AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ మార్చి 2014

సైన్స్ & టెక్నాలజీ మార్చి 2014
సేవలు ప్రారంభించిన ఐఎన్‌ఎస్ సుమేధ
నౌకాదళం ఐఎన్‌ఎస్ సుమేధను తన విధుల్లోకి చేర్చుకుంది. దేశీయంగా రూపొందించి, నిర్మించిన అత్యాధునిక గస్తీ నౌక ఐఎన్‌ఎస్ సుమేధను వైస్ అడ్మిరల్ అనిల్ చోప్రా మార్చి 7న పనాజీలో నౌకాదళంలో చేర్చారు. దీన్ని గోవాషిప్ యార్‌‌డ లిమిటెడ్ నిర్మించింది.

సాగర గర్భం నుంచి అణ్వస్త్ర క్షిపణి పరీక్ష 
గగనతలం, ఉపరితలం నుంచే కాకుండా సముద్ర గర్భం నుంచి సైతం దీర్ఘశ్రేణి అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించగల సత్తాను భారత్ సాధించింది. జలాంతర్గాముల నుంచి ప్రయోగించగల దీర్ఘశ్రేణి సబ్‌మెరైన్ -లాంచ్ బాలిస్టిక్ మిసైల్ (ఎస్‌ఎల్‌బీఎం)ను మార్చి 24న బంగాళాఖాతంలో రక్షణ శాఖ వర్గాలు విజయవంతంగా ప్రయోగించాయి. సముద్ర జలాల అడుగు భాగం నుంచి జలాంతర్గామి ద్వారా బీవో 5 అణ్వస్త్ర క్షిపణిని రక్షణశాఖ ఇదివరకే విజయవంతంగా పరీక్షించినప్పటికీ దాని లక్ష్య పరిధి 700 కిలోమీటర్లు మాత్రమే. తాజాగా పరీక్షించిన క్షిపణి పరిధి 2 వేల కిలోమీటర్లు. నీటి లోపలి నుంచి ప్రయోగించేలా భారత్ రూపొందించిన వాటిలో ఇదే అత్యధిక పరిధిలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణి కావడం విశేషం. దీంతో గగన, భూతలాలతోపాటు సముద్ర గర్భం నుంచి సైతం దీర్ఘశ్రేణి అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించే సామర్థ్యంలో అమెరికా, ఫ్రాన్స్, రష్యా, చైనా వంటి దేశాల సరసన భారత్ నిలిచింది.

పృథ్వి -2 క్షిపణి పరీక్ష విజయవంతంఅణ్వస్త్ర సామర్థ్యం గల వృథ్వి -2 క్షిపణిని ఒడిశాలోని చాందీపూర్‌లో ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజి నుంచి మార్చి 28న భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 500 నుంచి వెయ్యి కిలోల బరువుగల ఆయుధాలను మోసుకుపోగలదు. ఈ క్షిపణిని 2003లో సైన్యానికి అప్పగించారు. శిక్షణలో భాగంగా ప్రస్తుత పరీక్షను సైన్యం నిర్వహించింది.

No comments:

Post a Comment