AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ జూలై 2014

సైన్స్ & టెక్నాలజీ జూలై 2014
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష
ఆధునీకరించిన బ్రహ్మోస్ క్షిపణిని రక్షణ,పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్‌డీఓ) ఒడిశాలోని చాందీపూర్ వద్ద గల పరీక్షా కేంద్రం నుంచి జూలై8న విజయవంతంగా పరీక్షించింది. ఇది 500 సెకన్లలో 290 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించింది. మోబైల్ లాంఛర్ నుంచి ఈ పరీక్ష నిర్వహించారు. ఇది బ్రహ్మోస్ 44వ ప్రయోగం. ఈ క్షిపణికి పర్వతాలు, భవనాల మధ్య ఉండే రహస్య శత్రు స్థావరాలను కచ్చితత్వంతో ధ్వంసం చేయగలదు. 
సాగర శోధనకు ‘సింధు సాధన‘
దేశంలో తొలిసారిగా నిర్మించిన పరిశోధన నౌక సింధు సాధన ప్రారంభమైంది. ప్రధానమంత్రి కార్యాలయ శాఖ సహాయమంత్రి జితేందర్ సింగ్ దీన్ని జూలై 13న గోవాతీరంలో జాతికి అంకితం చేశారు.

అత్యాధునిక సమాచార వ్యవస్థ.. దిశానెట్
విపత్తులు, ప్రమాదాల సమయంలో సమాచార వ్యవస్థలు పనిచేయని ప్రదేశాల్లో అండగా నిలిచే అత్యాధునిక సమాచార వ్యవస్థను భారత్-జపాన్ శాస్త్రవేత్తలు జూలై 24న ప్రదర్శించారు. దీనికి దిశానెట్ అని పేరు పెట్టారు. సమాచార వ్యవస్థ అందుబాటులో లేనిచోట కూడా ఇది పనిచేస్తుంది.ఆపదలో ఉన్న వారికి ఆసరాగా నిలవ డమే కాకుండా బాధితులు, బంధువులకు సాంత్వన కలిగించడంలో ఇది కీలకం కానుంది. ఈ పరిశోధనలో హైదరాబాద్ ఐఐటీ, చెన్నై ఐఐటీ, ఎన్‌జీఆర్‌ఐతో పాటు టోక్యో కియో విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు పాలుపంచుకున్నారు. 

అండమాన్‌లో పరిశోధనలకు బయల్దేరిన సింధుసాధనభారత్ తొలిసారి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన పరిశోధన నౌక సింధుసాధన అండమాన్ సముద్రంలో పరిశోధన సాగించేందుకు జూలై 27న విశాఖ పోర్టునుంచి బయలుదేరింది. అత్యాధునిక పరిశోధన సదుపాయాలు గల ఈ నౌకను నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ పరిశోధనల కోసం గుజరాత్‌లోని ఏబీసీ షిప్‌యార్డ్ రూపొందించింది. రూ. 220 కోట్లతో నిర్మించిన ఈ నౌక 6వేల మీటర్ల లోతులో పరిశోధనలు నిర్వహించగలదు. 

క్లోనింగ్ ముర్రా జాతి కోడెదూడహ్యాండ్ గెడైడ్ క్లోనింగ్ ప్రక్రియ ద్వారా ఛండీగఢ్‌లోని నేషనల్ డెయిరీ పరిశోధన సంస్థ (ఎన్‌డీఆర్‌ఐ) శాస్త్రవేత్తలు ఒక కోడెదూడను సృష్టించారు. జూలై 23న జన్మించిన దీనికి రజత్ అని పేరు పెట్టారు.

No comments:

Post a Comment