AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ ఫిబ్రవరి 2015

సైన్స్ & టెక్నాలజీ ఫిబ్రవరి 2015
భారత్, శ్రీలంక మధ్య పౌర అణు ఒప్పందం
భారత్, శ్రీలంక పౌర అణు ఒప్పందంపై సంతకాలు చేశాయి. శ్రీలంక అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన భారత పర్యటనలో భాగంగా 2015 ఫిబ్రవరి 16న ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. శ్రీలంక ఇలాంటి ఒప్పందం చేసుకోవడం ఇదే తొలిసారి. దీని కింద నైపుణ్యాలు, వనరులను బదలాయించుకుంటారు. అణు భద్రతలో సిబ్బందికి శిక్షణ కల్పిస్తారు. రక్షణ, వ్యూహాత్మక సహకారాన్ని కూడా విస్తరించుకోవాలని ఇరు దేశాలు అంగీకరించాయి. కళలు, సంస్కృతుల విషయంలోనూ ఇరు దేశాలు సంబంధాలు పెంపొందించుకుంటాయి. నలందా యూనివర్సిటీ ప్రాజెక్టులో శ్రీలంక భాగం పంచుకునేందుకు అవగాహన ఒప్పందం కుదిరింది. వ్యవసాయ రంగంలో సహకారానికి సంబంధించి మరో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.
ప్రపంచపు శక్తిమంతమైన మైక్రోస్కోప్
ప్రపంచంలోనే అత్యధిక (రెజల్యూషన్ సామర్థ్యం) శక్తిమంతమైన మైక్రోస్కోప్‌ను జపాన్‌కు చెందిన అంతర్జాతీయ కంపెనీ హిటాచీ రూపొందించింది. ఈ మైక్రోస్కోప్‌తో ఎలక్ట్రాన్ల ప్రవాహం ఆధారంగా అతి సూక్ష్మ పరిమాణంలో ఉండే అణువులనూ సైతం స్పష్టంగా చూడవచ్చు. దీనిపేరు ట్రాన్స్‌మిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ (టీఈఎమ్). 2010 నుంచి అభివృద్ధి చేస్తున్నారు. ఫిబ్రవరి రెండో వారంలో దీని నిర్మాణం పూర్తయింది. టీఈఎమ్ 43 పికోమీటర్ (అతిసూక్ష్మ అణువు సగం వ్యాసార్థానికి సమానం) రెజల్యూషన్ కలిగి ఉంటుంది. పికోమీటర్ అంటే మీటరులో లక్షకోట్లవ వంతు. అంటే ఇంతవరకూ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ ద్వారా కూడా చూడని సూక్ష్మాతి సూక్ష్మ కణాలను దీని ద్వారా చాలా స్పష్టంగా చూడవచ్చు. ఇది ఒక పెద్ద గదిని ఆక్రమించేంత పరిమాణంలో ఉంటుంది. 1930లో ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నేటి దాకా శాస్త్రవేత్తలు ఎన్నో కొత్త విషయాలు కనిపెట్టారు.
పృథ్వీ -2 పరీక్ష విజయవంతం
ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే అణు సామర్థ్యం ఉన్న పృథ్వీ-2 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. దీన్ని ఒడిశాలోని చాందీపూర్ పరీక్ష కేంద్రం నుంచి 2015 ఫిబ్రవరి 19న పరీక్షించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఈ మధ్య తరహా బాలిస్టిక్ క్షిపణి 350 కి.మీ. దూరంలోని లక్ష్యాలను చేధించగలుగుతుంది.
రూ. లక్ష కోట్లతో 7 యుద్ధ నౌకలు, 6 అణు జలాంతర్గాముల నిర్మాణం
దేశీయంగా ఏడు యుద్ధ నౌకలు, ఆరు అణు ఇంధన జలాంతర్గాముల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 17న ఆమోదం తెలిపింది. వీటి నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారు. ఈ మేరకు భద్రతపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ సంఘం నిర్ణయం తీసుకుంది. 30 ఏళ్లలో 24 జలాంతర్గాములను నిర్మించే కార్యక్రమానికి 1999లో ఆమోదం లభించింది. ఇందులో భాగంగా రూ. 50,000 కోట్లతో ప్రాజెక్టు-75 ఎ కింద నాలుగు యుద్ధ నౌకలను మజగావ్ డాక్ (ముంబై)లో, మూడింటిని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్‌‌స అండ్ ఇంజనీర్‌‌స సంస్థ (కోల్‌కతా)లో నిర్మిస్తారు. భారత్ ఆరు జలాంతర్గాములను విదేశీ సహకారంతో నిర్మిస్తోంది. మొదటిదాన్ని పదేళ్లలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
అత్యాధునిక సూపర్ సోనిక్ క్షిపణి బ్రహ్మోస్ పరీక్ష విజయవంతమైంది. దీన్ని 2015 ఫిబ్రవరి 14న గోవా తీరంలో ఐఎన్‌ఎస్ కోల్‌కతా నుంచి పరీక్షించారు. ఇది ధ్వని వేగం కంటే 1.4 రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. 290 కి.మీ. పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలుగుతుంది. ఈ క్షిపణిని ఇప్పటికే సైన్యం, నౌకాదళంలో చేర్చారు. 2014లో నౌకాదళంలోకి చేరిన ఐఎన్‌ఎస్ కోల్‌కతా నుంచి 16 బ్రహ్మోస్ క్షిపణులను, మిగిలిన యుద్ధ నౌకల ద్వారా ఒకేసారి 8 బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించే వీలుంది.
హవాయిలో అతిపెద్ద సోలార్ టెలిస్కోప్
ప్రపంచంలో అతిపెద్ద సోలార్ టెలిస్కోప్‌ను హవాయిలోని మాయులో నెలకొల్పుతున్నారు. ఇది 2019లో ప్రారంభం కానుంది. దీంతో అంతరిక్ష వాతావరణ ప్రమాదాలను అంచనా వేసే సామర్థ్యం మెరుగవుతుంది.

‘తేజస్’ విజయం
నావికాదళ అవసరాల కోసం రూపొందించిన రెండో నావల్ ప్రొటోటైప్ తేజస్ విమానం తొలిసారి విజయవంతంగా నింగిలోకి ఎగిరింది. ఫిబ్రవరి 7న బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) లోని రన్ వే నుంచి గాలిలోకి ఎగిరిన ఈ యుద్ధవిమానం 35 నిమిషాల పాటు చక్కర్లు కొట్టింది. దీన్ని స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది. ఇప్పటికే వైమానిక దళంలో తేజస్‌ను చేర్చారు.

హిందూ మహా సముద్రంలో భారత్ ఖనిజ వేటహిందూ మహా సముద్రంలో విలువైన ఖనిజాల అన్వేషణకు భారత ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 10 వేల చదరపు కిలోమీటర్ల ఈ సముద్ర గర్భంలో బంగారం, వెండి, ప్లాటినం వంటి విలువైన లోహాలతోపాటు అమూల్యమైన ఖనిజాలు ఉన్నట్లు సైంటిస్ట్‌లు అంచనా వేస్తున్నారు.

వీటిని వెలికి తీసేందుకు చర్యలు ప్రారంభించారు. ఖనిజాల వెలికితీతకు కేంద్ర ఎర్త్ సెన్సైస్ శాఖ జమైకాలోని ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ(ఐఎస్‌ఏ)తో ఒప్పందాన్ని ఖరారు చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. తమ ఖనిజ అన్వేషణ ప్రణాళికను ఐఎస్‌ఏ ఆమోదించిందని నేషనల్ సెంటర్ ఫర్ అంటార్క్‌టిక్ అండ్ ఓషియన్ రీసెర్చ్(ఎన్‌సీఏఓఆర్) డెరైక్టర్ ఎస్.రాజన్ తెలిపారు. సముద్ర గర్భంలోని నిర్దేశిత ప్రాంతంలో 15 ఏళ్లపాటు లోహాల అన్వేషణ, వెలికితీతకు ఐఎస్‌ఏతో ఒప్పందం కుదర్చుకోనున్నట్లు వెల్లడించారు.

No comments:

Post a Comment