AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Friday 24 November 2017

సైన్స్ & టెక్నాలజీ జూలై 2016

సైన్స్ & టెక్నాలజీ జూలై 2016
కేజీ బేసిన్‌లో రూ.33 లక్షల కోట్ల విలువైన గ్యాస్ హైడ్రేట్లు
కృష్ణా-గోదావరి బేసిన్(బంగాళాఖాతం)లో భారీ ఎత్తున సహజ వాయు నిల్వలను కనుగొన్నట్లు అమెరికా భూ విజ్ఞాన సర్వే (యూఎస్‌జీఎస్)జూలై 25న వాషింగ్టన్‌లో ప్రకటించింది. గ్యాస్ హైడ్రేట్ల రూపంలో ఉన్న ఈ నిల్వల పరిమాణాన్ని 134 లక్షల కోట్ల ఘనపుటడుగులుగా అంచనా వేశారు. దీని విలువ ప్రస్తుత ధరల్లో సుమారు రూ.33 లక్షల కోట్లు. దీంతో భారత్, అమెరికాలు సంయుక్తంగా చేపట్టిన ఈ అన్వేషణ ద్వారా తొలిసారి హిందూ మహాసముద్ర పరిధిలో గ్యాస్ హైడ్రేట్‌లను గుర్తించినట్లైంది. సహజ వాయువు, నీరు కలిసి ప్రకృతి సిద్ధంగా గడ్డ కట్టి మంచు రూపంలో ఉండటాన్ని గ్యాస్ హైడ్రేట్ అంటారు.

ఇన్‌శాట్-3డీ స్థానంలో ఇన్‌శాట్-3డీఆర్
సేవలు నిలిచిపోయిన ఇన్‌శాట్-3డీ ఉపగ్రహం స్థానంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇన్‌శాట్-3డీఆర్‌ను ప్రవేశపెట్టనుంది.2013 జూలై 26న ఇన్‌శాట్-3డీ ఉపగ్రహన్ని ఇస్రో రోదసిలోకి పంపింది. అయితే సౌర ఫలకాల్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో దీని సేవలు నిలిచిపోయాయి. ఇన్‌శాట్-3డీని రీప్లేస్ చేయనుంది కాబట్టి కొత్త ఉపగ్రహానికి ఇన్‌శాట్-3డీఆర్ అని పేరుపెట్టారు. ఈ ప్రయోగాన్ని ఆగస్టు 28న చేపట్టనున్నారు.
అధిక ఉష్ణోగ్రతల సంవత్సరంగా 2016
ఇప్పటిదాకా అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా 2016 రికార్డులకెక్కింది.2016లో 6 నెలల కాలంలో అత్యధిక ఊష్ణోగ్రతలు నమోదయ్యాయని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంఓ) తెలిపింది. 20వ శతాబ్దంలో.. 378 వరుస నెలల సగటు రికార్డుస్థాయి ఉష్ణోగ్రతలను 2016 ఉష్ణోగ్రతలు పక్కకు నెట్టి సరికొత్త రికార్డు సృష్టించాయని వెల్లడించింది. దీనికి కారణం నిత్యం వాతావరణంలోకి విడుదలవుతున్న గ్రీన్‌హౌస్ వాయువులేననే అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది.
ప్రపంచాన్ని చుట్టొచ్చిన సోలార్ విమానం ఇంపల్స్-2
అతిపెద్ద సోలార్ విమానం ఇంపల్స్-2 చేపట్టిన ప్రపంచ యాత్ర జూలై 26న విజయవంతంగా ముగిసింది. ఇది ప్రపంచ పర్యటనను 2015 మార్చిలో అరిజోనా నుంచి ప్రారంభించి.. సౌదీలోని అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడంతో ముగించింది. ఇంపల్స్-2 విమానం ఇంధనం అవసరం లేకుండా 500 గంటల్లో 17 భాగాలుగా 40 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. దీని ప్రపంచ యాత్ర అరేబియన్ సముద్రం, భారత్, మయన్మార్, చైనా, పసిఫిక్, అట్లాంటిక్ మహాసముద్రాలు, అమెరికా, దక్షిణ ఐరోపా, ఉత్తర ఆఫ్రికాల మీదుగా సాగింది. సౌర ఇంధనంపై అవగాహన కల్పించే లక్ష్యంతో విమాన రూపకర్తలు, పెలైట్‌లు ఆండ్రి బార్చ్ బెర్గ్, బెర్ట్రాండ్ పికార్డ్‌లు ఈ యాత్ర చేపట్టారు.

ఐదేళ్ల ప్రయాణానంతరం గురు గ్రహ కక్ష్యలోకి జునో
నాసా ప్రయోగించిన సౌర విద్యుత్‌తో పనిచేసే అంతరిక్ష వ్యోమనౌక జునో.. 5 ఏళ్లపాటు 170 కోట్ల కిలోమీటర్లు ప్రయాణించి జూలై 5న గురు గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. జునోకు పొడవైన 3 భారీ సౌర ఫలకాలను అమర్చారు. ఇది సౌరవ్యవస్థతో పాటు గ్రహాల్లో పెద్దదైన బృహస్పతి పుట్టుక, పరిణామక్రమాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. 
నెట్‌వర్క్‌డ్ రెడీనెస్ ఇండెక్స్‌లో భారత్‌కు 91వ స్థానం
డిజిటలైజ్డ్ ఆర్థిక, సామాజిక వ్యవస్థలు రూపొందించేందుకు అవసరమైన పరిస్థితులను కల్పించిన తీరు ఆధారంగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) నెట్‌వర్క్‌డ్ రెడీనెస్ ఇండెక్స్‌ను రూపొందించింది. జూలై 6న విడుదల చేసిన జాబితాలో భారత్‌కు 91వ స్థానం దక్కింది. సింగపూర్ మొదటి స్థానంలో నిలవగా, ఫిన్‌లాండ్, స్వీడన్‌లు వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నాయి.

వైమానిక దళంలో చేరిన స్వదేశీ యుద్ధ విమానం తేజస్ 
స్వదేశీ యుద్ధ విమానం తేజస్ జూలై 1న వైమానిక దళంలో చేరింది. తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) అభివృద్ధి చేసింది. తేజస్ ప్రపంచంలోనే తేలికైన సూపర్ సోనిక్ యుద్ధ విమానం. ఇది గగనతలం నుంచి గగనతలం, గగనతలం నుంచి భూతలం, గగనతలం నుంచి సముద్రంపై లక్ష్యాలను ఛేదించగలదు.

ఇజ్రాయెల్-భారత్ ఎంఆర్-శామ్ క్షిపణి ప్రయోగం విజయవంతంభూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల మీడియం రేంజ్ మిస్సైల్ (ఎంఆర్-శామ్)ను ఒడిశాలోని చాందీపూర్ ప్రయోగ కేంద్రం నుంచి పరీక్షించారు. దీన్ని హైదరాబాద్‌లోని డీఆర్‌డీవో శాస్త్రవేత్తలు, ఇజ్రాయెల్‌కు చెందిన ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

గురుడి కక్ష్యలోకి ప్రవేశించిన ‘జునో’అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) ప్రయోగించిన సౌర విద్యుత్తుతో పనిచేసే అంతరిక్ష వ్యోమనౌక ‘జునో’ జూలై 5న విజయవంతంగా గురుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఐదేళ్ల కాలంలో 170 కోట్ల కి.మీ ప్రయాణించి జునో లక్ష్యాన్ని చేరింది. జునోకు మూడు పొడవైన భారీ సౌర ఫలకాలుంటాయి. మన సౌరవ్యవస్థతోపాటు గ్రహాల్లో అన్నింటికన్నా పెద్దదైన బృహస్పతిల పుట్టుక, పరిణామక్రమాలను అర్థం చేసుకోడానికి జునో సహాయపడనుంది. ఈ అంతరిక్ష వాహకనౌకపై అమెరికా ప్రభుత్వం 1.1 బిలియన్ డాలర్లు ఖర్చుపెట్టింది. గెలీలియో(వాహకనౌక) తర్వాత గురుడి కక్ష్యలోకి వెళ్లిన తొలి వ్యోమనౌక జునోనే. జునోలో 9 సైన్సు పరికరాలుంటాయి. గురుగ్రహంపై అయస్కాంత క్షేత్రాల మ్యాపింగ్, నీరు, అమ్మోనియాల పరిమాణాన్ని కొలవడం, అరోరాలను (ధ్రువాల వద్దే ఏర్పడే రంగు రంగుల ప్రాంతాలు) పరిశీలించడం వంటి బాధ్యతలను జునో నిర్వర్తిస్తుంది. 2018 ఫిబ్రవరి 20న జునో మిషన్ ముగుస్తుంది. అప్పటిలోపు జునో బృహస్పతి చుట్టూ 37 సార్లు పరిభ్రమిస్తుంది. ఈ వ్యోమనౌకను నాసా 2011 ఆగస్టు 5న ఫ్లోరిడాలోని కేప్ కార్నివాల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ప్రయోగించింది.

No comments:

Post a Comment