AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ అక్టోబరు 2014

సైన్స్ & టెక్నాలజీ అక్టోబరు 2014
అతిపెద్ద టెలిస్కోప్ నిర్మాణంలో భారత్
హవాయ్ దీవిలో నిర్మిస్తున్న ప్రపంచ అతిపెద్ద థర్టీ మీటర్ టెలిస్కోప్ (టీఎంటీ) నిర్మాణంలో జపాన్, అమెరికా, చైనా, కెనడాలతోపాటు భారత్ కూడా భాగం పంచుకుంటోంది. దీని నిర్మాణ ప్రారంభ కార్యక్రమం అక్టోబర్ 7న జరిగింది. హవాయి దీవిలో 4,012 మీటర్ల ఎత్తై మౌనా కీ అగ్ని పర్వతంపై 1.4 బిలియన్ డాలర్ల (రూ. 8,618 కోట్లు) వ్యయంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ టెలిస్కోపు ద్వారా 500 కి.మీ దూరంలో ఉన్న నాణెం పరిమాణాన్ని స్పష్టంగా చూడొచ్చు. ఈ టీఎంటీ నిర్మాణం 2022 నాటికి పూర్తవుతుంది.


పీఎస్‌ఎల్‌వీ-సీ 26 ప్రయోగం విజయవంతం 
ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1సి ఉపగ్రహాన్ని పీఎస్‌ఎల్‌వీ-సీ 26 నౌక శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం నుంచి అక్టోబరు 16న విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. నావిగేషన్ కోసం ప్రయోగించిన మూడో ఉపగ్రహం ఇది. అర్ధరాత్రి రాకెట్ ప్రయోగించడం ఇది రెండోసారి.

విజయవంతమైన నిర్భయ్ క్షిపణి ప్రయోగం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తొలి దీర్ఘశ్రేణి సబ్‌సానిక్ క్రూయిజ్ క్షిపణి నిర్భయ్ ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైంది. దీన్ని అక్టోబరు 17న ఒడిశాలోని చాందీపూర్ ప్రయోగ కేంద్రం నుంచి నిర్వహించారు. ఇది 1000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అణ్వస్త్రాలను కూడా మోసుకుపోగలదు. భూమి, ఆకాశం, సముద్రంపైనుంచి దీన్ని ప్రయోగించవచ్చు. ఇది కనిష్టంగా ఐదు మీటర్ల ఎత్తులో, గరిష్టంగా ఐదు కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించగలదు. ప్రస్తుతం బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి 290 కి.మీ మాత్రమే ప్రయాణిస్తుంది. నిర్భయ్‌ను రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో)కు చెందిన ఏరో నాటికల్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ సంస్థ (బెంగళూరు) అభివృద్ధి చేసింది. అమెరికాకు చెందిన తోమహాక్, పాకిస్థాన్‌కు చెందిన బాబర్ క్షిపణులకు నిర్భయ్ పోటీగా నిలుస్తుంది.

No comments:

Post a Comment