జీ-20 - గ్రూప్ ఆఫ్ 20
అనేది ప్రపంచంలోని 20 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల కూటమి. 1999లో ఆర్థిక మంత్రుల, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల వేదికగా ఇది ఏర్పడింది. 2008లో ఏర్పడిన ఆర్థిక మాంద్యం తర్వాత ఇది దేశాధినేతల సదస్సుగా రూపాంతరం చెందింది. ఈ వేదికలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని ముఖ్యమైన అంశాలను చర్చిస్తారు. జీ-20 లో 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు సభ్యత్వం ఉంది.జీ-20 దేశాలు ప్రపంచలో మూడింట రెండింతల జనాభా కలిగి ఉన్నాయి. ప్రపంచ జీడీపీలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 80 శాతం వాటా ఈ దేశాలదే.
జీ-20 సదస్సు 2016 ముఖ్యాంశాలు..
జీ-20 11వ సదస్సు 2016 సెప్టెంబర్ 4, 5 తేదీల్లో చైనాలోని హాంగ్జూ నగరంలో జరిగింది. జీ-20 శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యమిచ్చిన రెండో ఆసియా దేశం చైనా. 2010 నవంబర్లో నిర్వహించిన జీ-20 సదస్సుకు మరో ఆసియా దేశం దక్షిణ కొరియా ఆతిథ్యమిచ్చింది.
ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ‘ఒక దక్షిణాసియా దేశం ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తోంది’ అని పాకిస్తాన్ను పరోక్షంగా విమర్శించారు. వాతావరణాన్ని కాపాడుకోవాలని, ప్రజారోగ్యం ముఖ్యమైన విషయమని, ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ పారిస్ వాతావరణ మార్పుల ఒప్పందానికి ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించారు.
హాంగ్జూ సదస్సులో సభ్యదేశాల నాయకులతోపాటు ఈజిప్ట్, కజకిస్తాన్, లావోస్, సెనెగల్, స్పెయిన్, సింగపూర్, థాయ్లాండ్ దేశాల నేతలు కూడా అతిథులుగా పాల్గొన్నారు.
జీ-20 శిఖరాగ్ర సదస్సులు
ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ‘ఒక దక్షిణాసియా దేశం ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తోంది’ అని పాకిస్తాన్ను పరోక్షంగా విమర్శించారు. వాతావరణాన్ని కాపాడుకోవాలని, ప్రజారోగ్యం ముఖ్యమైన విషయమని, ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సదస్సు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ పారిస్ వాతావరణ మార్పుల ఒప్పందానికి ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించారు.
హాంగ్జూ సదస్సులో సభ్యదేశాల నాయకులతోపాటు ఈజిప్ట్, కజకిస్తాన్, లావోస్, సెనెగల్, స్పెయిన్, సింగపూర్, థాయ్లాండ్ దేశాల నేతలు కూడా అతిథులుగా పాల్గొన్నారు.
జీ-20 శిఖరాగ్ర సదస్సులు
| క్రమ సంఖ్య | సంవత్సరం | ఆతిథ్య నగరం | దేశం |
| 1. | 2008 నవంబర్ | వాషింగ్టన్ డి.సి. | అమెరికా |
| 2. | 2009 ఏప్రిల్ | లండన్ | యూకే |
| 3. | 2009 సెప్టెంబర్ | పిట్స్బర్గ | అమెరికా |
| 4. | 2010 జూన్ | టొరంటో | కెనడా |
| 5. | 2010 నవంబర్ | సియోల్ | దక్షిణ కొరియా |
| 6. | 2011 నవంబర్ | కేన్స | ఫ్రాన్స్ |
| 7. | 2012 జూన్ | లాస్ కబోస్ | మెక్సికో |
| 8. | 2013 సెప్టెంబర్ | సెయింట్ పీటర్సబర్గ | రష్యా |
| 9. | 2014 నవంబర్ | బ్రిస్బేన్ | ఆస్ట్రేలియా |
| 10. | 2015 నవంబర్ | అంతాల్యా | టర్కీ |
| 11. | 2016 సెప్టెంబర్ | హాంగ్జూ | చైనా |
12వ జీ-20 శిఖరాగ్ర సదస్సు 2017 జూలైలో జర్మనీలోని హాంబర్గ నగరంలో జరగనుంది.
జీ-20 11వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న నాయకులు
జీ-20 11వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న నాయకులు
| దేశం | పాల్గొన వ్యక్తి హోదా | పేరు |
| అర్జెంటీనా | అధ్యక్షుడు | మారీసియో మాక్రి |
| ఆస్ట్రేలియా | ప్రధానమంత్రి | మల్కమ్ టర్నబుల్ |
| బ్రెజిల్ | అధ్యక్షుడు | మిచెల్ టెమెర్ |
| కెనడా | ప్రధానమంత్రి | జస్టిన్ ట్రుడో |
| చైనా | అధ్యక్షుడు | జీ జిన్ పింగ్ |
| ఫ్రాన్స | అధ్యక్షుడు | ఫ్రాంకోయిస్ హోలాండ్ |
| జర్మనీ | చాన్సలర్ | ఎంజెలా మెర్కెల్ |
| భారత్ | ప్రధానమంత్రి | నరేంద్ర మోదీ |
| ఇండోనేషియా | అధ్యక్షుడు | జోకో విడోడో |
| ఇటలీ | ప్రధానమంత్రి | మాతియో రెంజీ |
| జపాన్ | ప్రధానమంత్రి | షింజో అబే |
| మెక్సికో | అధ్యక్షుడు | ఎన్రిక్ పెనా నియతో |
| రష్యా | అధ్యక్షుడు | వ్లాదిమిర్ పుతిన్ |
| సౌదీ అరేబియా | డిప్యూటీ క్రౌన్ | ప్రిన్స్ మొహ మ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ |
| దక్షిణ కొరియా | అధ్యక్షురాలు | పార్క గెన్ హై |
| దక్షిణాఫ్రికా | అధ్యక్షుడు | జాకబ్ జుమా |
| టర్కీ | అధ్యక్షుడు | రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ |
| యునెటైడ్ కింగ్డమ్ | ప్రధానమంత్రి | థెరిసా మే |
| యునెటైడ్ స్టేట్స్ | అధ్యక్షుడు | బరాక్ ఒబామా |
| యూరోపియన్ కౌన్సిల్ | ప్రెసిడెంట్ | డొనాల్డ్ టస్క్ |
No comments:
Post a Comment