AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ డిసెంబరు 2015

సైన్స్ & టెక్నాలజీ డిసెంబరు 2015
బరాక్ 8 క్షిపణి పరీక్ష విజయవంతం
యుద్ధ నౌకల నుంచి ప్రయోగించే బరాక్ 8 క్షిపణిని భారత నావికాదళం విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి గగన తలంలోకి ప్రయోగించే 70 కిలోమీటర్ల పరిధి(రేంజ్) ఉన్న బరాక్ 8 క్షిపణిని అరేబియా సముద్రంలో ‘ఐఎన్‌ఎస్ కోల్‌కతా’ నౌక నుంచి పరీక్షించారు. దీన్ని భారత్, ఇజ్రాయెల్ సంయుక్తంగా అభివృద్ధిపరిచాయి. ఉపరితలం నుంచి గగన తలంలోకి ప్రయోగించే క్షిపణుల్లో ఇది అత్యంత పరిధి కలిగి ఉంది. దీంతో పాటు క్షిపణులను గుర్తించి, ప్రమాదాలను పసిగట్టే రాడార్ వ్యవస్థను కూడా అభివృద్ధిపరిచారు. ఈ రాడార్ వ్యవస్థ ద్వారా 250 కిలోమీటర్లకు పైగా పరిధిలో వందలాది శత్రు క్షిపణులు, అనుమానాస్పద విమానాలు, డ్రోన్‌లను ఒకేసారి గుర్తించవచ్చు.

పీఎస్‌ఎల్‌వీ-సీ29 ప్రయోగం విజయవంతం
భారత్ చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ (పీఎస్‌ఎల్‌వీ-సీ29) ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి డిసెంబర్ 16న ఆరు సింగపూర్ ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ-సీ29 భూమికి 550 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఇది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) షార్ నుంచి చేపట్టిన 50వ ప్రయోగం. ఆరు ఉపగ్రహాలలో రిమోట్ సెన్సింగ్ కోసం రూపొందించిన టెలియాస్-01 ఉపగ్రహం (బరువు 400 కిలోలు)తో పాటు కెంట్ రిడ్జ్ (78 కిలోలు), వెలాక్సి-సీ1 (123 కిలోలు), వెలాక్స్-2 (13 కిలోలు), గెలాషియో (3.4 కిలోలు), ఎథినోక్సాట్ అనే చిన్న ఉపగ్రహం ఉన్నాయి. ఇస్రో 1999 నుంచి వాణిజ్య పరంగా ఉపగ్రహ ప్రయోగాలను చేపట్టటం ప్రారంభించింది.
భూమిపైకి తిరిగొచ్చిన ‘ఫాల్కన్9’ రాకెట్
అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే తొలిసారిగా నింగిలోకి దూసుకెళ్లిన ‘ఫాల్కన్ 9’ అనే రాకెట్ విజయవంతంగా భూమిపైకి వచ్చింది. కాలిఫోర్నియాకు చెందిన స్పేస్ ఎక్ప్‌ప్లొరేషన్ టెక్నాలజీస్ కంపెనీ(స్పేస్-ఎక్స్)అనే ప్రైవేట్ సంస్థ దీన్ని రూపొందించింది. ఎన్నో విఫలయత్నాల తర్వాత భూమిపై ఫాల్కన్ నేరుగా ల్యాండ్ అయినట్లు కంపెనీ తెలిపింది. రాకెట్ మొదటి దశ ఫ్లోరిడాలోని కేప్‌కెనవరల్ వద్ద డిసెంబర్ 21న నేలపై దిగినట్లు పేర్కొన్నారు. ఆర్బ్‌కాం కంపెనీకి చెందిన 11 కృత్రిమ ఉపగ్రహాలను ఫాల్కన్ భూ సమీప కక్ష్యలో ప్రవేశపెట్టింది. స్పేస్-ఎక్స్‌ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అభినందించింది. కృత్రిమ ఉపగ్రహాలను (పేలోడ్) అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ప్రతిసారి కొన్ని వేల కోట్ల రూపాయలు వృథా అవుతున్నాయి. ఎంతో విలువైన రాకెట్ సామగ్రి కూడా నాశనం అవుతోంది. ఇప్పుడు స్పేస్-ఎక్స్ చేపట్టిన ప్రయోగంతో రాకెట్ ప్రయోగాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. అమెజాన్ కంపెనీకి చెందిన బ్లూ ఆరిజిన్ అనే రాకెట్ల తయారీ కంపెనీ 2015 నవంబర్‌లో ఈ తరహా ప్రయోగం విజయవంతంగా చేపట్టింది. అయితే ఈ ప్రయోగంలో నేరుగా భూమిపై ల్యాండ్ కాకుండా పారాచూట్ సహయంతో నేలపైకి వచ్చింది.

హైడ్రోజన్ బాంబు అభివృద్ధి చేశాం: ఉత్తర కొరియా
హైడ్రోజన్ బాంబును అభివృద్ధి చేసినట్లు ఉత్తర కొరియా ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశనేత కిమ్ జాంగ్ ఉమ్ డిసెంబర్ 10న ప్రకటన చేశారు. కాగా, దీనిపై వివిధ దేశాల నిపుణులు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. హైడ్రోజన్ బాంబును థెర్మోన్యూక్లియర్ బాంబు అని కూడా పిలుస్తారు. దీని తయారీలో అధునాతన టెక్నాలజీని ఉపయోగిస్తారు. హైడ్రోజన్ బాంబు అణుబాంబు కంటే శక్తిమంతమైన పేలుడును సృష్టిస్తుంది. ఉత్తర కొరియా 2006, 2009, 2013లలో భూగర్భంలో అణుపరీక్షలు నిర్వహించింది. 

షహీన్-3, షహీన్ 1-ఎ క్షిపణిలను ప్రయోగించిన పాక్ అణ్వస్త్ర సామర్థ్యం గల షహీన్-3, షహీన్ 1-ఎ క్షిపణిలను పాకిస్థాన్ విజయవంతంగా ప్రయోగించింది. అరేబియా సముద్రంలో డిసెంబర్ 11న షహీన్-3ని, 15న షహీన్ 1-ఎను పరీక్షించింది. సంప్రదాయ అణ్వాయుధాలను మోసుకెళ్లే షహీన్-3.. 2,750 కి.మీ దూరంలోని లక్ష్యాలను, షహీన్ 1-ఎ.. 900 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించగలవు. భారత్‌లోని అనేక నగరాలు వీటి పరిధిలోకి వస్తాయి.

ఇస్రో 50వ అంతరిక్ష ప్రయోగం విజయవంతంభారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తన 50వ అంతరిక్ష ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి డిసెంబర్ 16న పీఎస్‌ఎల్‌వీ సీ-29 రాకెట్ ఆరు విదేశీ ఉపగ్రహాలతో నింగిలోకి దూసుకెళ్లింది. ఇది ఇస్రో 50వ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ సీ-29 ద్వారా సింగపూర్‌కు చెందిన ఆరు ఉపగ్రహాలను 550 కి.మీల ఎత్తులోని సన్ సింక్రోనస్ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. 1999లో వాణిజ్యపరమైన ప్రయోగాలకు శ్రీకారం చుట్టిన ఇస్రో ఇప్పటి వరకు 20 దేశాలకు చెందిన 57 ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇస్రోకు ఇది 32వ పీఎస్‌ఎల్వీ ప్రయోగం. పీఎస్‌ఎల్‌వీ సీ - 29 రాకెట్ పొడవు 44.4 మీటర్లు, బరువు 227.6 టన్నులు. 

కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఉపగ్రహాల వివరాలు..
  • టెలియోస్-1 (400 కిలోలు)
  • కెంట్‌రిడ్జ్ (78 కిలోలు)
  • వెలాక్సి-సీ1 (123 కిలోలు)
  • వెలాక్సి-11 (13 కిలోలు)
  • గెలాషియో (3.4 కిలోలు)
  • ఎథినోక్సాట్

విద్యార్థులు అభివృద్ధి చేసిన క్యూబ్‌శాట్స్ ప్రయోగించిన నాసాఅమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తొలిసారిగా విద్యార్థులు రూపొందించిన మూడు చిన్న పరిశోధన ఉపగ్రహాల(క్యూబ్‌శాట్స్)ను ప్రయోగించింది. రెండు విశ్వవిద్యాలయాలు, ఓ ప్రాథమిక పాఠశాలకు చెందిన సుమారు 400 మంది విద్యార్థులు ఈ క్యూబ్‌శాట్స్‌కు రూపకల్పన చేసి అభివృద్ధి చేశారు. ఎడ్యుకేషనల్ లాంచ్ ఆఫ్ నానోశాటిలైట్(ఈఎల్‌ఏఎన్‌ఏ) మిషన్స్ తొమ్మిదో ఇన్‌స్టాల్‌మెంట్‌లో భాగంగా క్యూబ్‌శాట్ లాంచ్ ఇన్షియేటివ్(సీఎస్‌ఎల్‌ఐ) కార్యక్రమం ద్వారా ఈ క్యూబ్‌శాట్స్‌ను ఎంపికచేసినట్లు నాసా ఓ ప్రకటనలో తెలిపింది. ఫ్లోరిడాలోని కేప్ కనవెరల్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి డిసెంబర్ 3న అట్లాస్-5 రాకెట్ ద్వారా వీటిని ప్రయోగించారు. ఖగోళ అన్వేషణ, భూ పర్యవేక్షణ తదితర నాసా మిషన్లకు ఈ శాటిలైట్లు తక్కువ ఖర్చులో సేవలందించనున్నాయి.

ఐసీటీ సూచీలో భారత్‌కు 131వ ర్యాంకుయూఎన్ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్(ఐసీటీ) 167 దేశాలతో రూపొందించిన ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ టెక్నాలజీ అభివృద్ధిసూచీ(ఐసీటీ)లో భారత్ 131వ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 3.2 బిలియన్ల మంది(ప్రపంచ జనాభాలో 43.4 శాతం మంది) ఆన్‌లైన్ సేవలు వినియోగించుకుంటున్నారని ఐటీయూ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఈ సూచీలో దక్షిణ కొరియా మొదటిస్థానంలో నిలువగా, ఐస్‌లాండ్ రెండో స్థానంలో నిలిచింది.

No comments:

Post a Comment