AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Tuesday 2 January 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 2 2018

*🌏 చరిత్రలో ఈరోజు 🌎*

*🌅జనవరి 2*🌅*🏞సంఘటనలు*🏞


1954 : భారతరత్న పురస్కారం భారతదేశ మొదటి రాష్ట్రపతి డా. రాజేంద్ర ప్రసాద్ చేత స్థాపించబడింది.


*🌻🌻జననాలు*🌻🌻


1917: కె.ఎం.మాథ్యూ, మలయాళ మనోరమ దినపత్రిక సంపాదకుడు. (మ.2010)


1918: బత్తిని మొగిలయ్య గౌడ్, తెలంగాణాకు చెందిన సాతంత్ర్య పోరాట యోధుడు. (మ.1946)


1920: ఐజాక్ అసిమోవ్, అమెరికన్ రచయిత మరియు బోస్టన్ విశ్వవిద్యాలయంలో జీవరసాయన శాస్త్రం ప్రొఫెసర్. (మ.1992)


1927: మల్లవరపు జాన్, ప్రసిద్ధ తెలుగు కవి. (మ.2006)


1932: ఓగేటి అచ్యుతరామశాస్త్రి, పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు మరియు గ్రంథకర్త.


1937: చంద్రశేఖర కంబార, కన్నడ కవి, నాటక రచయిత, సంగీత దర్శకుడు, చలనచిత్ర నిర్దేశకుడు, అధ్యాపకుడు మరియు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత.


1937: మహారాణి చక్రవర్తి, భారతీయ అణు జీవశాస్త్రజ్ఞురాలు.


1957: ఎ.వి.ఎస్., తెలుగు సినిమా హాస్యనటుడు, రచయిత, దర్శకులు, నిర్మాత మరియు రాజకీయనాయకుడు. (మ.2013)


1958: ఆహుతి ప్రసాద్, ప్రముఖ సినిమా నటుడు. (మ.2015)


1959: కీర్తి ఆజాద్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు.


1960: రామణ్ లాంబా, భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. (మ.1998)


1967: అరుణ్ సాగర్, సీనియర్ జర్నలిస్ట్ మరియు కవి. (మ.2016)


*🌹🌹మరణాలు*🌹🌹


1945: ఆదిభట్ల నారాయణదాసు, హరికథా పితామహుడు. (జ.1864)


1969: ముప్పవరపు భీమారావు, ప్రముఖ రంగస్థల నటుడు (జ.1909)


1983: పిలకా గణపతిశాస్త్రి, కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు. (జ.1911)


1992: కల్లూరి చంద్రమౌళి, స్వాతంత్ర్య సమరయోధుడు, మంత్రిపదవి, తిరుమల తిరుపతి దేవస్థానములకు అధ్యక్షునిగా కూడా పనిచేశాడు. (జ.1898)


2007: వల్లంపాటి వెంకటసుబ్బయ్య, ప్రముఖ తెలుగు సాహితీ విమర్శకుడు. (జ.1937)


2011: గుండవరపు సుబ్బారావు, అభ్యుదయ కవి, విప్లవ గీతాల రచయిత.


2015: వసంత్ గోవారికర్, ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త, పద్మశ్రీ మరియు పద్మభూషణ అవార్డుల గ్రహీత.(జ.1933)


2016: ఎ.బి.బర్ధన్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు. (జ.1924)


2017: కాకాని చక్రపాణి, ప్రముఖ కథారచయిత, నవలాకారుడు మరియు అనువాదకుడు. (జ.1942)


*🔷జాతీయ / అంతర్జాతీయ దినాలు*🔷


🔻ప్రపంచ శాంతి దినోత్సవం


*🗓 నేటి పంచాంగం 🗓*

*తేది :  2, జనవరి 2018*
సంవత్సరం : హేవిళంబినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : పుష్యమాసం
ఋతువు : హేమంత ఋతువు
కాలము : శీతాకాలం
వారము : మంగళవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : పౌర్ణమి
(నిన్న ఉదయం 11 గం॥ 44 ని॥ నుంచి ఈరోజు ఉదయం 7 గం॥ 54 ని॥ వరకు)
నక్షత్రం : ఆరుద్ర
(నిన్న మద్యాహ్నం 2 గం॥ 53 ని॥ నుంచి ఈరోజు ఉదయం 11 గం॥ 48 ని॥ వరకు)
యోగము : ఐంద్రము
కరణం : బవ
వర్జ్యం :
(ఈరోజు రాత్రి 10 గం॥ 19 ని॥ నుంచి ఈరోజు రాత్రి 11 గం॥ 43 ని॥ వరకు)
అమ్రుతఘడియలు :
(ఈరోజు తెల్లవారుజాము 3 గం॥ 5 ని॥ నుంచి ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 28 ని॥ వరకు)
దుర్ముహూర్తం :
(ఉదయం 8 గం॥ 59 ని॥ నుంచి ఉదయం 9 గం॥ 43 ని॥ వరకు)(రాత్రి 11 గం॥ 2 ని॥ నుంచి రాత్రి 11 గం॥ 46 ని॥ వరకు)
రాహుకాలం :
(సాయంత్రం 3 గం॥ 6 ని॥ నుంచి సాయంత్రం 4 గం॥ 29 ని॥ వరకు)
గుళికకాలం :
(ఉదయం 12 గం॥ 19 ని॥ నుంచి మద్యాహ్నం 1 గం॥ 42 ని॥ వరకు)
యమగండం :
(ఉదయం 9 గం॥ 32 ని॥ నుంచి ఉదయం 10 గం॥ 55 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 46 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 53 ని॥ లకు
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : మిథునము

🔲 సూక్తులు

🔺పతనానికి సోపానాలు మూడు - నిర్లక్ష్యం, అజాగ్రత్త, పొరపాటు.

🔺పదిమంది దుర్మార్గులు కలిసికట్టుగా చేయగల హానికంటే మూర్ఖుడి మూఢవిశ్వాసం ఎక్కువ హాని చేయగలదు.

🔺పదేళ్ళపాటు పుస్తకం చదవడం కంటే విజ్ఞులైన వారితో గంటసేపు ముచ్చటించడం మేలు.

🔺పనిచేయని వాడికి తినే హక్కులేదు.

🔺పనిచేసే హక్కు నీకుందికానీ దాని ఫలితంపై హక్కులేదు.

🔺పనిని బాగా ప్రారంభించినప్పుడే ఆ పని సగం పూర్తి అవుతుంది.

        --------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
        -------------------------
" మనిషికి అహాంకారం ఉన్నా పరవాలేదు.
అనుమానం మాత్రం ఉండకూడదు
ఎందుకంటే...!
అహాంకారం కన్నా అనుమానం చాలా ప్రమాదం...! "

       --------------------------
🌹 _*నేటీ మంచి మాట*_ 🌹
      ---------------------------
" బాధలు అనేవి గాలిలాంటివి అవి లేని చోటు అంటూ ఎక్కడ ఉండదు
నీ ఒక్కడికే
బాధలు ఉన్నట్లు తెగ బాధపడకు చాలా మంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారు..! "

*🤘 నేటి సుభాషితం🤘*

*ఒక వ్యక్తి యొక్క జయాపజయాలు అతను సమయాన్ని ఎలా ఖర్చు చేస్తాడన్న విషయం పైనే ఆధారపడి ఉంటాయి.*

*💎 నేటి ఆణిముత్యం 💎*

ఉడుముండదె నూరేండ్లును
బడియుండదె పేర్మి బాము పదినూరేండ్లున్
మడుపునఁ గొక్కెర యుండదె
కడు నిల బురుషార్థపరుడు గావలె సుమతీ!

*తాత్పర్యం:*

ఉడుము నూరేళ్లు, పాము పది వందల ఏళ్లు, కొంగ చెరువులో చిరకాలం జీవిస్తున్నాయి. వాటి జీవితాలన్నీ నిరుపయోగాలే. మానవుని జీవితం అలా కాక ధర్మార్థకామమోక్షాసక్తితో కూడినది కావాలి.

*విశ్లేషణ*

భగవంతుడు జంతువులకి జ్ఞానం ఇవ్వలేదు, ఒక్క మనిషికి మాత్రమే జ్ఞానం వరంగా ఇచ్చాడు.మనిషి ఆ జ్ఞానం అనే సంపద తో మంచి ఆలోచనలతో ఎన్నో విజయాలని సాధించవచ్చు. ఉడుము వందేళ్ళు జీవిస్తుంది , పాము వెయ్యేళ్ళు  జీవిస్తుంది , కొంగ ధీర్గాయువు తో జీవిస్తుంది కాని అవి ఎవ్వరికి ఉపయోగపడవు. మనిషి మత్రం జీవించినన్నాళ్ళూ అందరికీ ఉపయోగ పడుతూ తన జీవితాన్ని ని ధర్మం తో నడిపిస్తూ మోక్షం కోసం ప్రయత్నించాలి అని చెప్పటమే ఈ పద్యం లో నీతి.

*✍🏼 నేటి కథ ✍🏼*

*పగటి కల*

వాసు, వాసంతి అన్నా చెల్లెళ్ళు. వాళ్లిద్దరూ కలసి ఆడుకునేవాళ్లు, పాడుకునేవాళ్లు, చక్కగా బడికి పోయేవాళ్లు.

ఒకసారి వాళ్ల ఇంటికి బంధువుల అబ్బాయి చంద్ర వచ్చాడు. ఒట్టి చంద్ర కాదు వాడు- `కలల చంద్ర'. చంద్రకు కలలు కనడమంటే ఇష్టం. సమయం దొరికినప్పుడల్లా కళ్ళు మూసుకుని, కలల్లో తేలిపోతుండేవాడు.

చాలా కాలానికి తమ ఇంటికొచ్చిన చంద్రను వెంటపెట్టుకొని, వాసు, వాసంతిలు వాళ్ల తోటకు వెళ్ళారు.
తోటలో మామిడి కొమ్మకు ఉయ్యాల కట్టి ఊగుదామనుకున్నారు ముగ్గరూ. చంద్రకు కూడా ఉయ్యాల ఊగటం అంటే చాలా చాలా ఇష్టం. తనే మొదట ఊగుతానన్నాడు వాడు.
`సరే' నువ్వే మొదట ఊగమని, వాడిని ఊపడం మొదలుపెట్టాడు వాసు.

ఉయ్యాలలో కూర్చోగానే చంద్రకు కలలు మొదలయ్యాయి.

ఊగే ఉయ్యాలలోంచి ఆకాశంలో దూసుకుపోతున్న ఓ రాకెట్ లోకి ఎగిరిపోయాడు చంద్ర. అక్కడినుండి ఏకంగా ఒక గ్రహం మీదికి దూకాడు. ఆ గ్రహం మన భూమిలాగా నిలకడగా లేదు! ఉయ్యాలలాగా ఊగిపోతున్నది. చివరికి అక్కడి చెట్లుకూడా అటూ ఇటూ సోలిపోతూనే ఉన్నాయి. ఇంకా అలా ఊగుతూనే, చంద్ర ఆ గ్రహంమీద నడవటం మొదలుపెట్టాడు. నడిచీ నడిచీ కాళ్ళు నొప్పులైతే పుట్టాయిగానీ, అక్కడ జనసంచారం అన్నది లేదు.

అంతలో అతనికి ఒకచోట పే..ద్ద- మెరిసే వస్తువు ఒకటి కనిపించింది. 'ఏమిటా?' అనుకుని దాని దగ్గరికెళ్ళి చూశాడు- చూస్తే, ఆశ్చర్యం! అది ఒక భారీ వజ్రం. దాన్ని ఎత్తుకుపోదామని ప్రయత్నించాడు చంద్ర. అయితే ఆ వజ్రం సుమారు ఇరవై కిలోల బరువు ఉంటుందేమో, అసలు కదలలేదు. ఎలాగైనా సరే ఆ వజ్రాన్ని ఎత్తుకుపోవాల్సిందే అని, వాడు ముందుకు వంగి, రెండు చేతుల్తోటీ వజ్రాన్ని పట్టుకొని, అతి ప్రయత్నంమీద, బలంగా ఎత్తాడు!! - ఇంకేం చెప్పాలి? వజ్రంకోసం చేతులు వదిలిన చంద్ర, ఉయ్యాలలోంచి దబ్బున కిందపడ్డాడు .

పాపం, చంద్ర! కలలచంద్రకు పళ్ళు ఊడినంత పనైంది. దగ్గర్లోనే ఉన్న వాసు, వాసంతిలు పరుగు పరుగున వచ్చి చంద్రను పైకి లేపి, "ఏమైంది? ఎందుకు, కింద పడ్డావు?" అని అడిగారు. అప్పుడే కల నుండి తేరుకొన్న ఆ కలల రాకుమారుడు ముక్కుతూ, మూలుగుతూ తన సుందర స్వప్నాన్ని వివరించాడు.
ఆ తర్వాత వాసు, వాసంతిలు చాలాకాలం వరకూ కలల రాకుమారుణ్ని తలుచుకుని నవ్వుకున్నారు.
చంద్ర మాత్రం అప్పటినుంచి పగటి కలలు కనడం మానేశాడు. 

*📖 మన ఇతిహాసాలు 📓*

*శూర్పణఖ*

శూర్పణఖ భర్త విద్యుజ్జిహ్వుడు. వీడు కాలకేయ వంశానికి చెందినవాడు. రావణాసురుడు లోకాలన్నిటినీ జయించే ఉత్సాహంలో ఒకసారి కాలకేయులతో పోరాడుతూ పొరబాటున విద్యుజ్జిహ్వుడినీ వధించాడు. అప్పటికి శూర్పణఖ గర్భవతి. భర్త మరణంతో దు:ఖితమదియైన శూర్పణఖను రావణుడు 'తెలియక తప్పు జరిగిపోయిందని' ఓదార్చి, మనసు కుదుటపడటానికి ఖరుడు, దూషణుడు, త్రిశరుడు అనేవాళ్ళను తోడిచ్చి దండకారణ్యంలో విహరించమని పంపేశాడు. జనస్థానంలో ఆమె విహరిస్తూ ఉంటుంది.

ఆమెకు పుట్టిన కొడుకు జంబుకుమారుడు. వాడు తన తండ్రికి జరిగిన అన్యాయం గురించి తెలుసుకుని పగతీర్చుకునేందుకు తపస్సు చెయ్యటానికని వెళ్తాడు. తపస్సు చేస్తున్నవాడి చుట్టూ వెదురుపొద గుబురుగా పెరుగుతుంది. ఈ పొద పంచవటికి సమీపంలోనే ఉంటుంది. అరణ్యవాసంలో అన్నావదినలకు తోడుగా వచ్చిన లక్ష్మణుడు ఫలాల కోసం వెతుకుతూ అటువైపు వస్తాడు. అప్పుడు అక్కడి మునులు ఆ వెదురు పొదను నరకమని అతడికి చెప్తారు. లక్ష్మణుడు పొదను నరకగానే దాంతో బాటు జంబుకుమారుడి తల తెగిపోతుంది. చచ్చినవాడు రాక్షసుడు కాబట్టి విచారించవద్దని మునులు లక్ష్మణుడికి చెప్తారు. తన కొడుకు అకాలమరణం గురించి తెలుసుకున్న శూర్పణఖ ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరి వెళ్తుంది. కానీ రాముడి సుందరరూపాన్ని చూసి మోహిస్తుంది.

అంటే సీతారామలక్ష్మణులు శూర్పణఖ కంటబడడం కాకతాళీయంగా జరిగింది కాదన్నమాట. ఆమే వాళ్ళను వెతుక్కుంటూ వచ్చింది. దాంతో కథ ఆ తర్వాత తిరగవలసిన మలుపులన్నీ చకచకా తిరిగేసింది!

*✅ తెలుసుకుందాం ✅*

*🐬చేపలు ఎగురుతాయా?*🦈

✳ఎగిరే చేపలు ఉన్నా అవి పక్షిలా ఎగరడము కాదు . చేపలకుండే రెక్కలు కొంచెమే విస్తరించి ఉంటాయి. ఈ తరహా చేపలు తోకతో నీటి మీద కొట్టి గాలిలోకి లేచి రెక్కలుకాని రెక్కలను విప్పి గాలిలో తేలుతూ కొంచము దూరము లో పడతాయి. అలా వరుసగా చేసుకుంటూ పోతాయి. ఇది ఒక రకమైన దూకడము . శత్రువులనుంది రక్షించుకునేందుకు , ఆహారము వేటాడే సమయములో వేగముగా చలించేందుకు ఇలా ఎగురుతాయి.

*🏀గురుకుల పీజీటీ ఫలితాలు విడుదల*

టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఎంపిక జాబితా

 🅾తెలంగాణ: తెలంగాణ గురుకులాల్లోని పీజీటీ పోస్టుల నియామక ఫలితాలను టీఎస్పీఎస్సీ ఆదివారం విడుదల చేసింది. ఫలితాల తుదిజాబితాను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఉంచినట్టు కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. గణితం, జీవ, భౌతిక, సాంఘికశాస్ర్తాలకు సంబంధించి మొత్తం 513 పోస్టులకు జూలై 18,19 తేదీల్లో రాతపరీక్షలు జరిగాయి. తాజా పోస్టుల భర్తీతో ఇప్పటివరకు గురుకులాల్లో 921 పీజీటీ ఖాళీలను భర్తీ చేసినట్టు వాణీప్రసాద్ వివరించారు. పీజీటీ గణితంలో 126 ఖాళీలకుగాను 114 మందిని, సాంఘికశాస్త్రం విభాగంలో 177 ఖాళీలకు 166 మంది, భౌతికశాస్త్రం విభాగంలో 188 ఖాళీలకు 174 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్టు వాణీప్రసాద్ తెలిపారు. మిగిలిన ఖాళీల భర్తీ వివరాలను పీహెచ్సీ క్యాటగిరీ కింద వైద్యధ్రువీకరణ పత్రాల పరిశీలన అనంతరం విడుదల చేస్తామని చెప్పారు. కాగా, జీవశాస్త్రం విభాగంలో 22 పోస్టులకుగాను 21 మందిని ఎంపిక చేసినట్టు, ఏజెన్సీ క్యాటగిరీలో అర్హులైన అభ్యర్థి దొరుకకపోవడంతో మరోపోస్టును భర్తీచేయలేదని తెలిపారు

*🚫ఐఐటీ-జేఈఈకి 14 లక్షల దరఖాస్తులు*

☯ తెలంగాణ: ఐఐటీ, ఎన్ఐటీ ఇతర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 8న నిర్వహించనున్న ఐఐటీ-జేఈఈ మెయిన్ రాతపరీక్ష దరఖాస్తుల గడువు ముగిసింది. 

దేశవ్యాప్తంగా దాదాపు 14 లక్షలకుపైగా విద్యార్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకున్నట్టు తెలిసింది.

 తెలంగాణ, ఏపీ రాష్ర్టాల నుంచి దాదాపు 1.50 లక్షలమంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నట్టు కోచింగ్ సంస్థల యాజమాన్యాలు అభిప్రాయపడ్డాయి.

*⛔13 నుంచి అంతర్జాతీయ పతంగుల పండుగ*

హైదరాబాద్: మరో అంతర్జాతీయస్థాయి వేడుకకు నగరం సన్నద్ధమవుతోంది. 

ఈ నెల 13, 14, 15 తేదీల్లో నగరంలోని పరేడ్ గ్రౌండ్లో భారీ కైట్ ఫెస్టివల్ నిర్వహించేందుకు పర్యాటక శాఖ సన్నద్ధమవుతోంది. సాహిత్య అకాడమీతో కలసి ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించిన పర్యాటక – భాషా సాంస్కృతిక శాఖలు తాజాగా కైట్ ఫెస్టివల్కు ఏర్పాట్లు చేస్తున్నాయి.

 తెలంగాణ సంస్కృతి, సం ప్రదాయాలను ప్రతిబింబించేలా అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ను నిర్వహించనున్నా రు.

ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూడు రోజులపాటు కార్యక్రమాలు ఉంటాయి.

 రాత్రి సమయంలో నిర్వహించే పతంగుల ఎగురవేత ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నది. 

మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 9 గంటల వరకు స్వీట్ ఫెస్టివల్, మధ్యాహ్నం 2 గంటలకు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. 

వీటితో పాటు పతంగుల తయారీ, కళాబృందాల నృత్యాలు వంటి కార్యక్రమాలుంటాయి.

దేశంలోని వివిధ నగరాల నుండి కైట్ ప్లేయర్స్ వచ్చి పతంగులు ఎగురవేస్తూ సందడి చేయనున్నారు. గతేడాది 16 దేశాల నుంచి 70 మంది వరకు ప్రతినిధులు పాల్గొనగా ఈసారి మరింత ఎక్కువ దేశాల నుంచి 100 మంది ప్రతినిధులను ఆహ్వానించనున్నారు.

 పతంగుల పండుగను యాదాద్రితోపాటు, వరంగల్లోనూ నిర్వహించనున్నారు.

 నగరంలోని పీపుల్స్ప్లాజా, శిల్పారామం, ఆగాఖాన్ అకాడమీ, నెక్లెస్రోడ్లో పతంగుల ఉత్సవాలు జరగనున్నాయి.

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం🙏*

*🌺సుభాషిత వాక్కు🌺*

*"నయంకాని వ్యాధికన్నా మరణం, దుష్టులతో స్నేహం కన్నా ఒంటరితనం, యోగ్యతలేని పొగడ్తలకన్నా నింద.. మేలైనవి."*

*"The Lord has everything. What can one possibly offer to him? Is there anything that has not yet been offered to the Lord, and is not yet His? Yes, there is. It is one's own mind."*

*🌷మంచి పద్యం*

*పట్టు పట్టవలయు పనులు సాధించగ*
*పట్టు పట్టరాదు పట్టెనేని*
*పట్టి వదలకున్న పనులిల ఈడేరు*
*వాస్తవంబు వేమువారి మాట*

*❗భావం:-*

*పట్టిన పట్టు వదలకుండా పనులు చేస్తేనే పనులు పూర్తి అగును. అలా పనిచేయనట్లయితే పనులు ప్రారంభించకూడదు.*

*♦నేటి జీ కె*♦

      *"Int'l Summits in 2018"*
   *అంతర్జాతీయ సమావేశాలు- స్థలాలు*

👉 *BRICS - South Africa*

👉 *NATO - Belgium*

👉 *G20 - Argentina*

👉 *G8 - Canada*

👉 *East Asia - Singapore*

👉 *CHOGM - United Kingdom*

👉 *OPEC - Austria*

👉 *ASEAN (April&November) - Singapore*

👉 *APEC - New Guinea*

ఈ రోజు జి కె

1)👉 2016 సంవత్సరానికి "ఏకలవ్య"  అవార్డును ఒడిశాలో ఎవరికి ప్రకటించారు?
A: *శ్రాబనీ నందా*

2)👉 నా పేరు ఆజాద్ నా తండ్రిపేరు స్వాతంత్ర్యం అన్నది ఎవరు?
A: *ఆజాద్ చంద్రశేఖర్*

3)👉 ఇందిరాగాంధీ  అత్యవసర పరస్థితిని ఎప్పుడు విధించారు?
A: *1975*

4)👉 హర్యాన హరికేన్ అని ఏ క్రికెటర్ ను పిలుస్తారు?
A: *కపిల్ దేవ్*

5)👉 ఇంద్రుడి* యొక్క వాహనం పేరేమిటి?
A: *ఐరావతం*
            🍃✌🌺
➖➖➖➖➖➖➖
*FIRST TIME IN INDIA*
➖➖➖➖➖➖➖
👉 India's first *live payment bank* – *Airtel* at *Rajasthan*
👉 First state *to start India's first Cherry Blossom Festival* – *Meghalaya*
👉 First-ever *Indian Institute of Skills* of the country at *Kanpur* in *Uttar Pradesh*

👉 *Dhasai* village in Thane district has become the first *cashless village* in *Maharashtra*
👉 *Maharashtra* is the *first state* in the country *to have a cyber police station in each district* simultaneously. 
👉 *Maharashtra* became the first Indian state *to adopt Fly Ash Utilisation Policy* 
👉 *Goa* prepares itself to become the first state *to operate cashless in the country* from *31 Dec 2016* 
👉 *Nagpur* is declared as the first *digital district of India* 
👉 First *Children’s Court* inaugurated in *Hyderabad* 
👉 *Haryana* - first state to *implement the benefit of 7th Central Pay Commission* 
👉 *Gujarat* becomes the first state *to distribute 2 crore LED bulbs* under *Unnat Jyoti by Affordable LEDs for All (UJALA)* scheme. 
👉 *Lanura*, a village in *Budgam* district of *Jammu & Kashmir*, became the first village in the state *to go cashless*. 
👉 *Punjab* government has launched country's first *amphibious bus project* at the *Harike wetland near Amritsar*. 
In *Himachal Pradesh*, the first *Cyber Crime Police Station* has been opened at *Shimla*. 
👉 *Hailakandi* has become the first district in *Assam* to *pay wages to tea garden workers* through individual bank accounts. 
👉 *Chhattisgarh* has become the first state *to adopt a resolution welcoming the demonetization of high-value currency notes*
👉 *Palampur* Assembly Constituency of *Kangra district, HP* became the first *e-assembly constituency of the country*
👉 *Jharkhand* has become the first state in the country *to implement Direct Benefit Transfer in Kerosene*
👉 First *underwater restaurant* – *Ahmadabad*
👉 First *railway university* – *Vadodara*
👉 First *rail auto transportation and logistics hub* – *Chennai*
👉 First *defense park* – *Ottapalam, Kerala*
👉 First *LCD panel plant* – *Maharashtra*
👉 First *civil aviation park* – *Gujarat*
👉 First *ever gender park* – *Kerala*
👉 First *space park* – *Bengaluru*
👉 First *digital state* - *Kerala*
👉 First *cash giving app* - *CASHe*
👉 First *online interactive heritage portal* - *Sahapedia*
👉 First *textile university* - *Surat*
👉 First *tiger cell of India* - *Dehradun*
👉 World’s *tallest girder rail bridge* - *Manipur*
👉 India’s *first underground museum* – *New Delhi*
👉 India’s *first design yatra* - *Kerala*
👉 *Nagpur* – *first digital district* of India
👉 *Kerala* – *third* Open Defecation Free
👉 *Sikkim* – *First ODF* state
👉 *Himachal Pradesh* – *second ODF* state
👉 Asia’s *biggest Jungle Safari* – *Naya Raipur, Chhattisgarh*
👉 Asia’s first *longest cycle highway* – *Uttar Pradesh*
👉 *Akodara village (Gujarat)* - first *digital village* in India

👉 India’s *first liquefied natural gas-driven bus* - *Kerala*

👉 First *island district* – *Majuli, Assam*
👉 First *WiFi hotspot village* – *Gumthala Garhu, Haryana*
👉 First *children’s court* – *Hyderabad*
👉 First *water metro project* – *Kochi*
👉 First state *to approve sewage and water policy* – *Rajasthan*
👉 First state *to adopt Street Lighting National program* – *Rajasthan*
👉 First state to implement *Direct Benefit Transfer in Kerosene* – *Jharkhand*
👉 First *Happiness Junction of India* – *Sonepur (Bihar)*
              🍃🌷🤗🌷🍃
*✳తెలంగాణ జనాభా అక్షరాస్యత*

🔹తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం 1,12,077 చ.కి.మీ

జనాభా 3,50,03,674/ 350.04 లక్షలు

పురుషులు 1,76,11,633/ 176.12 లక్షలు

స్త్రీలు 1,73,92,401/ 173.92 లక్షలు

గ్రామీణ ప్రాంత జనాభా 213.95 లక్షలు

పట్టణ ప్రాంత జనాభా 136.09 లక్షలు

*🔵అత్యధిక జనాభాగల జిల్లాలు*

-హైదరాబాద్ - 39,43,323 (పురుషులు 20,18,575, స్త్రీలు 19,24,748)

-రంగారెడ్డి - 24,26,243 (పురుషులు 12,43,967, స్త్రీలు 11,82,276)

-మేడ్చల్ మల్కాజిగిరి - 24,60,095 (పురుషులు-12,56,883, స్త్రీలు-12,03, 212)

-నల్లగొండ - 16,18,196 (పురుషులు 8,18,306, స్త్రీలు-8,00,110)

-సంగారెడ్డి - 15,27,628 (పురుషులు-7,77,235, స్త్రీలు-7,50,393)

*🌐అతి తక్కువ జనాభాగల జిల్లాలు*

-కుమ్రం భీం ఆసిఫాబాద్ - 5,15,812 (పురుషులు 2,58,197, స్త్రీలు 2,57,615)

-రాజన్న సిరిసిల్ల - 5,52,037 (పురుషులు 2,74,109, స్త్రీలు 2,77,928)

-జనగాం - 5,66,376 (పురుషులు 2,83,648, స్త్రీలు 2,82,728)

-వనపర్తి - 5,77,758 (పురుషులు 2,94,833, స్త్రీలు 2,82,925)

-జోగులాంబ గద్వాల్ - 6,09,990 (పురుషులు 3,09,274, స్త్రీలు 3,00,716)

*🔹లింగ నిష్పత్తి*

-2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1000 మంది పురుషులకుగాను 988 మంది స్త్రీలు ఉన్నారు.

1901 - 947 1941 - 960 1981 - 971

1911 - 957 1951 - 980 1991 - 967

1921 - 963 1961 - 975 2001 - 971

1931 - 958 1971 - 969 2011 - 988

-మొత్తం 31 జిల్లాలకుగాను 21 జిల్లాల్లో లింగ నిష్పత్తి రాష్ట సగటు (988) కంటే ఎక్కువగా ఉన్నది. 11 జిల్లాల్లో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఉన్నారు.

*-అత్యధిక లింగ నిష్పత్తి* 
ఉన్న జిల్లా నిర్మల్. 1000 మంది పురుషులకుగాను 1046 మంది స్త్రీలు ఉన్నారు.

-1901 నుంచి 2011 వరకు లింగ నిష్పత్తి పెరుగుతూ తగ్గుతూ వస్తున్నది.

*✳అత్యధిక లింగ నిష్పత్తి*

-నిర్మల్ 1046

-నిజామాబాద్ 1044

-జగిత్యాల 1036

-కామారెడ్డి 1033

-మెదక్ 1027

-రాజన్న సిరిసిల్ల 1014

-జయశంకర్ భూపాలపల్లి 1009

-సిద్దిపేట 1008

-భద్రాద్రి కొత్తగూడెం 1008

-ఖమ్మం 1005

-వికారాబాద్ 1001

*☸అతితక్కువ లింగ నిష్పత్తి*

-రంగారెడ్డి 950
-హైదరాబాద్ 954
-మేడ్చల్ మల్కాజిగిరి 957
-వనపర్తి 960
-సంగారెడ్డి 963

-రాష్ట్ర జనసాంద్రత 312 చ.కి.మీ.

-పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న జనాభా 38.88 శాతం

-గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్న జనాభా 61.12 శాతం

*🚫జనాభా పెరుగుదల*

-2001 నుంచి 2011 మధ్య జనాభా పెరుగుదల 13.58 శాతం

-1991 నుంచి 2001 మధ్య జనాభా పెరుగుదల 18.77 శాతం

-జనాభా వృద్ధిలో రుణ వృద్ధిరేటు నమోదైన దశాబ్దం 1911-21 (-3.79 శాతం)

-అతి ఎక్కువ జనాభా వృద్ధిరేటు నమోదైన దశాబ్దం 1981-1991 (29.37 శాతం)

*🌐అక్షరాస్యత రేటు*

*-ఏడేండ్ల వయస్సు పైబడి చదవ, రాయగలిగి, అర్థం చేసుకునేవారిని అక్షరాస్యులు అంటారు*.

*-మొత్తం జనాభాలో (0-6 ఏండ్ల మినహా) ఎంత మంది అక్షరాస్యులు ఉన్నారో తెలిపేది అక్షరాస్యత రేటు*

-2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర అక్షరాస్యత 66.54 శాతం

-పురుషులు- 75.04 శాతం

-స్త్రీలు - 57.99 శాతం

-గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అక్షరాస్యత వ్యత్యాసం అత్యధికం.

-పట్టణ ప్రాంతాలు - 81.09 శాతం

-గ్రామీణ ప్రాంతాలు - 57.03 శాతం

*🔵అత్యధిక అక్షరాస్యత (శాతం)*

-హైదరాబాద్ - 83.25

-మేడ్చల్-మల్కాజిగిరి - 82.48
-వరంగల్ అర్బన్ - 76.17
-రంగారెడ్డి - 71.88
-కరీంనగర్ - 69.16
*🔹అత్యధిక వర్క్ఫోర్స్*

-హైదరాబాద్ (కార్మికులు 10.96, ఉపాంత కార్మికులు 3.17)

-రంగారెడ్డి (కార్మికులు 8.65, ఉ. కా.1.57)

-మేడ్చల్ మల్కాజిగిరి (కార్మికులు 8.06, ఉపాంత కార్మికులు 1.58)

-నల్లగొండ (కార్మికులు 6.92, ఉపాంత కార్మికులు 1.14)

-నిజామాబాద్ (కార్మికులు 6.56, ఉపాంత కార్మికులు 1.06)

*✳అతితక్కువ వర్క్ఫోర్స్*

-కుమ్రం భీం (కార్మికులు 1.81, ఉపాంత కార్మికులు 0.72)

-జనగాం (కార్మికులు 2.30, ఉ. కా. 0.57)

-రాజన్న సిరిసిల్ల (కార్మికులు 2.54, ఉపాంత కార్మికులు 0.45)

-మంచిర్యాల (కార్మికులు 2.58, ఉపాంత కార్మికులు 0.87)

-వనపర్తి (కార్మికులు 2.63, ఉపాంత కార్మికులు 0.33)

*✴పనిచేయని వారు అత్యధికం*

-హైదరాబాద్ 25,30,026

-మేడ్చల్ మల్కాజిగిరి14,95,363

*⛔పనిచేయని వారు తక్కువ*

-రాజన్న సిరిసిల్ల 2,53,374

-కుమ్రం భీం ఆసిఫాబాద్ 2,62,811

-జనగామ 2,78,883

-వనపర్తి 2,81,609

-జోగుళాంబ గద్వాల్ 2,81,904

-పిల్లల జనాభా (0-6 ఏండ్లు) 38,99,166

-బాలలు 20,17,935

-బాలికలు 18,81,231

-రాష్ట్ర మొత్తం జనాభాలో పిల్లల జనాభా శాతం 11.14 శాతం 

*🔵అత్యధిక పిల్లల జనాభా*
-హైదరాబాద్ 4,69,126

-రంగారెడ్డి 2,97,841

*🔹పట్టణ, గ్రామీణ జనాభా (లక్షల్లో)*

*దశాబ్దం -గ్రామీణ- పట్టణ*
1961- 71-- 124.97-- 33.21

1971- 81 --150.82-- 50.99

1981- 91-- 182.15-- 78.74

1991-2001-- 211.34-- 98.53

2001- 2011-- 213.95-- 136.09

2001 నుంచి 2011 మధ్య జనాభా పెరుగుదల 38.12 శాతం

(పట్టణ ప్రాంతం)
2001 నుంచి 2011 మధ్య జనాభా పెరుగుదల 2.13 శాతం

(గ్రామీణ ప్రాంతం)
మొత్తం కుటుంబాలు: 83,03,612

కుటుంబ పరిమాణం: 4

*☯అతితక్కువ అక్షరాస్యత*

-జోగుళాంబ గద్వాల 49.37

-నాగర్కర్నూల్ 54.38
-వనపర్తి 55.66
-మెదక్ 56.12

-రాష్ట్ర సగటు అక్షరాస్యత 66.54 కంటే 26 జిల్లాల అక్షరాస్యత తక్కువగా ఉన్నది.

*🛑జనాభాలో సామాజిక భాగస్వామ్యం*

*☯మొత్తం జనాభాలో ఎస్సీ, ఎస్టీల భాగస్వామ్యం*

-ఎస్సీ జనాభా 54,08,800
 (పురుషులు 26,93,127, మహిళలు 27,15,673)

-ఎస్సీ జనాభా శాతం 15.45 శాతం

-ఎస్సీ జనాభాలో లింగ నిష్పత్తి 1,008

-ఎస్టీ జనాభా 31,77,940
 ( పురుషులు 16,07,656, మహిళలు 15,70,284)

-ఎస్టీ జనాభా శాతం 9.08 శాతం

-ఎస్టీ జనాభాలో లింగ నిష్పత్తి 977

-1961లో 2.81 శాతం ఉన్న ఎస్టీ జనాభా 1981లో 8.19 శాతానికి చేరింది.

 2011లో 9.08 శాతానికి చేరుకున్నది. ఎస్టీ జనాభాలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తున్నది.

*✳అత్యధికంగా ఎస్సీ జనాభా*

-మేడ్చల్ - మల్కాజిగిరి 24.72
-నాగర్ కర్నూల్ 21.32
-జనగామ 21.15

*🔹అతితక్కువ ఎస్సీ జనాభా*

-హైదరాబాద్ 6.29
-మేడ్చల్- మల్కాజిగిరి 9.43
-భద్రాద్రి కొత్తగూడెం 13.42

*🏀అత్యధిక ఎస్టీ జనాభా*

-మహబూబాబాద్ 37.80
-భద్రాద్రి కొత్తగూడెం 36.66
-ఆదిలాబాద్ 31.68

*🛑అత్యల్ప ఎస్టీ జనాభా*

-హైదరాబాద్ 1.24
-కరీంనగర్ 1.27
-జోగుళాంబ గద్వాల 1.54
-మేడ్చల్ మల్కాజిగిరి 2.26

*☸అత్యధిక కుటుంబాలు*

-హైదరాబాద్ 8,49,051
-మేడ్చల్-మల్కాజిగిరి 5,98,112
-రంగారెడ్డి 5,59,150
-నల్లగొండ 4,01,728
-ఖమ్మం 3,82,929

*✳అతితక్కువ కుటుంబాలుగల జిల్లాలు*

-కుమ్రం భీం ఆసిఫాబాద్ 1,20,420
-వనపర్తి 1,23,544
-జోగుళాంబ గద్వాల 1,32,261
-రాజన్న సిరిసిల్ల 1,38,261
-జనగామ 1,39,238

-రాష్ట్ర పట్టణ జనాభా 1,36,08,665 (పురుషులు 69,06,640, మహిళలు 67,02,025)

-పట్టణ జనాభాలో లింగనిష్పత్తి 970

-100 శాతం పట్టణీకరణ జరిగిన జిల్లా
- హైదరాబాద్

*☯అతితక్కువ పిల్లల జనాభా*

-రాజన్న సిరిసిల్ల 48,571

-జనగామ 55,056

పిల్లల్లో లింగ నిష్పత్తి 932

*పిల్లల్లో లింగ నిష్పత్తి(అత్యధికం)*

-భద్రాద్రి కొత్తగూడెం 964
-సంగారెడ్డి 955

*పిల్లల్లో లింగ నిష్పత్తి (అతితక్కువ)*

-వనపర్తి 903
-వరంగల్ రూరల్ 903
-మహబూబాబాద్ 903

*🛑పట్టణ జనాభా అత్యధికం*

-మేడ్చల్- మాల్కాజిగిరి 91.47
-వరంగల్ అర్బన్ 68.51
-రంగారెడ్డి 57.60

*🕉-రాష్ట్ర గ్రామీణ జనాభా*
 2,13,95,009 (పురుషులు 1,07,04,993, మహిళలు 1,06,90,016)

-గ్రామీణ జనాభాలో లింగ నిష్పత్తి 999

*🚫గ్రామీణ జనాభా ఎక్కువ*

-వరంగల్ రూరల్ 93.01

-జయశంకర్ భూపాలపల్లి 92.43
-మెదక్ 92.33

-2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో మొత్తం కార్మికులు లేదా వర్క్ఫోర్స్ 163.42 లక్షలు

-ప్రధాన కార్మికులు - 137.20 లక్షలు (ఎస్సీలు 22.42 లక్షలు, ఎస్సీలు 14.58 లక్షలు)

-ఉపాంత కార్మికులు - 26.22 లక్షలు (ఎస్సీలు 4.96 , ఎస్టీలు 2.93 లక్షలు)

-వ్యవసాయదారులు - 31.51 లక్షలు

-వ్యవసాయ కార్మికులు - 59.15 లక్షలు

-కుటీర పరిశ్రమ - 7.77 లక్షలు

-ఇతర కార్మికులు - 64.99 లక్షలు
-పనిచేయని వారు - 186.62 లక్షలు
           🍃✌🌺
*FIGURES OF SPEECH* 

Figure-of-Speech may be classified as under: 

1. Those based on resemblance 
• Simile 
• Metaphor 
• Personification 
• Apostrophe 

2. Those based on Contrast: 
• Antithesis 
• Epigram 
* Oxymoron
* Paradox

3. Those based on Association: 
• Metonymy 
• Synecdoche 

4. Those depending on Construction: 
• Climax 
• Anticlimax 

*1. ALLITERATION :* Alliteration refers to the repetition of of an initial consonant sound, at least three times in a sentence.  

*EXAMPLES :*
• A peck of pickled peppers
• Don't delay dawns disarming display. Dusk demands daylight. 
• Sara's seven sisters slept soundly in sand.
 • Sally sells sea shells by the seashore” 

*2. SIMILE :*  In Simile, a comparison is made between two object of different kinds which have at least one point in common. The Simile is introduced by the word ‘as…as’ or 'like'. 

“Life is like a box of chocolates; you never know what you’re going to get” 

*EXAMPLES:* 
• As active as quicksilver 
• As afraid as a grasshopper 
• As ageless as the sun 
• As agile as a cat 
• As agile as a monkey 
• As alert as a bird 
• As alike as two peas 
• As alone as a leper 
• As alone as Crusoe 
• As ambitious as the devil 

*3. METAPHOR :* An implied comparison between two unlike things that actually have something important in common (as if two things were one.)

*EXAMPLES:*
• The camel is the ship of the desert. 
• Life is a dream. 
• The news was a dragger to his heart. 
• Revenge is a kind of wild justice. 
• “My heart is a lonely hunter that hunts on a lonely hill” 

*** *NOTE* : Every SIMILE can be compressed into a METAPHOR, and Every METAPHOR can be expanded into a SIMILE. 

*EXAMPLES:*
• Tanaji fought as fiercely as a loin. (Simile) 
• Tanaji was a lion in the fight. (Metaphor) 

• The waves thundered on the shore. (Metaphor) 
• The waves broke on the shore with noise like a thunder. (Simile)

•My love is like a red, red rose,
 That's newly sprung in June. (Simile) 
• Love is a rose but you better not pick it. (Metaphor)

*4. ANTITHESIS :* In Antithesis, a striking opposition or contrast of words or sentiments is made in the same sentence. It is employed to secure emphasis. 

*EXAMPLES:*
• Man proposes, but God disposes. 
• Not that I loved Caesar less, but I loved Rome more. 
• Speech is silver, but Silence is Gold. 
• Many are called, but few are chosen. 
• To err is human, but to forgive on divine. 

*5. OXYMORON :* A figure of speech in which  contradictory terms appear side by side or at once of the same thing. 

*EXAMPLES:*
• She accepted it as the kind cruelty of surgeon’s knife. 
• It is an open secret.

*6. PARADOX :* A statement that appears to contradict itself in the same sentence. 

*EXAMPLES :*
“War is peace. Ignorance is strength. Freedom is slavery.” Though we know these things aren’t true, they present an interesting paradox that makes a person think seriously about what they have just read or heard. 

*7. IRONY :* The use of words to convey the opposite of their literal meaning.  It is often used to poke fun at a situation that everyone else sees as a very serious matter. 

*EXAMPLES :*
“Gentlemen, you can’t fight in here! This is the War Room!”

 *8. APOSTROPHE :*  An Apostrophe is a direct address to the dead, to the absent, or to a personified object or idea. This figure is a special form of Personification. 

*EXAMPLES:*
• Milton! You should not be living at this hour. 
• Friend! I know not which way I must look for comfort.
• Roll on! Thou deep and dark blue Ocean, roll. 
• Death! Where is thy sting? O Grave! Where is thy victory?

 *9. EUPHEMISM :* Euphemism consists in the description of a disagreeable thing by an agreeable name. 

*EXAMPLES:*
• You are telling me a fairy tale. (You are telling me lies) 
• He is gone to heaven. (He is dead) 
•We have to let you go. (You're fired.)
•You're well fed. (You're fat.)

*10. HYPERBOLE :* Hyperbole is an exaggerated statement for the purpose of emphasis or heightened effect.

*EXAMPLES:*
• Why, man, if the river is dry, I am able to fill it with tears. 
• Hmalet! You have not cleft my heart in twain. 
•“It was as big as a mountain! It was faster than a cheetah! It was dumber than a rock!” 

*11. SYNECDOCHE :* A figure of speech in which a part is used to represent the whole 

*EXAMPLES :*
ABCs for alphabet or the whole for a part 
England won the World Cup in 1966.
Seeing eyes, helping hands.

*12. ONOMATOPOEIA :* This is the use of a word that actually sounds like what it means. 

Onomatopoeia (pronounced ON-a-MAT-a-PEE-a) refers to words (such as bow-wow and hiss ) that imitate the sounds 
    
Good examples include “hiss” or “ding-dong” or “fizz.”

*13. PERSONIFICATION :* In Personification, inanimate objects and abstract notions are spoken of as having life and intelligence. 

 This is a way of giving an inanimate object the qualities of a living thing.

*EXAMPLES:* 
• Death lays its icy hands on King. 
• Pride goes forth on horseback, grand and gay. 
• Laughter is holding her both sides. 
•“The tree quaked with fear as the wind approached” 
•“The sun smiled down on her” 

 *14. PUN :* A play on words , sometimes on different senses of the same word and sometimes on the similar sense or sound of different words.

A form of wordplay using similar sounding words.

*EXAMPLES:*
 “The wedding was so emotional that even the cake was in tiers (tears).”

“Two silk worms had a race and ended in a tie.” - A “tie” can of course either be when neither party wins, but in this pun also refers to the piece of clothing usually made from silk.

“Why can a man never starve in the Great Desert? Because he can eat the sand which is there. But what brought the sandwiches there? Why, Noah sent Ham, and his descendants mustered and bred.” - There are several separate puns, including the pun on “sand which” and “sandwich,” as well as “Ham” (a Biblical figure) and “ham” and the homophonic puns on “mustered”/“mustard” and “bred”/“bread.”

*15. METONYMY :* A figure of speech in which one word or phrase is substituted for another with which it's closely associated. Metonyms make associations or substitutions. 

In some ways it can be seen as a nickname for something else.
However, we all understand the meaning, and so the words are interchangeable. 

*EXAMPLES:*
 The place name "Bollywood," has become a metonym for the Hindi film industry. 

Using the word “crown” for “king or queen” or “lab coats” for “scientists”. 

“The White House said” doesn’t actually mean the White House said it (a house can’t speak!) but that the President of America (who lives in The White House)  said it.

*16. RHETORICAL QUESTION :*  A rhetorical question is a question that is asked not to get an answer, but instead to emphasize a point. They are often used to elicit thought and understanding on the part of the listener or reader.

*EXAMPLES :*
 "Marriage is a wonderful institution, but who would want to live in an institution?" 

We also use rhetorical questions in common speech, such as the following statements:

Sure, why not?
Who knew?
Does it look like I care?
Are you kidding me?
Do birds fly?
Is the sky blue?

🔲ఆక్షిజన్ మాత్రమే రక్తం లో కలుస్తుంది-ఎందుకు? 

ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్ళినపుడు కేవలం ఆక్షిజన్ మాత్రమే ఎందుకు రక్తం లో కలుస్తుంది ... నైట్రోజన్ తదితర వాయువులు ఎందుకు కలవవు ?.

గాలిలో ప్రధానం గా నైట్రోజన్ , ఆక్షిజన్ వాయువులు 4:1 నిష్పత్తి లో ఉన్నాయి ... నిజానికి గాలిలో 80% ఉండేది నైట్రోజన్ వాయువే . అది మన శ్వాసక్రియలో ఉపిరితిత్తుల్లోకి ప్రవేశించినా వచ్చిన దారినే తిరిగి బయటికి వస్తుంది ... అది రక్తం లో కలవదు . ఆక్షిజన్ గాలిలో 20% మాత్రమె ఉన్నా అది రక్తం లో కలుస్తుంది .

ఉపిరితిత్తులు స్పాంజి లు గా ఉంటాయి . గాలి మూలమూలలా వ్యాపిస్తుంది . . ఆ గాలి చిట్టచివరికి శ్వాస గుళిక (Alviolous) లో చేరుకుంటుంది . ఈ శ్వాసగులిక గోళాల్లో పలుచని చర్మంగల రక్తనాళాల్లో రక్తం ప్రవహిస్తుంటుంది , ఈ రక్తం లో "హీమోగ్లోబిన్ " ఉంటుంది , ఈ హీమోగ్లోబిన్ కు అయస్కాంత ధర్మం ఉన్నది . . . మనం పీల్చే గాలిలోని ఆక్షిజన్ కి కుడా అయస్కాంత లక్షణం ఉన్నది . అయస్కాంతాలు పరస్పరం ఆకర్షించుకుంటాయి . ఈ లక్షణం వల్ల ఆక్షిజన్ రక్తం లోనికి ఆకర్షితమవుతుంది . అంతే గాని వ్యాపనం (diffusion) వల్ల మాత్రమే కాదు . వ్యాపనం పాత్ర చాలా పరిమితం . వ్యాపనం ద్వారానే అయితే నైట్రోజన్ కుడా రక్తం లో కలవాలి . జైత్రోజన్ కు అయస్కాంత ధర్మం లేదు ... అందువల్ల అది రక్తం లో కలవలేదు . అలాగని నైట్రోజన్ వాయువు శ్వాసక్రియ లో వృధా అని తెల్చేయకూడదు . గాలి పీడనానికి ప్రధాన అంశం ఈ నైట్రోజన్ . ఆ పీడనం వల్లే గాలి మన ఉపిరితిట్టుల్లో మారుమూల ప్రాంతాలకు కుడా చేరుకుంటుంది .

*🌟🌞మజిల్‌క్రాంప్స్‌ను తగ్గించే అరటిపండు🌞🌟*

అతి తేలిగ్గా చవకగా దొరుకుతూ అత్యంత ఎక్కవ పోషకాలు ఉండే పండ్లలో ముఖ్యమైనది అరటిపండు. దానితో ఒనగూరే ప్రయోజనాల్లో అవి కొన్ని... ∙ఒంట్లో ఖనిజ లవణాలు తగ్గి మాటిమాటికీ కండరాలు పట్టేస్తున్నవారు (మజిల్‌ క్రాంప్స్‌తో బాధపడుతున్నవారు) అరటిపండ్లు తింటే ఆ సమస్య దూరవుతుంది 

అరటిపండులో పొటాషియమ్‌ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే అది రక్తపోటు (హైబీపీ)ని స్వాభావికంగానే నియంత్రిస్తుంది ∙ఇందులో ఉండే పొటాషియమ్, విటమిన్‌ సి, విటమిన్‌ బి6... గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు తోడ్పడతాయి.

*విటమిస్‌ సితో పాటు బి6 అంశాలు రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు సైతం తోడ్పడతాయి ∙అరటిపండు జీర్ణశక్తిని పెంచి, ఆహారం తేలిగ్గా జీర్ణమయ్యేలా చూస్తుంది. జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ∙ఇందులోని పొటాషియమ్‌ మన మూత్రపిండాల ఆరోగ్య నిర్వహణకు తోడ్పడుతుంది ∙ఇందులోని అమైనో యాసిడ్స్‌ అద్భుతమైన జ్ఞాపకశక్తికి, మెదడు చురుకుగా పనిచేయడానికి ఉపయోగపడతాయి*

*🌟🌞ఆరుబ్యాంకుల చెక్‌లు చెల్లవు..🌞🌟* 

దిల్లీః  *గతేడాది ఏప్రిల్‌లో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో విలీనమైన ఆరు అనుబంధ బ్యాంకులకు సంబంధించిన చెక్‌బుక్‌లు నేటి నుంచి చెల్లవని సోమవారం ఎస్‌బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఆరు బ్యాంకులకు చెందిన ఖాతాదారులు కొత్త చెక్‌బుక్‌లను తీసుకోవడానికి 31 డిసెంబరు 2017 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు ఎస్‌బీఐ 2017 సెప్టెంబరులోనే ప్రకటించింది*. 

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌,జైపూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావెన్‌కోర్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌తో పాటు భారతీయ మహిళా బ్యాంక్‌ 2017 ఏప్రిల్‌ 1న ఎస్‌బీఐలో విలీనమైన సంగతి తెలిసిందే. వీటి విలీనంతో ఎస్‌బీఐ ప్రపంచంలో ఆస్తుల పరంగా అగ్రస్థానంలోఉన్న 50 బ్యాంకుల సరసన చేరింది.

 *డిసెంబరు 31, 2017తో ఈ ఆరు అనుబంధ బ్యాంకుల చెక్‌బుక్‌ల చెల్లుబాటుకు ఇచ్చిన గడువు ముగిసింది. విలీనమైన బ్యాంకులకు చెందిన ఖాతాదారులు కొత్తగా ఎస్‌బీఐ పేరుతో ఉన్న చెక్‌బుక్‌లను తీసుకోవాల్సిఉంటుంది.*

 *ఇంటర్నెట్‌బ్యాంకింగ్‌, ఎస్‌బీఐ ఎనీవేర్‌(మొబైల్‌యాప్‌), ఎస్‌బీఐ మింగిల్‌(వెబ్‌ అప్లికేషన్‌), ఏటీఎం సెంటర్‌, సమీపంలోని బ్యాంక్‌ బ్రాంచిలోనైనా ఖాతాదారులు కొత్త చెక్‌బుక్‌లను పొందవచ్చని రెండురోజుల క్రితం ఎస్‌బీఐ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేసింది.*

*2017 awards*

*జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డు గెలుచుకున్న కంపెనీ? 
- అపోలో మ్యూనిచ్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ
* యునెస్కో ఆసియా పసిఫిక్‌ అవార్ట్‌ ఆఫ్‌ మెరిట్‌ 2017ను గెలుచుకున్న భారత ఆలయం? 
- శ్రీ రంగనాథస్వామి టెంపుల్‌ 
*2016 ఎన్టీఆర్‌ నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డు ఎవరికి లభించింది? - రజినీకాంత్‌
* మొట్టమొదటి కేసరి మీడియా అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? - టి.జె.ఎస్‌.జార్జ్‌
* 2017 కల్పనాచావ్లా అవార్డు విజేత?
- ప్రీతి శ్రీనివాసన్‌
*బెంగాల్‌ ప్రభుత్వం అందించే 'మహానాయక్‌ సమ్మాన్‌-2017 అవార్డు గ్రహీత? - శకుంతల బారువ 
*కాంబోడియాలోని ఆంగ్‌కోర్‌వాట్‌ వంటి సాంస్కతిక కేంద్రాల పరిరక్షణకు చేసిన కృషికి 2017లో రామన్‌ మెగసెసె అవార్డు పొందింది? 
- యొషియాకి ఇషిజావ(జపాన్‌)
* నేషనల్‌ సైన్స్‌ ఫౌండేషన్స్‌ కెరీర్‌ అవార్డు- 2017 గెల్చుకున్న భారత-అమెరికన్‌ ఎవరు? 
- అన్షుపాలి శ్రీవాత్సవ్‌ 
* ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అండ్‌ అవార్డ్స్‌ ఆఫ్‌ ఆస్ట్రేలి యాలో ఉత్తమ నటి అవార్డు పొందిన భారతీయ నటి?
-ఐశ్వర్యరారు బచ్చన్‌ 
* 2017 సరస్వతి సమ్మాన్‌ అవార్డు విజేత? 
- మహాబలేశ్వర్‌ సెయిల్‌ 
*చేనేత మహిళా కార్మికుల కోసం కమలాదేవి ఛటో పాధ్యాయ జాతీయ అవార్డులను ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రిత్వశాఖ? -టెక్స్‌టైల్స్‌ శాఖ
* సెర్బ్‌ డిస్టింగిష్‌డ్‌ ఫెలో అవార్డుకు ఎంపికైనవారు ఎవరు? - లాల్జీసింగ్‌ 
* 2016 మూర్తీదేవి అవార్డు గ్రహీత? 
-ఎంపీ వీరేంద్రకుమార్‌ 
* 2017 పాలీ ఉమ్రీగర్‌ అవార్డు గెలుచుకున్నాడు? - విరాట్‌ కోహ్లి
*2017 ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో విజిటర్స్‌ అవార్డు అందుకున్న యూనివర్సిటీ? 
- జవహర్‌లాల్‌నెహ్రూ యూనివర్సిటీ
*2017 హార్వర్డ్‌ హ్యుమానిటేరియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు ఎవరికి లభించింది?
- రాబిన్‌ రిహన్న ఫెంటి
* 2017 ESPN cric info అవార్డులలో కెప్టెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా ఎవరు అందుకున్నారు?
- విరాట్‌ కోహ్లి
* 89వ అస్మార్‌ అవార్డులలో ఏ చిత్రం ఉత్తమ యాని మేషన్‌ అవార్డు గెలుచుకుంది? - జూటోపియా 
* 89వ అస్మార్‌ అవార్డులలో ఏ చిత్రం ఉత్తమ యాని మేషన్‌ అవార్డు గెలుచుకుంది? - జూటోపియా
* ఎర్నెస్ట్‌ అండ్‌ యంగ్‌ సంస్థ ఇండియన్‌ 2016 ఎంటర్‌ ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు పొందిన వారు?
- వివేక్‌చాంద్‌ సెహగల్‌ 
* 2016-17 ఇంటర్నేషనల్‌ మెర్క్యురీ అవార్డ్స్‌ గెలుచు కున్న ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌?- EDII 
* ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పరిపాలనలో సివిల్‌ సర్వీస్‌ అవార్డ్స్‌ ప్రారంభించింది?
- అరుణాచల్‌ప్రదేశ్‌ 
* డా||బి.సి.రారు నేషనల్‌ అవార్డు-2016కు ఎవరు ఎంపికయ్యారు? - పి.రఘురాం 
* 89వ ఆస్కార్‌ అవార్డులలో బెస్ట్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ ఫిల్మ్‌ అవార్డు గెల్చుకున్న 'ది సేల్స్‌మెన్‌' సినిమా దర్శకుడు ఎవరు? - అస్గర్‌ ఫర్హాది
*2017 ల్యూరియస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ అవార్డులలో స్పోర్ట్స్‌ వుమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు ఎవరు అందుకున్నారు?
- సిమోని బైల్స్‌ 
*కుల్‌దీప్‌ నాయర్‌ జర్నలిజం అవార్డు-2017 విజేత?
- రవిష్‌ కుమార్‌
* 2017 నేషనల్‌ యశ్‌చోప్రా మెమోరియల్‌ అవార్డుకు ఎవరు - షారుక్‌ఖాన్‌ 
* 2017 రీగన్‌రన్‌ సైన్స్‌ టాలెంట్‌ సెర్చ్‌ అవార్డు గెలు పొందిన ఇండియన్‌-అమెరికన్‌? - ఇంద్రాణిదాస్‌ 
* 6వ నేషనల్‌ ఫోటోగ్రఫి అవార్డులలో లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డును ఎవరు అందుకున్నారు?
- రఘురారు 
* హరి ఓం ఆశ్రమం అలెంబిక్‌ రీసెర్చ్‌ అవార్డు-2016 విజేత? - నీనా శ్రీవాత్సవ 
* ఐఎంసీ రామకష్ణ బజాజ్‌ నేషనల్‌ కోటా అవార్డు పొందిన స్వచ్ఛంద సంస్థ? - అన్నామృత
* 2016 నేషనల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ అవార్డులలో 'బెస్ట్‌ ఐటీ స్టార్టప్‌ ఆఫ్‌ ఇండియా' అవార్డు గెలుచుకున్న స్టార్టప్‌? - లూసిడ్యుస్‌
* 2017 నేషనల్‌ ఎంఎస్‌ఎంఈ ఎక్స్‌లెన్స్‌ అవార్డు పొందిన బ్యాంక్‌? - కార్పొరేషన్‌ బ్యాంక్‌
* 67వ బెర్లిన్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఇంటర్నే షనల్‌ ఫెడరేషన్‌ అఫ్‌ ఆర్ట్‌ సినిమా అవార్డు గెలుచు కున్న భారతీయ చిత్రం? - న్యూటన్‌ 
* 2017 గ్రామీ అవార్డులలో బెస్ట్‌ వరల్డ్‌ మ్యూజిక్‌ ఆల్బమ్‌ అవార్డు పొందిన ఇండో-అమెరికన్‌ మ్యూజిషియన్‌?
- సందీప్‌దాస్‌
* యునైటెడ్‌ కింగ్‌డమ్‌ ఔట్‌ స్టాండింగ్‌ బ్రేవరి అవార్డు-2017 అందుకున్న భారత సంతతి వ్యక్తి? 
- షంద్‌ పనెసర్‌ 
* 2017 బ్రాండ్‌ లారేట్‌ లెజెండరీ అవార్డు గ్రహీత? 
- లతా మంగేష్కర్‌
*క్వీన్‌ ఎలిజబెత్‌-2 నైట్‌హుడ్‌ అవార్డు పొందిన భారతీయ సంతతికి చెందిన బ్రిటిష్‌ ప్రొఫెసర్‌ ఎవరు?
- శంకర్‌ బాలసుబ్రమణ్యన్‌ 
* నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 'మెడల్‌ ఆఫ్‌ స్క్రోల్‌' అవార్డు ఎవరికి ప్రదానం చేసింది? - గౌరవ్‌ గోయల్‌ 
*2016 నవలేఖన్‌ అవార్డు విజేతలు ఎవరు? 
-శ్రద్ధా, జ్ఞాన్‌శ్యామ్‌ కుమార్‌ దేవాంష్‌
* 2017 గోల్డెన్‌ గ్లోబ్స్‌ అవార్డుల్లో ఉత్తమ చలన చిత్రం అవార్డు గెలుచుకుంది? - మూన్‌లైట్‌
* 2017 జైపూర్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డు అందుకున్నవారు? 
-రమేష్‌ ప్రసాద్

*📚✍బ్రిడ్జి కోర్సు చేస్తే ఎవరైనా ఎంబీబీఎస్‌ డాక్టరే*

*♦లోక్‌సభలో ఎన్‌ఎంసీ ఏర్పాటు బిల్లు*

*♦అన్ని వర్గాల నిరసన*

*♦నేడు ఐఎంఏ విధుల బహిష్కరణ*

🌻న్యూఢిల్లీ, జనవరి 1: వివాదాస్పదమైన నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎంసి) ఏర్పాటుకు సంబంధించిన బిల్లును కేంద్ర ఆరోగ్యమంత్రి జేపీ నడ్డా సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా ప్రస్తుతం ఉన్న మెడికల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (ఎంసిఐ) స్థానే ఎన్‌ఎంసి ఏర్పాటుచేస్తారు. ఈ బిల్లుపై బీజేపీ మినహా అన్ని వర్గాల నుంచీ నిరసన వ్యక్తమవుతోంది. బిల్లును మరోమారు స్థాయీసంఘానికి పంపాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

🌻బ్యూరోక్రాటిక్‌ పెత్తనానికి బిల్లు వీలుకల్పిస్తుందని విపక్షాలన్నీ హెచ్చరిస్తున్నాయి. అటు ఎంసీఐ కూడా దీన్ని తీవ్రంగా నిరసించింది. మంగళవారం 12 గంటలపాటు వైద్యసేవలను బహిష్కరించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పిలుపునివ్వడంతో- ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, ఎమర్జెన్సీ కేసులు అటెండ్‌ అయ్యేట్లు చర్యలు తీసుకోవాలని కేంద్రం అన్ని కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులకు నోటీసిచ్చింది.

🌻బిల్లును హడావిడిగా ఆమోదించి చట్టం చేయవద్దని, ఇబ్బందికర అంశాలు అందులో చాలానే ఉన్నాయని కాంగ్రెస్‌ నేత జైరామ్‌ రమేష్‌ కోరారు. ‘‘ఇది ప్రజా వ్యతిరేకం. భారతీయ వైద్య వ్యవస్థకు ఇది బ్లాక్‌ డే..’’ అని ఎంసీఐ, ఐఎంఏ నిరసన వ్యక్తం చేశాయి. బిల్లు ప్రకారం -4 స్వయం ప్రతిపత్తిగల బోర్డులు ఏర్పాటవుతాయి. ఇవి వైద్య విద్య (యూజీ- పీజీ రెండూ), మెడికల్‌ కాలేజీలకు అనుమతులు, రెన్యూవల్స్‌, మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌కు అనుమతులు మొదలైనవి చూ స్తాయి. వైద్యవిద్యను సమూలంగా ప్రక్షాళన చేయడం తమ లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది. 

🌻ఈ ఎన్‌ఎంసీ లో 25 మంది సభ్యులతో ఓ పాలక వ్యవస్థ ఏర్పాటవుతుంది. దీనికి ఓ ఛైర్మన్‌ను, సభ్యులను ప్రభుత్వమే నియమిస్తుంది. 5 మందిని ఎన్నికుంటారు, 12 మందిని ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా కేబినెట్‌ సెక్రటరీ సారథ్యంలోని సెర్చ్‌ కమిటీ నియమిస్తుంది.

🌻ఇదంతా ఓ బ్యూరోక్రాటిక్‌ వ్యవస్థ అనీ, కేంద్రం తనకు నచ్చిన రాజకీయ నేతలకు, బ్యూరోక్రాట్లకు పునరావాసం కల్పించడానికి ఈ బిల్లును ఉపయోగించబోతోందని, ఇందులో ప్రొఫెషనల్స్‌కు చోటు లేకపోవడమేంటని ఐఎంఏ ప్రశ్నిస్తోంది. మరో వివాదాస్పద అంశం ఏంటంటే- ఏడాదికోసారి- హోమియోపతి, ఆయుర్వేద, అల్లోపతి, భారతీయ వైద్యవిధానాలకు సంబంధించిన సమీకృత ముఖాముఖి సమావేశం చేసి- పరస్పర సహకారం పెంపొందించడం.

🌻ఇది అసాధ్యమని, అన్ని వైద్యవిధానాలనూ ఇంటెగ్రేట్‌ చేయడమనేది ఓ ఊహమాత్రమేనని నిపుణులు అంటున్నారు. అదీ కాక-ఈనిబంధన- హోమియో డాక్లర్లు కూడా అల్లోపతి వైద్యం చేయడానికి అవకాశం కల్పిస్తుంది. ఓ బ్రిడ్జి కోర్సు చేసేస్తే ఏ డాక్టరైనా ఎంబీబీఎస్‌ డాక్టర్‌తో సమానం.

*📚✍మాకొద్దీ ఇంజినీరింగ్‌✍📚*

*2 January 2018, 3:56 am*

*♦దారుణంగా పడిపోయిన సీట్ల భర్తీ*

*♦తెలంగాణలో 42% కళాశాలల్లో చేరింది 6 శాతమే* 

*♦ఏపీలోని మూడోవంతు విద్యా సంస్థల్లో చేరికలు 11 శాతమే* 

*♦దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి*

 🌻ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్‌ కళాశాలల్లో సీట్ల భర్తీ దారుణంగా పడిపోతూ వస్తోంది. 2016-17 విద్యా సంవత్సరానికి దేశవ్యాప్తంగా మూడోవంతు విద్యా సంస్థల్లో సగటున 13% సీట్లు మాత్రమే భర్తీ అయినట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ సోమవారం వెల్లడించింది.

🌻తెలంగాణలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ 266 కళాశాలల్లో 41,628 సీట్లు ఉండగా..112లో కేవలం 6 శాతం(2,874) మంది మాత్రమే చేరినట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని 325 విద్యా సంస్థల్లో 47,640 సీట్లకుగానూ 109లో కేవలం 5,687 సీట్లు (11.98%)మాత్రమే భర్తీ అయినట్లు తెలిపింది.

🌻దక్షిణాదిలో అథమం: కేంద్రం వెల్లడించిన గణాంకాల మేరకు దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు మిగిలిపోతున్నాయి.

🌻ఈ మూడు రాష్ట్రాల్లోని 398 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో 1.66 లక్షల సీట్లకు గానూ.. కేవలం 20 వేలు(12%) మాత్రమే భర్తీ కావడం పరిస్థితికి అద్దం పడుతోంది. కర్ణాటక, కేరళల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. కర్ణాటకలోని 198 కళాశాలలకు గానూ కేవలం 18లో మాత్రమే 80 శాతం సీట్లు, కేరళలో 176కి గానూ 34లో 84% సీట్లు భర్తీ కాలేదు.

🌻అత్యధిక సీట్లు మిగిలిపోయిన కళాశాలల సంఖ్యలో(177) తమిళనాడు దేశంలోనే తొలిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్‌ (169), మహారాష్ట్ర (139) ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 3,325 కళాశాలలకు గానూ 1267లో 86% సీట్లు మిగిలిపోవడం గమనార్హం.

ఈ రోజు జి కె

1.ICRC-ప్రధానకార్యాలయం ఎక్కడ ఉంది?
2.అల్బేనియా దేశ రాజధాని?
3.జాతీయ ఉపాధ్యాయ మహిళా దినోత్సవం  జనవరి-3వ తేదీనఎవరి జన్మదినసందర్భంగా జరుపుకుంటాము?
4.కోమరంభీం ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది?
5.నీటి కుళాయిని తిప్పడంలో ఇమిడి ఉన్న సూత్రం?
6.జాతీయ వాతావరణ రాడార్ ఎక్కడ ఉంది?
7.ఇటీవల ఢిల్లీ మెట్రో మార్గం సదుపాయo కల్పించిన నోయిడా పట్టణం ఏ రాష్ట్రంలో ఉంది?
8.దేశంలోనే తొలిసారిగా AC సబర్బన్ రైలు ఏ నగరంలోకి అందుబాటులోకి వచ్చింది?
9.వరల్డ్ రాపిడ్ చెస్ చాంపియన్ షిప్ విజేత?
10.శివకపూర్ అనే క్రీడాకారుడు ఏ క్రీడకు చెందినవాడు?
  జవాబులు
1.జెనీవా(స్విట్జర్లాండ్)
2.తిరానా
3.సావిత్రిబాయి ఫూలే(భారతదేశ ప్రధమ ఉపాధ్యాయరాలు)
4.ఆదిలాబాద్
5.బలయుగ్మ సూత్రం
6.గాందకి(తిరుపతి)
7.ఉత్తరప్రదేశ్
8.ముంబయి
9.విశ్వనాథన్ ఆనంద్
10.గోల్ఫ్

*🔥Daily English🔥*

1. *When you praise a person for doing a good job*

*🔹I am very pleased with your work.*

*🔹Congratulations!*

*🔹Very impressive.*

*🔹Very nice.*

*🔹Nice job.*

*🔹Nice work.*

*🔹Good job.*

*🔹Good work.*

*🔹Keep up the good work.*

*🔹Keep it up!*

*🔹Well done!*

*🔹Bravo!*

*🔹That takes the cake!*

*🔹You're something else!*

🔸2. *When you demonstrate your subjection to a more experienced colleague*

*🔹You're the boss.*

*🔹You're the doctor.*

🔸3. *When you are going to reprimand an employee*

*🔹I'd like to have a word with you.*

*🔹Can I see you in my office?  (used with can or may or could.)*

*🔹I'll see you in my office in fifteen minutes.*

Slang of the Day

💥babe

✍🏾Meaning:
a good-looking young woman

❗️For example:

🔺The boys are down at the beach checkin' out all the cute babes in their swimsuits.

🔺Jill said, "Don't call us babes! It sounds horrible."

➰Note: Some women find this word offensive, so be careful when using it.
━━━━━━━━━━━
#Slang_of_the_day

Idiom of the Day

💥once in a blue moon

✍🏾Meaning:
If something happens once in a blue moon, it happens very rarely.

❗️For example:

🔺We hardly ever go out these days, though once in a blue moon we might go and see a movie.

🔺My daughter lives in Brazil and she only comes to see us once in a blue moon; maybe every two or three years if we're lucky.
━━━━━━━━━
#Idiom_of_the_Day

*🔷భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ*


♦రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. మొత్తం 30 మందికి పైగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. అధికారుల బదిలీ స్థానాలు ఈ విధంగా ఉన్నాయి. 
- రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా సురేష్ చందా
- ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యదర్శిగా బీ.ఆర్.మీనా
- రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజేశ్వర్ తివారి
- వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా శాంతికుమారికి అదనపు బాధ్యతలు
- పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శిగా అరవింద్ కుమార్
- బీసీ సంక్షేమశాఖ కార్యదర్శిగా బుర్రా వెంకటేశంకు అదనపు బాధ్యతలు
- కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్‌గా నవీన్ మిత్తల్
- విపత్తు నిర్వహణ కమిషనర్‌గా ఆర్.వి.చంద్రవదన్
- పశుసంవర్ధకశాఖ కార్యదర్శిగా సందీప్‌కుమార్ సుల్తానియా
- బీసీ సంక్షేమశాఖ కమిషనర్‌గా అనితా రాజేంద్ర
- మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా దానకిశోర్‌కు అదనపు బాధ్యతలు
- గిరిజిన సంక్షేమ కమిషనర్‌గా క్రిస్టినా
- ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్దప్రకాశ్
- భూ పరిపాలన సంచాలకులుగా వాకాటీ కరుణ
- రాష్ట్ర సమాచార కమిషన్ కార్యదర్శిగా ఇలంబర్తి
- సైనిక సంక్షేమ సంయుక్త కార్యదర్శిగా చంపాలాల్
- ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సంచాలకులుగా ప్రీతిమీనా
- వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఒమర్ జలీల్
- నిజామాబాద్ కలెక్టర్‌గా ఎం.ఆర్.ఎం.రావు
- పెద్దపల్లి కలెక్టర్‌గా దేవసేన
- *జనగాం కలెక్టర్‌గా అనితా రామచంద్రన్‌కు అదనపు బాధ్యతలు*
- మెదక్ కలెక్టర్‌గా మాణిక్‌రాజుకు అదనపు బాధ్యతలు
- మహబూబాబాద్ కలెక్టర్‌గా లోకేశ్ కుమార్‌కు అదనపు బాధ్యతులు
- ప్రణాళికా బోర్డు కార్యదర్శిగా శివకుమార్ నాయుడు
- ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అశోక్‌కుమార్
- ఢిల్లీలో తెలంగాణ భవన్ ఓఎస్‌డీగా కాళీచరణ్
- జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా భారతి హోళికేరి
- జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా సిక్బా పట్నాయక్
- జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా ముషారఫ్ అలీ
- బోధన్ సంయుక్త కలెక్టర్‌గా అనురాగ్ జయంతి
- మెట్‌పల్లి సంయుక్త కలెక్టర్‌గా గౌతమ్
- భద్రాచలం సంయుక్త కలెక్టర్‌గా పమేలా సత్పతి
- బెల్లంపల్లి సంయుక్త కలెక్టర్‌గా రాహుల్‌రాజ్

*🕉వివిధ సెట్స్ కన్వీనర్ల నియామకం*

🅾హైదరాబాద్: వివిధ ప్రవేశ పరీక్షల కన్వీనర్లను నియమిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇవాళ ఉత్తర్వులు వెలువరించింది.

 ఎంసెట్ కన్వీనర్గా జేఎన్టీయూ(హెచ్) రిజిస్ట్రార్ ఎన్. యాదయ్య, 

ఈసెట్ కన్వీనర్గా జేఎన్టీయూ(హెచ్) ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ. గోవర్దన్,

 ఐసెట్ కన్వీనర్గా కేయూ ప్రొఫెసర్ ఎం. సుబ్రహ్మణ్యశర్మ, 

పీఈసెట్ కన్వీనర్గా ఎంజీయూ ప్రొఫెసర్ వి. సత్యనారాయణ,

 పీజీఎల్సెట్, లాసెట్ కన్వీనర్గా ఓయూ ప్రొఫెసర్ ద్వారకానాథ్, 

పీజీఈసెట్ కన్వీనర్గా ఓయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సమీన్ ఫాతిమా,

 ఎడ్సెట్ కన్వీనర్గా ఓయూ ప్రొఫెసర్ సి. మధుమతిని నియమిస్తూ ఉన్నత విద్యామండలి ప్రకటించింది.
రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం కోసం వివిధ కోర్సులకు నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ఇప్పటికే ఖరారు చేసిన విషయం తెలిసిందే. 

మే 2 నుంచి 5 వరకు ఎంసెట్ ఆన్లైన్ పరీక్షలు జరగనున్నాయి. 

మే 9న ఈసెట్, మే 17న ఐసెట్, మే 20న పీఈసెట్. మే 25న లాసెట్, మే 25న పీజీఈసెట్, మే 26న పీజీ లాసెట్, మే 31న ఎడ్సెట్ నిర్వహించనున్నారు.

*🛑198 కోట్ల రూపాయలతో కేజీబీవీల భవనాల నిర్మాణం*

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో 198 కోట్ల రూపాయలతో 61 అకాడమిక్ బ్లాక్ లు, 34 కేజీబీవీల నూతన భవనాలకు ఈ నెల 15వ తేదీలోపు శంకుస్థాపనలు చేసి, 2018 అక్టోబర్ నాటికి భవనాలు పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులకు గడువు విధించారు. తెలంగాణ రాష్ట్ర కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలు దేశంలో అత్యుత్తమంగా ఉన్నాయని, వీటిని మరింత పటిష్టంగా మార్చాలని చెప్పారు. కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాలు(కేజీబీవీ), మోడల్ స్కూల్స్, విద్యాశాఖ గురుకుల విద్యాలయాల్లోని విద్యార్థుల వసతులు, హెల్త్ కిట్ల పంపిణీ, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఇతర అధికారులతో సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్ష చేశారు.
కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, విద్యాశాఖ గురుకుల విద్యాలయాల్లో మొత్తంగా 1, 03,000 మంది విద్యార్థులున్నారని, వీరందరికీ ఈ నెల 9వ తేదీలోపు హెల్త్ కిట్లను పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. హెల్త్ కిట్లను నాలుగు దఫాలుగా 12 నెలలకు సరిపడే విధంగా మూడు నెలలకొకసారి పంపిణీ చేయాలన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల వారిగా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, స్పెషల్ ఆఫీసర్లతో సమీక్ష సమావేశాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి కడియం శ్రీహరి సూచించారు. సమావేశంలో విద్యాశాఖ సంచాలకులు కిషన్, విద్యాశాఖ సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ కుమార్, చీఫ్ ఇంజనీర్ మల్లేషం, కేజీబీవీల డైరెక్టర్ శ్రీహరి, మోడల్ స్కూల్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ శేషుకుమారి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

సావిత్రి  బాయిపూలే జయంతి జనవరి 3 ను భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నామంటే ఆమె గొప్పతనం మనంతెలుసుకోవలసిందే....మనదేశంలో మొదటి మహిళా ఉపాధ్యాయురాలు, మహిళలకు మొదటిపాఠశాల స్ధాపించిన, సంఘ సంస్కర్త సావిత్రీబాయి పూలే.  మన రాష్ట్ర ప్రభుత్వం ఈమె జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభకల ఉత్తమ ఉపాధ్యాయినల సత్కారం విశాఖపట్టణంలో ఏర్పాటుచేయడం అన్ని జిల్లాకేంద్రాలనుండి మహిళా ఉపాధ్యాయునులను విశాఖ తీసుకురావడానికి యస్ యస్ ఏ ద్వారా ఏర్పాట్లు చేయడం ముదావహం. అవార్డలుపొందుతున్న మనసోదరీమణులందరికీ యస్ .టి.యు. అభినందన మందారాలనర్పిస్తుంది.
      అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రాహ్మణవాద సంప్రదాయాలను, ఆధిపత్యవర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా  పాఠశాలలు ప్రారంభించి,12 మే 1848న దేశంలో బహుజనులకు మెుట్టమెుదటి పాఠశాల ప్రారంభించిన సంస్కర్త సావిత్రిబాయి ఫూలే  .ఈమె భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని మరియు రచయిత్రి. ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫులేభార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆమె ఆధునిక విద్య  ద్వారానే స్ర్తీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన సావిత్రిబాయి భర్తతో 1848 జనవరి 1న పూణేలో మొట్టమొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది.కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ  సామాజిక  బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం ఫణంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసారు.

ఆమె మహారాష్ట్ర సతారా జిల్లాలో నయాగావ్‌ అనే గ్రామంలో 1831 జనవరి 3 న జన్మించింది. ఆమెది రైతుకుటుంబం. సావిత్రి బాయి కుటుంబానికి తెలంగాణ ప్రాంతంతో బంధుత్వం ఉంది. వీరి బంధువులు నిజామాబాద్ జిల్లా లో బోధన్ నాందేడ్ కొండల్ వాడి ప్రాంతంలో , అదిలాబాద్ చుట్టుపక్కల ఉన్నరు. బోధన్ ప్రాంతపు మున్నూరుకాపులు వీరికి చుట్టాలు. సావిత్రి బాయి తన 9వ యేట 12 యేండ్ల జ్యోతిరావు ఫూలెను 1840లో వివాహమాడారు. ఆ దంపతులకు స్వంత పిల్లలు లేరు. కానీ ఆ జంట యశ్వంతరావు (బ్రాహ్మణ వితంతువు కుమారుడు) ను దత్తత తీసుకున్నారు."జ్యోతీరావు ఫూలె" ప్రోత్సాహంతోనే ఇంట్లోనే అక్షరాభ్యాసం చేసి విద్యావంతురాలైంది. అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, బ్రాహ్మణవాద సంప్రదాయాలను, ఆధిపత్యవర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలలు ప్రారంభించి,12 మే 1848న దేశంలో బహుజనులకు మెుట్టమెుదటి పాఠశాల ప్రారంభించారు. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె. కేవలం 4 సంవత్సరాలలోనే గ్రామీణ ప్రాంతాల్లో 20 పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యనందించారు. 1848 లోనే దేశంలొ విద్యా ఉద్యమం ప్రారంభించిన మెుదటి మహిళ ఉపాద్యాయురాలు , దళితుల, స్త్రీల విద్యా ్యా వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమే. వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఆమె ఆధిపత్య కులాల వారి నుంచి అనేక దాడులను, అవమానాలను ఎదుర్కొంది.ఈ నేపథ్యంలోనే 1849లో పూలే, సావిత్రీబాయి దంపతులను గృహ బహిష్కారానికి గురిచేశారు. ఆమె మానవ హక్కుల గురించి ఇతర సామాజిక సమస్యల గురించి స్ర్తీలను చైతన్యపరచడానికి 1852లో మహిళా సేవామండల్‌ అనే మహిళా సంఘన్ని కూడా స్థాపించింది. జెండర్‌ సమస్యలకు తోడుగా, కుల పితృస్వామ్య వ్యవస్థల అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం ఈ సంస్థ కృషిచేసింది. మహిళా హక్కులే మానవ హక్కులని తొలిసారిగా నినదించినది సావిత్రిబాయి ఫూలే. అసత్యాలతో, అగ్రవర్ణ దురహంకారపు నిచ్చెనమెట్ల కులవ్యవస్థగా నిర్మాణమైన సమాజంలో "సత్యాన్ని" శోధించడానికి 1873 లో తన భర్త మహత్మా పూలేతో కలసి "సత్యశోధక్ సమాజ్ "ను ప్రారంభించి బాల్యవివాహలకు, మూడనమ్మకాలకు, సతీసహగమనానికి వ్యతిరేఖంగా మరియు వితంతువు పునఃర్వివాహల కొరకు అసమాన బ్రాహ్మనిజ వ్యవస్థకు వ్యతిరేఖంగా బలమైన ఉధ్యమం నడిపారు. బాల్యంలోనే వైధవ్యాన్ని అనుభవించే ఎంతో మంది ఆడపిల్లలకు అన్నం పెట్టి ఆశ్రయం కల్పించారు. గర్భవతులైన వారికి పురుళ్లు పోసి వారి కళ్లల్లో వెలుగు చూసారు. అలా పురుడు పోసుకుని తన వద్దేవదిలేసి పోయిన ఓ బిడ్డను అక్కున చేర్చుకున్నారు.యశ్వంత్ గా నామకరణం చేసి తమ ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా పెంచి పెద్ద చేసారు. వితంతువులకు శిరోముండనం చేయడాన్ని తీవ్రంగా ఖండించి, క్షురకులను చైతన్యపర్చి, వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకుల చేత 1860లో సమ్మె చేయించారు సావిత్రీబాయి. తరువాత 1873 సెప్టెంబరు 24న ‘‘సత్యసోధక్‌ సమాజ్‌’’ అనే సామాజిక, ఆధ్యాత్మిక సంస్థను ప్రారంభించి, సత్యసోధన కోసం ఉద్యమాన్ని నడిపారు పూలే. ఈ సత్యసోధక్‌ సమాజ్‌ మహిళా విభాగం సావిత్రీబాయి నేతృత్వంలో నడిచేది. వివాహాలు వంటి శుభ కార్యాలను పురోహితులు లేకుండా నిర్వహించే విధానాన్ని ఈ సంస్థ ప్రారంభించింది. 1873 డిసెంబరు 25న భార్యను కోల్పోయిన ఒక యువకునికి తన స్నేహితురాలి కుమార్తెతో సత్యసోధక్‌ సమాజ్‌ ఆధ్వర్యన సావిత్రీబాయి వివాహం జరిపించారు.1868 నుంచి సావిత్రీబాయి అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడారు. 1870లో ఒకసారి 1896లో మరోసారి దేశంలో తీవ్ర దుర్భిక్షం ఏర్పడినప్పుడు ఫూలే దంపతులు చేసిన కృషి అనన్య సామాన్యం. కరువు వాతపడిన కుటుంబాలలోని అనాధ బాలలను దాదాపు 2,000 మందిని అక్కున చేర్చుకున్నారు. తమ పాటశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ప్రారంభించినారు. సావిత్రిబాయి సంఘ సంస్కర్తగానే గాదు, రచయిత్రిగా కూడా వేగుచుక్కగా నిలిచారు. 1854లోనే ఆమె తన కవితాసంపుటి ‘కావ్యఫూలే’ను ప్రచురించింది. మరో కవితా సంపుటి ‘పావన కాశీ సుభోధ్‌ రత్నాకర్‌’ను 1891లో ప్రచురించింది. ఆమె ఉపన్యాసాల్లో కొన్ని 1892లో పుస్తకరూపంలో వచ్చాయి.
జ్యోతీరావుపూలే. 1890 నవంబరు 28న మరణించడంతో సావిత్రీబాయి అంతులేని దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఈ దుఃఖంలోనుంచే మరో ఆదర్శానికి శ్రీకారం చుట్టారు. తన భర్త పూలే చితికి తానే స్వయంగా నిప్పుపెట్టి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. భారతదేశ చరిత్రలో భర్త చితికి భార్య నిప్పు పెట్టిన తొలి సంఘటన ఇది. ఫూలే మరణాంతరం సత్యసోధాక్ సమాజ్ భాద్యతనీ స్వీకరించి నడిపించింది. 1897 లో ప్లేగు వ్యాధి, పూణేనగరాన్ని వణికించింది. నగరమంతా ఎడారిగా మారింది. జనమంతా దగ్గర్లోని అడవుల్లోకి పారిపోయారు. అయినా సావిత్రీబాయి పూలే కొడుకు యశ్వంత్ తోకల్సి వ్యాధిగ్రస్తులకు సేవ చేసారు.

ప్లేగు వ్యాధి సోకిన మాంగ్ లాంటి దళిత కులాలకి చెందిన దళిత చిన్నపిల్లలని తన చంకన వేసుకొని చికిత్స చేసి కాపాడింది. చివరికి ఆ ప్లేగు వ్యాధే ఆమెకి సోకి మార్చి 10, 1897 లో కబళించింది. ఆమె దత్తపుత్రుడు యశ్వంత్‌ అంత్యక్రియలు జరిపించిండు. సావిత్రి బాయి జయంతిని భారతదేశ మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము... శుభాకాంక్షలతో.....

No comments:

Post a Comment