AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Tuesday 2 January 2018

చరిత్రలో ఈ రోజు జనవరి 3 2018


*🌹చరిత్రలో ఈ రోజు/జనవరి 3*🌹

*🕘సంఘటనలు*🕘

*💚1985: రవిశాస్త్రి  ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు సాధించి ఈ ఘనత పొందిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించాడు.*

*💚1999: ఐరోపా లోని 11 దేశాల్లో కార్పొరేట్లు, పెట్టుబడుల మార్కెట్లలో యూరోను ప్రవేశపెట్టారు.*

*💚2003: ఆంధ్ర ప్రదేశ్ గవర్నరుగా సూర్జీత్ సింగ్ బర్నాలా నియమితులయ్యాడు.*

*❣జననాలు*❣

*💚1831: సావిత్రి బాయి ఫూలే, భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని మరియు రచయిత్రి.*

*💚1892: జె.ఆర్. ఆర్.టోల్కీన్, ప్రఖ్యాతుడైన ఆంగ్ల రచయిత, కవి, భాషా చరిత్ర అధ్యయనకారుడు. (మ.1973)*

*💚1903: నిడుదవోలు వేంకటరావు, సుప్రసిద్ధ సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1982)*

*💚1921 : ప్రముఖ భారతీయ సినిమా దర్శకుడు కథా రచయిత చేతన్ ఆనంద్జననం.(మ. 1997)*

*💚1948: ఐతా చంద్రయ్య: తెలంగాణా ప్రాంతానికి చెందిన కవి,రచయిత.*

*💚1981 : ప్రముఖ భారతీయ సినిమా నేపధ్య గాయకుడు నరేష్ అయ్యర్‌జననం.*

*💚1986: అస అకీరా, అమెరికన్ నీలి చిత్రాల నటీమణి.*

*💚1986: నవనీత్ కౌర్, మలయాళ సినిమా నటి. కొన్ని తెలుగు సినిమాలలో నటించింది.*

*🍃మరణాలు*🍃

*💚1984: బ్రహ్మ ప్రకాష్, ప్రసిద్ధ మెటలర్జిస్టు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత (జ.1912)*

*💚1986: క్రొవ్విడి లింగరాజు, స్వాతంత్ర్య సమర యోధులు, రచయిత. (జ.1904)*

*💚1987: కోగంటి రాధాకృష్ణమూర్తి, ప్రముఖ రచయిత, సంపాదకుడు, హేతువాది. (జ.1914)*

*💚1993: డి. రామలింగం, ప్రముఖ రచయిత. (జ.1924)*

*💚2000: అల్లం శేషగిరిరావు, ప్రముఖ తెలుగు కథారచయిత. (జ.1934)*

*💚2002: సతీష్ ధావన్, భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు, ఇస్రో మాజీ ఛైర్మన్ (జ.1920)*

*💚2013 : ప్రముఖ వాయులీన విద్వాంసుడు ఎం.యస్. గోపాలకృష్ణ మరణం (జ. 1931).*

*🇮🇳జాతీయ దినాలు*🇮🇳

*🌷మహిళా టీచర్స్ డే*


ఫాదర్‌ ఆఫ్‌ ఇంటర్నెట్‌' అని ఎవరిని అంటారు?
- అంతర్జాలం (ఇంటర్నెట్‌)
                  సమాచారాన్ని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి అత్యంత వేగంగా పంపడానికి ఉపయోగించే సాంకేతిక విధానాన్ని ఇంటర్నెట్‌ అంటారు. మొట్టమొదటిగా అమెరికాలో 1960 సంవత్సరంలో  'ARPANET' అనే పేరుమీద రక్షణ అవసరాల కోసం ఇంటర్నెట్‌ను ఏర్పాటుచేశారు. వింట్‌సెర్ఫ్‌, రాబర్ట్‌ కాన్‌ అనే శాస్త్రవేత్తలు దీనిని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చారు. అందువల్ల వీరిద్దరినీ 'ఫాదర్‌ ఆఫ్‌ ఇంటర్నెట్‌' అంటారు. దీనిని ఉపయోగించి సమాచారాన్ని అత్యంత వేగంగా, సులువుగా అక్షరాల రూపంలో, చిత్రాలు, వీడియోలు, ఆడియోల రూపంలో ఇతరులకు చేరవేయవచ్చు. 
- ఇంటర్నెట్‌ వల్ల ఉపయోగాలు : సమాచారం ప్రతిఒక్కరికీ అందుబాటులోకి రావడం వల్ల పరిశోదన అనేది చాలా సులభంగా మారింది. ఒకరితో ఒకరు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం అత్యంత తేలికగా మారింది. మనకు పరిచయం లేని వ్యక్తులనుంచి కూడా సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి సరైన అవకాశం మనకు లభిస్తుంది. డిజటల్‌ రూపంలో సమాచారాన్ని ముద్రించి సరఫరా చేయడానికి వీలు కల్పిస్తుంది. కాబట్టి పేపర్‌ను పొదుపు చేయగల వీలు లభించింది. వ్యాపార రంగంలో వివిధ సంస్థల గురించి విస్తృత ప్రచారానికి ఒక ప్రధాన సాధనంగా ఉంది.
- ఇంటర్నెట్‌ వల్ల నష్టాలు : కంప్యూటర్‌ల యొక్క వైరస్‌లకు, వాటి వ్యాప్తికి ప్రధాన కారణం ఇంటర్‌నెట్‌. సైబర్‌నేరాలు పెరిగిపోయి. క్రెడిట్‌, డెబిట్‌ కార్డునెంబర్ల చౌర్యం, మోసం వంటి వాటికి అవకాశం చిక్కింది. ఇంటర్నెట్‌లో లభించే సమాచారం ఒక్కోసారి సరైనది కాకపోవచ్చు. ఇ-మెయిల్‌ ద్వారా ఒకచోట నుంచి మరోచోటుకి వెళ్లే మెసేజ్‌లు హాకింగ్‌కు గురయ్యే అవకాశం ఉంది. దీని వల్ల భద్రతకు ముప్పు కలిగే అవకాశం ఏర్పడుతుంది.
కంప్యూటర్‌ నెట్‌వర్క్‌ల రకాలు 
1. LAN ( Local Area Network ): LAN అనేది ఒక చిన్న సింగిల్‌ సైట్‌ నెట్‌వర్క్‌. తక్కువస్థాయి ఉన్నటువంటి చిన్న భౌగోళిక పరిధిలో ఉపయోగపడుతుంది. అంటే ఇల్లు, ఆఫీసు, బిల్డింగ్‌, స్కూలు వంటి ఒక కిలోమీటరు కంటే తక్కువ పరిధిలో ఉండే ప్రాంతాల్లో పరికరాలను ఒకదానితో ఒకటి కలిపి ఉపయోగిస్తారు. దీనిలో అన్ని టెర్మినల్‌లూ ప్రధానమైన కంప్యూటర్‌కు అనుసంధానించి ఉంటాయి. ఈ ప్రధాన కంప్యూటర్‌ను ' సర్వర్‌' అంటారు. సాధారణంగాLAN  లో డాటా ట్రాన్స్‌ఫర్‌ రేటు 10 నుంచి 100 MBPS (Mega bits per second) గా ఉంటుంది.
2.W-Lan (Wireless LAN) : సమాచార సరఫరా కోసం రేడియో తరంగాలను ఉపయోగించే LAN వ్యవస్థనే W-Lan అంటారు. ఈ వ్యవస్థను నెలకొల్పడానికి wi-fi (Wireless fidility) సాధనంగా ఉపయోగిస్తారు. ఈ  wi-fi  ద్వారా ఎటువంటి తీగెల సహాయం లేకుండా వైర్‌లెస్‌ పద్ధతిలో ఇంటర్నెట్‌ సదుపాయం అందించవచ్చు. ఇది రేడియోతరంగాల ఆధారంగా పనిచేస్తుంది.
3.WAN (Wide Area Network) : ఒక భౌగోళిక పరిథిలో ఉన్నటువంటి అనేక  LAN ల మొత్తాన్ని WAN అని అంటారు. LAN లన్నింటినీ WAN తో కలపడానికి 'రూటర్‌' అనే నెట్‌వర్క్‌ డివైస్‌ను ఉపయోగిస్తాం. దీనిలోపల టెలిఫోన్‌ లైన్స్‌, శాటిలైట్స్‌ లింకులు, ఇతర కమ్యూనికేషన్‌ టెక్నాలజీలను ఉపయోగిస్తారు.
4. MAN (Metropolitan Area Network)  : ఇది ఒక పట్టణం కోసం లేదా నగరం కోసం తయారుచేసిన డాట్‌నెట్‌వర్క్‌. ఇది LAN  కంటే పెద్ద విస్తృత స్థాయిలో ఉన్న భౌగోళిక ప్రదేశాన్ని WAN కంటే తక్కువ స్థాయి ప్రాంతాన్ని కలిగి ఉంటుంది. దీనికి ఉదాహరణగా 'కేబుల్‌ నెట్‌వర్క్‌' ను చెప్పవచ్చు.
6. PAN (Personal Area Network): చాలా తక్కువ పరిధి కలిగిన నెట్‌వర్క్‌. ఉదాహరణ బ్లూటూత్‌.
7.VPN (Virtual Private Network)   : అంతర్గత సమాచారాన్ని ఎక్కువ సంఖ్యలో ప్రసారం కోసం, దాని భద్రతకోసం ఉపయోగించే అధునిక టెక్నాలజీ. 
8.  Modem : Modem అనేది ఒక పరికరం. ఇది సమాచారాన్ని పంపేవారి దగ్గర డిజిటల్‌ సిగల్‌ని అనలాగ్‌సిగల్‌గా మారుస్తూ సమాచారాన్ని అందుకునే వారి దగ్గర అనలాగ్‌ సిగల్స్‌ను డిజటల్‌ సిగల్‌గా మారుస్తుంది. ఇలా మార్చడం అనేది ప్రత్యేక వైర్‌లైన్‌ లేదా టెలీఫోన్‌ లైన్‌ ద్వారా సమాచారాన్ని పంపే అవకాశం కలుగుతుంది. టెలిఫోన్‌ లైన్‌కు, కంప్యూటర్‌కు మధ్య ఈ మోడెమ్‌ను అనుసంధానించడం ద్వారా సిగల్‌ను మార్చి డిజటల్‌ సిగల్‌రూపంలో మనకు కనిపించేట్లు చేస్తుంది.
9. www : : దీనిని సృష్టించిన వ్యక్తి 'టిమ్‌ బెర్నర్స్‌లీ' దీని సేవలను మొదటిసారిగా 1991 ఆగస్టు 6న అందుబాటులోకి తెచ్చారు. ఒక కంప్యూటర్‌ నుంచి మరొక కంప్యూటర్‌కు ఫైల్స్‌ను ఇంటర్నెట్‌ ద్యారా అనుసంధానించడం. 'వరల్డ్‌ వైడ్‌ వెబ్‌'
కంప్యూటర్‌ భద్రత : కంప్యూటర్‌ భద్రతనే సైబర్‌ సెక్యూరిటీ లేదా ఐ.టి సెక్యూరిటీ అంటారు. కంప్యూటర్‌ల మధ్య జరిగేటటువంటి సమాచార రవాణాలలో భద్రతను కాపాడటమే దీని ప్రధాన లక్ష్యం.
- కంప్యూటర్‌ వైరస్‌ : కంప్యూటర్‌ పరిభాషలో వైరస్‌ అనగా 'వైటల్‌ ఇన్ఫర్మేషన్‌ రిసోర్సెస్‌ అండర్‌  సీజ్‌'. ఈ కంప్యూటర్‌ వైరస్‌ ఒక కంప్యూటర్‌ నుంచి మరొక కంప్యూటర్‌కు వేగంగా వ్యాప్తి చెందుతూ ఆ కంప్యూటర్‌ పనితీరులో జోక్యం చేసుకుంటూ ఇబ్బందిపెట్టే ఒక చిన్న సాప్ట్‌వేర్‌ ప్రోగ్రాం. ఇవి కంప్యూటర్‌ పనితీరును దెబ్బతీస్తాయి.1986లో సృష్టించిన మొట్టమొదటి పిసిబూట్‌ సెక్టార్‌ వైరస్‌ 'బ్రెయిన్‌'. 1971లో సృష్టించిన మొట్టమొదటి కంప్యూటర్‌ వైరస్‌ పేరు 'క్రీపర్‌'
- యాంటీవైరస్‌ : కంప్యూటర్‌లోకి చొరబడిన వైరస్‌ను వెతికి, దానిని తొలగించి మళ్ళీరాకుండా నిరోధించే కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌నే 'యాంటీవైరస్‌ ' అని అంటారు.
- ట్రాన్స్‌పాండర్స్‌ : వివిధ పౌనఃపున్యాల వద్ద తరంగాలను గ్రహించి, వాటిని ద్విగుణీకృతం చేసి, తిరిగి పంపే సాధనాలను ట్రాన్‌పాండర్స్‌ అంటారు. దీని విస్తృత రూపం ట్రాన్స్‌మీటర్‌ రెస్పాండర్‌. కమ్యూనికేషన్‌ శాటిలైట్‌ ఛానళ్లను ట్రాన్స్‌పాండర్స్‌ అంటారు. డిజటల్‌ వీడియో డేటా కంప్రెషన్‌, మల్టిప్లెక్సింగ్‌ విధానాలను ఉపయోగించి ఒక ట్రాన్‌పాండర్‌ ద్వారా ఒకే సమయంలో అనేక వీడియో ఆడియోలను ఒకే పౌనఃపున్యం వద్ద పంపించవచ్చు. ఇవి మూడు రకాల పౌనఃపున్య అవధులను కలిగి ఉంటాయి.
1. ఎస్‌-బాండ్‌ : దీని పౌనఃపున్య అవధి రెండు నుంచి నాలుగు హెర్జ్‌ల వరకూ ఉంటుంది. స్పేస్‌ షటిల్‌, ఇంటర్నేషనల్‌ స్పేస్‌ స్టేషన్‌తో కమ్యూనికేట్‌ కావడానికి ఆ పౌనఃపున్య అవధిని ఉపయోగిస్తారు. వాతావరణ రాడార్‌లు, ఉపరితల నౌకారాడార్‌లు, కమ్యూనికేషన్‌ శాటిలైట్స్‌ కూడా ఈ పౌనఃపున్య అవధిని ఆధారంగా చేసుకొని పనిచేస్తాయి.
2. సి-బాండ్‌ : వీటిని సాధారణంగా రేడియో టెలీకమ్యూనికేషన్‌లో ఉపయోగిస్తారు. మైక్రోవేవ్స్‌, విద్యుదయస్కాంత తరంగాల కలయికను ఉపయోగిస్తారు.
3. కెయు-బ్యాండ్‌ : వీటి పౌనఃపున్య అవధి 11.2 నుంచి 14.4 గిగాహెర్జ్‌గా ఉంటుంది. ఈ పౌనఃపున్యం విద్యుదయస్కాంత పట్టికలోని ఒక భాగం. దీనిని కమ్యూనికేషన్‌ ఛానల్‌లో ఉపయొగిస్తారు. డైరక్ట్‌ టు హోమ్‌ (డిటిహెచ్‌) లలోకూడా ఉపయోగిస్తారు. 
నాసావారు దీనిని ట్రాకింగ్‌ డాటా రిలే శాటిలైట్‌లలో ఉపయోగిస్తారు. శాటిలైట్‌ న్యూస్‌ సేకరణలో ఈ కెయు-బాండ్‌ను ఉపయోగిస్తారు.

*🤘 నేటి సుభాషితం🤘*

*సమయంతో పాటు పనిచేసేవాడు సమర్థుడు, సమయానుకూలంగా వ్యవహరించేవాడు విజేత.*

_*శుభోదయం*_    
        --------------------------
🌻 *మహానీయుని మాట* 🍁
        -------------------------
" వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు..!
చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే ఉండిపోతాడు..!! "
       --------------------------
🌹 _*నేటీ మంచి మాట*_ 🌹
      ---------------------------
" కాళ్లకు తగిలిన గాయం ఎలా నడవాలో నేర్పిస్తుంది..!
హృదయానికి తగిలిన గాయం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది..!! "

💟👣💟

👣నలుగురి కోసం
👣 నడిచే దారిలో 
👣నడక కష్టమైనా
👣 నడక ఆపకూడదు
👣 భవిష్యత్తులో అదే 
👣రాజబాట అవుతుంది

*🗓 నేటి పంచాంగం 🗓*

*తేది :  3, జనవరి 2018*
సంవత్సరం : హేవిళంబినామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : పుష్యమాసం
ఋతువు : హేమంత ఋతువు
కాలము : శీతాకాలం
వారము : బుధవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : విదియ
(ఈరోజు తెల్లవారుజాము 4 గం॥ 9 ని॥ నుంచి మర్నాడు తెల్లవారుజాము 0 గం॥ 40 ని॥ వరకు)
నక్షత్రం : పునర్వసు
(నిన్న ఉదయం 11 గం॥ 49 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 50 ని॥ వరకు)
యోగము : వైదృతి
కరణం : తైతిల
వర్జ్యం :
(ఈరోజు సాయంత్రం 3 గం॥ 56 ని॥ నుంచి ఈరోజు సాయంత్రం 5 గం॥ 21 ని॥ వరకు)
అమ్రుతఘడియలు :
(ఈరోజు ఉదయం 6 గం॥ 43 ని॥ నుంచి ఈరోజు ఉదయం 8 గం॥ 7 ని॥ వరకు)
దుర్ముహూర్తం :
(ఉదయం 11 గం॥ 57 ని॥ నుంచి ఉదయం 12 గం॥ 41 ని॥ వరకు)
రాహుకాలం :
(ఉదయం 12 గం॥ 19 ని॥ నుంచి మద్యాహ్నం 1 గం॥ 42 ని॥ వరకు)
గుళికకాలం :
(ఉదయం 10 గం॥ 56 ని॥ నుంచి ఉదయం 12 గం॥ 19 ని॥ వరకు)
యమగండం :
(ఉదయం 8 గం॥ 9 ని॥ నుంచి ఉదయం 9 గం॥ 32 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 6 గం॥ 46 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 5 గం॥ 53 ని॥ లకు
సూర్యరాశి : ధనుస్సు
చంద్రరాశి : కర్కాటకము

*💎 నేటి ఆణిముత్యం 💎*

ప్రారభ్యతే న ఖలు విఘ్నభయేన నీచైః
ప్రారభ్య విఘ్ననిహతా విరమంతి మధ్యాః ।
విఘ్నైః పునః పునరపి ప్రతిహన్యమానాః
ప్రారబ్ధముత్తమ జనా న పరిత్యజంతి ॥

*భావము :*

నీచులు ఏద‌న్నా ప‌నిని ప్రారంభించేందుకు కూడా సంశ‌యిస్తూ ఉంటారు. తాము త‌ల‌పెట్టే ప‌ని ఎక్క‌డ విఫ‌ల‌మ‌వుతుందో అన్న సంశ‌యంతో దానిని మొద‌లుపెట్ట‌నే పెట్ట‌రు. మ‌ధ్య‌ములు ప‌నిని ఎలాగొలా మొద‌లుపెడ‌టారు. కానీ ఏద‌న్నా విఘ్నం ఎదురుకాగానే అక్క‌డితో త‌మ ప్ర‌య‌త్నం నుంచి విర‌మించుకుంటారు. ఉత్త‌ములు అలా కాదు! ఎన్ని విఘ్నాలు ఎదురైనా, ఎన్ని క‌ష్టాలు ప‌ల‌క‌రించినా... అనుకున్న ప‌నిని పూర్తిచేసే వ‌ర‌కూ విశ్ర‌మించ‌రు.

*👬 నేటి చిన్నారి గీతం 👬*

*లాల లాల లాలలా*

లాల లాల లాలలా
లాల లాల లాలలా 
నేలమీద నింగిలోన 
గాలి తిరుగుతున్నది...
రార రార రారరా
రార రార రారరా 
నదులలోన పోలాల్లోన
నీరు నడుస్తున్నది...
పాప పాప పాపపా 
పాప పాప పాపపా 
చెట్టుమీద గుట్టమీద 
పక్షి ఎగురుతున్నది...
టాట టాట టాటటా
టాట టాట టాటటా
అమ్మకు నాన్నకు టాటా 
నేను బడికి పోతున్నా...

*✍🏼 నేటి కథ ✍🏼*

*ముందుచూపు*

ఒక అడవిలో చాలా పక్షులు కలిసి జీవిస్తూ ఉండేవి. ఆ అడవికి దగ్గర్లో ఉన్న పొలాలలో రైతులు రకరకాల పంటలు పండించేవారు. ఒకనాడు పక్షులు ఆకాశంలో ఎగురుతూ ఉండగా, క్రింద పొలంలో ఒక రైతు ఏవో గింజలు నాటుతూ కనబడ్డాడు. అన్ని పక్షులూ 'అది మామూలే' అనుకొని, తమ మానాన తాము ఎగురుకుంటూ‌వెళ్లిపోయాయి. కాని చురుగ్గా ఆలోచించే ఓ చిన్న పిచ్చుక మాత్రం ఆ పొలంలోకి దిగి, ఆ రైతు ఏం విత్తనాలు నాటుతున్నాడో గమనించింది జాగ్రత్తగా. భవిష్యత్తులో ఏం జరగబోతోందో ఆ పిచ్చుకకు అర్థమైపోయింది వెంటనే.

"ఆ రైతు తన పొలంలో జనప విత్తనాలు నాటుతున్నాడు. ఆ మొక్కల నుంచి వచ్చే నారతో తాళ్లనూ, వలలను తయారు చేస్తారు. ఆ వలలతో మన లాంటి పక్షులని, చేపలను పట్టుకుంటారు. అందుకని మనం వెంటనే ఆ పంటను నాశనం చేద్దాం పదండి " అని తెలివైన ఆ పిట్ట తన జట్టు పక్షులతో అంది.

కాని, దాని మాటలను ఏ పక్షీ వినిపించుకోలేదు. కొన్ని రోజులకు పొలంలో జనప మొలకలు వచ్చాయి.
"ఇప్పటికీ మించి పోయింది లేదు. ఇకనైనా మనం మేలుకోవాలి. వెంటనే ఆ పంటను నాశనం చేద్దాం పదండి" అన్నది పిచ్చుక.
"ఆ... ఇప్పుడే ఏం తొందరొచ్చింది?!" అంటూ మిగతా పక్షులు దాని మాటలు పెడచెవిన పెట్టాయి.
రోజు రోజుకూ మొక్కలు పెరగసాగాయి! కొంతకాలం గడిచాక, "ఇక లాభం లేదు" అని, తెలివైన ఆ పిచ్చుక అక్కడినుండి మరో ప్రాంతానికి వలస వెళ్లిపోయింది.

ఇంకొంతకాలానికి నిజంగా ఆ పిచ్చుక చెప్పినట్లే జరిగింది. కొందరు మనుషులు జనపనారతో వలలను చేసి, వాటితో పిట్టలను, చేపలను పట్టడం మొదలుపెట్టారు. పిచ్చుక హెచ్చరికను పెడచెవిన పెట్టిన పిట్టలన్నీ ఆ వలలో చిక్కుకొని పోయాయి, పాపం!!

*✅ తెలుసుకుందాం ✅*

*⭕జంతువులు, పక్షులు-ప్రకృతి వైపరీత్యాలను ఎలా పసిగడతాయి?*

✳జీవులన్నింటికీ పరిశీలన శక్తి, సామర్థ్యాలు ఒకే విధంగా ఉండవు. ఉదాహరణకి మనం వంద అడుగుల దూరంలో ఉన్న ఈగను చూడలేం. కానీ గద్ద వేల అడుగుల దూరంలో ఉండే జంతువును కూడా చూడగలదు. భూకంపాలు, తుపాన్లు, సునామీలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు ఒక్క ఉదుటన ఏ విధమైన ముందస్తు సంకేతాలు లేకుండా రావు. అలాంటి సందర్భాల్లో ప్రకృతిలో చోటు చేసుకునే సున్నితమైన మార్పుల్ని కొన్ని పక్షులు, జంతువులు గ్రహించగలుగుతాయి. ఉదాహరణకు గాలిలో కలిగే మార్పులు, భూమిలో ఏర్పడే కంపనాల్ని, వాతావరణంలో హఠాత్తుగా మారే తేమ శాతం లాంటి వివరాలను అవి గుర్తించగలుగుతాయి. తద్వారా అవి ప్రకృతి వైపరీత్యాలను కొంత మేరకు ముందే పసిగట్టగలవు. అలాగని 2 సంవత్సరాల తర్వాతో, రెండు నెలల తర్వాతో రాబోయే వాటిని అవి కూడా గుర్తించలేవు.

*🌷💐మహిళా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలతో... 💐🌷*

 *👩🏻‍🏫ఆధునిక భారత చరిత్రలో ధృవతార సావిత్రీబాయి ఫూలే👩🏻‍🏫*

భారతదేశంలో ప్రముఖ సంఘ సంస్కర్తలలో సావిత్రీబాయి ఫూలే ఒకరు. ఆమె దేశంలో తొలి ఆదర్శ ఉపాధ్యాయిని. బ్రిటిష్ పాలన నాటి ప్రజల స్థితిగతులు, విద్య, సాంఘిక దురాచారాలు, సతీ సహగమనం, బాల్య వివాహాలు సావిత్రీబాయిని కదిలించాయి. మహారాష్ట్రలో సతారా జిల్లాకు చెందిన నయ్‌గావ్‌లో 1831వ సంవత్సరం జనవరి 3వ తేదీన సావిత్రీబాయి జన్మించింది. ఈమెది కూడా బాల్య వివాహమే. ఆమె వివాహం సంఘసంస్కర్త జ్యోతిరావు ఫూలేతో జరిగింది. వివాహానంతరం సావిత్రీబాయికి విద్యాభ్యాసం చేసి ఉపాధ్యాయ శిక్షణ ఇప్పించారు. కుల వ్యవస్థ నిర్మూలనకు, పీడిత ప్రజానీకం పట్ల ఆమె మనసులో ఆలోచనలను గుర్తించిన జ్యోతిరావు ఫూలే బాలికల పాఠశాల ప్రారంభించడానికి ప్రయత్నం చేశారు.

 1848వ సంవత్సరంలో మహారాష్ట్రలోని పుణే లో ఒక ఇంట్లో బాలికల పాఠశాలను సావిత్రీబాయి ప్రారంభించింది. ఆమె ప్రధానోపాధ్యాయినిగా 9 మంది పిల్లలతో బడి నడిపేది. ఈ పాఠశాల నడపటం ఉన్నత, అగ్రవ ర్ణాలకు నచ్చలేదు. దీంతో సావిత్రీ బాయిపై వేధింపులకు, భౌతికదాడు లకు పూనుకున్నారు. పాఠశాలకు నడిచే దారిలో ఆమెపై బురద చల్ల డం, రాళ్లు విసరడం, అసభ్య పదజా లాన్ని వాడటం వంటివి చేశారు. బుర దతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తరువాత మార్చుకుని, మరల వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది. ఎవరైనా అడిగిన ప్పుడు ధైర్యంగా ‘నా విధిని నేను నిర్వహిస్తున్నాను’ అని చెప్పేది. అయినా రోజూ వేధింపులకు విసిగి ఒకరోజు ఒకడి చెంప పగులకొట్టింది.

 పట్టు వీడక వారు సాగించిన విద్యా ఉద్యమా నికి తక్కువ కాలంలోనే సహకారం గుర్తింపు లభిం చాయి. ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడికి కేటా యించాడు. కొంత మంది పుస్తకాలు సేకరించారు. మోరోవిఠల్, వాల్వేకర్, దియోరావ్ వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహ ణకు సహకరించారు. 1851లో మరల పాఠశాల ప్రారంభించారు. బాలికల చదువు కోసం, విద్యాభి వృద్ధి కోసం సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఈ కృషిని గుర్తించిన ఆనాటి ప్రభుత్వం 1851, నవంబర్ 16న విద్యాశాఖ ఆధ్వర్యంలో శాలు వాలతో ఘనంగా సత్కరించింది.

 తన జీవితాన్ని త్యాగం చేసి విద్యాబోధనకు, బాలికలకు అంకిత మైంది. సాంఘిక దురాచారాల నిర్మూలన కోసం పెద్దలతో ఘర్షణ పడవలసివచ్చినా బెదరలేదు. వితంతువులకు శిరోముండనం చేయబోమంటూ క్షురకులను చైతన్యవంతులను చేసింది. అనాథ స్త్రీలకు, పిల్లలకు శరణాలయాలు, ఆశ్రమాలు ఏర్పా టు చేయించింది. సత్యశోధక సమాజంలో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసి కులాంతర వితంతు వివాహాలు జరిపించింది. 1890లో భర్త జ్యోతిరావు ఫూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు, దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే తానే చితికి నిప్పు అంటించి అంత్యక్రియలు పూర్తి చేసిం ది. ఆమె తెగువకు యావత్ భారతదేశం దిగ్భ్రాంతి చెందింది.

సామాజిక సేవలో అంతిమశ్వాస
 1890వ దశకంలో ప్లేగు వ్యాధి బారినపడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది. దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2 వేల మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది. 1897వ సంవత్స రం, మార్చి 10న ఒక పిల్లవాడికి సేవ చేస్తుండగా ఆమెకు ఆ వ్యాధే సోకి మరణించింది. క్రాంతి బాయిగా ప్రజలందరూ పిలుచుకునే సావిత్రీబాయి ఫూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ధృవతారగా వెలుగొందుతూనే ఉంటుంది.

 *సావిత్రి బాయి స్ఫూర్తి...*

స్త్రీ సాధికారత కోసం, వారి హక్కుల కోసం కృషి చేసిన సావిత్రి బాయి జీవితం ఆదర్శప్రాయం. వారు చూపిన మార్గాన్ని అనుసరించడమే వారికి మనం ఇచ్చే నివాళి.

సావిత్రిబాయి ఫూలే దేశంలో సామాజిక చైతన్యాన్ని, స్త్రీ చైతన్యాన్ని కలిగించిన వారిలో ముఖ్యులు. మహారాష్ట్రలో సతారా జిల్లాలో జనవరి 3న జన్మించిన సావిత్రి బాయికి తొమ్మిదేళ్ల వయసులోనే జ్యోతిరావు ఫూలేతో వివాహం అయింది. మహాత్మా జ్యోతి బా ఫూలే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, మానవహక్కులు వంటి భావనలు విద్య ద్వారానే సాధ్వమవుతాయని బలంగా విశ్వసించారు. ఫూలే ప్రోత్సాహంతోనే సావిత్రిబాయి చదువుకున్నారు. ఆరోజుల్లో అణగారిన వర్గాలకు, స్త్రీలకు చదువుకోవడానికి పాఠశాలలు ఉండేవి కావు. అందుకే సావిత్రి బాయి పెళ్లికి ముందు మూడవ తరగతి వరకే చదివారు. పెళ్లి తర్వాత జ్యోతిబా ఫూలే చొరవతో తిరిగి చదువు కొనసాగించారు. అంతేకాదు ఫూలే ఆమె చదువుకునే అవకాశం కల్పించడమే కాదు ఆమె చదువు పదిమందికి ఉపయోగపడేలా టీచర్ ట్రైనింగ్ కూడా ఇచ్చారు. 

అలా సావిత్రి బాయి తాను విద్య నేర్చుకుని, పదిమందికి నేర్పించారు. ఈ విధంగా సావిత్రి బాయి ఈ దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు అయ్యారు. సమాజంలో స్త్రీలు అన్నిరంగాల్లో ముందుండాలని, స్త్రీలు చదవగలరు, రాయగలరు, పోరాటం చేయగలరని నిరూపించిన దార్శనికురాలు సావిత్రి బాయి ఫూలే. అట్టడుగు వర్గాలకు చదువు చెప్పడానికి వెళ్లేటప్పుడు ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. ఫూలే దంపతులు మహారాష్ట్రలో బలమైన సామాజిక ఉద్యమాలను నిర్మించారు. మహారాష్ట్రలో అణగారిన వర్గాల వారు నివసించే ప్రాంతాల్లో మొదట పాఠశాలలు ప్రారంభించారు. తర్వాత ఆడ పిల్లల కోసం కూడా ప్రత్యేక పాఠశాలలను పూలే దంపతులు ఏర్పాటు చేశారు. 

వారు స్థాపించిన పాఠశాలలో నాడు విద్యకు నోచుకోని స్త్రీలు, అణగారిణ వర్గాల విద్యార్థులు ఎంతో మంది చదువుకున్నారు. సావిత్రిబాయి అట్టడుగు వర్గాలకు విద్య నేర్పించడానికి అగ్రకులాల వారు సహించలేకపోయారు. ఆమెను అనేక అవమానాలకు గురిచేశారు. ఆమెపై కోడిగుడ్లు, టమాటాలు, బురద, రాళ్లు విసిరేవారు. వారి చర్యలతో విసుగు చెందిన సావిత్రి ఉద్యోగం మానాలని భావించారు. అయితే భర్త ఇచ్చిన ప్రోత్సాహంతో సావిత్రి బాయి పోరాటాన్ని వదిలిపెట్టలేదు. ఏ సమాజం సంకెళ్లు విధించిందో వాటిని తెంపి స్త్రీ విద్య, వారి హక్కుల కోసం నిరంతరం ఉద్యమించారు. 

సావిత్రి బాయి అణగారిని వర్గాల వారినేకాకుండా బ్రాహ్మణ స్త్రీలకు కూడా ఆదరించారు. అగ్రవర్ణాల్లోని వితంతువులను చేరదీశారు. వారికి కొత్త జీవితాలను ప్రసాదించారు. వితంతువుల కోసం, వారి పిల్లల కోసం జ్యోతిరావు శరణాలయాలను స్థాపించారు. ఇందులో కూడా సావిత్రిబాయి తన సేవలు అందించారు. జ్యోతిరావు ఫూలే 1837లో సత్యశోధక సమాజం ఏర్పాటు చేశారు. అందులో భర్తతో పాటు సావిత్రి బాయి క్రియాశీలయంగా పాల్గొన్నారు. 1876-77,1896-97లో మహారాష్ట్రలో కరువు కాటకాలు సంభవించాయి. అప్పుడు ఉచిత భోజన వసతి హాస్టళ్లను ఏర్పాటు చేయాలని, కరువు నివారణ కోసం తక్షణ చర్యలు చేపట్టాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ సమయంలో సత్యశోధక్ సమాజ్ చేసిన సేవ, ముఖ్యంగా సావిత్రిబాయి చేసి సేవ చిరస్మరణీయం.

దేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు, మొట్టమొదటి సామాజిక ఉద్యమకారిణి సావిత్రిబాయి ఫూలేనే. తన రచనల ద్వారా ఆనాటి సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలను బద్దలు కొట్టారు. తన భర్త మహాత్మా జ్యోతిబా ఫూలే 1890లో మరణించినా ఆయన ప్రారంభించిన కార్యక్రమాలను కొనసాగించారు. 1890లో పుణె పరిసర ప్రాంతాల్లో ప్లేగు వ్యాధి ప్రబలింది. ఆమె వ్యాధి బారిన పడిన వారికి సేవలు చేసింది. స్త్రీలకు ఆదర్శంగా నిలిచారు. ప్లేగు వ్యాధిగ్రస్తులకు సేవ చేస్తూ ఆ వ్యాధి బారిన పడిన సావిత్రి బాయి 1897 మార్చి 10న మరణించారు.

సమాజంలో ఉన్న అసమానతలు రూపుమాపాలంటే విద్యా ద్వారానే అది సాధ్యమౌతుందని ఫూలే దంపతులు భావించారు. అలాగే నాడు వ్యవస్థలో గూడుకట్టుకున్న అనేక మూఢనమ్మకాలను పారదోలాలంటే విద్య ఒక పరిష్కారం అని చాటిచెప్పారు. స్త్రీ సాధికారత కోసం, వారి హక్కుల కోసం కృషి చేసిన సావిత్రి బాయి జీవితం ఆదర్శప్రాయం. వారు చూపిన మార్గాన్ని అనుసరించడమే వారికి మనం ఇచ్చే నివాళి.

*🙏పాఠశాల అసెంబ్లీ కోసం*🙏

 *♦సుభాషిత వాక్కు*♦

*లక్ష్యం పట్ల ఉన్న స్థిరత్వం పైనే   గెలుపు రహస్యం దాగుంటుంది.*

*"We believe in ordinary acts of bravery, in the courage that drives one person to stand up for another."*

*🌷మంచి పద్యం*

*చెట్టు మనకు ఇచ్చు చిరకాల మోదము*
*చెరపు చేయవద్దు చెట్టు కొట్టి*
*చెట్లు కేకపోతే జీవమే లేదులే*
*వాస్తవంబు వేమువారి మాట*

*❗భావం:-*

*వృక్షాల వలన సదా మనకు ఆనందం కలుగుతుంది. అటువంటి వాటిని నాశనం చేయవద్దు. ఈ జగతిన చెట్టు లేనిచో ఏ జీవి జీవించలేదు.*

*♦నేటి జీ కె♦*

*1) దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు మహాత్మాగాంధీప్రచురించిన పత్రిక ఏది?*

*జ: ఇండియన్‌ ఒపీనియన్‌*

*2)  ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?*

*జ: సెప్టెంబర్‌ 21*

*3) .గ్రెగర్‌ మెండర్‌ శాస్త్రీయ పరిశోధనలను ఏ మొక్కలపై చేశాడు?*

*జ:  బఠానీలు*

*4) మంచినీటి సరఫరా చేసే కల్పసర్‌ ప్రాజెక్టు ఎక్కడ ఉంది?*

*జ:  గుజరాత్‌*

*5) వాయు మరియు సముద్ర ప్రయాణ దూరాలను నాటికల్‌ మైళ్ళలో కొలుస్తారు. ఒక నాటికల్‌ మైల్‌ దేనికి సమానము?*

*జ: 1.85200 కి.మీ.*

*6) .భారతదేశ అతిపెద్ద కుటీర పరిశ్రమ ఏది?*

*జ: చేనేత పరిశ్రమ*

*6) .రాజస్థాన్‌లోని రాణా ప్రతాప్‌ సాగర్‌ ఆనకట్ట ఏ నదిపై కట్టబడింది?*

*జ: చంబిల్‌*

*🔷భయం ఉంటేనే వ్యవస్థ బాగుంటుంది*

♦ పబ్లిక్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ పెద్ద ఎత్తున జరుగుతుండటంపై ఉమ్మడి హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.

♦ మాస్‌ కాపీయింగ్‌ నేపథ్యంలో విద్యా ప్రమాణా లు పడిపోతున్నాయంది. *మాస్‌ కాపీయింగ్‌కు సహకరించే ఉపాధ్యాయులు విద్యార్థులకు దేవుళ్లుగా, సహకరించనివారు దెయ్యాల్లా కనిపి స్తున్నారని* వ్యాఖ్యానించింది. తక్కువ మార్కు లు వచ్చినా పర్వాలేదు.. *నిజాయితీగా ఆ మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తున్న తల్లిదం డ్రులు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించింది. మాస్‌ కాపీయింగ్‌కు అందరూ బాధ్యులేనంది.*

♦గతేడాది 10వ తరగతి పరీక్షల సందర్భంగా మాస్‌ కాపీయింగ్‌కు సంబంధించి తెలంగాణలో 4 కేసులు, ఏపీలో ఓ కేసు మాత్రమే నమోదవడంపై విస్మయం వెలిబుచ్చింది. పబ్లిక్‌ పరీక్షల చట్టం–1997 కింద కేసులు నమోదు చేయడంతోపాటు ప్రాసిక్యూషన్‌ చేస్తేనే పరిస్థితులు దార్లోకి వస్తాయని స్పష్టం చేసింది. *‘‘భయం ఉంటేనే వ్యవస్థ బాగుపడుతుంది. ఫెయిలైతే ఏమవుతుంది.. ఓ సంవత్సరం లేటవుతుంది.. ఇందుకోసం అడ్డదార్లు తొక్కా ల్సిన అవసరమేముంది?’’* అని వ్యాఖ్యానిం చింది.

♦మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా ఏదో ఒకటి చేయాల్సిన అవసరముందంటూ ఇందు కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపా లని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.

♦ ఉభయ రాష్ట్రాల్లోని మాస్‌ కాపీయింగ్, పుస్తకాలు పెట్టి రాస్తున్న రాతల్ని అడ్డుకోవడంలో విద్యాశాఖాధి కారులు దారుణంగా విఫలమవు తున్నారని, మాస్‌ కాపీయింగ్‌ను అడ్డుకునేందుకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పర్యవేక్షించేలా ఆదేశాలివ్వాలంటూ ఏలూరుకు చెందిన ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ గుంటుపల్లి ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. దీన్ని ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది.

♦తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఏపీ న్యాయవాది పేర్కొంటూ విచారణను సంక్రాంతి సెలవుల తర్వాత చేపట్టాలని కోరారు.

♦ ధర్మాసనం స్పందిస్తూ.. మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన ఘటనల్లో ఎన్ని కేసులు నమోదు చేశారు.. ఎంతమందిని ప్రాసిక్యూట్‌ చేశారో చెప్పాలంది. ఏపీలో ఓ కేసు, తెలంగాణలో నాలుగు కేసులు నమోదు చేసినట్లు తెలుసుకున్న ధర్మాసనం విస్మయం వెలిబుచ్చింది. చట్టాన్ని ఎందుకు సక్రమంగా అమలు చేయట్లేదని ప్రశ్నించింది. 

♦సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి నిర్వహణ పెద్ద ఆర్థిక భారమేనని, కాబట్టి ఈ ఆర్థిక భారాన్ని మోయాలని ప్రభుత్వాలను ఆదేశించే అధికారం తమకెక్కడుందో చెప్పాలని పిటిషనర్‌ను కోరింది. మాస్‌ కాపీయింగ్‌ నిరోధానికి ఏం చేస్తే బాగుంటుందో సలహాలివ్వాలని కోరింది.

*⛔సబ్బు బిళ్ల.. స్కూలు బల్ల.. కాదేదీ అవినీతికి అనర్హం!*

 🅾హైదరాబాద్: పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన డ్యుయల్ డెస్క్ల కొనుగోలు వివాదాస్పదమవుతోంది. చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి డ్యుయల్ డెస్క్ల సరఫరా పేరిట ఓ మధ్య వ్యాపారి అధిక ధరలతో వంద.. వెయ్యి కాదు.. ఏకంగా లక్ష బల్లలను సరఫరా చేసేలా ఆర్డర్ సొంతం చేసుకున్నారు. విద్యాశాఖ టెండర్లు పిలిచి ఈ పనులు అప్పగించిందా? అంటే అదీ లేదు. జైళ్ల శాఖ పేరుతో నామినేషన్పై వీటి కొనుగోలుకు విద్యా శాఖ ఓకే చెప్పింది. సాధారణంగా రూ.10 లక్షల విలువైన పనులకూ ప్రభుత్వానికి ఫైలు పంపించే విద్యా శాఖ రూ.50 కోట్ల విలువైన ఈ పనులకు సొంతంగా ఆర్డర్ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. పైగా చర్లపల్లి సెంట్రల్ జైలులో ఏడాది పొడవునా పని చేసినా లక్ష బల్లల తయారీ సామర్థ్యం లేదని విద్యాశాఖ అధికారులే చెబుతున్నారు. అయినా జైలు పేరుతో బయటి వ్యక్తికి లక్ష బల్లల సరఫరా ఆర్డర్ అప్పగించారని, ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్ల దందా కొనసాగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

*🌐ఓపెన్ మార్కెట్లో చూస్తే..*
విద్యాశాఖ ఆర్డర్ ఇచ్చిన డ్యుయల్ డెస్క్లను పరిశీలిస్తే అంత ధర లేదని చిన్నతరహా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ముగ్గురు విద్యార్థులు కూర్చునేందుకు వీలున్న ఈ బల్లల తయారీకి రూ.2,800 వరకు ఖర్చవుతుందని, సరఫరా, లాభాల కింద రూ.1,200 కలిపినా రూ.4 వేలకు మించదని పేర్కొంటున్నాయి. కానీ ముగ్గురు విద్యార్థులు కూర్చునే బల్లలకు రూ.5,050 రేటుతో రూ.50 కోట్లకుపైగా విలువైన ఆర్డర్ను ఎలాంటి టెండర్లు లేకుండా ఇవ్వడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇవేకాదు పదో తరగతి పరీక్షల కోసం మరో 11 వేల వరకు డ్యుయల్ డెస్క్ల సరఫరాకూ ఆర్డర్ ఇచ్చింది. ఈ వ్యవహారంలో రూ.15 కోట్ల వరకు నిధుల దుర్వినియోగం జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. విద్యాశాఖ మాత్రమే కాదు.. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖలు కూడా గురుకులాల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జైల్లో ఖైదీలు తయారు చేసే ఉత్పత్తులను ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయాలి. సాధారణంగా జైలులో తయారు చేసే బల్లలపై పన్నులు ఉండవు. అలాంటప్పుడు మరింత రేటు తగ్గాల్సి ఉన్నా.. అధిక ధరలకు ఆర్డర్ ఇవ్వడం గమనార్హం.

*జెమ్ ఏం చెబుతోందంటే..*
గవర్నమెంట్ ఈ–మార్కెట్ప్లేస్(జెమ్).. ప్రధానమంత్రి నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ సూచనల మేరకు ఏర్పాటైన ఆన్లైన్ మార్కెట్ ఇదీ. ఇందులో వ్యాపార సంస్థలు, ప్రభుత్వాలు రిజిస్టర్ చేసుకోవాలి. ప్రభుత్వాలకు అవసరమైన పరికరాలను స్పెసిఫికేషన్స్ ప్రకారం ఆయా వ్యాపార సంస్థల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో డెస్క్లు సరఫరా చేసే వ్యాపార సంస్థలు వెయ్యికిపైగా ఉన్నాయి. విద్యాశాఖ నిర్దేశిత ప్రమాణాలతో కూడిన డ్యుయల్ డెస్క్లు రూ.1,600 నుంచి రూ.3,500 వరకు ధర ఉన్నాయి. కానీ దాని నుంచి కొనుగోలు చేసేందుకు విద్యా శాఖ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కాగా, ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో విచారణకు ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ ఈ విషయాన్ని తేల్చాలని జైలు అధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది.

*ధరలు మేం నిర్ణయించం..*
లక్ష డ్యుయల్ డెస్క్ల కొనుగోలు కోసం చర్లపల్లి జైలుకు ఆర్డర్ ఇచ్చింది వాస్తవమే. జైళ్లలో తయారయ్యే వస్తువులను ప్రభుత్వ విభాగాలు కొనుగోలు చేయాలన్న నిబంధన ఉంది. ఆ మేరకే మేం ఆర్డర్ ఇచ్చాం. అయితే ధరలను మేం నిర్ణయించం. మేం ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం జైలు అధికారులే ధర నిర్ణయించారు. ఆ ప్రకారమే కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చాం.
*– కిషన్, పాఠశాల విద్యా కమిషనర్*

*🏀ఆకాశంలో పెద్ద చంద్రుడు*

🎾 ప్రపంచవ్యాప్తంగా మంగళవారం కూడా బ్లూ మూన్ కనువిందు చేసింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అతిపెద్ద చంద్రుడు ప్రజలకు కనువిందు చేశాడు.

*🎾నేడు, రేపు భూమికి దగ్గరగా ఉల్కలు..*

బ్లూ మూన్తో పాటు బుధ, గురువారాల్లో మరో ఆవిష్కరణ చోటు చేసుకోనుంది. బుధ, గురువారాల్లో సప్తరుషి మండలం నుంచి ఉల్కాపాతం భూ వాతావరణానికి దగ్గరగా ప్రయాణించనున్నాయి. ఈ నెల 31న కూడా రెండో సారి బ్లూ మూన్ ఉండటంతో ఉల్కాపాతాల ప్రయాణం పెద్దగా కనిపించకపోవచ్చని సైన్స్ పరిశోధకులు చెబుతున్నారు. ఒకే నెలలో రెండు సార్లు బ్లూమూన్తో పాటు ఉల్కాపాతాల ప్రయాణం ఉండటంతో విద్యార్థులకు ప్రయోగాత్మకంగా విషయాన్ని తెలియజేయవచ్చని జిల్లా సైన్స్ అ«ధికారి శరత్కృష్ణ తెలిపారు.

*✍వివిధ సెట్స్ కన్వీనర్ల నియామకం*

*❇హైదరాబాద్: వివిధ ప్రవేశ పరీక్షల కన్వీనర్లను నియమిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇవాళ ఉత్తర్వులు వెలువరించింది. ఎంసెట్ కన్వీనర్‌గా జేఎన్‌టీయూ(హెచ్) రిజిస్ట్రార్ ఎన్. యాదయ్య, ఈసెట్ కన్వీనర్‌గా జేఎన్‌టీయూ(హెచ్) ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎ. గోవర్దన్, ఐసెట్ కన్వీనర్‌గా కేయూ ప్రొఫెసర్ ఎం. సుబ్రహ్మణ్యశర్మ, పీఈసెట్ కన్వీనర్‌గా ఎంజీయూ ప్రొఫెసర్ వి. సత్యనారాయణ, పీజీఎల్‌సెట్, లాసెట్ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ ద్వారకానాథ్, పీజీఈసెట్ కన్వీనర్‌గా ఓయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సమీన్ ఫాతిమా, ఎడ్‌సెట్ కన్వీనర్‌గా ఓయూ ప్రొఫెసర్ సి. మధుమతిని నియమిస్తూ ఉన్నత విద్యామండలి ప్రకటించింది.*

*❇రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం కోసం వివిధ కోర్సులకు నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ఇప్పటికే ఖరారు చేసిన విషయం తెలిసిందే. మే 2 నుంచి 5 వరకు ఎంసెట్ ఆన్‌లైన్ పరీక్షలు జరగనున్నాయి. మే 9న ఈసెట్, మే 17న ఐసెట్, మే 20న పీఈసెట్. మే 25న లాసెట్, మే 25న పీజీఈసెట్, మే 26న పీజీ లాసెట్, మే 31న ఎడ్‌సెట్ నిర్వహించనున్నారు.*

*✍భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ*

*హైదరాబాద్: రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. మొత్తం 30 మందికి పైగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. అధికారుల బదిలీ స్థానాలు ఈ విధంగా ఉన్నాయి.*

- రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా సురేష్ చందా
- ఎస్సీ, ఎస్టీ కమిషన్ కార్యదర్శిగా బీ.ఆర్.మీనా
- రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా రాజేశ్వర్ తివారి
- వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శిగా శాంతికుమారికి అదనపు బాధ్యతలు
- పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శిగా అరవింద్ కుమార్
- బీసీ సంక్షేమశాఖ కార్యదర్శిగా బుర్రా వెంకటేశంకు అదనపు బాధ్యతలు
- కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్‌గా నవీన్ మిత్తల్
- విపత్తు నిర్వహణ కమిషనర్‌గా ఆర్.వి.చంద్రవదన్
- పశుసంవర్ధకశాఖ కార్యదర్శిగా సందీప్‌కుమార్ సుల్తానియా
- బీసీ సంక్షేమశాఖ కమిషనర్‌గా అనితా రాజేంద్ర
- మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా దానకిశోర్‌కు అదనపు బాధ్యతలు
- గిరిజిన సంక్షేమ కమిషనర్‌గా క్రిస్టినా
- ఎస్సీ అభివృద్ధిశాఖ కార్యదర్శిగా జ్యోతి బుద్దప్రకాశ్
- భూ పరిపాలన సంచాలకులుగా వాకాటీ కరుణ
- రాష్ట్ర సమాచార కమిషన్ కార్యదర్శిగా ఇలంబర్తి
- సైనిక సంక్షేమ సంయుక్త కార్యదర్శిగా చంపాలాల్
- ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సంచాలకులుగా ప్రీతిమీనా
- వికారాబాద్ జిల్లా కలెక్టర్‌గా ఒమర్ జలీల్
- నిజామాబాద్ కలెక్టర్‌గా ఎం.ఆర్.ఎం.రావు
- పెద్దపల్లి కలెక్టర్‌గా దేవసేన
- జనగాం కలెక్టర్‌గా అనితా రామచంద్రన్‌కు అదనపు బాధ్యతలు
*- మెదక్ కలెక్టర్‌గా మాణిక్‌రాజుకు అదనపు బాధ్యతలు*
- మహబూబాబాద్ కలెక్టర్‌గా లోకేశ్ కుమార్‌కు అదనపు బాధ్యతులు
- ప్రణాళికా బోర్డు కార్యదర్శిగా శివకుమార్ నాయుడు
- ఢిల్లీలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా అశోక్‌కుమార్
- ఢిల్లీలో తెలంగాణ భవన్ ఓఎస్‌డీగా కాళీచరణ్
- జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా భారతి హోళికేరి
- జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా సిక్బా పట్నాయక్
- జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా ముషారఫ్ అలీ
- బోధన్ సంయుక్త కలెక్టర్‌గా అనురాగ్ జయంతి
- మెట్‌పల్లి సంయుక్త కలెక్టర్‌గా గౌతమ్
- భద్రాచలం సంయుక్త కలెక్టర్‌గా పమేలా సత్పతి
- బెల్లంపల్లి సంయుక్త కలెక్టర్‌గా రాహుల్‌రాజ్

*✍ఆకాశంలో పెద్ద చంద్రుడు*

*🌝ప్రపంచవ్యాప్తంగా మంగళవారం కూడా బ్లూ మూన్ కనువిందు చేసింది. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో అతిపెద్ద చంద్రుడు ప్రజలకు కనువిందు చేశాడు.*

*👉నేడు, రేపు భూమికి దగ్గరగా ఉల్కలు..*

*☄బ్లూ మూన్తో పాటు బుధ, గురువారాల్లో మరో ఆవిష్కరణ చోటు చేసుకోనుంది. బుధ, గురువారాల్లో సప్తరుషి మండలం నుంచి ఉల్కాపాతం భూ వాతావరణానికి దగ్గరగా ప్రయాణించనున్నాయి. ఈ నెల 31న కూడా రెండో సారి బ్లూ మూన్ ఉండటంతో ఉల్కాపాతాల ప్రయాణం పెద్దగా కనిపించకపోవచ్చని సైన్స్ పరిశోధకులు చెబుతున్నారు. ఒకే నెలలో రెండు సార్లు బ్లూమూన్తో పాటు ఉల్కాపాతాల ప్రయాణం ఉండటంతో విద్యార్థులకు ప్రయోగాత్మకంగా విషయాన్ని తెలియజేయవచ్చని జిల్లా సైన్స్ అ«ధికారి శరత్కృష్ణ తెలిపారు.*

*✍సబ్బు బిళ్ల.. స్కూలు బల్ల.. కాదేదీ అవినీతికి అనర్హం!*

 *❇హైదరాబాద్: పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన డ్యుయల్ డెస్క్ల కొనుగోలు వివాదాస్పదమవుతోంది. చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి డ్యుయల్ డెస్క్ల సరఫరా పేరిట ఓ మధ్య వ్యాపారి అధిక ధరలతో వంద.. వెయ్యి కాదు.. ఏకంగా లక్ష బల్లలను సరఫరా చేసేలా ఆర్డర్ సొంతం చేసుకున్నారు. విద్యాశాఖ టెండర్లు పిలిచి ఈ పనులు అప్పగించిందా? అంటే అదీ లేదు. జైళ్ల శాఖ పేరుతో నామినేషన్పై వీటి కొనుగోలుకు విద్యా శాఖ ఓకే చెప్పింది. సాధారణంగా రూ.10 లక్షల విలువైన పనులకూ ప్రభుత్వానికి ఫైలు పంపించే విద్యా శాఖ రూ.50 కోట్ల విలువైన ఈ పనులకు సొంతంగా ఆర్డర్ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. పైగా చర్లపల్లి సెంట్రల్ జైలులో ఏడాది పొడవునా పని చేసినా లక్ష బల్లల తయారీ సామర్థ్యం లేదని విద్యాశాఖ అధికారులే చెబుతున్నారు. అయినా జైలు పేరుతో బయటి వ్యక్తికి లక్ష బల్లల సరఫరా ఆర్డర్ అప్పగించారని, ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్ల దందా కొనసాగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.*

*👉ఓపెన్ మార్కెట్లో చూస్తే..*

*❇విద్యాశాఖ ఆర్డర్ ఇచ్చిన డ్యుయల్ డెస్క్లను పరిశీలిస్తే అంత ధర లేదని చిన్నతరహా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ముగ్గురు విద్యార్థులు కూర్చునేందుకు వీలున్న ఈ బల్లల తయారీకి రూ.2,800 వరకు ఖర్చవుతుందని, సరఫరా, లాభాల కింద రూ.1,200 కలిపినా రూ.4 వేలకు మించదని పేర్కొంటున్నాయి. కానీ ముగ్గురు విద్యార్థులు కూర్చునే బల్లలకు రూ.5,050 రేటుతో రూ.50 కోట్లకుపైగా విలువైన ఆర్డర్ను ఎలాంటి టెండర్లు లేకుండా ఇవ్వడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇవేకాదు పదో తరగతి పరీక్షల కోసం మరో 11 వేల వరకు డ్యుయల్ డెస్క్ల సరఫరాకూ ఆర్డర్ ఇచ్చింది. ఈ వ్యవహారంలో రూ.15 కోట్ల వరకు నిధుల దుర్వినియోగం జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. విద్యాశాఖ మాత్రమే కాదు.. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖలు కూడా గురుకులాల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జైల్లో ఖైదీలు తయారు చేసే ఉత్పత్తులను ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయాలి. సాధారణంగా జైలులో తయారు చేసే బల్లలపై పన్నులు ఉండవు. అలాంటప్పుడు మరింత రేటు తగ్గాల్సి ఉన్నా.. అధిక ధరలకు ఆర్డర్ ఇవ్వడం గమనార్హం.*

*👉జెమ్ ఏం చెబుతోందంటే..*

*❇గవర్నమెంట్ ఈ–మార్కెట్ప్లేస్(జెమ్).. ప్రధానమంత్రి నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ సూచనల మేరకు ఏర్పాటైన ఆన్లైన్ మార్కెట్ ఇదీ. ఇందులో వ్యాపార సంస్థలు, ప్రభుత్వాలు రిజిస్టర్ చేసుకోవాలి. ప్రభుత్వాలకు అవసరమైన పరికరాలను స్పెసిఫికేషన్స్ ప్రకారం ఆయా వ్యాపార సంస్థల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో డెస్క్లు సరఫరా చేసే వ్యాపార సంస్థలు వెయ్యికిపైగా ఉన్నాయి. విద్యాశాఖ నిర్దేశిత ప్రమాణాలతో కూడిన డ్యుయల్ డెస్క్లు రూ.1,600 నుంచి రూ.3,500 వరకు ధర ఉన్నాయి. కానీ దాని నుంచి కొనుగోలు చేసేందుకు విద్యా శాఖ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కాగా, ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో విచారణకు ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ ఈ విషయాన్ని తేల్చాలని జైలు అధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది.*

*👉ధరలు మేం నిర్ణయించం..*

*❇లక్ష డ్యుయల్ డెస్క్ల కొనుగోలు కోసం చర్లపల్లి జైలుకు ఆర్డర్ ఇచ్చింది వాస్తవమే. జైళ్లలో తయారయ్యే వస్తువులను ప్రభుత్వ విభాగాలు కొనుగోలు చేయాలన్న నిబంధన ఉంది. ఆ మేరకే మేం ఆర్డర్ ఇచ్చాం. అయితే ధరలను మేం నిర్ణయించం. మేం ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం జైలు అధికారులే ధర నిర్ణయించారు. ఆ ప్రకారమే కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చాం.*

*– కిషన్, పాఠశాల విద్యా కమిషనర్*

*✍భయం ఉంటేనే వ్యవస్థ బాగుంటుంది*

*❇పబ్లిక్‌ పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌ పెద్ద ఎత్తున జరుగుతుండటంపై ఉమ్మడి హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.*

*❇మాస్‌ కాపీయింగ్‌ నేపథ్యంలో విద్యా ప్రమాణా లు పడిపోతున్నాయంది. మాస్‌ కాపీయింగ్‌కు సహకరించే ఉపాధ్యాయులు విద్యార్థులకు దేవుళ్లుగా, సహకరించనివారు దెయ్యాల్లా కనిపి స్తున్నారని వ్యాఖ్యానించింది. తక్కువ మార్కు లు వచ్చినా పర్వాలేదు.. నిజాయితీగా ఆ మార్కులు తెచ్చుకోవాలని ఆశిస్తున్న తల్లిదం డ్రులు ఎంతమంది ఉన్నారని ప్రశ్నించింది. మాస్‌ కాపీయింగ్‌కు అందరూ బాధ్యులేనంది.*

*❇గతేడాది 10వ తరగతి పరీక్షల సందర్భంగా మాస్‌ కాపీయింగ్‌కు సంబంధించి తెలంగాణలో 4 కేసులు, ఏపీలో ఓ కేసు మాత్రమే నమోదవడంపై విస్మయం వెలిబుచ్చింది. పబ్లిక్‌ పరీక్షల చట్టం–1997 కింద కేసులు నమోదు చేయడంతోపాటు ప్రాసిక్యూషన్‌ చేస్తేనే పరిస్థితులు దార్లోకి వస్తాయని స్పష్టం చేసింది.*

❇ *‘‘భయం ఉంటేనే వ్యవస్థ బాగుపడుతుంది. ఫెయిలైతే ఏమవుతుంది.. ఓ సంవత్సరం లేటవుతుంది.. ఇందుకోసం అడ్డదార్లు తొక్కా ల్సిన అవసరమేముంది?’’ అని వ్యాఖ్యానిం చింది.*

*❇మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా ఏదో ఒకటి చేయాల్సిన అవసరముందంటూ ఇందు కోసం ఏం చర్యలు తీసుకుంటున్నారో తెలపా లని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 23కు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయ మూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ శ్యాంప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది.*

*❇ఉభయ రాష్ట్రాల్లోని మాస్‌ కాపీయింగ్, పుస్తకాలు పెట్టి రాస్తున్న రాతల్ని అడ్డుకోవడంలో విద్యాశాఖాధి కారులు దారుణంగా విఫలమవు తున్నారని, మాస్‌ కాపీయింగ్‌ను అడ్డుకునేందుకు పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసి పర్యవేక్షించేలా ఆదేశాలివ్వాలంటూ ఏలూరుకు చెందిన ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ గుంటుపల్లి ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలు చేశారు. దీన్ని ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది.*

*❇తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ.. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఏపీ న్యాయవాది పేర్కొంటూ విచారణను సంక్రాంతి సెలవుల తర్వాత చేపట్టాలని కోరారు.*

*👉ధర్మాసనం స్పందిస్తూ..*

*❇మాస్‌ కాపీయింగ్‌కు పాల్పడిన ఘటనల్లో ఎన్ని కేసులు నమోదు చేశారు.. ఎంతమందిని ప్రాసిక్యూట్‌ చేశారో చెప్పాలంది. ఏపీలో ఓ కేసు, తెలంగాణలో నాలుగు కేసులు నమోదు చేసినట్లు తెలుసుకున్న ధర్మాసనం విస్మయం వెలిబుచ్చింది. చట్టాన్ని ఎందుకు సక్రమంగా అమలు చేయట్లేదని ప్రశ్నించింది.* 

*❇సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి నిర్వహణ పెద్ద ఆర్థిక భారమేనని, కాబట్టి ఈ ఆర్థిక భారాన్ని మోయాలని ప్రభుత్వాలను ఆదేశించే అధికారం తమకెక్కడుందో చెప్పాలని పిటిషనర్‌ను కోరింది. మాస్‌ కాపీయింగ్‌ నిరోధానికి ఏం చేస్తే బాగుంటుందో సలహాలివ్వాలని కోరింది.*

*✍రూ.198 కోట్లతో కేజీబీవీలకు భవనాలు*

*❇సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో (కేజీబీవీ) రూ.198 కోట్లతో 61 అకడమిక్‌ బ్లాక్‌లు, 34 కేజీబీవీలకు నూతన భవన నిర్మాణాలకు ఈ నెల 15లోపు శంకుస్థాపనలు చేసి, అక్టోబర్‌ నాటికి భవనాలు పూర్తి చేయాలని ఉపముఖ్య మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర కేజీబీవీలు దేశంలో అత్యు త్తమంగా ఉన్నాయని, వీటిని మరింత పటిష్ట పరచాలని సూచించారు. కేజీబీవీ, మోడల్‌ స్కూల్స్, గురుకులాల్లోని విద్యార్థులకు వసతు లు, హెల్త్‌ కిట్ల పంపిణీ, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌ ఆచార్య, అధికారులతో సచివాలయంలో ఆయన సమీక్షించారు. ఆయా విద్యా సంస్థల్లోని విద్యార్థులకు ఈ నెల 9లోగా హెల్త్‌ కిట్లు అందజేయాలన్నారు. 4 దశలుగా ఏడాదికి సరిపడేలా ఇవ్వాలన్నారు. బాలికలకు, బాలురకు విడివిడిగా హెల్త్‌కిట్లు రూపొందించినట్లు చెప్పారు. ఈ కిట్ల కోసం ఏటా రూ.12 కోట్ల వ్యయం అవుతోందన్నారు.*

 *👉కలెక్టర్ల నేతృత్వంలో సమీక్షలు*

*❇ఈ ఏడాది జనవరి 1 నుంచి అన్ని విద్యా సంస్థల్లో ఒకేరకమైన మెనూ అందిస్తున్నట్లు తెలిపారు. మెనూలో ఉదయం 6 గంటలకే 250 మిల్లీలీటర్ల పాలు.. ఆ తర్వాత అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం అందిస్తున్నట్లు వివరించారు. నెలకు 4 సార్లు చికెన్, 2 సార్లు మటన్, రోజూ గుడ్డు, నెయ్యి అందిస్తున్నట్లు చెప్పా రు. పదో తరగతి వార్షిక పరీక్షలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల వారీగా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లాలోని ప్రధానోపాధ్యా యులు,స్పెషల్‌ ఆఫీసర్లతో సమీక్షలు నిర్వహించాలన్నారు. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడంపై దృష్టి పెట్టాలని సూచించారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధ మవడంలో లోటుపాట్లు లేకుండా చూడాల ని ఆదేశించారు. సమావేశంలో విద్యాశాఖ డైరెక్టర్‌ కిషన్, విద్యాశాఖ సంక్షేమ, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఎండీ విజయ్‌ కుమార్, చీఫ్‌ ఇంజనీర్‌ మల్లేశం, కేజీబీవీల డైరెక్టర్‌ శ్రీహరి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ శేషు కుమారి పాల్గొన్నారు.*

*✍కొత్తగా మరో 40 పురపాలికలు*

*❇సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 40 కొత్త మునిసిపాలిటీలు ఏర్పాటు కానున్నాయి. అదేవిధంగా ప్రస్తుతమున్న మునిసిపాలిటీల్లో పదుల సంఖ్యలో శివారు గ్రామ పంచాయ తీలు విలీనం కానున్నాయి. పెరిగిన జనాభా, పన్నుల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. పలు మునిసిపాలిటీల గ్రేడ్లను పెంచబోతోంది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 10 నుంచి 31కి పెంచిన నేపథ్యంలో కొత్తగా జిల్లా కేంద్రాలుగా ఏర్పడిన గ్రామ పంచాయతీలకు మునిసిపా లిటీ హోదా కల్పించాల్సి ఉంది. అదేవిధంగా 2011 జనాభా లెక్కల ప్రకారం 20 వేలు, ఆపై జనాభా గల గ్రామ పంచాయతీలకు సైతం మునిసిపాలిటీ హోదా కల్పించాలని నిర్ణయం తీసుకుంది.*

*❇రాష్ట్రంలోని 15 గ్రామ పంచాయ తీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్‌ చేయాలనే ప్రతిపాదనలు ఇప్పటికే రాష్ట్ర పుర పాలక శాఖకు చేరాయి. వీటితో పాటు మరో 12 మునిసిపాలిటీల్లో శివారు గ్రామ పంచాయ తీలను విలీనం చేయాలనే ప్రతిపాదనలపై పురపాలక శాఖ పరిశీలన జరుపుతోంది. నిబంధనలను అనుసరించి... 2011 జనాభా లెక్కల ప్రకారం 20 వేలు, ఆపై జనాభా కలిగి ఉండటంతో పాటు జనాభాలో దాదాపు సగం మంది వ్యవసాయేతర రంగంలో ఉపాధి పొందుతూ ఉంటేనే ఆ గ్రామ పంచాయతీని మునిసిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేయాలి. దీని ప్రకారం 40 గ్రామ పంచా యతీలకు మునిసిపాలిటీ హోదా ఇవ్వవచ్చని ప్రభుత్వ పరిశీలనలో తేలింది.*

*👉శివార్ల విలీనాలు.. హోదాల పెంపు!*

*❇నల్లగొండ మునిసిపాలిటీ హోదాను ఫస్ట్‌ గ్రేడ్‌ నుంచి స్పెషల్‌ గ్రేడ్‌కు పెంచుతూ త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అదే విధం గా కొత్తగా జిల్లా కేంద్రంగా ఏర్పడిన నాగర్‌ కర్నూల్‌కు నగర పంచాయతీ నుంచి మునిసి పాలిటీగా, ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రానికి గ్రామ పంచాయతీ నుంచి మునిసిపాలిటీగా హోదా పెంచనుంది. సంగారెడ్డి మునిసిపాలిటీలో 11 శివారు గ్రామ పంచాయతీల విలీనం ప్రతిపాద నలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. బోధన్‌ (నిజామాబాద్‌) మునిసిపాలిటీలో శివారు ప్రాంతాల విలీనం, తాండూరు(వికారాబాద్‌) మునిసిపా లిటీ పరిధి పెంపు, ఆందోల్‌– జోగిపేట్‌ నగర పంచాయతీలో ఆరు శివారు గ్రామాలు, సదాశివపేట మునిసిపాలిటీలో 13 శివారు గ్రామాలు, జహీరాబాద్‌ మునిసిపాలిటీలో 15 శివారు గ్రామాల విలీనం ప్రతిపాదనలు ఉన్నాయి. షాద్‌నగర్‌ మునిసి పాలిటీ హోదాను గ్రేడ్‌–2గా పెంచనుంది.*

*👉కొత్త ప్రతిపాదనలు..*

బాన్సువాడ(కామారెడ్డి జిల్లా), *చేర్యాల(సిద్దిపేట),*
 తొర్రూరు(రంగారెడ్డి), *నర్సాపూర్‌ (మెదక్‌),* మరిపెడ(మహబూబాబాద్‌), *నారాయణ్‌ ఖేడ్‌(సంగారెడ్డి),*
 *రామాయంపేట (మెదక్‌),* బొల్లారం(సం గారెడ్డి), నిజాంపేట(రంగారెడ్డి), ఆసిఫాబాద్‌ (కుమ్రం భీం ఆసిఫాబాద్‌), డోర్నకల్‌ (మహబూబాబాద్‌), మద్దూరు (మహబూబ్‌నగర్‌), కోస్గి (మహబూబ్‌నగర్‌), ధర్మపురి (జగిత్యాల), *తూఫ్రాన్‌(మెదక్‌)* గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్‌ చేయాలనే ప్రతిపాదనలను రాష్ట్ర పురపాలక శాఖ పరిశీలిస్తోంది.

ఈ రోజు జి కె

1)👉 ఒక "ఫాతం" ఎన్ని  అడుగులకు సమానం?
A: *6 అడుగులు*

2)👉 "మెక్సికో సింధూశాఖలో" ఏర్పడే తుఫాన్లను ఏమంటారు?
A: *హరికేన్లు*

3)👉 దేశంలో అత్యధిక విస్తీర్ణంలో "మడ  అడవులు" ఉన్నాయి?
A: *పశ్చిమ బెంగాల్*

4)👉 "జాతీయ వాతావరణ రాడార్"  ఎక్కడ కలదు?
A: *గాందకి(తిరుపతి)*

5)👉 "ప్లాస్టర్ ఆఫ్ పారీస్" యొక్క రసాయనిక నామం  ఏమిటి?
A: *కాల్షియం సల్ఫేట్(జిప్సం)*
 *CaSo4*
                🍃✌🌺
♦ *టిఆర్టీ రాత పరీక్షలు ఫిబ్రవరి 24 న ఏ రకంగా నిర్వహిస్తారు???*

👉 *హిందీ అభ్యర్థులకు న్యాయం చేయాలి.*
👉 *డి.ఎడ్.,సెకండ్ ఇయర్ వారికి న్యాయం చేయాలి.*
👉 *పాత సిలబస్ ప్రక్కన పెట్టి కొత్త సిలబస్ ప్రకటించాలి.*
👉 *కొత్త జిల్లాల వారిగా ఉద్యోగాలు భర్తీ చేయాలి.*
👉 *ఇంత వరకు కొత్త జిల్లాలకు గెజిట్ రాకపోవడం దారుణం.*
👉 *పర్సెంటేజ్ లేకుండా అభ్యర్థులకు టిఆర్టీ అవకాశం ఇవ్వాలి.*
👉 *ఫిబ్రవరిలో డి.యస్సి.,చరిత్రలోనే రాత పరీక్షలు ఇంత వరకు ఏ ప్రభుత్వం నిర్వహించలేదు.* *ఇది ఆకాడమిక్ ఇయర్.* *అసలు ఈ ఫిబ్రవరి* *నెలలో టిఆర్టీ నిర్వహించరాదు.*
👉 *కడియం శ్రీహరి సారుకి...నిరుద్యోగుల ఆవేదన పట్టదు.*
👉 *ఉన్నత అధికారులు కూడా అభ్యర్థులను పట్టించుకోవడం లేదు.*
👉 *అంత సిలబస్ ను అభ్యర్థులు ఎలా చదవాలి...ఒక వేళ చదివితే సమయం అన్న పెంచాల కదా.*
👉 *ప్రభుత్వం ఒకేసారి మెగా టిఆర్టీ ఇస్తే ఏమైనా నష్టమా.*
👉 *2019 ఎన్నికలకు టీచర్ ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారు.ఉంటే భర్తీ చేస్తారు..లేకపోతే లేదు.*
👉  *ఇంత వరకు పంచాయితీ సెక్రెటరీ ఉద్యోగాలు ఇవ్వలేదు.*
👉 *ప్రభుత్వ పాఠశాలలో ఈ టిఆర్టీ నోటిఫికేషన్లో ఆర్ట్,క్రాఫ్ట్,పోస్టులు భర్తీ చేయాలి...ఈ రెగ్యులర్ పోస్టులు పడక దాదాపుగా 30 సంవత్సరాలు అయింది.ఈ పోస్టులు భర్తీ చేస్తే ప్రభుత్వానికి మంచి పేరు కూడా వస్తుంది.కదా ప్రస్తుత పిల్లలకు డ్రాయింగ్ నైపుణ్యం చాలా ఉంది.*
👉 *తెరాస ప్రభుత్వం నిరుద్యోగుల పట్ల ఉనికిని కోల్పోవద్దు.*

🤦‍♂ *రాష్ట్ర టిఆర్టీ నిరుద్యోగుల ఆవేదన*🤦‍♂
 శ్రీహరి కామెంట్స్ : 
👉రేపటి లోగా KGVB,MODEL SCHOOL లో హీట్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన కడియం.
👉KGVB స్కూల్ లో విద్యార్థులకు  సొంత ఖర్చు తో టెలివిజన్ ఏర్పాటు .

👉తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా KGVB,మోడల్ స్కూల్ లో విద్యార్థులకు ఆరోగ్య భద్రత కిట్ లా  పంపిణీ చేయడం చాలా సంతోషకరం .
👉ముందుగా విద్యార్థులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
👉తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత పేద విద్యార్థుల పట్ల నాణ్యమైన విద్యను అందించాలని కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.

👉తెలంగాణ రాష్ట్రం లో 296 నుంచి 544 గురుకుల పాఠశాల లు ఏర్పాటు చేసిన ఘనత మనది.
👉దేశం లో ఎక్కడ లేని విధంగా విద్యను అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం.
👉విద్యార్థులకు సన్న బియ్యం తో పాటు విద్యార్థులకు అన్ని రకాలుగా విద్య వ్యవస్థను నిలుపుకున్న ప్రభుత్వం టి ఆర్ ఎస్ ప్రభుత్వం .
👉840 గురుకుల పాఠశాల 194 మోడల్ స్కూల్ ,475KGVB స్కూల్ ఏర్పాటు చేశామని తెలిపారు.
👉విద్యార్థులకు ఆరోగ్యం పట్ల పరిశుభ్రత తో పాటు భోజనం సదుపాయం అల్పిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం.
👉విద్యార్థుల పట్ల ఆరోగ్య పరిరక్షణ కోసం 15 రకాల హెల్త్ కిట్ పంపిణీ కోసం కృషి చేస్తున్నాం.
👉చదువు తో పాటు ఆరోగ్య పరిరక్షణ కూడా ముఖ్యం .
👉కొత్త సం నుంచి నెలకు నాలుగు సార్లు మటన్ ,రెండు సార్లు చికెన్ అందిస్తున్నామని అన్నారు.
👉తెలంగాణ రాష్ట్ర లో అన్ని KGVB,మోడల్ స్కూల్ ,విద్యార్థులకు కోసం వేడి నీటిని ఏర్పాటు.
👉పేదరికం నుంచి వచ్చామని భదపడకుడదని విద్యార్థులకు భరోసా కల్పించారు..
👉నేను కూడా పేద కుటుంబానికి చెందిన వాడని అని ఈ స్థాయి కి ఎదిగాననై తెలిపారు.
👉వారం రోజుల లోపు సోలార్ ఫినిషింగ్ ఏర్పాటు , టివి ,మరో అర్ ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ..

👉తెలంగాణ రాష్ట్ర. బంగారు తెలంగాణ కావాలంటే మానవ వనరుల ఏర్పాటు కావాలని కోరారని అందుకోసం అది విద్యార్థుల వల్లనే అని తెలిపారు.

*రక్తదాతలకు వేతనంతో కూడిన సెలవు.💫*

🧘‍♂🧘‍♂రక్తదానం చేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయనున్నట్లు సిబ్బంది, వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 

🧘‍♂🧘‍♂గుర్తింపు ఉన్న బ్లడ్‌ బ్యాంకులో రక్తం లేదా రక్తకణాలు, ప్లేట్‌లెట్లు, ప్లాస్మా దానం చేస్తే సెలవు మంజూరు చేయ నున్నట్లు తెలిపారు. 


🧘‍♂🧘‍♂రక్తదానం చేసినట్లు తగిన ఆధారాలు చూపి ఏడాదిలో 4 సార్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

No comments:

Post a Comment