AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

అవార్డులు అక్టోబరు 2012

అవార్డులు అక్టోబరు 2012
బ్రహ్మ చెల్లాకు ఆసియా సొసైటీ అవార్డు 
ప్రతిష్టాత్మక ఆసియా సొసైటీ బెర్నార్డ్ స్క్వార్జ్ బుక్ అవార్డు-2012 సంవత్సరానికి భారత్‌కు చెందిన వ్యూహాత్మక అంశాల విశ్లేషకుడు బ్రహ్మ చెల్లాకు దక్కింది. ఆయన రాసిన వాటర్ ఏషియాస్ న్యూ బ్యాటిల్ గ్రౌండ్ పుస్తకానికి ఈ పురస్కారం లభించింది. 

ఇన్ఫోసిస్ నారాయ‌ణ‌మూర్తికి ప్రతిష్టాత్మక హూవ‌ర్-2012 మెడ‌ల్‌దేశంలో దాత‌త్వ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఇన్ఫోసిస్ వ్యవ‌స్థాప‌కుడు ఎన్‌. ఆర్‌. నారాయ‌ణ మూర్తి 2012 వ సంవ‌త్సరానికి గాను ప్రతిష్టాత్మక హూవ‌ర్ మెడ‌ల్ అందుకున్నారు. లాభాపేక్షకు తావు లేకుండా సాంకేతిక‌త‌కు సంబంధంలేని గొప్ప సేవ‌ల‌ను స‌మాజానికి అందిస్తున్న ఇంజినీర్లకు ఈ మెడ‌ల్‌ను అందిస్తారు.అక్టోబ‌ర్ 26 న అమెరికాలోని సియెట్‌లో జరిగిన గ్లోబ‌ల్ హ్యుమానిటేరియ‌న్ టెక్నాల‌జీ స‌మావేశంలో నారాయ‌ణ మూర్తి ఈ మెడ‌ల్ అందుకున్నారు. 

జీవ వైవిధ్య అవార్డులు
తొలిసారిగా భారత జీవ వైవిధ్య అవార్డులను హైదరాబాద్‌లో ముగి సిన యూఎన్ జీవ వైవిధ్య సదస్సు సందర్భంగా (అక్టోబర్ 18న) ప్రదానం చేశారు. భారత్-యూఎన్‌డీపీ నెలకొల్పిన ఈ అవార్డులను తొలిసారిగా అడవులు, వన్యప్రాణులు, పర్యావరణాన్ని కాపాడేందుకు తోడ్పడుతున్న నాలుగు సంస్థలకు ప్రదానం చేశారు. ఈ అవార్డులను షిన్ జహనియా జంగిల్ సురక్ష (ఒడిశా), శంకర్‌పల్లి గ్రామ పంచాయతీ (మహారాష్ట్ర), వన్‌ఉత్థాన్ సంస్థాన్ (రాజస్థాన్), పెరియార్ టైగర్ రిజర్వు(కేరళ)లకు ప్రకటించారు. ఈ అవార్డు కింద లక్ష రూపాయల నగదు. ప్రశంసాపత్రం అందజేస్తారు. దేశవ్యాప్తంగా వచ్చిన 150 నామినేషన్లలో ఎం.ఎస్ స్వామినాథన్ ఆధ్వర్యంలోని కమిటీ ఈ నాలుగు సంస్థలను ఎంపిక చేసింది. ప్రతి సంవత్సరం ఈ అవార్డులను అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం పురస్కరించుకుని మే 22న అందజేస్తారు.

నోబెల్ బహుమతులు -2012వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని 2012 సంవత్సరానికి బ్రిటన్‌కు చెందిన జాన్‌బి. గుర్డన్(79), జపాన్‌కు చెందిన షిన్యా యమనకలలు సంయుక్తంగా దక్కించుకున్నారు. పరిణతి చెందిన మూలకణాన్ని ప్లూరిపొటెంట్ రకపు కణంగా మార్చవచ్చనే విషయాన్ని శాస్త్ర పూర్వకంగా నిరూపించినందుకు వీరికి సంయుక్తంగా అక్టోబర్ 8న నోబెల్ ప్రకటించారు. గుర్డాన్ న్యూక్లియర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ క్లోనింగ్‌లపై దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. షిన్యా అంతర్జాతీయ స్టెమ్ సెల్స్ పరిశోధన సంస్థ ప్రస్తుత అధ్యక్షుడు. ప్లూరిపొటెంట్ ద్వారా చర్మంలో యవ్వన గుణాలను పునరుద్ధరింపజేయడానికి చేసిన పరిశోధనలు ఈయనకు గుర్తింపు తెచ్చాయి.
భౌతిక శాస్త్రం: సెర్జ్ హరోచే(పాన్స్), డెవిడ్ వైన్‌లాండ్ (అమెరికా)లు సంయుక్తంగా ఎంపికయ్యారు. క్వాంటమ్ పార్టికల్స్‌పై చేసిన పరిశోధనలకు నోబెల్ లభించింది.

టెస్సీ థామస్‌కు లాల్ బహదూర్ శాస్త్రి అవార్డు ప్రతిష్టాత్మక ‘లాల్ బహదూర్ శాస్త్రి జాతీయ అవార్డు’ను రక్షణశాఖ మహిళా శాస్త్రవేత్త టెస్సీ థామస్‌కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అక్టోబర్ 1 ప్రదానం చేశారు. అగ్ని క్షిపణి ప్రాజెక్టులో థామస్ సేవలందిస్తున్నారు. క్షిపణి పరిజ్ఞానంలో ఆమె చేసిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డు కింద ఆమెకు రూ. 5 లక్షల నగదు, ప్రశంసా పత్రం బహూకరిస్తారు. ప్రతి సంవత్సరం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, అకడెమిక్స్, మేనేజ్‌మెంట్‌లలో విశేష కృషి చేసిన వారికి ఈ అవార్డును అందజేస్తారు.

సంగీత నాటక అకాడెమీ ఫెలోషిప్స్2011 సంవత్సరానికి ప్రతిష్టాత్మక సంగీత నాటక అకాడెమీ ఫెలోషిప్‌కు 11 మంది ప్రముఖులు ఎంపికయ్యారు. వీరిలో సరోద్ సంగీత విద్వాంసుడు అమ్జాద్ అలీఖాన్, పద్మ సుబ్రమణ్యం, ముకుంద్‌లాల్, హరిప్రసాద్ చౌరాసియా, శివకుమార్ శర్మ, కావీ విశ్వనాథ శివరామన్, మోహన్ చంద్రశేఖరన్, రాజ్‌కుమార్ సింఘాజిత్ సింగ్, కలామండలం గోపి, చంద్రశేఖర బసవన్నెప్ప కంబారా, హస్నమ్ కన్హేలాల్ ఉన్నారు. వీరికి ఒక్కొక్కరికి రూ. 3 లక్షల నగదు తామ్రపత్రం బహూకరిస్తారు.
2013 ఆస్కార్‌కు ‘బర్ఫీ’ 2013 ఆస్కార్ అవార్డులకు విదేశీ కేటగిరీ(ఉత్తమచిత్రం) విభాగంలో బాలీవుడ్ చిత్రం ‘బర్ఫీ’ నామినేట్ అయింది. ఈ చిత్రానికి అనురాగ్ బసు దర్శకత్వం వహించారు. 

ఇండియన్ న్యూక్లియర్ సొసైటీ అవార్డులు2012వ సంవత్సరానికి ఇండియన్ న్యూక్లియర్ సొసైటీ అవార్డులను సెప్టెంబర్ 25న ప్రకటించారు. సైన్స్ కమ్యూనికేషన్‌లో అవుట్ స్టాండింగ్ సర్వీసు, హోమీ బాబా లైఫ్‌టైం అఛీవ్‌మెంట్ అవార్డులను ప్రకటించారు. 

అవుట్ స్టాండింగ్ సర్వీస్ అవార్డు: ఈ అవార్డుకు ‘ఫ్రంట్‌లైన్’ పత్రిక అసోసియేట్ ఎడిటర్ టి.ఎస్, సుబ్రమణియణ్, ట్రాంబేలోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ మీడియా రిలేషన్స్ హెడ్ ఆర్. కె. సింగ్ ఎంపికయ్యారు.

హోమీబాబా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు: ఈ అవార్డుకు ఇండోర్‌లోని రాజారామన్న సెంటర్ ఫర్ అడ్వాన్‌‌సడ్ టెక్నాలజీ సెంటర్ మాజీ డెరైక్టర్ డి.డి. బవాల్కర్, యురేనియం కార్పొరేషన్ మాజీ చైర్మన్ రామచంద్రగుప్తా ఎంపికయ్యారు. 

రైట్ లైవ్లీహుడ్ అవార్డులురైట్ లైవ్లీహుడ్ అవార్డులు 2012 సంవత్సరానికిగాను నలుగురికి దక్కాయి. వీటిని సెప్టెంబర్ 27న ప్రకటించారు. పర్యావరణం, అంతర్జాతీయ అభివృద్ధికి కృషి చేసిన వారికి ప్రతి ఏటా ఈ అవార్డులను అందజేస్తారు. ఈ పురస్కారాలను 
1980లో స్వీడిష్-జర్మన్ జకోబ్ ఒన్ ఉక్స్‌కుల్ స్థాపించాడు. దీనిని నోబెల్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తారు. వివరాలు..
విజేతలు:
గౌరవ పురస్కారం: టర్కీ పర్యావరణ ఉద్యమ పితామహుడు హెరెట్టిన్ కరాకా(90)కు దక్కింది. 

జ్యూరీ పురస్కారాలు:సిమా సమర్(55)(ఆఫ్ఘనిస్థాన్): ఈమె మానవ హక్కుల కార్యకర్త, ఆఫ్ఘనిస్థాన్ మాజీ మంత్రి. బుర్ఖా సంప్రదాయాన్ని వ్యతిరేకించారు. మహిళల హక్కులు, అభ్యున్నతి కోసం పోరాడినందుకు ఆమెకు ఈ అవార్డు దక్కింది. 

జీన్‌షార్ఫ్(84): అమెరికా రాజకీయ సిద్ధాంత కర్త, అహింసాయుత విప్లవాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం తెచ్చిన నిపుణుడు.

క్యాంపెయిన్ ఎగనెస్ట్ ఆర్‌‌మ్స ట్రేడ్ (యూకే): ఇది ఆయుధ వ్యాపార వ్యతిరేక ప్రచారం సాగిస్తున్న స్వచ్ఛంద సంస్థ.

No comments:

Post a Comment