AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

క్రీడలు మే 2015

క్రీడలు మే 2015
ముంబై ఇండియన్స్‌కు ఐపీఎల్-8 టైటిల్
ఎనిమిదో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) క్రికెట్ చాంపియన్‌షిప్‌ను ముంబై ఇండియన్స్ గెలుచుకుంది. కోల్‌కతాలో మే 24న జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించింది. ఈ టైటిల్‌ను గెలవడం ముంబైకిది రెండోసారి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు చెందిన డేవిడ్ వార్నర్ 562 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన డ్వేన్ బ్రావో 26 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. విలువైన ఆటగాడిగా ఆండ్రీ రస్సెల్(14 వికెట్లు, 326 పరుగులు) నిలిచాడు. క్రిస్ గేల్ అత్యధికంగా 36 సిక్సర్లు కొట్టాడు.
సైనా నంబర్‌వన్
 భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ బీడబ్ల్యూఎఫ్ మే 21న విడుదల చేసిన ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచింది. గత నెలలో తొలిసారిగా ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచిన సైనా ఆ తర్వాత రెండో స్థానానికి పడిపోయింది. మే 26న ప్రారంభమైన ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో సైనా డిఫెండింగ్ చాంప్‌గా బరిలోకి దిగింది. పీవీ సింధు ఒక స్థానం దిగజారి 12వ ర్యాంకులో ఉంది. పురుషుల విభాగంలో కె.శ్రీకాంత్ తన నాలుగో స్థానాన్ని.. పి.కశ్యప్, ప్రణయ్ తమ 13, 15వ స్థానాలను కాపాడుకున్నారు. మహిళల డబుల్స్‌లో గుత్తా జ్వాల, అశ్విని పొన్నప్ప జంట 21వ స్థానంలో ఉంది.
రోస్‌బర్గ్‌కు మొనాకో గ్రాండ్ ప్రీ
ఫార్ములా వన్ మొనాకో గ్రాండ్ ప్రీ టైటిల్‌ను మెర్సిడెస్ రేసర్ నికో రోస్‌బర్గ్ గెలుచుకున్నాడు. మోంటెకార్లోలో మే 24న జరిగిన రేసులో రోస్‌బర్గ్ విజేతగా నిలవగా సెబాస్టియన్ వెటల్ రెండో స్థానాన్ని పొందాడు.
సియెట్ ఉత్తమ క్రీడాకారుడు రహానే
2015 సియెట్ క్రీడా అవార్డులను మే 25న ముంబైలో ప్రదానం చేశారు. లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డు: కపిల్ దేవ్; ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: కుమార సంగక్కర(శ్రీలంక); ఉత్తమ క్రీడాకారుడు: అజింక్య రహానే; ఉత్తమ బ్యాట్స్‌మన్: హషీం ఆమ్లా (దక్షిణాఫ్రికా); ఉత్తమ బౌలర్: హెరాత్(శ్రీలంక); ఉత్తమ టీ-20 ఆటగాడు: డ్వేన్ బ్రావో(వెస్టిండిస్); పాపులర్ చాయిస్ అవార్డు: పొలార్డ్(వెస్టిండిస్).

చైనాకు బ్యాడ్మింటన్ సుదిర్మన్ కప్
బ్యాడ్మింటన్ సుదిర్మన్‌కప్‌ను చైనా గెలుచుకుంది. చైనాలోని డాంగ్వాన్‌లో మే 16న ముగిసిన ప్రపంచ టీమ్ మిక్స్‌డ్ చాంపియన్‌షిప్ సుదిర్మన్ కప్ ఫైనల్‌లో జపాన్‌ను చైనా ఓడించి వరుసగా ఆరోసారి విజేతగా నిలిచింది. ఈ పోటీలు తిరిగి 2017లో ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నగరంలో జరుగుతాయి.
జొకోవిచ్, షరపోవాలకు రోమ్ ఓపెన్ టైటిళ్లు
రోమ్ మాస్టర్స్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను జొకోవిచ్ గెలుచుకున్నాడు. రోమ్‌లో మే 16న జరిగిన ఫైనల్‌లో రోజర్ ఫెదరర్‌ను జొకోవిచ్ ఓడించాడు. ఇది జొకోవిచ్‌కు నాలుగో మాస్టర్స్ టైటిల్. మహిళల సింగిల్స్ టైటిల్‌ను మరియా షరపోవా కైవసం చేసుకుంది. మహిళల డబుల్స్ టైటిల్‌ను టిమియా బాబోస్, క్రిస్టినా మడనోవిచ్ జోడీ గెలుచుకుంది.
రన్నరప్ సానియా జంట 
 రోమ్ ఓపెన్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత స్టార్ సానియా మీర్జా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట రన్నరప్‌గా నిలిచింది. రోమ్‌లో మే 17న జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-హింగిస్ ద్వయం 4-6, 3-6తో మూడో సీడ్ తిమి బాబోస్ (హంగేరి)-క్రిస్టినా మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్) జంట చేతిలో ఓడిపోయింది. ఫైనల్ చేరుకునే క్రమంలో ప్రత్యర్థికి ఒక్క సెట్ కూడా కోల్పోని సానియా జంట తుదిపోరులో మాత్రం వరుస సెట్‌లలో ఓడింది. 72 నిమిషాల్లో ముగిసిన ఈ ఫైనల్లో సానియా జోడీ తమ సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయింది. రన్నరప్‌గా నిలిచిన సానియా-హింగిస్‌లకు 57,840 యూరోల ప్రైజ్‌మనీ (రూ. 42 లక్షలు)తోపాటు 585 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. జతగా ఆడుతున్న తర్వాత సానియా-హింగిస్ జంటకు ఫైనల్లో ఎదురైన తొలి ఓటమి ఇదే కావడం గమనార్హం. తొలి మూడు టోర్నమెంట్లలో (ఇండియన్ వెల్స్, మియామి, ఫ్యామిలీ సర్కిల్ కప్) విజేతగా నిలిచిన ఈ ఇండో-స్విస్ ద్వయం పోర్షె గ్రాండ్‌ప్రిలో రెండో రౌండ్‌లో, మాడ్రిడ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓటమి పాలైంది.

క్విటోవాకు మాడ్రిడ్ ఓపెన్ టైటిల్
మాడ్రిడ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను పెట్రా క్విటోవా మే 9న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో స్వెత్లానా కుజనెత్సోవాను ఓడించి గెలుచుకుంది. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఆండీ ముర్రే.. ఫైనల్లో రఫెల్ నాదల్‌ను ఓడించి గెలుచుకున్నాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను రోహన్ బోపన్న (భారత్), ఫ్లోరిన్ మెర్గియా (రొమేనియా).. ఫైనల్లో నెనాద్ జిమోంజిక్ (సెర్బియా), మార్సిన్ మట్‌కోవిక్సీ (పోలండ్)లను ఓడించి గెలుచుకున్నారు. బోపన్నకు ఇది మూడో మాస్టర్స్ సిరీస్ టైటిల్.
హాకీ సిరీస్ భారత్ కైవసం
జపాన్‌తో జరిగిన నాలుగు మ్యాచ్‌ల హాకీ సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. భువనేశ్వర్‌లో మే 9న జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. దీంతో భారత్‌కు 3-0 తేడాతో సిరీస్ దక్కింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.
రోస్‌బర్గ్‌కు స్పెయిన్ గ్రాండ్‌ప్రి
మెర్సిడస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ ఫార్ములా వన్ స్పెయిన్ గ్రాండ్ ప్రిని గెలుచుకున్నాడు. బార్సిలోనాలో మే 10న జరిగిన రేసులో రోస్‌బర్గ్ విజేతగా నిలవగా, లూయిస్ హామిల్టన్ రెండో స్థానం సాధించాడు.
ఏటీపీ చాలెంజర్ టోర్నీ
భారత టెన్నిస్ క్రీడాకారుడు యూకీ బాబ్రీ స్పెయిన్‌కు చెందిన ఆడ్రియన్ మెనాడస్ మెసిరాస్‌తో కలిసి ఏటీపీ చాలెంజర్ టోర్నీ డబుల్స్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. వీరు మే 9న కర్షి (ఉజ్బెకిస్తాన్) లో జరిగిన ఫైనల్లో సెర్గి బెటోవ్ (బెలారస్), మిఖాయిల్ ఎల్గిన్ (రష్యా)లను ఓడించారు.

వరల్డ్ ఉమెన్ టీం చెస్ చాంపియన్‌షిప్‌లో హంపీ, హారికలకు పతకాలు
భారత్ చెస్ క్రీడాకారిణిలు హంపీ, హారికలు వరల్డ్ ఉమెన్ టీం చాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత బోర్డు మెడల్ పొందారు. చైనాలోని చెంగ్డూలో 2015 ఏప్రిల్ 28న ముగిసిన పోటీల్లో హారికకు రజత పతకం, హంపీకి కాంస్య పతకం దక్కాయి. టీం చాంపియన్‌షిప్‌లో జార్జియా మొదటి స్థానంలో నిలవగా రష్యా, చైనా, భారత్‌కు తరువాతి స్థానాలు దక్కాయి.

బాక్సింగ్ మెగా ఫైట్‌లో మేవెదర్ గెలుపుప్రముఖ బాక్సింగ్ క్రీడాకారులు ఫ్లాయిడ్ మేవెదర్ (అమెరికా), మ్యానీ పాకియో (ఫిలిప్పీన్‌‌స)ల మధ్య 2015 మే 3న లాస్‌వెగాస్ (అమెరికా)లో జరిగిన బౌట్‌లో మేవెదర్ విజేతగా నిలిచాడు. ఈ శతాబ్దపు మేటి బౌట్‌గా పేర్కొన్న ఈ పోటీలో పాకియోను ఓడించి మేవెదర్ గెలుపొందాడు. విజేతకు రూ. 1,147 కోట్లు (18 కోట్ల డాలర్లు), ఓడిన పాకియోకు రూ. 764 కోట్లు(12 కోట్ల డాలర్లు) లభించాయి. మేవెదర్‌కు ఇది వరుసగా 48వ విజయం.

ఫెదరర్‌కు ఇస్తాంబుల్ ఓపెన్టాప్‌సీడ్ రోజర్ ఫెదరర్ ఇస్తాంబుల్ ఓపెన్ టెన్నిస్ టైటిల్ గెలుచుకున్నాడు. ఇస్తాంబుల్‌లో 2015 మే 3న జరిగిన ఫైనల్స్‌లో పాబ్లో క్యూవస్‌ను ఫెదరర్ ఓడించాడు.

ముర్రేకు మ్యూనిచ్ ఓపెన్ టైటిల్మ్యూనిచ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను ఆండీ ముర్రే గెలుచుకున్నాడు. మ్యూనిచ్‌లో 2015 మే 4న జరిగిన ఫైనల్స్‌లో ఫిలిప్ కోల్ స్క్రీబెర్‌ను ముర్రే ఓడించాడు. ముర్రేకి ఇది కెరీర్‌లో 33వ టైటిల్.

రోరె మక్‌లోరేకు వరల్డ్ మ్యాచ్ ప్లే చాంపియన్‌షిప్వరల్డ్ నెంబర్ వన్ రోరె మక్‌లోరే గోల్ఫ్ వరల్డ్ మ్యాచ్ ప్లే చాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్నాడు. శాన్ ఫ్రాన్సిస్‌కోలో 2015 మే 3న జరిగిన మ్యాచ్‌లో గారీ ఉడ్‌లాండ్‌ను రోరె ఓడించాడు.

రైల్వేలకు హాకీ ఇండియా ఉమెన్ నేషనల్..5వ హాకీ ఇండియా ఉమెన్‌‌స నేషనల్ చాంపియన్‌షిప్‌ను రైల్వేలు గెలుచుకున్నాయి. సైఫై (ఉత్తరప్రదేశ్)లో 2015 మే 3న జరిగిన ఫైనల్స్‌లో జార్ఖండ్‌ను రైల్వేలు ఓడించాయి. రైల్వేలకు ఐదేళ్లలో ఇది నాలుగో నేషనల్ టైటిల్.

స్కేటింగ్‌లో భారత్‌కు 7 స్వర్ణాలుహాంకాంగ్ ఇంటర్నేషనల్ స్పీడ్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ మొత్తం 14 పతకాలు గెలుచుకుంది. ఇందులో 7 స్వర్ణాలు కావడం విశేషం. వీటితో పాటు మరో 5 రజతాలు, 2 కాంస్యాలు భారత్ సొంతం చేసుకుంది. 11 ఏళ్ల ఖుషీ షా మూడు ఈవెంట్లలో స్వర్ణాలు సాధించింది. 

ఆసియా సీనియర్ రెజ్లింగ్‌లో గీతకు కాంస్యంఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ గీత ఫోగట్ కాంస్య పతకం గెలిచింది. దోహాలో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో మే 6న జరిగిన మహిళల ఫ్రీ స్టయిల్ 58 కేజీల కేటగిరీ కాంస్య పతక పోరులో ఆమె... వియత్నాంకు చెందిన థి లొన్ నైగుయెన్‌ను కంగుతినిపించింది. పురుషుల ఫ్రీస్టయిల్ కేటగిరీలో హితేందర్ కూడా కాంస్యపతక పోటీకి అర్హత సంపాదించాడు.

No comments:

Post a Comment