AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

క్రీడలు ఆగష్టు 2015

క్రీడలు ఆగష్టు 2015
ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్బీజింగ్‌లో ఆగస్టు 30న ముగిసిన ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో ఏడు స్వర్ణాలతో కెన్యా తొలిసారి మొదటి స్థానం సాధించింది. మరో ఆఫ్రికా దేశం జమైకా రెండో స్థానంలో నిలిచింది. ఈ చాంపియన్‌షిప్‌లో ఆఫ్రికా దేశం అగ్రస్థానంలో నిలవడం ఇదే తొలిసారి. మొత్తం 206 దేశాలు పాల్గొన్న చాంపియన్‌షిప్‌లో భారత్ 65వ స్థానంలో నిలిచింది. భారత అథ్లెట్ లలితా శివాజీ బాబర్ 3000 మీటర్ల స్టీపుల్ చేజ్‌లో ఎనిమిదో స్థానంలో నిలవడంతో ఒక పాయింట్ భారత్‌కు లభించింది. మొత్తం 18 మంది అథ్లెట్లు ఈ పోటీల్లో పాల్గొన్నారు.

పతకాల పట్టిక:మొదటి 5 స్థానాల్లో ఉన్న దేశాలు
దేశంస్వర్ణంరజతంకాంస్యంమొత్తం
కెన్యా76316
జమైకా72312
అమెరికా66618
బ్రిటన్4127
ఇథియోపియా3328


ఈ చాంపియన్‌షిప్‌లో జమైకన్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ మూడు బంగారు పతకాలు సాధించాడు. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో స్వర్ణంతో పాటు నాలుగొందల మీటర్ల రిలేలో తన సహచరులతో కలిసి స్వర్ణ పతకం సాధించాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో బోల్ట్ మొత్తం 11 స్వర్ణ పతకాలు సాధించాడు.

12 ఏళ్ల తర్వాత యూరోప్ అథ్లెట్‌కు స్వర్ణంమహిళల 200 మీటర్ల పరుగులో నెదర్లాండ్స్ అమ్మాయి డాఫ్నె ష్కిపెర్స్ చాంపియన్‌గా నిలిచింది. ఆగస్టు 28న జరిగిన ఈ ఈవెంట్ ఫైనల్లో ష్కిపెర్స్ 21.63 సెకన్లలో గమ్యానికి చేరుకొని స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. 12 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో యూరోప్ అథ్లెట్‌కు పసిడి పతకం లభించింది. చివరిసారి 2003లో అనస్తాసియా కాపాచిన్స్‌కాయా (రష్యా) ఈ ఘనత సాధించింది.

రియో ఒలింపిక్స్‌కు భారత హాకీ జట్టుభారత మహిళల హాకీ జట్టు రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినట్లు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ఆగస్టు 28న ప్రకటించింది. జూలైలో బెల్జియంలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ టోర్నమెంట్‌లో భారత్ 5వ స్థానాన్ని సాధించడంతో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినట్లు ఎఫ్‌ఐహెచ్ తెలిపింది. 36 సంవత్సరాల తర్వాత భారత మహిళల జట్టు ఈ అర్హత సాధించింది. చివరగా 1980 మాస్కో ఒలింపిక్స్‌లో పాల్గొని నాలుగో స్థానంలో మహిళల జట్టు నిలిచింది. 

అమెరికా కోచ్‌గా వెంకటపతిరాజు భారత మాజీ క్రికెటర్, హైదరాబాద్‌కు చెందిన ఎస్. వెంకటపతిరాజుకు అమెరికా క్రికెట్ జట్టు కోచ్‌గా నియమితులయ్యారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పర్యవేక్షణలోని అమెరికా క్రికెట్ జట్టు కోచ్‌లలో ఒకడిగా అతను వ్యవహరిస్తాడు. ‘ఐసీసీ అమెరికాస్ క్రికెట్ కంబైన్’ అనే పేరుతో వ్యవహరిస్తున్న ఈ జట్టుకు శిక్షణ ఇచ్చేందుకు ఐసీసీ కోచ్‌ల బృందాన్ని ఎంపిక చేసింది. రాజుతో పాటు బౌలింగ్ దిగ్గజం కోట్నీ వాల్ష్ కూడా ఇందులో ఉన్నారు. క్రికెటర్‌గా రిటైర్ అయిన తర్వాత రాజు... భారత జట్టు సెలక్టర్‌గా, హైదరాబాద్ రంజీ జట్టు కోచ్‌గా పని చేయడంతో పాటు హెచ్‌సీఏ ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించాడు. ఇటీవలి వరకు ఐసీసీ డెవలప్‌మెంట్ ప్రోగ్రాంలో భాగంగా ఆసియా రీజియన్ అభివృద్ధి అధికారిగా కూడా పని చేశాడు.

గాంధీ-మండేలా సిరీస్ఇక నుంచి భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగబోయే ద్వైపాక్షిక సిరీస్‌లను ‘ద మహత్మ గాంధీ-నెల్సన్ మండేలా సిరీస్’గా వ్యవహరించాలని ఇరు దేశాల బోర్డులు నిర్ణయించాయి. అలాగే ఇరు జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్‌కు ‘ఫ్రీడం ట్రోఫీ (స్వతంత్ర ట్రోఫీ)’గా నామకరణం చేశాయి. ఈ విషయాన్ని ఆగస్టు 31న ఇరు బోర్డులు తెలియజేశాయి. 

యు ముంబాకు ప్రో కబడ్డీ ట్రోఫీ
ప్రో కబడ్డీ లీగ్ రెండో సీజన్ టైటిల్‌ను యు ముంబా గెలుచుకుంది. ముంబైలో ఆగస్టు 23న జరిగిన ఫైనల్లో బెంగళూరు బుల్స్‌ను యు ముంబా ఓడించింది. టైటిల్ గెలిచిన యు ముంబా జట్టుకు రూ.కోటి, బెంగళూరుకు రూ.50 లక్షల ప్రైజ్‌మనీ దక్కింది. రైజింగ్ స్టార్ ఆఫ్ ది టోర్నీగా సందీప్ (టైటన్స్), రైడర్ ఆఫ్ ది టోర్నీగా కషిలింగ్ (ఢిల్లీ), డిఫెండర్ ఆఫ్ ది టోర్నీగా రవీందర్ (ఢిల్లీ), ఆల్‌రౌండర్ ఆఫ్ ది టోర్నీగా మంజీత్ చిల్లర్ (బెంగళూరు) నిలిచారు.
హామిల్టన్‌కు బెల్జియం గ్రాండ్ ప్రి టైటిల్
మెర్సిడెజ్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ ఫార్ములావన్ బెల్జియం గ్రాండ్ ప్రి టైటిల్ గెలుచుకున్నాడు. ఆగస్టు 23న జరిగిన రేసులో హామిల్టన్ టైటిల్ సాధించగా, రోస్‌బర్గ్, గ్రోస్యెన్ వరుసగా రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నారు.
ఉసేన్ బోల్ట్‌కు 100 మీటర్ల టైటిల్
2015 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో జమైకాకు చెందిన స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ 100 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచాడు. బీజింగ్‌లో ఆగస్టు 23న జరిగిన 100 మీటర్ల పరుగులో బోల్ట్ 9.79 సెకన్లలో రేసును ముగించి మొదటి స్థానం సాధించాడు. అమెరికాకు చెందిన జస్టిన్ గాట్లిన్ 9.80 సెకన్లలో పూర్తిచేసి రెండో స్థానంలో నిలిచాడు. బోల్ట్ ప్రపంచ చాంపియన్‌గా నిలవడం ఇది మూడోసారి. మహిళల 100 మీటర్ల రేసులో జమైకాకు చెందిన షెల్లీ ఆన్ ఫ్రేజర్ ప్రైస్ స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. ఈ రేసులో డాఫ్నీ చిపర్స్(నెదర్లాండ్స్) రజతం, టోరీ (అమెరికా) కాంస్యం సాధించారు.
ఫెదరర్‌కు సిన్సినాటి మాస్టర్స్ టైటిల్
సిన్సినాటి మాస్టర్స్ సిరీస్ టైటిల్ రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) గెలుచుకున్నాడు. సిన్సినాటి (అమెరికా)లో ఆగస్టు 24న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో నొవాక్ జకోవిచ్ (సెర్బియా)ను ఫెదరర్ ఓడించాడు. ఈ టైటిల్ ఫెదరర్ గెలుచుకోవడం ఇది ఏడోసారి. మహిళల సింగిల్స్ టైటిల్‌ను సెరెనా విలియమ్స్ గెలుచుకుంది. ఫైనల్లో సిమోనా హాలెప్‌ను సెరెనా ఓడించింది.
క్రికెట్ నుంచి విరమించుకున్న సంగక్కర
శ్రీలంక క్రికెట్‌కు 15 ఏళ్లుగా సేవలందించిన సీనియర్ బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర(37) ఆట నుంచి విరమించుకున్నాడు. ఆగస్టు 24న కొలంబోలో భారత్‌తో ముగిసిన రెండో టెస్టు నుంచి ఆయన తన క్రికెట్ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఆయనకు తోటి ఆటగాళ్లు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన, ప్రధానమంత్రి రణిల్ విక్రమసింఘే తదితరులు పాల్గొన్నారు. 134 టెస్టులు ఆడిన సంగక్కర 12,400 పరుగులు చేశాడు. ఇందులో 38 సెంచరీలు ఉన్నాయి. 404 వన్డేల్లో 14,234 పరుగులు సాధించాడు. ఇందులో 25 సెంచరీలు ఉన్నాయి.
ఇంగ్లండ్‌కు యాషెస్ ట్రోఫీ
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను ఇంగ్లండ్ కైవసం చేసుకుంది. ఐదు టెస్టుల సిరీస్‌ను 3-2 తేడాతో నెగ్గి యాషెస్ ట్రోఫీని ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. సిరీస్‌లో రెండవ, ఐదో టెస్టులను ఆసీస్ నెగ్గగా... మిగతా మూడు టెస్టులను ఇంగ్లండ్ గెలుచుకుంది. క్రిస్ రోజర్స్ (ఆసీస్), రూట్ (ఇంగ్లండ్)లు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా నిలిచారు. ఈ టెస్టుతో ఆసీస్ కెప్టెన్ క్లార్క్, మరో ఆటగాడు క్రిస్ రోజర్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. మొత్తం కెరీర్‌లో క్లార్క్ 115 టెస్టుల్లో 49.10 సగటుతో 8643 పరుగులు చేశాడు. ఇందులో 28 సెంచరీలు ఉన్నాయి. రోజర్స్ 25 టెస్టుల్లో 42.87 సగటుతో 5 సెంచరీలు సహా 2015 పరుగులు సాధించాడు. 
ఆఫ్రికా అథ్లెట్లకు స్వర్ణాలు
ఆఫ్రికాలోని చిన్న దేశమైన ఎరిత్రియాకు చెందిన 19 ఏళ్ల రన్నర్ గిర్మె గెబ్రెసెలాసీ చరిత్ర సృష్టించాడు. బీజింగ్‌లో ప్రారంభమైన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో పురుషుల మారథాన్ రేసులో విజేతగా నిలిచి పెను సంచలనం సృష్టించాడు. తన కెరీర్‌లో కేవలం మూడో రేసులో పాల్గొన్న అతను 42.195 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటల 12 నిమిషాల 27 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకోవడంతోపాటు స్వర్ణ పతకాన్ని సాధించాడు. యెమాన్ సెగె (ఇథియోపియా-2గం.13ని.08 సెకన్లు) రజతం, సాలమన్ ముతాయ్ (ఉగాండ-2గం.13ని.30 సెకన్లు) కాంస్య పతకాలు సాధించారు. ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో ఎరిత్రియాకు ఇదే తొలి పసిడి పతకం. 2009 చాంపియన్‌షిప్‌లో 10 వేల మీటర్ల రేసులో తదెస్సె జెర్సెనె ఎరిత్రియాకు రజత పతకం అందించాడు.
అలాగే పురుషుల 800 మీటర్ల రేసులో కెన్యా స్టార్ డేవిడ్ రుదీషా రెండోసారి పసిడిపతకాన్ని దక్కిం చుకోగా... పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో కెన్యా యువతార నికోలస్ బెట్ తొలిసారి తమ దేశానికి స్వర్ణాన్ని అందించాడు. ఇక మహిళల 1500 మీటర్ల రేసులో గెన్‌జెబి దిబాబా విజేతగా నిలిచి ఈ మెగా ఈవెం ట్‌లో ఇథియోపియా పసిడి ఖాతాను తెరిచింది.
భారత్‌లో అంతర్జాతీయ వెయిట్‌లిఫ్టింగ్ పోటీలు
అంతర్జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు భారతదేశం తొలిసారిగా ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2015 అక్టోబర్ 11-15 మధ్య పుణేలో కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ జరుగనున్నాయి. ఈ చాంపియన్‌షిప్‌లో యూత్, జూనియర్, సీనియర్ విభాగాల్లో పోటీలు ఉంటాయి. మనదేశం నుంచి 40 మంది ఈ చాంపియన్‌షిప్‌లో పోటీపడనున్నారు. వారిలో 11 మంది యూత్ (బాలుర, బాలికల), 16 మంది జూనియర్ (పురుషుల, మహిళల), 13 మంది సీనియర్ (పురుషుల, మహిళల) విభాగాల్లో బరిలోకి దిగనున్నారు.

ప్రపంచ ఆర్చరీలో అభిషేక్‌కు స్వర్ణం
ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్-3 పోటీల్లో భారత ఆర్చర్ అభిషేక్ వర్మ స్వర్ణ పతకం సాధించాడు. వ్రోక్లా (పోలండ్)లో ఆగస్టు 15న జరిగిన పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో ఇస్మాయిల్ ఇబాది (ఇరాక్)పై అభిషేక్ విజయం సాధించి స్వర్ణం గెలుచుకున్నాడు.
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) గెలుపొందింది. ఆగస్టు 16న జరిగిన జకార్తాలో జరిగిన ఫైనల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనానెహ్వాల్ రజతం సాధించింది. ఈ చాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి క్రీడాకారిణిగా సైనా రికార్డు సృష్టించింది. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను చెన్ లాంగ్ (చైనా) ఫైనల్లో లీ చోంగ్ వీ (మలేసియా)ను ఓడించి టైటిల్ సాధించాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను మహ్మద్ అసన్, హెంద్రా సెటియావన్ (ఇండొనేషియా) గెలుచుకున్నారు. వీరు ఫైనల్లో లియు జియోలాంగ్, కియు జిహాన్ (చైనా)లను ఓడించారు. మహిళల డబుల్స్ టైటిల్‌ను జావో యున్‌లీ, తియాన్ కింగ్ (చైనా) గెలుచుకున్నారు. వీరు ఫైనల్లో క్రిస్టినా పెడెర్సన్, కమిలా రైటర్ జుహీ (డెన్మార్క్)లను ఓడించారు.
నిషికోరికి వాషింగ్టన్ ఓపెన్ టైటిల్
వాషింగ్టన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను కీ నిషికోరి (జపాన్) గెలుచుకున్నాడు. వాషింగ్టన్‌లో ఆగస్టు 9న జరిగిన ఫైనల్లో జాన్ ఇస్నర్ (అమెరికా)ను నిషికోరి ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను స్లోయానే స్టీఫెన్స్ గెలుచుకుంది. ఈమె ఫైనల్లో అనస్టాసియా పాలిచెకునోవాను ఓడించింది.
ఈపీఎల్‌లో భారత ఫుట్‌బాల్ క్రీడాకారిణి
ప్రతిష్టాత్మక ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) క్లబ్ వెస్ట్ హామ్ యునెటైడ్ మహిళా ఫుట్‌బాల్ జట్టు.. భారత క్రీడాకారిణి అదితి చౌహాన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఇంగ్లండ్‌లోని ఓ టాప్ క్లబ్ తరఫున ఆడనున్న తొలి భారత మహిళా ఫుట్‌బాలర్‌గా ఆమె రికార్డు సృష్టించింది. 2013లో దక్షిణాసియా టైటిల్‌ను నెగ్గిన భారత జట్టులో గోల్‌కీపర్ అదితి కీలకపాత్ర పోషించింది. ఇంగ్లండ్ మహిళల ఫుట్‌బాల్ వ్యవస్థలో మూడో లెవల్ అయిన మహిళల ప్రీమియర్ లీగ్ సదరన్ డివిజన్‌లో వెస్ట్ హామ్ జట్టు తలపడుతోంది.
భారత గోల్ఫ్ క్రీడాకారుడు లాహిరి కొత్త రికార్డ్
భారత గోల్ఫ్ చరిత్రలో అనిర్బన్ లాహిరి కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ప్రతిష్టాత్మక పీజీఏ చాంపియన్‌షిప్‌లో సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచి సత్తా చాటాడు. ఓ మేజర్ టోర్నీలో భారత గోల్ఫర్స్ నుంచి ఈ స్థాయి ప్రదర్శన ఇప్పటిదాకా లేదు. ఈ రాణింపుతో అతను ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 15 స్థానాలు మెరుగుపరుచుకుని 38వ ర్యాంకుకు చేరాడు. లాహిరి దాదాపు రూ. 2.40 కోట్ల ప్రైజ్‌మనీ నెగ్గాడు. 28 ఏళ్ల లాహిరి మార్చిలో మూడు వారాల వ్యవధిలో మలేసియా ఓపెన్, హిరో ఇండియన్ ఓపెన్ నెగ్గి వార్తల్లో నిలిచాడు. జీవ్ మిల్కా సింగ్ 2008లో తొమ్మిది స్థానాన్ని సంపాదించడమే భారత్ తరఫున ఇప్పటివరకు పీజీఏ చాంపియన్‌షిప్‌లో ఉత్తమ ప్రదర్శన.
ఐఏఏఎఫ్ అధ్యక్షుడిగా సెబాస్టియన్ కో
బ్రిటన్ దిగ్గజ అథ్లెట్, ఒలింపిక్ మాజీ చాంపియన్ సెబాస్టియన్ కో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సంఘాల సమాఖ్య (ఐఏఏఎఫ్) కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆగస్టు 19న జరిగిన ఎన్నికల్లో సెబాస్టియన్ కోకు 115 ఓట్లు రాగా... ఆయన ప్రత్యర్థి, ఉక్రెయిన్ పోల్‌వాల్ట్ దిగ్గజం సెర్గీ బుబ్కాకు 92 ఓట్లు వచ్చాయి. 16 ఏళ్లుగా ఈ పదవిలో ఉన్న లామైన్ డియాక్ (సెనెగల్) స్థానంలో ఆగస్టు 31న కో బాధ్యతలు స్వీకరిస్తారు. 58 ఏళ్ల సెబాస్టియన్ కో 1980 మాస్కో, 1984 లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌లలో 1500 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకాలు సాధించారు. అంతేకాకుండా ఎనిమిది అవుట్‌డోర్, మూడు ఇండోర్ ప్రపంచ రికార్డులను సృష్టించారు. అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయిన సెర్గీ బుబ్కా ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బుబ్కాతోపాటు దహ్లాన్ అల్ హమాద్ (ఖతార్), హమాద్ కల్కాబా మల్బూమ్ (కామెరూన్), అల్బెర్టో యువాన్‌టొరెనా (క్యూబా) ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఇదే ఎన్నికల్లో భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎఫ్‌ఐ) అధ్యక్షుడు అదిల్లె సుమరివల్లా ఐఏఏఎఫ్ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

రిటైర్మెంట్ ప్రకటించిన క్లార్క్
ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ (34)అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరమించుకుంటున్నట్లు ఆగస్టు 8న ప్రకటించాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ అనంతరం వైదొలుగుతున్నట్లు తెలిపాడు. 2011 నుంచి ఆయన ఆస్ట్రేలియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. కెరీర్‌లో 114 టెస్ట్‌లు ఆడిన క్లార్క్ 8628 పరుగులు చేశాడు. ఇందులో 28 సెంచరీలు ఉన్నాయి.
ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్
ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 5 స్వర్ణ పతకాలు లభించాయి. దక్షిణ కొరియాలోని సువన్‌లో ఆగస్టు 10న ముగిసిన పోటీల్లో 5 స్వర్ణ పతకాలతోపాటు 5 రజత, ఏడు కాంస్య పతకాలు దక్కాయి. భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు ఎన్.కృష్ణ తేజ (అండర్-18 ఓపెన్‌లో) స్వర్ణ పతకం సాధించాడు.
హాకీ ఆటగాడు గుర్బాజ్‌పై 9 నెలల నిషేధం
సీనియర్ హాకీ ఆటగాడు గుర్బాజ్ సింగ్‌పై తొమ్మిది నెలల నిషేధం విధించారు. జట్టులో విభేదాలు సృష్టిస్తుండడంతో పాటు తనలో క్రమశిక్షణ లేదని హాకీ ఇండియా (హెచ్‌ఐ) ఈ నిర్ణయం తీసుకుంది. గత నెల బెల్జియంలో జరిగిన హాకీ వరల్డ్ లీగ్ సెమీఫైనల్స్ అనంతరం హెచ్‌ఐకి సమర్పించిన నివేదికలో గుర్బాజ్‌పై ఈమేరకు ఫిర్యాదు అందింది. ఆగస్టు 10న హర్బీందర్ సింగ్ నేతృత్వంలోని సమావేశమైన హెచ్‌ఐ క్రమశిక్షణ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దీంతో 2016, మే 9 వరకు అతడు భారత జట్టుకు ఆడలేడు. జూడ్ ఫెలిక్స్ అందించిన నివేదికను అనుసరించి కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కోచ్‌గా పనిచేసిన మైకేల్ నాబ్స్‌తో కూడా గొడవ పడి లండన్ ఒలింపిక్స్ అనంతరం కొద్ది కాలం గుర్బాజ్ సస్పెండ్‌కు గురయ్యాడు.
సానియాకు ‘రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర’
 దేశం గర్వించదగ్గ విజయాలు సాధించిన టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర’ పురస్కారానికి ఎంపికైంది. బ్యాడ్మింటన్ రైజింగ్ స్టార్ కిడాంబి శ్రీకాంత్, రోలర్ స్కేటింగ్ ప్లేయర్ అనూప్ కుమార్ యామా ప్రతిష్టాత్మక ‘అర్జున’ అవార్డులను దక్కించుకున్నారు. ఈ మేరకు పురస్కారాల కమిటీ వీళ్ల పేర్లను కేంద్ర క్రీడాశాఖకు సిఫారసు చేసింది. జాబితాను క్రీడాశాఖ ఆమోదించిన తర్వాత ఈనెల 29న జాతీయ క్రీడా దినోత్సవం రోజున ఆటగాళ్లకు ఈ అవార్డులను అందజేస్తారు. క్రికెటర్ రోహిత్ శర్మతో పాటు మరో 14 మందిని కూడా అర్జున అవార్డుకు ప్రతిపాదించారు.
ఖేల్త్న్ర అవార్డు దక్కించుకోబోతున్న రెండో టెన్నిస్ ప్లేయర్ సానియా. అట్లాంటా ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన లియాండర్ పేస్... 1996లో ఈ పురస్కారాన్ని అందుకున్నాడు. 
అర్జున అవార్డుకు ఎంపికైన మరో 14 మంది
పూవమ్మ (అథ్లెటిక్స్), పీఆర్ శ్రీజేశ్ (హాకీ), దీపా కర్మాకర్ (జిమ్నాస్టిక్స్), జీతు రాయ్ (షూటింగ్), సందీప్ కుమార్ (ఆర్చరీ), మన్‌దీప్ జాంగ్రా (బాక్సింగ్), బబిత, భజ్‌రంగ్ (రెజ్లింగ్), స్వరణ్ సింగ్ విర్క్ (రోయింగ్), సతీశ్ శివలింగం (వెయిట్‌లిఫ్టింగ్), సంతోయ్ దేవి (వుషు), శరత్ గైక్వాడ్ (ప్యారా సెయిలింగ్), మన్‌జీత్ చిల్లార్, అభిలాష మహాత్రే (కబడ్డీ).
అద్వానీ ఖాతాలో 13వ ప్రపంచ టైటిల్
భారత స్నూకర్ స్టార్ పంకజ్ అద్వానీ తన కెరీర్‌లో 13వ ప్రపంచ టైటిల్‌ను సాధించాడు. ఆగస్టు 11న జరిగిన ప్రపంచ 6-రెడ్ స్నూకర్ చాంపియన్‌షిప్‌ను అతడు కైవసం చేసుకున్నాడు. డిఫెండింగ్ చాంప్‌గా బరిలోకి దిగిన తను ఫైనల్లో యాన్ బింగ్‌టావో (చైనా)ను 6-2తో సునాయాసంగా ఓడించాడు.

సురేశ్ రైనా @ పదేళ్లు
 భారత మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా జూలై 30 నాటికి అంతర్జాతీయ క్రికెట్‌లో పదేళ్లు పూర్తి చేసుకున్నాడు. 2005, జూలై 30న శ్రీలంకతో దంబుల్లాలో వన్డే మ్యాచ్‌లో రైనా ఆరంగేట్రం చేశాడు. 28 ఏళ్ల రైనా ఆడిన తొలి మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇప్పటివరకు 218 వన్డేల్లో 5 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలతో 5,500 పరుగులు చేశాడు. వన్డే, టెస్టు, టీ20ల్లో సెంచరీ సాధించిన ఏకైక భారత ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. 2011 ప్రపంచకప్ నెగ్గిన జట్టులో సభ్యుడిగా ఉండడంతో పాటు అదే ఏడాది వెస్టిండీస్ టూర్‌కు వన్డే జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. 2011, 15 ప్రపంచకప్‌లు ఆడిన రైనా.. ఒక సెంచరీ, రెండు అర్ధసెంచరీలలో 358 పరుగులు చేశాడు. 18 టెస్టులు, 44 టీ20 మ్యాచ్‌లు సైతం ఆడాడు.

భారత క్రికెట్ స్పాన్సర్‌గా ‘పేటీఎం’భారత క్రికెట్ జట్టు స్వదేశంలో ఆడే అంతర్జాతీయ సిరీస్‌లతో పాటు దేశవాళీ క్రికెట్‌కు టైటిల్ స్పాన్సర్‌షిప్ హక్కులను పేటీఎం మాతృ సంస్థ ‘వన్97’ కంపెనీ దక్కించుకుంది. 2019 వరకు భారత్‌లో జరిగే అన్ని సిరీస్‌లనూ పేటీఎం కప్‌గా నిర్వహించనున్నారు. ఈ హక్కుల ద్వారా బీసీసీఐకి రూ.203.28 కోట్ల ఆదాయం సమకూరనుంది. జూలై 30న జరిగిన బోర్డు మార్కెటింగ్ కమిటీలో ఈమేరకు నిర్ణయించారు. ఒక్కో మ్యాచ్‌కు రూ.1.68 కోట్లు కనీస ధరగా నిర్ణయించగా... పేటీఎం రూ.2.42 కోట్లు చెల్లిస్తామంటూ దాఖలు చేసిన బిడ్‌ను కమిటీ ఆమోదించింది. గత ఏడాది మైక్రోమ్యాక్స్ సంస్థ ఒక్కో మ్యాచ్‌కు రూ.2.02 కోట్లు చెల్లించింది.

2022 వింటర్ ఒలింపిక్స్ వేదిక బీజింగ్ప్రపంచ క్రీడల చరిత్రలో చైనా రాజధాని బీజింగ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 2008లో సమ్మర్ ఒలింపిక్స్‌ను అంగరంగ వైభవంగా నిర్వహించిన బీజింగ్... 2022 వింటర్ ఒలింపిక్స్‌కూ ఆతిథ్యమివ్వనుంది. దీంతో రెండు ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చిన నగరంగా బీజింగ్ రికార్డులకెక్కనుంది. పోటీల వేదికను ఖరారు చేయడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సిల్ (ఐఓసీ) జూలై 31న ప్రత్యేకంగా సమావేశమైంది. బిడ్డింగ్‌లో బీజింగ్ 44 ఓట్లు సాధించగా... చివరి వరకు గట్టిపోటీ ఇచ్చిన కజకిస్తాన్‌కు 40 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆరు దేశాలు ఈ బిడ్డింగ్‌లో పాల్గొనగా... రకరకాల కారణాలతో నాలుగు దేశాలు వైదొలిగాయి. 

రాజీవ్‌గాంధీ ఖేల్త్న్రకు సానియా పేరు ప్రతిపాదనప్రతిష్టాత్మక రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర అవార్డుకు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పేరును కేంద్ర క్రీడాశాఖ ప్రతిపాదించింది. దీనిపై కమిటీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. సానియా సాధించిన విజయాలకు గుర్తుగా ఆమె పేరును సిఫార్సు చేసినట్లు ఆగస్టు 1న క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇంటర్-ఇన్‌స్టిట్యూషనల్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్45వ ఆల్ ఇండియా ఇంటర్- ఇన్‌స్టిట్యూషనల్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్ పోటీల్లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సౌమ్యజిత్ ఘోష్ గెలుచుకున్నాడు. ఆగస్టు 2న న్యూఢిల్లీలో జరిగిన ఫైనల్లో హర్మీత్ దేశాయ్‌ని సౌమ్యజిత్ ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను మనికా బాత్రా గెలుచుకుంది. ఈమె ఫైనల్లో అంకితా దాస్‌ను ఓడించింది. పురుషుల డబుల్స్ టైటిల్‌ను అభిషేక్ యాదవ్, సుధాన్షు గ్రోవర్ గెలుచుకున్నారు. వీరు ఫైనల్లో సౌమ్యజిత్ ఘోష్, హర్మీత్ దేశాయ్‌ని ఓడించారు. మహిళల డబుల్స్ టైటిల్‌ను క్రిత్వికా సిన్హా రాయ్, శ్వేతా పార్తే గెలుచుకున్నారు. వీరు ఫైనల్లో అనిందితా చక్రవర్తి, పల్లబి కుందూలను ఓడించారు.

ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్భారత్‌కు చెందిన ఆర్చర్ రజత్ చౌహాన్ ప్రపంచ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచి, వ్యక్తిగత పతకం సాధించిన తొలి భారతీయుడుగా రికార్డుకెక్కాడు. కోపెన్‌హాగెన్‌లో ఆగస్టు 1న జరిగిన ఫైనల్లో కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో స్టీఫెన్ హానెన్స్ (డెన్మార్క్) బంగారు పతకం సాధించాడు. మహిళల రికర్వ్ విభాగంలో భారత జట్టు రన్నరప్‌గా నిలిచి, రజతం సాధించింది. దీపికా కుమారి, లక్ష్మీరాణి, రిమిల్‌తో కూడిన బృందం ఈ పతకం సాధించింది. ఆగస్టు 2న కోపెన్‌హాగెన్‌లో జరిగిన ఫైనల్లో రష్యా జట్టు బంగారు పతకం సాధించింది.

జోత్స్నకు పదో టైటిల్భారత స్టార్ స్వ్కాష్ క్రీడాకారిణి జోత్స్న చిన్నప్ప తన కెరీర్‌లో పదో డబ్ల్యూఎస్‌ఏ టైటిల్ సాధించింది. ఆగస్టు 2న జరిగిన విక్టోరియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచి, 15 వేల డాలర్ల (దాదాపు రూ. 9.60 లక్షలు) ప్రైజ్‌మనీని పొందింది.

స్పెషల్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడులాస్ ఏంజెలీస్‌లో జరుగుతున్న స్పెషల్ ఒలింపిక్స్ ప్రపంచ గేమ్స్.. గోల్ఫ్‌లో భారత్‌కు చెందిన రణవీర్ సింగ్ సైనీ స్వర్ణ పతకం సాధించాడు. మూగ, చెవిటి వైకల్యంతో బాధపడుతున్న 14 ఏళ్ల సైనీ.. జులై 31న జరిగిన జీఎఫ్ గోల్ఫ్ లెవల్-2 అల్టర్‌నెట్ షాట్ ప్లేలో విజయం సాధించి ఆ ఘనత దక్కిన మొదటి భారతీయుడయ్యాడు. రణవీర్ రెండేళ్ల కిందట ఆసియా పసిఫిక్ క్రీడల్లో రెండు గోల్డ్ మెడల్స్ కూడా సాధించాడు.

జిమ్నాస్ట్ దీపాకు కాంస్యంఆసియా సీనియర్ జిమ్నాస్టిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అమ్మాయి దీపా కర్మాకర్ కాంస్య పతకాన్ని సాధించింది. ఆగస్టు 3న జరిగిన మహిళల వాల్ట్ విభాగంలో త్రిపురకు చెందిన దీపా 14.725 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. యాన్ వాంగ్ (చైనా-14.988 పాయింట్లు) స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకోగా... సెయి మియకావ (జపాన్-14.812 పాయింట్లు) రజత పతకాన్ని దక్కించుకుంది.

స్విమ్మింగ్‌లో లెడెకి ప్రపంచ రికార్డుప్రపంచ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో అమెరికా సూపర్ స్టార్ స్విమ్మర్ కేటీ లెడెకి కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. ఆగస్టు 3న జరిగిన మహిళల 1500 మీటర్ల ఫ్రీస్టయిల్ హీట్ రేసును 18 ఏళ్ల లెడెకి 15 ని: 27.71 సెకన్లలో ముగించి, గతేడాది పాన్ పసిఫిక్ చాంపియన్‌షిప్‌లో 15 ని : 28.35 సెకన్లతో తానే నెలకొల్పిన ప్రపంచ రికార్డును సవరించింది. 1500 మీటర్ల విభాగంలో లెడెకిది నాలుగో ప్రపంచ రికార్డు. 16 ఏళ్ల ప్రాయంలో 2013 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 15 ని : 36.53 సెకన్లతో తొలి ప్రపంచ రికార్డును సృష్టించిన లెడెకి... ఆ తర్వాత వుడ్‌లాండ్స్ మీట్‌లో (15 ని : 34.23 సెకన్లు), పాన్ పసిఫిక్ చాంపియన్‌షిప్‌లో మరో రెండుసార్లు ప్రపంచ రికార్డును సవరించింది. 400, 800 మీటర్ల విభాగాల్లోనూ లెడెకి పేరిటే ప్రపంచ రికార్డులు ఉన్నాయి.

No comments:

Post a Comment