AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Tuesday 2 January 2018

ప్రపంచం World తూర్పు ఆసియా సదస్సు (ఈఏఎస్)

తూర్పు ఆసియా సదస్సు (ఈఏఎస్)

ఆసియాన్ వార్షిక సమావేశాల తర్వాత తొమ్మిదో తూర్పు ఆసియా సదస్సు (ఈస్ట్ ఏసియా సమ్మిట్) నవంబర్ 13న మయన్మార్ రాజధాని నేపిటాలో జరిగింది. 2005, డిసెంబర్‌లో నిర్వహించిన మొదటి సదస్సుకు మలేషియా రాజధాని కౌలాలంపూర్ ఆతిథ్యమిచ్చింది. ఈ సదస్సులో 18 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. పది ఆసియాన్ దేశాలతోపాటు.. వాటి ఇరుగుపొరుగు దేశాలైన భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూఎస్‌ఏ, రష్యాలు కూడా సభ్యులుగా చేరాయి.

తొమ్మిదో తూర్పు ఆసియా సదస్సుకు భారత ప్రధాని నరేంద్రమోడీ హాజరయ్యారు. ఈ సదస్సులో ఆయన ప్రసంగిస్తూ భారత్ గతంలో అనుసరించిన లుక్ ఈస్ట్ విధానాన్ని యాక్ట్ ఈస్ట్ విధానంగా మార్చడానికి ప్రయత్నిస్తోందని చెప్పారు. లుక్ ఈస్ట్ విధానాన్ని మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు ప్రవేశపెట్టారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ భాగస్వామ్యం అవసరమని మోడీ పేర్కొన్నారు. మతం ముసుగులో ఉగ్రవాదానికి పాల్పడడాన్ని వ్యతిరేకించాలని ఆయన ప్రపంచదేశాలకు పిలుపునిచ్చారు. తూర్పు ఆసియా సదస్సు ఇస్లామిక్ స్టేట్ అనే ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా ప్రకటన చేసింది.

తూర్పు ఆసియా సదస్సులోపాల్గొన్న దేశాధినేతలు/ప్రభుత్వాధినేతలు
బూనై సుల్తాన్హసనల్ బోల్‌కియా
మయన్మార్ అధ్యక్షుడుథేన్‌సేన్
కంబోడియా ప్రధానిహున్‌సేన్
ఇండోనేషియా అధ్యక్షుడుజోకో విడోడో
లావోస్ ప్రధానిథాంగ్‌షింగ్ థమ్మవాంగ్
మలేషియా ప్రధానినజీబ్ రజాక్
ఫిలిప్పీన్‌‌స అధ్యక్షుడుబెనిగ్నో అక్వినో
సింగపూర్ ప్రధానిలీ సీన్ లూంగ్
థాయ్‌లాండ్ ప్రధానిప్రయుత్ చాన్ వో చా
వియత్నాం ప్రధానిగుయెన్ టాన్ డంగ్
ఆస్ట్రేలియా ప్రధానిటోనీ అబాట్
న్యూజిలాండ్ ప్రధానిజాన్ కీ
చైనా ప్రీమియర్లీ కెకియాంగ్
జపాన్ ప్రధానిషింజో అబే
దక్షిణ కొరియా అధ్యక్షురాలుపార్‌‌క గేన్ హై
భారత్ ప్రధానినరేంద్ర మోడీ
రష్యా ప్రధానిదిమిత్రి మెద్వదేవ్
అమెరికా అధ్యక్షుడుబరాక్ ఒబామా


No comments:

Post a Comment