AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ సెప్టెంబరు 2016

సైన్స్ & టెక్నాలజీ సెప్టెంబరు 2016
పీఎస్‌ఎల్‌వీ-సీ 35 ప్రయోగం విజయవంతం
పీఎస్‌ఎల్‌వీ సీ-35 ద్వారా ఒకే ప్రయోగంలో 8 ఉపగ్రహాలను రెండు వేర్వేరు కక్ష్యల్లోకి ప్రవేశపెట్టి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ రికార్డు సృష్టించింది. దీంతో ప్రపంచంలో అమెరికా, రష్యాల తర్వాత ఆ సామర్థ్యం సాధించిన మూడో దేశంగా అవతరించింది.

శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి సెప్టెంబర్ 6న ప్రయోగించిన పీఎస్‌ఎల్‌వీ-సీ35 వాహకనౌక స్వదేశీ ఉపగ్రహాలైన స్కాట్‌శాట్-1, ప్రథమ్, పైశాట్ తో పాటు ఐదు విదేశీ ఉపగ్రహాలను (మొత్తం 8) రెండు వేర్వేరు ఎత్తుల్లోని సూర్యానువర్తన ధ్రువకక్ష్యల్లోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది.
ఉపగ్రహాల వివరాలుస్కాట్‌శాట్-1:371 కిలోలు బరువుండే స్కాట్‌శాట్-1 ఐదేళ్ల పాటు సేవలు అందిస్తుంది. ఓషన్‌శాట్-2 కాలపరిమితి పూర్తవడంతో అత్యంత అధునాతమైన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన స్కాట్‌శాట్-1ను పంపారు. వాతావరణంపై ముందస్తు అంచనాలు, తుపానులను కనిపెట్టడం, ఆచూకీ కనుగొనే సేవలను ఇది అందిస్తుంది. 
భారత వర్సిటీల ఉపగ్రహాలు: 2 (ప్రథమ్‌శాట్-ముంబై ఐఐటీ, పైశాట్-బెంగళూరు పీఈఎస్ విశ్వవిద్యాలయం) 
అల్జీరియా ఉపగ్రహాలు: 3 (అల్‌శాట్-1బి, అల్‌శాట్-2బి, అల్‌శాట్-1ఎన్)
అమెరికా ఉపగ్రహం: 1 (పాత్‌ఫైండర్-1)
కెనడా ఉపగ్రహం: 1 (ఎన్‌ఎల్‌ఎస్-19)
మందులకు లొంగని ఇన్‌ఫెక్షన్లపై ఐరాస యుద్ధం
మందులకు లొంగని ఇన్‌ఫెక్షన్లు, మొండి సూక్ష్మక్రిములను తుదముట్టించేందుకు ఉద్దేశించిన ప్రకటనపై సెప్టెంబర్ 21న ఐరాసలోని 193 దేశాలు సంతకాలు చేశాయి. ఇది విజయవంతమైతే ఏటా 7 లక్షల మరణాలను నివారించే అవకాశం ఉంది. ఒక ఆరోగ్య అంశంపై ఐరాస ప్రకటన చేయడం ఇది నాలుగోసారి. 2001లో హెచ్‌ఐవీ, 2011లో సాంక్రమితేతర జబ్బులు, 2013లో ఎబోలాపై ఐరాస ప్రకటన చేసింది.
అతిపెద్ద రేడియో టెలీస్కోప్ విధుల ప్రారంభం
చైనా నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద రేడియో టెలీస్కోప్ సెప్టెంబర్ 25 నుంచి పనిచేయడం ప్రారంభించింది. గ్రహాంతరవాసుల ఉనికిని కనుగొనేందుకు ఇది ఉపయోగపడుతుంది.
గ్రహాంతర జీవాన్వేషణకు ప్రాజెక్టు
గ్రహాంతర జీవుల అన్వేషణ కోసం ‘బ్రేక్‌త్రూ లిజన్’ పేరుతో ఒక ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, రష్యా వ్యాపారవేత్త యూరీ మిల్నర్, భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్‌లు సంయుక్తంగా ప్రకటించారు. భూమిని పోలిన గ్రహం ప్రాక్జిమా బి నుంచి రేడియో సిగ్నల్స్‌ను వినడం కోసం దీనిని చేపడుతున్నారు. దీని వ్యయం 10 కోట్ల డాలర్లు(రూ.660 కోట్లు). ప్రాక్జిమా బి భూమికి నాలుగు కాంతి సంవత్సరాల దూరం(25 లక్షల కోట్ల కి.మీ)లో ఉంది.
ప్రపంచంలో అతిపెద్ద సోలార్ ప్లాంట్ ప్రారంభం
ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్లాంటును అదానీ గ్రీన్ ఎనర్జీ సంస్థ సెప్టెంబర్ 21న ప్రారంభించింది. తమిళనాడులోని రామాంతపూర్ జిల్లాలోగల కుమితిలో 648 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్లాంటును ఏర్పాటు చేశారు. 4,550 కోట్లతో దాదాపు 5 వేల ఎకరాల్లో నెలకొల్పిన ఈ ప్లాంటును తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్లాంటులో మొత్తం 25 లక్షల సోలార్ మాడ్యూల్స్, 576 ఇన్వెస్టర్లు, 154 ట్రాన్సుఫార్మర్లను ఏర్పాటు చేశారు.

క్షిపణి విధ్వంసక నౌక ‘మోర్ముగావో’ ప్రారంభం
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన అత్యాధునిక క్షిపణి విధ్వంసక యుద్ధనౌక ఐఎన్‌ఎస్ ‘మోర్ముగావో’ను సెప్టెంబర్ 17న ప్రారంభించారు. ముంబైలోని మజ్‌గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్(ఎండీఎల్) తయారు చేసిన ఈ నౌకను నావికా దళాధిపతి అడ్మిరల్ సునీల్ లాంబా సతీమణి రీనా ప్రారంభించి అరేబియా సముద్రంలోకి జలప్రవేశం చేశారు. మోర్ముగావో నుంచి ఉపరితలం నుంచి ఉపరిత లానికి, ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులను, జలాంతర్గామి విధ్వంసక రాకెట్లను ప్రయోగించవచ్చు. ఇది 7,300 టన్నుల సామర్థ్యంతో గరిష్టంగా గంటకు 30 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది.

గస్తీ నౌక రాణి గెయిడిన్‌లీ.. తీర గస్తీ దళానికి అప్పగింతభారత తీర గస్తీ దళం కోసం విశాఖ షిప్‌యార్డ్ రూపొందించిన గస్తీ నౌక రాణి గెయిడిన్‌లీని సెప్టెంబర్ 14న ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారులకు అప్పగించారు. ఈ నౌక పొడవు 51.5 మీటర్లు, వెడల్పు 8.3 మీటర్లు.

స్పేస్ ల్యాబ్ తియాంగాంగ్-2ను ప్రయోగించిన చైనాఅంతరిక్ష కేంద్రానికి అవసరమైన స్పేస్ ల్యాబ్ తియాంగాంగ్-2ను చైనా సెప్టెంబర్ 15న విజయవంతంగా ప్రయోగించింది. 2022 నాటికి మానవ సహిత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలన్న లక్ష్యంలో భాగంగా ఈ ల్యాబ్‌ను పంపింది. దీన్ని గోబీ ఎడారిలోని జియుక్వాన్ ఉపగ్రహ కేంద్రం నుంచి ప్రయోగించారు.

ముంబై ఐఐటీ నుంచి తొలి ఉపగ్రహంఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ-ముంబై) విద్యార్థులు తయారుచేసిన తొలి ఉపగ్రహం ‘ప్రథమ్’ను సెప్టెంబర్ 26న సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. ఐనోస్ఫియర్‌లో ఎలక్ట్రాన్లను లెక్కించడం కోసం దీనిని తయారు చేశారు. భూమి నుంచి 720 కిలోమీటర్ల ఎత్తులో నాలుగు నెలల పాటు ఇది పనిచేస్తుంది. ప్రథమ్ (ఐఐటీ-బీ), పైశాట్ (పెసిట్-బెంగళూరు) అనే రెండు ఉపగ్రహాలతో పాటు మరో ఆరు ఉపగ్రహాలను పీఎస్‌ఎల్‌వీ ద్వారా పంపుతున్నారు.

ఇన్‌శాట్-3డీఆర్ ప్రయోగం విజయవంతం
నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి సెప్టెంబర్ 8న వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్-3డీఆర్‌ను ఇస్రో విజయవంతంగా పయోగించింది. దీని కోసం దేశీయంగా రూపొందించిన సంక్లిష్ట క్రయోజనిక్ అప్పర్ స్టేజ్ అమర్చిన భారీ రాకెట్ జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్05 ను ఉపయోగించారు. ఇది ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది.
ఇన్‌శాట్-3డీఆర్ పనిచేయని ఇన్‌శాట్-3డీ స్థానంలో వాతావరణ, గాలింపు, సహాయ చర్యల్లో సాయపడనుంది. ఈ ఉపగ్రహంలో 6-చానల్ ఇమేజర్, 9-చానల్ సౌండర్ పరికరాలు, వాతావరణ సమాచార (డాటా) రిలే ట్రాన్స్‌పాండర్స్ (డీఆర్‌టీ), శాటిలైట్ ఎయిడెడ్ సెర్చ్ అండ్ రెస్క్యూ (ఎస్‌ఏఎస్ అండ్ ఆర్) పరికరాలను అమర్చారు.
ఉపగ్రహ విశేషాలు
రాకెట్:జీఎస్‌ఎల్‌వీ ఎఫ్05
తీసుకెళ్లగల సామర్థ్యం: 415.2 టన్నులు
ఎత్తు: 49.1 మీటర్లు 
వ్యాసం- 3.4 మీటర్లు
ఉపగ్రహం: ఇన్‌శాట్ 3డీఆర్
బరువు: 2,211 కిలోలు 
జీవిత కాలం: 10 సంవత్సరాలు
కొలతలు: 2.4 x 1.6 x 1.5 (మీటర్లు)
విద్యుత్తు: 1700 వాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేయగల రెండు సౌరఫలకాలు, 90 ఏహెచ్ 
లిథియం-అయాన్ బ్యాటరీ
ప్రయోగ వ్యయం: రూ. 210 కోట్లు 
రాకెట్‌కు ఖర్చు: రూ. 160 కోట్లు 
ఉపగ్రహం వ్యయం: రూ. 50 కోట్లు
అణుబాంబును పరీక్షించిన ఉత్తర కొరియా
కొత్తగా అభివృద్ధి చేసిన అణ్వాయుధం(వార్‌హెడ్)తో అణు బాంబును శాస్త్రవేత్తలు విజయవంతంగా పరీక్షించారని ఉత్తర కొరియా ప్రభుత్వ టీవీ చానల్ సెప్టెంబర్ 8న వెల్లడించింది. దీంతో రాకెట్‌కు చిన్న అణు వార్‌హెడ్‌ను అనుసంధానించే సామర్థ్యాన్ని కొరియా సంపాదించుకుంది. ఇది ఉత్తర కొరియా ఐదో అణు పరీక్ష. ఈ పరీక్షతో పుంగ్యెరి అణు కేంద్రం సమీపంలో రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రతతో కృత్రిమ భూకంపం సంభవించింది. దీంతో ఉత్తర కొరియాపై ఆర్థికపరమైన ఆంక్షలతో దానిని ఒంటరిని చేయాలని ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి.

370 కోట్ల సంవత్సరాల కిందటి శిలాజం లభ్యం
దాదాపు 370 కోట్ల సంవత్సరాల కిందటి ఓ శిలాజాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో గతంలో గుర్తించిన 220 మిలియన్ సంవత్సరాల కిందటి శిలాజం కంటే ఇది పురాతనమైనదిగా రికార్డులకెక్కింది. గ్రీన్‌లాండ్‌‌సలోని మంచు దిబ్బల కిందగల గ్రీన్‌స్టోన్ బెల్ట్‌లో వోలొంగోంగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అలెన్ నట్‌మ్యాన్ బృందం దీనిని గుర్తించింది.

కొత్తగా కనుగొన్న చేపకు ఒబామా పేరు
కొత్తగా కనుగొన్న ఒక చేపకు శాస్త్రవేత్తలు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పేరు పెట్టనున్నారు. హవాయ్ తీరంలో కొత్త సముద్ర జీవుల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఒబామా నిర్ణయించడంతో ఆయనను ఈ విధంగా గౌరవించనున్నారు. ముదురు ఎరుపు, బంగారు వర్ణంలో ఉండే ఈ కొత్త రకం చేపను ‘కురే అటాల్’ అనే పగడాల దీవి దగ్గర్లో 300 అడుగుల లోతు నీటిలో కనుగొన్నారు.

వరిలో కొత్త వంగడం సృష్టించిన శాస్త్రవేత్తలుపోషకాహార లోపానికి చెక్ పెట్టేలా జింక్ ఎక్కువగా ఉండే సరికొత్త వరి వంగడాన్ని భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు సృష్టించారు. దీనికి ధాన్ 45 అనే పేరు పెట్టారు.
పార్లమెంటరీ స్థాయి కమిటీ సూచన మేరకు భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ (గతంలో వరి పరిశోధన సంస్థ) 12 ఏళ్లు నిర్విరామ కృషి చేసింది. డీఆర్‌ఆర్ ధాన్ 45 (IET 23832) అని పిలిచే ఈ వరి 125 రోజుల్లో కోతకు వస్తుంది. దీనిలో అత్యధికంగా 22.6 పీపీఎం (ఇప్పటి వరకూ ఉన్న వరి వంగడాల్లో ఇదే ఎక్కువ) జింక్ ఉంటుంది.

No comments:

Post a Comment