AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

క్రీడలు సెప్టెంబరు 2012

క్రీడలు సెప్టెంబరు 2012
వెటల్‌కు సింగపూర్ గ్రాండ్‌ప్రీఫార్ములా వన్ సింగపూర్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను డిఫెండింగ్ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ సాధించాడు. సెప్టెంబర్ 23న జరిగిన పోటీలో బటన్ రెండో స్థానంలో నిలిచాడు. 

రెస్ట్ ఆఫ్ ఇండియాకు ఇరానీ కప్ఇరానీ కప్ క్రికెట్ టోర్నీ టైటిల్‌ను రెస్ట్ ఆఫ్ ఇండియా గెలుచుకుంది. బెంగళూరులో సెప్టెంబర్ 24న ముగిసిన ఫైనల్స్‌లో రాజస్థాన్‌ను ఓడించింది. 

ఆర్చరీ ప్రపంచ కప్‌లో దీపికకు రజతంభారత అగ్రశ్రేణి ఆర్చర్, వరల్డ్ నెంబర్-2 ర్యాంకర్ దీపిక కుమారి ఆర్చరీ ప్రపంచ కప్‌లో రజత పతకం సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 23న ముగిసిన టోర్నీలో మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగం ఫైనల్లో రన్నరప్‌గా నిలిచింది. 

యూత్ వెయిట్ లిఫ్టింగ్‌లో చంద్రిక రికార్డ్భారత మహిళా వెయిట్ లిఫ్టర్ చంద్రిక తరాఫ్దర్ రికార్డ్ సృష్టించింది. యూత్ వరల్డ్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో 44 కిలోల విభాగంలో రెండు కాంస్య పతకాలు సాధించి.. ఆ ఘనత పొందిన తొలి భారత లిఫ్టర్‌గా నిలిచింది.

పంజాబ్‌కు నేషనల్ జూనియర్ హాకీ నేషనల్ జానియర్ హాకీ ఛాంపియన్‌షిప్‌ను పంజాబ్ గెలుచుకుంది. లక్నోలో సెప్టెంబర్ 9న జరిగిన ఫైనల్లో ఒడిశాను పంజాబ్ ఓడించింది. 

నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ 52వ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు చెన్నైలో సెప్టెంబర్ 14న ముగిసాయి. ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌ను రైల్వేస్ జట్టు గెలుచుకుంది. పురుషుల ఛాంపియన్‌షిప్‌ను సర్వీసెస్ గెలుచుకోగా, మహిళ ఛాంపియన్‌షిప్ రైల్వేస్ దక్కింది. ఉత్తమ అథ్లెట్ సర్వీసెస్‌కు చెందిన జితిన్ థామస్ (పురుషులు), రైల్వేస్‌కు చెందిన తింతూ లూకా(మహిళలు) నిలిచారు. 

పారాలింపిక్స్‌లో చైనాకు మొదటి స్థానం లండన్‌లో సెప్టెంబర్ 9న ముగిసిన పారాలింపిక్స్ క్రీడల్లో చైనా 95 స్వర్ణపతకాలతో మొదటిస్థానంలో నిలిచింది. ఈ క్రీడల్లో 164 దేశాలకు చెందిన 4,200 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. భారత్ తరపున 10 మంది పాల్గొన్నారు. భారత్‌కు హైజంప్ ఎఫ్- 42 విభా గంలో కర్ణాటకకు చెందిన గిరీష నాగరాజె గౌడ రజత పతకం సాధించాడు.

పతకాల పట్టికలో మొదటి ఐదు స్థానాలు సాధించిన దేశాలు
దేశంస్వర్ణంరజతంకాంస్యం
చైనా957165
బ్రిటన్344343
రష్యా363828
అమెరికా312938
ఆస్ట్రేలియా322330
భారత్1

వన్డే క్రికెటర్ ఆఫ్‌ది ఇయర్‌గా కోహ్లీ 
ఇంటర్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)- 2012వ సంవత్సరానికి వార్షిక అవార్డులను శ్రీలంక రాజధాని కోలంబొలో సెప్టెంబర్ 15న ప్రదానం చేశారు. వివరాలు..

* క్రికెటర్ ఆఫ్‌ది ఇయర్, ఉత్తమ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్, పీపుల్స్ ఛాయిస్ అవార్డులు: కుమార సంగక్కర (శ్రీలంక)
* వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: విరాట్ కోహ్లీ (భారత్) 
* వన్డే ఉమెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: స్టఫానీ టేలర్(వెస్టిండీస్)
* టీ-20 ఉత్తమ ప్రదర్శన: రీచర్డ్ లేవీ (దక్షిణాఫ్రికా)
* ఉమెన్స్ టీ-20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: సరా టేలర్(ఇంగ్లండ్)
* స్పిరిట్ ఆఫ్ క్రికెట్-డేనియల్ వెటోరి (న్యూజిలాండ్)
* ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్‌ది: ఇయర్ జార్జ్ డాప్రిక్ (ఇంగ్లండ్)
* ఉత్తమ ఎంపైర్ -కుమార ధర్మసేన (శ్రీలంక).

భారత్‌కు శాఫ్ మహిళల టైటిల్డిపెండింగ్ ఛాంపియన్ భారత్ శాఫ్ మహిళల ఫుట్‌బాల్ టైటిల్‌ను గెలుచుకుంది. కొలంబోలో సెప్టెంబర్ 16న జరిగిన ఫైనల్స్‌లో భారత్ నేపాల్‌పై విజయం సాధించింది. 

మురగప్ప హాకీ గోల్డ్ కప్ఎంసీపీ మురగప్ప గోల్డ్‌కప్ హాకీ టోర్నమెంట్‌లో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ), ఎయిర్ ఇండియా జట్లు సంయుక్త విజేతలుగా నిలిచాయి. చెన్నైలో సెప్టెంబర్ 16న జరిగిన ఫైనల్స్‌లో మ్యాచ్ డ్రా కావడంతో ఇరు జట్లను విజేతలుగా ప్రకటించారు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా వి. రఘునాధ్(ఐఓసీ) నిలిచాడు.

బుల్లర్ గోల్ఫ్ ఆసియన్ టూర్ టైటిల్ భారత్‌కు చెందిన గగన్ జీత్ బుల్లర్ గోల్ఫ్ ఆసియన్ టూర్ టైటిల్ గెలుచుకున్నాడు. తైపేలో సెప్టెంబర్ 17న ముగిసిన పోటీలో బుల్లర్ మొదటి స్థానంలో నిలవగా జాసోన్ కుట్జోన్(అమెరికా) రెండో స్థానంలో, థవోర్న్ విరాంచట్(థాయ్‌లాండ్) మూడోస్థానంలో నిలిచారు.
సెరెనా, ముర్రేలకు యు.ఎస్. ఓపెన్ టైటిల్స్యు.ఎస్. ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను సెరెనా విలియమ్స్, పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఆండీ ముర్రేలు గెలుచుకున్నారు. సెప్టెంబర్ 9న జరిగిన ఫైనల్స్‌లో ప్రపంచ నెంబర్ వన్ విక్టోరియా అజరెంకా(బెలారస్)పై 6-2, 2-6, 7-5 ఆధిక్యంతో సెరెనా విలియమ్స్ (అమెరికా) నెగ్గింది. దీంతో నాలుగోసారి యూ.ఎస్. ఓపెన్ టైటిల్ (1999, 2002, 2008)ను, కెరీర్‌లో 15వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సొంతం చేసుకున్న ఘనత సాధించింది. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఆండీముర్రే(బ్రిటన్) గెలుచుకున్నాడు. నోవోక్ జకోవిచ్ (సెర్బియా)పై ముర్రే విజయం సాధించాడు. దీంతో 76 సంవత్సరాల తర్వాత తొలిసారి బ్రిటన్‌కు యు.ఎస్. ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ లభించింది.
మహిళల డబుల్స్: ఇటలీకి చెందిన సారా ఎరాని, రాబర్డా విన్సీలు మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించారు. ఫైనల్స్‌లో ఆండ్రియా హవకోవా- హర్టెకా(చెక్)లను ఓడించారు.
పురుషుల డబుల్స్: అమెరికాకు చెందిన బాబ్ బ్రయాన్, మెక్ బ్రయాన్ జోడీ సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 7న జరిగిన ఫైనల్స్‌లో భారత క్రీడాకారుడు లియాండర్ పేస్, చెక్‌కు చెందిన రాడెక్ స్టెపానెక్ జోడీపై బ్రయాన్ జోడి నెగ్గింది.
మిక్స్‌డ్ డబుల్స్ టైటిల్: ఎకటెరినా మకరోవా(రష్యా), బ్రూనో సోయరెస్ (బ్రెజిల్) జోడీ గెలుచుకుంది. క్వెటా పెస్కే(చెక్), మార్సిన్ మకోస్కీ(పోలాండ్)లపై విజయం సాధించింది.
పారాలింపిక్స్‌లో గిరీషకు రజతంలండన్ పారాలింపిక్స్(వికలాంగుల ఒలింపిక్స్)లో భారత హైజంపర్ గిరీష నాగరాజె గౌడ(కర్ణాటక) రజత పతకం సాధించాడు. సెప్టెంబర్ 2న పురుషుల హైజంప్ ఎఫ్-42 విభాగంలో ఈ ఘనత సాధించాడు. లండన్ పారాలింపిక్స్‌లో భారత్ తరఫున పదిమంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. పారాలింపిక్స్‌లో భారత్ తరఫున తొలిసారి 1972లో మురళికాంత్ స్విమ్మింగ్‌లో స్వర్ణం సాధించాడు. పారాలింపిక్స్‌లో భారత్ తొలిసారి 1968లో పాల్గొంది.
హమిల్టన్‌కు ఇటాలియన్ గ్రాండ్ ప్రీమెక్ లారెన్స్ డ్రైవర్ లీవిస్ హమిల్టన్ ఫార్ములా వన్ ఇటాలియన్ గ్రాండ్ ప్రీ టైటిల్‌ను మెక్ లారెన్స్ రేసర్ లూయిస్ హామిల్టన్ సొంతం చేసుకున్నాడు. ఇటలీలోని మోంజాలో సెప్టెంబర్ 9న ముగిసిన పోటీలో సెర్గియో పెరెజ్ రెండో స్థానాన్ని ద క్కించుకున్నాడు.
 
క్యాస్ట్రాల్ క్రికెట్ అవార్డులు
2011 సంవత్సరానికి క్యాస్ట్రాల్ క్రికెట్ అవార్డులను బెంగళూరులో ఆగస్టు 29న ప్రదానం చేశారు. వివరాలు... లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు-అజిత్ వాడేకర్, క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-ఎం.ఎస్.ధోని, జూనియర్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్-ఉన్ముక్త్ చంద్, ఇండియన్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ -రాహుల్ ద్రావిడ్, ఇండియన్ వన్డే క్రికెట ర్ ఆఫ్ ది ఇయర్- సురేష్ రైనా , బ్యాట్స్‌మన్ ఆఫ్ ది ఇయర్-సచిన్ టెండూల్కర్, బౌలర్ ఆఫ్ ది ఇయర్-రవిచంద్ర అశ్విన్, స్పెషల్ అవార్డు గ్రహీతలు: యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కొహ్లీ, సచిన్ టెండూల్కర్.
ఢిల్లీకి త్రోబాల్ ఫెడరేషన్ కప్ టైటిల్
ఫెడరేషన్ కప్ త్రోబాల్ ఛాంపియన్‌షిప్ మహిళల టైటిల్‌ను ఢిల్లీ గెలుచుకుంది. చెన్నైలో ఆగస్టు 30న ముగిసిన ఫైనల్స్‌లో తమిళనాడుపై ఢిల్లీ విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్‌ను ఓడించి ఢిల్లీ పురుషుల టైటిల్‌ను కూడా గెలుచుకుంది.
భారత్‌కు నెహ్రూ కప్
ప్రతిష్టాత్మక నెహ్రూ కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌ను భారత్ గెలుచుకుంది. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 2న జరిగిన ఫైనల్లో కామెరూన్‌పై భారత్ విజయం సాధించింది. భారత్ ఈ కప్పును గెలుచుకోవడం ఇది మూడోసారి. 2007, 2009లలో కూడా భారత్ విజేతగా నిలిచింది. మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా సునీల్ చెత్రి ఎంపికయ్యాడు.
బటన్‌కు బెల్జియం గ్రాండ్ ప్రి
బెల్జియం గ్రాండ్ ప్రి ఫార్ములా వన్ రేసులో మెక్‌లారెన్ జట్టు డ్రైవర్ జెన్సన్ బటన్ విజయం సాధించా డు. బెల్జియంలో సెప్టెంబర్ 2న జరిగిన పోటీలో బట న్ మొదటిస్థానంలో నిలువగా డిఫెండింగ్ చాంపియన్ సెబాస్టియన్ వెటల్ రెండోస్థానంలో నిలిచాడు.
భారత్‌కు టెస్ట్ సిరీస్
న్యూజిలాండ్‌తో జరిగిన రెండు టెస్టుల క్రికెట్ సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. బెంగళూరులో సెప్టెంబర్ 3న ముగిసిన రెండో టెస్ట్‌ను భారత్ గెలుచుకోవడంతో సిరీస్ 2-0 తేడాతో భారత్‌కు దక్కింది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా అశ్విన్ ఎంపికయ్యాడు.
కర్ణాటకకు బుచ్చిబాబు ట్రోఫి
బుచ్చిబాబు స్మారక క్రికెట్ టోర్నమెంట్ టైటిల్ కర్ణాటకకు దక్కింది. చెన్నైలో సెప్టెంబర్ 3న ముగిసిన పోటీలో కేరళపై విజయం సాధించింది.

No comments:

Post a Comment