన కాలంలో రాజులు తమ పాలనలో ఉన్న ప్రజల్లో ఎంత మంది యుద్ధం చేయడానికి తగిన సామర్థ్యం కలిగి ఉన్నారో తెలుసుకోడానికి, పన్నుల రూపంలో ఖజానాకు ఎంత ధనం సమకూరుతుందో అంచనా వేయడానికి జనాభా లెక్కలను సేకరించేవారు. ప్రస్తుత కాలంలో ఇందువల్ల ప్రభుత్వానికి విద్య, ఆరోగ్య, ఉద్యోగ సంబంధిత రంగాలలో ప్రణాళికలు వేయడానికి, ఒకో రంగానికి ఆర్ధిక వనరులు ఎలా సమకూర్చాలో తెలుసుకోడానికి వీలవుతుంది. దేశంలో జనాభా పెరుగుతోందో, తగ్గుతోందో తెలుస్తుంది. పట్టణ, పల్లె ప్రాంతాల్లో ఉండే ప్రజల నిష్పత్తి తెలుస్తుంది. ఎన్నికలలో ఎంత మంది ఓటర్లు పాల్గొంటారో తెలిస్తే ఆ మేరకు ఏర్పాటు చేయడానికి కుదురుతుంది. అలాగే ఆర్ధిక, సాంఘిక వ్యవస్థలను, శాంతిభద్రతలను మెరుగుపరిచే నిర్ణయాలను తీసుకోడానికి వీలవుతుంది. మన దేశంలో తొలిసారిగా 1872లో జనాభా లెక్కలను సేకరించారు. అప్పటి నుంచి ప్రతి పదేళ్లకు ఓసారి లెక్కించడం ఆనవాయితీగా ఉంది. 
       🍃✌🌺
🙏డిసెంబర్ 2017 వ్యక్తులు
ంం👶👧👦👨👩👴👵💂👷👮👼

ఇన్‌స్పైరింగ్ ఐఏఎస్‌లలో ఇద్దరు తెలంగాణ కలెక్టర్లు 
Current Affairs బెటర్ ఇండియా వెబ్‌సైట్ దేశంలోని స్ఫూర్తిదాయక ఐఏఎస్ అధికారుల జాబితాను రూపొందించింది. మెదక్ జిల్లా కలెక్టర్ భారతి హొలికెరి, మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్‌లకు ఈ జాబితాలో చోటు దక్కింది. వినూత్న ఆలోచనలతో కొత్తరకమైన కార్యక్రమాలకు శ్రీకారంచుట్టి, ప్రజల అభ్యున్నతికి కృషి చేశారని వీరిద్దరి గురించి బెటర్ ఇండియా సంస్థ పేర్కొంది. 
భారతి హొలికెరి గర్భిణుల ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకున్న చర్యలను ప్రశంసించింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్యసేవలను మెరుగుపర్చారని పేర్కొంది. మెదక్ జిల్లాను వంద శాతం బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా మార్చారు. 
ఇక రొనాల్డ్ రాస్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ ప్రజల అభ్యున్నతికి విభిన్న కార్యక్రమాలను అమలుచేశారు. హరితహారం అమలుచేసి జిల్లాను ఉత్తమ స్థానంలో నిలిపారు. దివ్యాంగ సోలార్ సొసైటీ ఏర్పాటుచేసి దివ్యాంగుల అభ్యున్నతికి కృషి చేశారు. కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తి చేసేలా వినూత్న కార్యక్రమాలు అమలుచేశారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బెటర్ ఇండియా ఇన్‌స్పైరింగ్ ఐఏఎస్‌ల జాబితా 
ఎప్పుడు : డిసెంబర్ 21 
ఎవరు : రొనాల్డ్ రాస్, భారతి హొలికెరికి జాబితాలో చోటు 

యూజీసీ చైర్మన్‌గా ధీరేంద్ర పాల్ సింగ్ 
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్‌గా ప్రొఫెసర్ ధీరేంద్ర పాల్ సింగ్‌ను నియమిస్తూ డిసెంబర్ 22న అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (నాక్) డెరైక్టర్‌గా ఉన్నారు. ధీరేంద్ర ఐదేళ్లపాటు యూజీసీ చైర్మన్ పదవిలో కొనసాగుతారని సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ) తెలిపింది. ప్రొఫెసర్ వేద్ ప్రకాశ్ యూజీసీ చైర్మన్‌గా 2017 ఏప్రిల్‌లో పదవీ విరమణ పొందినప్పటినుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : యూజీసీకి కొత్త చైర్మన్ నియామకం 
ఎప్పుడు : డిసెంబర్ 22 
ఎవరు : ప్రొఫెసర్ ధీరేంద్ర పాల్ సింగ్ 

ఆమ్నెస్టీ జనరల్ సెక్రటరీగా కుమీ నాయుడు 
అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శిగా తెలుగు మూలాలున్న దక్షిణాఫ్రికా ఉద్యమకారుడు కుమీ నాయుడు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న బెంగళూరుకు చెందిన సలీల్ షెట్టి 2018 ఆగస్టులో రిటైరయిన తరువాత నాయుడు బాధ్యతలు స్వీకరిస్తారు. 52 ఏళ్ల నాయుడు 2009- 2015 మధ్య కాలంలో గ్రీన్‌పీస్ ఇంటర్నేషన్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పనిచేశారు. తెలుగు మూలాలున్న తల్లిదండ్రులకు జన్మించినా మిగిలిన భారత సంతతి ప్రజల మాదిరిగానే నాయుడు కూడా తనను నల్లజాతి దక్షిణాఫ్రికా పౌరునిగానే భావించి, తెల్లజాతి పాలకులపై పోరు సాగించారు. చదువుకునే రోజుల్లో అక్కడి ఎమర్జెన్సీ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో పలుమార్లు అరెస్టయ్యారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రధాన కార్యదర్శిగా తెలుగు మూలాలున్న దక్షిణాఫ్రికా ఉద్యమకారుడు 
ఎప్పుడు : డిసెంబర్ 22 
ఎవరు : కుమీ నాయుడు 

ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ - 2017 జాబితా 
ప్రముఖ పత్రిక ‘ఫోర్బ్స్ ఇండియా’ 100 మంది సెలబ్రిటీ జాబితాలో బాలీవుడ్ స్టార్ సల్మాన్‌ఖాన్ మరోసారి తొలి స్థానంలో నిలిచాడు. ఈ మేరకు ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ - 2017 జాబితాను డిసెంబర్ 22న విడుదల చేసింది. అక్టోబర్ 1, 2016 నుంచి సెప్టెంబర్ 30, 2017 మధ్యలో ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో అత్యధిక ఆదాయం ఆర్జించినవారి పేర్లతో ఫోర్బ్స్ ఈ జాబితా రూపొందించింది. ఇందులో 232.83 కోట్ల ఆదాయంతో సల్మాన్‌ఖాన్ మొదటి స్థానంలో నిలిచాడు. 170.50 కోట్ల ఆదాయంతో షారూఖ్‌ఖాన్ రెండో స్థానంలో, 100.72 కోట్ల ఆదాయంతో విరాట్ కోహ్లీ మూడో స్థానంలో ఉన్నారు. 
2017 జాబితా 
సల్మాన్ ఖాన్ - రూ.232.83 కోట్లు
షారుఖ్ ఖాన్ - రూ.170 కోట్లు
విరాట్ కొహ్లీ - రూ.100.72 కోట్లు
అక్షయ్ కుమార్ - రూ.98.25 కోట్లు
సచిన్ టెండూల్కర్ - రూ.82.50 కోట్లు
అమీర్ ఖాన్ - రూ.68.75 కోట్లు
ప్రియాంక చోప్రా - రూ.68 కోట్లు
ఎం.ఎస్.ధోని - రూ.63.77 కోట్లు
హృతిక్ రోషన్ - రూ.63.12 కోట్లు
రవీణ్‌వీర్ సింగ్ - 62.63 కోట్లు
తెలుగు సెలబ్రిటీలు 
పీవీ సింధూ - 13వ స్థానం - రూ.57.25 కోట్లు
రాజమౌళి - 15వ స్థానం - రూ.55 కోట్లు
ప్రభాస్ - 22వ స్థానం - రూ.36.25 కోట్లు
సైనా నెహ్వాల్ - 29వ స్థానం - 31 కోట్లు
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ - 2017 జాబితా 
ఎప్పుడు : డిసెంబర్ 22
ఎవరు : తొలి స్థానంలో సల్మాన్ ఖాన్ 
ఎక్కడ : భారత్‌లో 
ఎందుకు : అక్టోబర్ 1, 2016 నుంచి సెప్టెంబర్ 30, 2017 మధ్యలో ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్డ్‌లో అత్యధిక ఆదాయం ఆర్జించినవారు

దాణా కేసులో లాలూని దోషిగా ప్రకటించిన సీబీఐ కోర్టు 
21 ఏళ్లనాటి దాణా కుంభకోణం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటికే ఒక కేసులో ఆయన జైలు శిక్ష ఎదుర్కొంటూ ఉండగా.. డిసెంబర్ 23న మరో కేసులో రాంచీ సీబీఐ కోర్టు దోషిగా తేల్చింది. అదే సమయంలో మరో మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా(80)తో పాటు ఆరుగురిని నిర్దోషులుగా పేర్కొంది. జనవరి 3న దోషులకు కోర్టు శిక్ష ఖరారు చేయనుంది. 1991-94 మధ్య కాలంలో దేవ్‌గఢ్ ఖజానా నుంచి రూ. 89.27 లక్షల్ని అక్రమంగా విత్‌డ్రా చేసిన దాణా కేసులో ఈ తీర్పు వెలువడింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌ను దోషిగా ప్రకటించిన కోర్టు 
ఎప్పుడు : డిసెంబర్ 23
ఎవరు : సీబీఐ ప్రత్యేక కోర్టు 

నేరెళ్ల వేణుమాధవ్‌పై ప్రత్యేక తపాలా కవర్ 
అంతర్జాతీయ మిమిక్రీ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్‌కు తపాలా శాఖ అరుదైన గౌరవం కల్పించింది. మిమిక్రీ కళలో 70 ఏళ్లు పూర్తి చేసుకున్న వేణుమాధవ్ 86వ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనపై తపాలాశాఖ తెలంగాణ సర్కిల్ ప్రత్యేక తపాలా కవర్‌ను ఆవిష్కరించింది. డిసెంబర్ 26న హైదరాబాద్ జనరల్ పోస్టాఫీసు (జీపీవో)లో నిర్వహించిన కార్యక్రమంలో సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ బ్రిగేడియర్ బి.చంద్రశేఖర్ ఈ కవర్‌ను ఆవిష్కరించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : నేరెళ్ల వేణుమాధవ్‌పై ప్రత్యేక తపాలా కవర్ 
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : తపాలా శాఖ

గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ
వరుసగా రెండోసారి విజయ్ రూపానీ గుజరాత్ ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఈ మేరకు డిసెంబర్ 26న నిర్వహించిన కార్యక్రమంలో రూపానీతో గవర్నర్ ఓపీ కోహ్లీ ప్రమాణస్వీకారం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్, మంత్రులుగా మరో 18 మంది ప్రమాణం చేశారు. వీరిలో నితిన్ పటేల్ సహా 9 మంది కేబినెట్ మంత్రులు కాగా.. మిగతా 10 మంది సహాయ మంత్రులు. 
ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు సాధించి వరుసగా ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 77 స్థానాల్లో గెలుపొందింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : గుజరాత్ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ ప్రమాణ స్వీకారం 
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎందుకు : గుజరాత్‌లో వరుసగా ఆరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజీపీ 

హిమాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జైరామ్ ఠాకూర్ 
హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా జైరామ్ ఠాకూర్ (52) డిసెంబర్ 27న ప్రమాణస్వీకారం చేశారు. షిమ్లాలోని రిడ్‌‌జ గ్రౌండ్‌లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్.. సీఎంతోపాటుగా మరో 11 మంది మంత్రులతో ప్రమాణం చేయించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, అగ్రనేత ఎల్‌కే అడ్వాణీతోపాటు రాజ్‌నాథ్, గడ్కరీ, నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 
ఇటీవల జరిగిన హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 68 సీట్లకు గానూ బీజేపీ 44 స్థానాల్లో గెలిచింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : హిమాచల్‌ప్రదేశ్‌లో కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం 
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జైరామ్ ఠాకూర్

ఐఓఏ కొత్త అధ్యక్షుడిగా నరీందర్ బాత్రా
 Current Affairs భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నూతన అధ్యక్షుడిగా నరీందర్ బాత్రా ఎన్నికయ్యారు. డిసెంబర్ 14న జరిగిన ఎన్నికల్లో ఆయనకు 142 ఓట్లు రాగా ప్రత్యర్థి అనిల్ ఖన్నాకు 13 ఓట్లు వచ్చాయి. ఐఓఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. బాత్రా ప్రస్తుతం అంతర్జాతీయ హాకీ సమాఖ్య చీఫ్‌గా కొనసాగుతున్నారు. ఐఓఏ కార్యదర్శిగా రాజీవ్ మెహతా ఎన్నికవగా, కోశాధికారిగా ఆనందీశ్వర్ పాండే గెలిచారు. నూతన కార్యవర్గం నాలుగేళ్ల పాటు పదవిలో ఉంటుంది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : భారత ఒలింపిక్ సంఘం కొత్త అధ్యక్షుడి ఎన్నిక 
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : నరీందర్ బాత్రా
ఎక్కడ : ఐఓఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో

ఎన్‌ఐఎన్ డెరైక్టర్‌గా డాక్టర్ హేమలత
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్) నూతన డెరైక్టర్‌గా సీనియర్ డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ ఆర్.హేమలత నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం డిసెంబర్ 14 న ఉత్తర్వులు జారీ చేసింది. గాంధీ మెడికల్ కాలేజీలో వైద్య విద్య పూర్తిచేసిన హేమలత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) పరిధిలోని ఎన్‌ఐఎన్‌లో సీనియర్ సైంటిస్ట్‌గా చేరారు. గర్భిణులు, నవజాత శిశువులకు పౌష్టికాహారం వంటి అంశాలపై పరిశోధనలు చేశారు. పరిశోధన రంగంలో ఆమె అందించిన సేవలకు 2016లో ‘ఫెలో ఆఫ్ నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సెన్సైస్’, 2017 లో ‘ఫెలో ఆఫ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ న్యూట్రిషన్ సెన్సైస్’ అవార్డులు అందుకున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : జాతీయ పోషకాహార సంస్థ నూతన డెరైక్టర్ నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : ఆర్.హేమలత
ఎక్కడ : హైదరాబాద్
ఎందుకు : పూర్తిస్థాయి డెరైక్టర్‌ను నియమించడంలో భాగంగా

బాలీవుడ్ నటుడు నీరజ్ ఓరా కన్నుమూత
బాలీవుడ్ నటుడు, రచయిత, దర్శకుడు నీరజ్ ఓరా డిసెంబర్ 14న మరణించారు. ఓరాకు 2016, అక్టోబర్‌లో గుండెపోటు రావడంతో కోమాలోకి వెళ్లిపోయారు. దీంతో ఇంట్లోనే చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. సత్య, ఫిర్ హెరా ఫెరి, దౌడ్ వంటి సినిమాలతో ఓరా గుర్తింపు పొందారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : నీరజ్ ఓరా కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 14
ఎవరు : బాలీవుడ్ నటుడు, రచయిత, దర్శకుడు

రిటైర్‌మెంట్ ప్రకటించిన సోనియా గాంధీ
ఏఐసీసీ అధ్యక్షుడిగా డిసెంబర్ 16న రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ప్రస్తుత అధ్యక్షురాలు సోనియాగాంధీ రిటైర్‌మెంట్ ప్రకంటించారు. 1998లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికైన సోనియా 19 ఏళ్ల 9 నెలలు అధ్యక్షురాలిగా ఉన్నారు. సోనియా నాయకత్వంలో 1999 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 114 సీట్లు మాత్రమే గెలుచుకుంది. దీంతో 1999-2004 మధ్యలో లోక్‌సభ ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు.
2004 ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ కూటమి విజయంతో సోనియా ప్రధాని కావాల్సి ఉండగా ఆమె విదేశీయురాలు కావడంతో ప్రధాని పదవి చేపట్టలేకపోయారు. దీంతో తన అనుచరుడు మన్మోహన్ సింగ్‌ను ప్రధాని పదవికి ఎంపికచేశారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : రిటైర్‌మెంట్ ప్రకటించిన ఏఐసీసీ అధ్యక్షురాలు
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : సోనియా గాంధీ
ఎందుకు : ఆరోగ్య కారణాలరీత్యా

ఇ-సైకిల్ ప్రచారకర్తగా సల్మాన్‌ఖాన్ 
ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ సైకిల్ తొక్కనున్నాడు. ఢిల్లీ-మీరట్‌ల మధ్య కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సైకిల్ ట్రాక్‌పై సల్మాన్ ఇ-సైకిల్ సవారీ చేస్తారని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు, ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు కేంద్రం ఈ ట్రాక్‌ను నిర్మిస్తోందని, దీనికి అంబాసిడర్‌గా సల్మాన్‌ఖాన్ కొనసాగుతారని గడ్కరీ తెలిపారు. నగరంలో చిన్నపాటి దూరాలకు సైకిల్ సవారీని ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే సల్మాన్‌ను ప్రచారకర్తగా ఎంపిక చేశారు. ఢిల్లీలో కాలుష్యం స్థాయికి మించి పెరిగిపోవడంతో... డీజిల్, పెట్రోలు వాహనాల సంఖ్యను తగ్గించేందుకు ఈ ట్రాక్‌ను నిర్మిస్తున్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇ-సైకిల్ ప్రచారకర్త 
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : సల్మాన్ ఖాన్ 
ఎక్కడ : ఢిల్లీ-మీరట్‌ల మధ్య 
ఎందుకు : ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు

‘మిస్ ఇండియా-యూఎస్‌ఏ’గా శ్రీసైని
‘మిస్ ఇండియా యూఎస్‌ఏ-2017’ కిరీటం వాషింగ్టన్ రాష్ట్రానికి చెందిన శ్రీసైని (21) అనే విద్యార్థినిని వరించింది. ఈ పోటీలో మొదటి రన్నరప్‌గా కనెక్టికట్‌కు చెందిన వైద్య విద్యార్థిని ప్రాచీ సింగ్ (22), రెండో రన్నరప్‌గా నార్త్ కరోలినాకు చెందిన ఫరీనా నిలిచారు. న్యూజెర్సీలోని రాయల్ అల్బర్‌‌ట్స ప్యాలెస్‌లో డిసెంబర్ 17న మూడు విభాగాల్లో నిర్వహించిన మిస్ ఇండియా యూఎస్‌ఏ పోటీల్లో 24కు పైగా రాష్ట్రాలకు చెందిన దాదాపు 50 మంది పాల్గొన్నారు. కాగా మిసెస్ ఇండియా యూఎస్‌ఏగా ఫ్లోరిడాకు చెందిన క్యాన్సర్ వైద్య నిపుణురాలు కవితా మల్హోత్రా పట్టాని ఎంపికయ్యారు. మొదటి రన్నరప్ టైటిల్‌ను ప్రేరణ, రెండో రన్నరప్ టైటిల్‌ను ఐశ్వర్య సాధించారు. మిస్ టీన్ ఇండియా యూఎస్‌ఏ కిరీటాన్ని న్యూజెర్సీకి చెందిన స్వప్న మన్నం(17) గెలుచుకున్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : మిస్ ఇండియా-యూఎస్‌ఏ - 2017
ఎప్పుడు : డిసెంబర్ 17
ఎవరు : శ్రీసైనీ 
ఎక్కడ : న్యూజెర్సీ 

జస్టిస్ స్వతంత్ర కుమార్ పదవీ విరమణ 
జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) చైర్‌పర్సన్‌గా ఐదేళ్లు సేవలందించిన జస్టిస్ స్వతంత్ర కుమార్ డిసెంబర్ 19న పదవీ విరమణ చేశారు. ఆయన తర్వాత ఈ పదవికి ఇంకా ఎవరినీ నియమించలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ కుమార్ 2012 డిసెంబరు 20న ఎన్‌జీటీ చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. అనంతరం అనేక కీలక తీర్పులను వెలువరించి పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడ్డారు. ఢిల్లీలో 10 ఏళ్లు దాటిన డీజిల్, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలను నిషేధించడం, గంగ, యమున నదుల ప్రక్షాళన చేపట్టడం, హిమాచల్ ప్రదేశ్‌లో అక్రమంగా నిర్మించిన హోటళ్లను కూల్చేయడం తదితరాలన్నీ ఈయన తీర్పుల వల్ల జరిగినవే. జమ్మూ కశ్మీర్‌లోని వైష్ణోదేవీ ఆలయానికి రోజుకు 50 వేల కంటే ఎక్కువ మంది భక్తులు వెళ్లడానికి వీల్లేదనీ, అమర్‌నాథ్ వద్ద ప్రజలు గట్టిగా అరుస్తూ శివనామ స్మరణ చేయకూడదని కూడా జస్టిస్ స్వతంత్ర కుమార్ ఆదేశించారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : జస్టిస్ స్వతంత్ర కుమార్ పదవీ విరమణ 
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : జాతీయ హరిత ట్రిబ్యునల్

కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ
 Current Affairs కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ(47) నియమితులయ్యారు. రాహుల్ తన తల్లి, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ నుంచి డిసెంబర్ 16న బాధ్యతలు స్వీకరించనున్నారు. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా దాఖలైన మొత్తం 89 నామినేషన్లు ఉపసంహరించుకోగా రాహుల్ నామినేషన్ మాత్రమే మిగిలింది. దీంతో ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్ నియమితులైనట్లు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల అథారిటీ ఛైర్మన్ ఎం.రామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. నెహ్రూ-గాంధీ వారసత్వంలో మోతీలాల్ నెహ్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ తర్వాత రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 10
ఎవరు : రాహుల్ గాంధీ

ఆలోచనాపరుల జాబితాలో కమలా హ్యారిస్ 
ప్రపంచ అత్యుత్తమ ఆలోచనాపరుల జాబితాలో భారతీయ అమెరికన్ కమలా హ్యారిస్ అగ్రస్థానంలో నిలిచారు. ప్రఖ్యాత ‘ఫారిన్ పాలసీ మ్యాగజీన్’ 2017 సంవత్సరానికి డిసెంబర్ 5న 50 మంది పేర్లతో ఒక జాబితాను ప్రకటించింది. ఇందులో కాలిఫోర్నియా సెనేటర్‌గా ఉన్న కమలా హ్యారిస్‌తోపాటు భారత సంతతికి చెందిన హసన్ మిన్హాజ్, నిక్కీ హేలీలకు చోటు దక్కింది. 

తూర్పు నౌకాదళ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఎంఎస్ పవార్
తూర్పు నౌకాదళానికి నూతన చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఎంఎస్ పవార్ డిసెంబర్ 11న బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత చీఫ్ ఆఫ్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ న్యూఢిల్లీలోని ఇంటిగ్రేటెడ్ డిఫెన్‌‌స స్టాఫ్ డిప్యూటీ చీఫ్‌గా బదిలీ అయ్యారు. దీంతో 1978 యూపీఎస్‌సీ బ్యాచ్‌కు చెందిన ఎంఎస్ పవార్ బాధ్యతలు స్వీకరించారు. పవార్ ప్రస్తుతం సీబర్డ్ ప్రాజెక్టు డెరైక్టర్ జనరల్‌గా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు గుజరాత్, మహారాష్ట్రలో ఫ్లాగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. పవార్ 1999 కార్గిల్ యుద్ధం సమయంలో వెస్ట్రన్ ఫ్లీట్‌కు ఫ్లీట్ నేవిగేషన్ ఆఫీసర్‌గా కీలక పాత్ర పోషించారు. ఆయన సేవలకు పరమ విశిష్ట సేవా పురస్కారం లభించింది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : తూర్పు నౌకాదళ చీఫ్ ఆఫ్ స్టాఫ్ బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : డిసెంబర్ 11 
ఎవరు : ఎంఎస్ పవార్
ఎక్కడ : విశాఖపట్నం 
ఎందుకు : ప్రస్తుత చీఫ్ అతుల్ కుమార్ జైన్ బదిలీ అవడంతో

డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడు లాల్జీ సింగ్ కన్నుమూత
ప్రముఖ శాస్త్రవేత్త, భారత డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడు లాల్జీ సింగ్ (70) డిసెంబర్ 10న కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో జన్మించిన సింగ్ బీహెచ్‌యూలో బీఎస్సీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ పూర్తిచేశారు. ఇదే యూనివర్సిటీకి 25వ వైస్‌చాన్స్ లర్‌గా పనిచేశారు.
లాల్జీసింగ్ హైదరాబాద్‌లోని కేంద్ర డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నొస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)లో ఓఎస్డీగా (1995-99)కూడా సేవలందించారు. హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) వ్యవస్థాపకుల్లో లాల్జీ ఒకరు. ల్యాకోన్‌‌స, జెనోమ్ ఫౌండేషన్ (పేదప్రజలకు జన్యుపరమైన సమస్యలకు చికిత్సనందించే సంస్థ) వంటి పలు సంస్థలను ఆయన స్థాపించారు.
దేశంలో డీఎన్‌ఏ ఆధారంగా పితృత్వాన్ని నిర్ధారించే పరీక్షలను లాల్జీ సింగ్ అభివృద్ధి చేశారు. 1991లోనే డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా డీఎన్‌ఏను కోర్టులో సాక్ష్యంగా ప్రవేశపెట్టడం ద్వారా ఓ పితృత్వ కేసును నిర్ధారించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ, పంజాబ్ మాజీ సీఎం బియంత్ సింగ్ హత్య కేసుల్లోనూ మృతుల నిర్ధారణకు ఈ టెక్నాలజీనే ఉపయోగించారు. 
లాల్జీసింగ్ హైదరాబాద్‌లోని సీసీఎంబీ డెరైక్టర్‌గా ఉన్నప్పుడు కృత్రిమ గర్భధారణ పద్ధతుల ఆధారంగా అంతరించిపోతున్న జీవజాతుల సంతతిని పెంచేందుకు లేబొరేటరీ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ ఎన్‌డేంజర్డ్ స్పీషీస్ (ల్యాకోన్‌‌స)ను ఏర్పాటు చేశారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ పితామహుడు కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : లాల్జీసింగ్
ఎక్కడ : భారత్‌లో

‘మీ టూ’ ఉచ్చులో ట్రంప్
ప్రపంచవ్యాప్తంగా లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు తమ వివరాలు బహిర్గతం చేస్తున్న ‘మీ టూ’ హ్యాష్ ట్యాగ్ ఉచ్చులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిక్కుకున్నాడు. డిసెంబర్ 12న న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో జెస్సీకా లీడ్‌‌స, రేఛల్ క్రూక్స్, సమంతా హాల్వే అనే మహిళలతో పాటు 16 మంది ట్రంప్ తమపై లైంగికదాడికి యత్నించాడని ఆరోపించారు. తమ అనుమతి లేకుండానే చుంబించడం, సున్నిత ప్రదేశాలను తాకడం వంటి అవాంఛిత చర్యలకు ట్రంప్ పాల్పడ్డారని తెలిపారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ‘మీ టూ’ ఉచ్చులో అమెరికా అధ్యక్షుడు
ఎప్పుడు : డిసెంబర్ 12
ఎవరు : డొనాల్డ్ ట్రంప్
ఎందుకు : మహిళలను లైంగికంగా వేధించినందుకు

సీపీసీ సమావేశాలకు ఏచూరీ, సుధాకర్‌రెడ్డిలకు ఆహ్వానం
 Current Affairs బీజింగ్‌లో జరిగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) సమావేశాలకు సీపీఎం, సీపీఐ ప్రధాన కార్యదర్శులు సీతారాం ఏచూరీ, సురవరం సుధాకర్‌రెడ్డిలను చైనా ఆహ్వానించింది. ఈ మేరకు నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు జరిగే ‘ప్రపంచ రాజకీయ పార్టీలతో సీపీసీ చర్చలు’ సమావేశాల్లో వారు పొల్గొననున్నారు. ఈ సమావేశాలకు 120 దేశాలనుంచి దాదాపు 200 రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరుకానున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : సీపీసీ సమావేశానికి ఏచూరీ, సుధాకర్‌రెడ్డిలకు ఆహ్వానం 
ఎప్పుడు : నవంబర్ 30 నుంచి డిసెంబర్ 03 వరకు
ఎవరు : కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా
ఎక్కడ : బీజింగ్, చైనా

తెలుగులో సానియా మీర్జా ఆత్మకథ
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటోబయోగ్రఫీ ‘ఏస్ అగెనైస్ట్ ఆడ్‌‌స’ తెలుగు అనువాదం ‘టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా’ పేరుతో నవంబర్ 29న విడుదలైంది. సానియా కెరీర్ విశేషాలతో కూడిన ఈ పుస్తకంను ‘సాక్షి’ క్రీడా ప్రతినిధి మొహమ్మద్ అబ్దుల్ హాది తెలుగులోకి తర్జుమా చేశారు. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : తెలుగులో సానియా మీర్జా ఆత్మకథ
ఎప్పుడు : నవంబర్ 29
ఎవరు : సాక్షి క్రీడా ప్రతినిధి మొహమ్మద్ అబ్దుల్ హాది

జీఈఎస్ సదస్సులో స్టార్టప్‌ల చాంపియన్ అజైతా షా
హైదరాబాద్‌లో జరిగిన ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో స్టార్టప్‌ల ‘పిచ్’ కాంపిటీషన్‌లో రాజస్తాన్‌కు చెందిన అజైతా షా తుది విజేత (గ్రాండ్ చాంపియన్)గా నిలిచారు. సదస్సును పురస్కరించుకుని స్టార్టప్ కంపెనీలకు ‘గ్లోబల్ ఇన్నోవేషన్ త్రూ సైన్‌‌స అండ్ టెక్నాలజీ (జిస్ట్)’ఆధ్వర్యంలో పిచ్ కాంపిటీషన్‌ను నిర్వహించారు. 
అజైతా షా రాజస్తాన్‌లో ‘ఫ్రాంటియర్ మార్కెట్స్’స్టార్టప్‌ను నిర్వహిస్తున్నారు. సౌరశక్తి వినియోగం, సౌరశక్తి ఆధారిత ఉత్పత్తులను తయారు చేయటంతో పాటు మహిళలకు వ్యాపార అవకాశాలను పెంపొందించేందుకు ఆమె కృషి చేస్తుంది.ఆమెకు దాదాపు 4 లక్షల డాలర్ల విలువైన బహుమతులను అందజేశారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : స్టార్టప్‌ల పిచ్ కాంపిటీషన్ గ్రాండ్ చాంపియన్ 
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : అజైతా షా
ఎక్కడ : జీఈఎస్ సదస్సు, హైదరాబాద్
ఎందుకు : మహిళలకు వ్యాపార అవకాశాలను పెంపొందించేందుకు ఆమె చేస్తున్న కృషికి

ఐరాస ప్రచారకర్తగా దియామీర్జా
బాలీవుడ్ నటి దియామీర్జా ఐక్యరాజ్యసమితి పర్యావరణ ప్రచారవేత్తగా నియమితులయ్యారు. భారత్‌లో పర్యావరణ కాలుష్యం, వాతావరణ మార్పులు, సముద్రాల పరిరక్షణ, అడవుల సంరక్షణ తదితర అంశాలపై పలు కార్యక్రమాల ద్వారా ఆమె అవగాహన కల్పించనున్నారు. కేట్ బ్లాంకెట్, అన్నా హాతావే, ఏంజెలీనా జోలీ తదితర హాలీవుడ్ నటులు కూడా పర్యావరణ పరిరక్షణ ప్రచారంలో భాగస్వామ్యులయ్యారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఐక్యరాజ్యసమితి పర్యావరణ ప్రచారవేత్త నియామకం
ఎప్పుడు : నవంబర్ 30
ఎవరు : బాలీవుడ్ నటి దియామీర్జా
ఎక్కడ : భారత్
ఎందుకు : కాలుష్యం, వాతావరణ మార్పులపై అవగాహన కల్పించడానికి

మాజీ సీజేఐ ఆదర్శ్ సేన్ ఆనంద్ కన్నుమూత
సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆదర్శ్ సేన్ ఆనంద్ (81) గుండె పోటుతో డిసెంబర్ 1న కన్నుమూశారు. 1936లో కశ్మీర్‌లో జన్మించిన ఆనంద్ లక్నో వర్సిటీ నుంచి లా పట్టా అందుకున్నారు. పంజాబ్, హరియాణా హైకోర్టుల్లో ప్రాక్టీస్ చేశారు. 1975లో కశ్మీర్ హైకోర్టు అదనపు జడ్జీగా నియమితులయ్యారు. 1998-2001 కాలంలో సుప్రీంకోర్టుకు 29వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2003-06 కాలంలో జాతీయ మానవహక్కుల కమిషన్ చైర్మన్‌గా పనిచేశారు. డీకే బసు కేసులో ఖైదీల హక్కులపై ఆయన ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైనదిగా పరిగణిస్తారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : మాజీ సీజేఐ కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 1
ఎవరు : ఆదర్శ్ సేన్ ఆనంద్
ఎందుకు : గుండెపోటుతో

ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా సలీల్ పరేఖ్
ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కొత్త సీఈవో, ఎండీగా సలీల్ ఎస్ పరేఖ్ డిసెంబర్ 2న నియమితులయ్యారు. 2018 జనవరి 2న బాధ్యతలు చేపట్టనున్న పరేఖ్ అయిదేళ్ల పాటు పదవిలో ఉంటారు. ఐటీ సేవల రంగంలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం గల పరేఖ్ ప్రస్తుతం క్యాప్‌జెమినీలో గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : ఇన్ఫోసిస్ కొత్త సీఈవో నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : సలీల్ ఎస్ పరేఖ్

బాలీవుడ్ నటుడు శశికపూర్ కన్నుమూత
బాలీవుడ్ నటుడు శశికపూర్(79) డిసెంబర్ 4న ముంబైలో కన్నుమూశారు. ఈయన పృథ్వీరాజ్ కపూర్ మూడో కుమారుడు. 1938 మార్చి 18న జన్మించిన శశికపూర్ నాలుగేళ్ల వయసులోనే సినిమాల్లో కన్పించారు. 1961లో ధర్మపుత్ర సినిమాతో హీరోగా ప్రస్థానం ప్రారంభించి 116 చిత్రాల్లో నటించారు. దీవార్, కభీకభీ, నమక్‌హలాల్, కాలాపత్తర్ వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. శశి కపూర్ 2011లో పద్మభూషణ్, 2015లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : బాలీవుడ్ నటుడు శశికపూర్ కన్నుమూత
ఎప్పుడు : డిసెంబర్ 4
ఎక్కడ : ముంబై
ఎందుకు : మూత్రపిండాల సమస్యతో

వ్యవసాయ పథకాలకు ప్రచారకర్తగా అక్షయ్ కుమార్
రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజన, పరంపరాగత్ కృషి వికాస్ యోజన వంటి వ్యవసాయ పథకాలకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు. టీవీల్లో ప్రకటనల ద్వారా రైతులను చైతన్యవంతం చేయడానికి అక్షయ్‌ను ప్రచారకర్తగా నియమించినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ డిసెంబర్ 6న తెలిపింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : కేంద్ర వ్యవసాయ పథకాలకు ప్రచారకర్త నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 6
ఎవరు : అక్షయ్ కుమార్
ఎందుకు : టీవీ ప్రకటనల ద్వారా రైతులను చైతన్యవంతం చేయడానికి

ఈ రోజు ప్రశ్న:

*ప్రశ్న: మనం ఒక్క పక్కకు తిరిగి ఎక్కువసేపు పడుకుంటే, చేయి మొద్దుబారినట్లుంటుంది. ఎందుకు?*

జవాబు: మనం ఒక పక్కకు తిరిగి ఎక్కువసేపు పడుకుంటేనో, ముఖ్యంగా నిద్రపోతున్నపుడు చేయి బరువుగా, మొద్దు బారినట్లుంటుంది. దీనికి కారణం చేతిలో ఉండే ధమనులలో సరిగా రక్త ప్రసరణ జరగకపోవడం, రక్త ప్రసరణ తగ్గిపోగానే కండరాలు, నరాలు, కణజాలలకు ఆక్సిజన్‌, మిగతా పోషకాల సరఫరా తగ్గిపోతుంది. దాంతో చేయి చైతన్యం కోల్పోయి మొద్దుబారి పోవడమే కాకుండా, ఒక్కోసారి నొప్పి కూడా కలుగుతుంది. దాంతో మనకు మెలకువ వస్తుంది. చేయిని కదిలిస్తే, అది బరువుగా, మొద్దుబారినట్లు ఉంటుంది. దీనికి కారణం రక్తం సరిగా అందకపోవడంతో కండరాలు బలహీన పడడమే. ఆ సమయంలో మనం చేయి కదపడానికి ఎంతో శ్రమపడాల్సి వస్తుంది. ఇలా తరచూ చేయి మొద్దు బారుతుంటే, దానికి కారణం చేతికి ఏదైనా తీవ్రమైన దెబ్బ తగిలి ఉండడమో లేక మరేమైనా అలాంటి కారణం కావచ్చు. అలాంటి సమయాల్లో డాక్టర్లను సంప్రదించాల్సి ఉంటుంది.

🛰🚀➖➖➖➖➖
*ఇస్రో కొత్త చైర్మన్గా కే శివన్*
➖➖➖➖➖➖➖
న్యూఢిల్లీ: ఇస్రో కొత్త చైర్మన్గా కే శివన్ ఎంపికయ్యారు. ఆయన విక్రమ్ సారాబాయి అంతరిక్ష సంస్థకు డైరెక్టర్గా ఉన్నారు. మూడేండ్ల పాటు ఆయన ఇస్రో చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దానితో పాటు స్పేస్ డిపార్ట్మెంట్కు సెక్రటరీగా ఆయన వ్యవహరిస్తారు. ఇదివరకు ఇస్రో చైర్మన్గా ఏఎస్ కిరణ్ కుమార్ ఉన్నారు. ఆయన జనవరి 12, 2015 నుంచి ఇస్రో చైర్మన్గా ఉన్నారు. మరో రెండు రోజుల్లో శ్రీహరికోట నుంచి ఇస్రో 100వ శాటిలైట్ను లాంచ్ చేయనున్న తరుణంలో ఇస్రో చైర్మన్గా శివన్ను నియమించటం ప్రాధాన్యం సంతరించుకున్నది.

*శివన్ ప్రస్థానం*

1982లో కే శివన్ ఇస్రోలో జాయిన్ అయ్యారు. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (పీఎస్ఎల్వీ) ప్రాజెక్ట్తో తన ప్రస్థానాన్ని ఆయన ప్రారంభించారు. మద్రాస్ ఐఐటీ నుంచి 1980లో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చేసిన శివన్, 1982 లో ఐఐఎస్సీ బెంగళూరు నుంచి మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. తర్వాత 2006లో బాంబే ఐఐటీ నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్లో పీహెచ్డీ పూర్తి చేశారు. పీఎస్ఎల్వీ ప్రాజెక్ట్ మిషన్ ప్లానింగ్, మిషన్ డిజైన్, మిషన్ ఇంటిగ్రేషన్ అండ్ అనాలిసిస్లో శివన్ ముఖ్య పాత్ర పోషించారు. తన కెరీర్లో శివన్ ఎన్నో అవార్డులను అందుకున్నారు. 2014లో సత్యబామ యూనివర్సిటీ, చెన్నై నుంచి డాక్టర్ ఆఫ్ సైన్స్ అవార్డు, 1999 లో విక్రమ్ సారాబాయ్ రీసెర్చ్ అవార్డును ఆయన అందుకున్నారు.
           🍃🌷🤗🌷🍃
*నేటి జీ కె*

*పధకాలు — ప్రారంభపు తేదీలు*

1. *ప్రధాన్ మంత్రి ఫసల్ బీమా యోజన* (పిఎంఎంబీబీ) 11 అక్టోబర్ 2014

2. *ప్రధాన్ మంత్రి Gram సిన్చాయి యోజన* (PMGSY) 01 జూలై 2015

3. *ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాన్ యోజనే* (PMGKY) ఏప్రిల్ 2015

4. *ప్రధాన్ మంత్రి జన వృద్ధ యోజన* (PMJAY) మార్చి 2016

5. *స్వచ్చ్ భారత్ అభియాన్* 02 అక్టోబర్ 2014

6. *కిసాన్ వికాస్ పత్ర* 03 మార్చి 2015 (మళ్లీ ప్రారంభించబడింది)

🙏🙏🙏

వర్తమానాంశాలు  - 2017 సాకర్‌ ఉత్తమ ఆటగాడు ఎవరు?
-ప్రపంచ ర్యాపిడ్‌ టైటిల్‌ నెగ్గిన విశ్వనాథన్‌ ఆనంద్‌
              ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ టైటిల్‌ గెలుచుకున్నాడు. రియాద్‌లో డిసెంబర్‌ 28న ముగిసిన పోటీలో వ్లాదిమర్‌ ఫెడసీవ్‌ (రష్యా)ను ఆనంద్‌ ఓడించాడు. టైటిల్‌ నెగ్గిన ఆనంద్‌కు రూ.1.6 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది.
చైనా, పాక్‌, అఫ్గాన్‌ విదేశాంగ మంత్రుల భేటీ
చైనా, పాకిస్థాన్‌, అప్గానిస్థాన్‌ విదేశీ వ్యవహారాల మంత్రుల తొలి త్రైపాక్షిక సమావేశం డిసెంబర్‌ 26న బీజింగ్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఉగ్రవాదులతో సంబంధాలు కలిగిన సంస్థలు, బృందాలు, వ్యక్తులకు తమ భూభాగాల్లో ఆశ్రయం కల్పించరాదని మూడు దేశాలు తీర్మానించాయి. సమావేశానికి అధ్యక్షత వహించిన చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్‌ యి మాట్లాడుతూ అఫ్గానిస్థాన్‌ ఒప్పుకుంటే చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవా (సీపీఈసీ)ను అఫ్గాన్‌ వరకూ విస్తరిస్తామని ప్రతిపాదించారు. 
ఈజిప్ట్‌ మాజీ అధ్యక్షుడికి మూడేళ్లు జైలు
న్యాయ వ్యవస్థను దూషించినందుకు ఈజిప్ట్‌ మాజీ అధ్యక్షుడు మొహమ్మద్‌ మోర్సీకి ఆ దేశ న్యాయస్థానం డిసెంబర్‌ 30న మూడేళ్ల జైలుశిక్షతోపాటు 20 లక్షల పౌండ్ల జరిమానా విధించింది.
లైబీరియా కొత్త అధ్యక్షుడిగా జార్జ్‌ వేV్‌ా
లైబీరియాలో జరిగిన ఎన్నికల్లో దేశ అధ్యక్షుడిగా జార్జ్‌వేV్‌ా ఎన్నికైనట్లు ఎన్నికల బోర్డ్‌ డిసెంబర్‌ 29న ప్రకటించింది. ఆయన జనవరి 22న అధ్యక్ష పదవి చేపట్టనున్నారు. 
గుజరాత్‌ సీఎంగా రూపానీ ప్రమాణస్వీకారం
గుజరాత్‌ ముఖ్యమంత్రిగా విజరు రూపానీ వరుసగా రెండోసారి డిసెంబర్‌ 26న ప్రమాణస్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా నితిన్‌ పటేల్‌, మరో 18 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, ఆ పార్టీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ, పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, బీహార్‌ సిఎం నితీశ్‌ కుమార్‌ తదితరులు హాజరయ్యారు. 
విదేశాంగ కార్యదర్శిగా విజరు గోఖలే
సీనియర్‌ దౌత్యవేత్త విజరు కేశవ్‌ గోఖలే భారత విదేశాంగ శాఖ కార్యదర్శిగా జనవరి 1న నియమితులయ్యారు. గోఖలే రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారు. 
ఏపీ డీజీపీగా మాలకొండయ్య
ఆంధ్రప్రదేశ్‌ నూతన డీజీపీగా డాక్టర్‌. ఎం.మాలకొండయ్య డిసెంబర్‌ 31న బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్‌ మాన్యువల్‌ ఆధారంగా నేర నియంత్రణకు కృషి చేస్తానన్నారు. 
హిమాచల్‌ సిఎంగా ఠాకూర్‌ ప్రమాణస్వీకారం
హిమాచాల్‌ప్రదేశ్‌ 14వ ముఖ్యమంత్రిగా జైరాం ఠాకూర్‌ డిసెంబర్‌ 27న ప్రమాణస్వీకారం చేశారు. ఆయనతోపాటు 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానితోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
మణిపూర్‌ వర్శిటీలో ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌
105వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌కు ఇంపాల్‌లోని మణిపూర్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ అసోసియేషన్‌ డిసెంబర్‌ 27న ప్రకటన చేసింది. సైన్స్‌ కాంగ్రెస్‌ మార్చిలో జరగనుంది. 
సూపర్‌సోనిక్‌ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన అడ్వాన్స్‌డ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ (ఏఏడీ) సూపర్‌సోనిక్‌ క్షిపణిని భారత్‌ డిసెంబర్‌ 28న ఒడిశాలోని బాలాసోర్‌ నుంచి విజయవంతంగా పరీక్షించింది. దీనికి 30 కిలోమీటర్ల ఎత్తులో శత్రుక్షిపణిని నేలకూల్చే సామర్థ్యం ఉంది.
ఏపీ పోలీస్‌ యాక్ట్‌ను సవరిస్తూ ఆర్డినెన్స్‌
డీజీపీని ఎంపిక చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉండేలా ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ యాక్ట్‌ను సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్‌ 26న ఆర్డినెన్స్‌ జారీ చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ (రిఫార్మ్స్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌) ఆర్డినెన్స్‌ నవంబర్‌ 4-2017 జారీ అయ్యింది. ఆర్డినెన్స్‌కు డిసెంబర్‌ 25న గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదముద్ర వేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.
హిజ్రాలకు ప్రత్యేక విధానం
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం డిసెంబర్‌ 30న హిజ్రా (ట్రాన్స్‌జెండర్స్‌)ల కోసం ప్రత్యేక విధానం ప్రకటించింది. ఈ విధానంలో భాగంగా 18 సంవత్సరాలుపైబడిన హిజ్రాలకు నెలకు రూ.1500 అందించనుంది. 
రంజీ ట్రోఫీ గెలుచుకున్న విదర్భ
విదర్భ జట్టు తొలిసారి రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఇండోర్‌లో జనవరి 1న జరిగిన ఫైనల్లో ఢిల్లీపై విదర్భ విజయం సాధించింది. ప్రైజ్‌మనీగా విదర్భకు రూ.2 కోట్లు దక్కింది.

* తెలుసుకోండి మీ నాలెడ్జ్‌
1. 2017కి గానూ 'రాయల్‌కప్‌' ఏషియన్‌ టూర్‌ టైటిట్‌ విజేత శివకుమార్‌. అతడు ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి ?
ఎ. షూటింగ్‌ బి. బిలియర్డ్స్‌
సి. గోల్ఫ్‌ డి. జిమ్నాస్టిక్స్‌
2. 78వ 'ఇండియన్‌ హిస్టరి కాంగ్రెస్‌-2017' సదస్సును ఎక్కడ నిర్వహించారు ?
ఎ.  ఉస్మానియా యూనివర్శిటీ (హైదరాబాద్‌)
బి. జాదవ్‌పూర్‌ యూనివర్శిటీ (కోల్‌కతా)
సి. షేర్‌-ఎ-కశ్మీర్‌ యూనివర్శిటీ (శ్రీనగర్‌)
డి. బర్కతుల్లా యూనివర్శిటీ (భూపాల్‌)
3. ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ కల్చర్‌ రిలేషన్స్‌కు నూతన అధ్యక్షుడు ?
ఎ. వినరు సహస్ర బుద్దే బి. లోకేశ్‌ చంద్ర
సి. ప్రతిష్టశర్మ డి. నజ్మా హెప్తుల్లా
4. 2018 మార్చిలో 105వ సైన్స్‌ కాంగ్రెస్‌ సమావేశానికి ఆతిధ్యమిస్తున్నది ?
ఎ. ఉస్మానియా యూనివర్శిటీ (హైదరాబాద్‌)
బి. మణిపూర్‌ యూనివర్శిటీ (ఇంపాల్‌)
సి. శ్రీవెంకటేశ్వర యూనివర్శిటీ (తిరుపతి)
డి. ఫిజికల్‌ రీసెర్చ్‌ లేబరేటరీ (అహ్మదాబాద్‌)
5. 2018 జనవరి 12న కార్బోశాట్‌-2 సహా -31 ఉపగ్రహ ప్రయోగాలకు ఇస్రో ఉపయోగిస్తున్న వాహక నౌక ?
ఎ. పిఎస్‌ఎల్‌వి-సి36 బి. పిఎస్‌ఎల్‌వి-సి40
సి. పిఎస్‌ఎల్‌వి-సి342 డి. పిఎస్‌ఎల్‌వి-సి39
6. హిమాచల్‌ ప్రదేశ్‌ నూతన ముఖ్యమంత్రి ?
ఎ. జయప్రకాశ్‌ నడ్డా బి. ప్రేమ్‌కుమార్‌ దుమాల్‌
సి. జైరామ్‌ ఠాకుర్‌ డి. సత్పాల్‌ సింగ్‌ సాధి
7. సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఇటీవల 
ఏ రాష్ట్రంలో ఆరు నెలలపాటు పొడిగించారు?
ఎ. త్రిపుర బి. నాగాలాండ్‌
సి. మణిపూర్‌ డి. మేఘాలయ
8. దేశ చరిత్రలో తొలిసారి ప్రపంచ చెస్‌ టోర్నీకి ఆతిధ్యం ఇవ్వడం ద్వారా ప్రాచుర్యం పొందిన దేశం?
ఎ. లిబియ బి. ఖతార్‌
సి. సౌదీ అరేబియా డి. ఘనా
9. 2018 జనవరి 1 నుంచి విఎటి (వాల్యూ ఆడెడ్‌ ట్యాక్స్‌)ను ప్రవేశ పెట్టిన దేశాలు?
ఎ. సౌదీ అరేబియా, యడి 
బి. కెన్యా, దక్షిణాఫ్రికా
సి. గ్రీసు, వెనిజులా 
డి. ఇతియోఫియా, గ్రీసు
10. జింబాబ్వే నూతన ఉపాధ్యక్షుడు ?
ఎ. అబ్దుల్లాహి ఫర్మాజో బి. ఒమర్‌ ఆల్‌ బషీర్‌
సి. సెబాస్టియన్‌ పినెం డి. కాన్‌స్టాంటిన్‌ చివేగా
11. మాలి నూతన ప్రధాని ?
ఎ. ఇబ్రహీం జయితా బి. బొబరుమైగా
సి. మిచెల్లి బాబ్‌లెట్‌ డి. సెబాస్టియన్‌ పినెరా

సమాధానాలు : 1.సి, 2.బి, 3.ఎ, 4.బి, 5.బి, 6.సి, 7.బి, 8.సి, 9.ఎ, 10.డి, 11.బి.

* బిట్‌ బ్యాంక్‌ 
1. 2017కి గానూ పురుషుల విభాగంలో ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ విజేత - విశ్వనాథన్‌ ఆనంద్‌ (ఇండియా)
2. 2017కి గానూ మహిళల విభాగంలో ప్రపంచ ర్యాపిడ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌ విజేత - జువెన్‌జున్‌ (చైనా)
3. గ్లోబ్‌ సాకర్‌ అవార్డ్స్‌-2017 ఉత్తమ సాకర్‌ ఆటగాడిగా ఎవరు ఎంపికయ్యారు - క్రిస్టియానా రొనాల్డో
4. ఢిల్లీపై గెలుపొంది 2017-18 రంజీ ట్రోఫీ చాంపియన్‌గా నిలిచిన జట్టు - విదర్భ
5. రంజీ ట్రోఫీ ఫైనల్లో హ్యాట్రిక్‌ సాధించిన రెండో బౌలర్‌ రజ్‌నోస్‌ గుర్భాని (విదర్భ). అయితే 1972-73లో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌ - కళ్యాణ సుందరం (తమిళనాడు)
6. క్రికెట్‌ చరిత్రలో తొలిసారిగా నాలుగు రోజుల టెస్ట్‌ మ్యాచ్‌ను ఏ రెండు దేశాల మధ్య నిర్వహించారు 
- దక్షిణాఫ్రికా - జింబాబ్వే
7. 2018 జనవరి 12-16 వరకూ 22వ జాతీయ యువజన ఉత్సవాలు ఏ నగరంలో వేదికగా నిర్వహించనున్నారు 
- జైపూర్‌ (రాజస్థాన్‌)
8. 2017 డిసెంబర్‌ 27-31 వరకూ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌కు ఆతిధ్యం ఇచ్చిన నగరం - గాంధీనగర్‌ (గుజరాత్‌)
9. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2018 సంవత్సరాన్ని ఏ విధంగా ప్రకటించింది - తెలుగు అభివృద్ధి సంవత్సరం
10. 2017 డిసెంబర్‌ 29న నిర్మలా సీతారామన్‌ సెంటర్‌ ఫర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ ఆపర్చునిటీస్‌ అండ్‌ లెర్నింగ్‌ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు - మంగళూరు (కర్ణాటక)
11. 2017కి గానూ పిఇటిఎ 'పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌'గా ఎంపికైన బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ - పిఇటిఎను విస్తరించండి- పీపుల్‌ ఫర్‌ ఎథికల్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ యానిమల్స్‌
12. పాసింజర్‌ రైళ్లకు ఎప్పటిలోగా బయోటారులెట్లను 100 శాతం అమర్చాలని కేంద్రం నిర్ణయించింది - 2019 మార్చి
13. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ 2017కుగానూ వెలువరించిన 'శాంతి అనుకూల సూచి'లో తొలి మూడు స్థానాలు పొందిన దేశాలు వరుసగా - స్వీడన్‌, స్విట్జర్లాండ్‌, ఫిన్లాండ్‌
14. 2017 డిసెంబర్‌ 31న బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రంగా దేన్ని ప్రకటించారు - అరుణాచల్‌ప్రదేశ్‌
15. కూరగాయలకు కనీస మద్దతు ధర ప్రకటించడం ద్వారా ఆ ప్రత్యేకత పొందిన తొలిరాష్ట్రంగా నిలిచింది - హర్యాన
16. 2018 జనవరి 1న తెలంగాణ పోలీస్‌ శాఖ ప్రవేశపెట్టిన టిఎస్‌కాప్‌ యాప్‌ ద్వారా ఎన్నిరకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి - 54
17. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ 2017కిగానూ వెలువరించిన శాంతి అనుకూల సూచిలో భారత్‌ ర్యాంకు - 90
18. ఆంధ్రప్రదేశ్‌ నూతన డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డిజిపి) - మాలకొండయ్య
19. లైబిరియా నూతన అధ్యక్షుడు - జార్జివా
20. 2017 డిసెంబర్‌ 26న భారత్‌ ఏ దేశానికి ఒక మిలియన్‌ డాలర్ల మానవతాపరమైన వైద్య సహాయం అందించాలని నిర్ణయించింది - యెమన్‌

🙏🙏ఈ రోజు జికె 

1)👉 రంజీట్రోఫీ (క్రికెట్) విజేత ఎవరు?
A: *విదర్భ జట్టు*

2)👉 "దేవధర్ ట్రోఫీ" (క్రికెట్) విజేత ఎవరు?
A: *తమిళనాడు*

3)👉 "దులీప్ ట్రోఫీ" (క్రికెట్) విజేత ఎవరు?
A: *ఇండియా రెడ్*

4)👉 "ఇరానీ కప్" (క్రికెట్) విజేత ఎవరు?
A: *రెస్ట్ ఆఫ్ ఇండియా*

5)👉 "సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోపి" (క్రికెట్) విజేత ఎవరు?
A: *ఈస్ట్  జోన్*
                     🍃✌🌺
*జైల్లో ఖైదీలకు గజల్స్ వినిపిస్తున్న గజల్ శ్రీనివాస్*

*తమకు రెండు శిక్షలు ఒకే సారి వేయడం అన్యాయమంటున్న ఖైదీలు*....
జర నవ్వుకోండ్రి

No comments:

Post a Comment