AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

క్రీడలు ఆగష్టు 2014

క్రీడలు ఆగష్టు 2014
యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలిపతకం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాగాల వెంకట రాహుల్ చైనాలోని నాన్‌జింగ్‌లో జరుగుతున్న యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం అందించాడు. భారత్‌కు దక్కిన తొలి పతకం ఇదే. వెయిట్‌లిఫ్టింగ్‌లో ఆగస్టు 21న రాహుల్ 77 కిలోల విభాగంలో రజతం సాధించాడు. అమెరికాకు చెందిన హాకోబ్‌కు స్వర్ణం, కజకిస్థాన్‌కు చెందిన కలియన్‌కు కాంస్యం దక్కాయి. 

బెల్జియం గ్రాండ్ ప్రి విజేత రికియార్డోబెల్జియం గ్రాండ్‌ప్రిని రెడ్‌బుల్ డ్రైవర్ డానియల్ రికియార్డో గెలుచుకున్నాడు. రోస్‌బర్గ్ (మెర్సిడెజ్)కు రెండో స్థానం దక్కింది. 

ఫెదర ర్, సెరెనాలకు సిన్సినాటి టైటిళ్లుసిన్సినాటి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పురుషుల విభాగంలో రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్) విజేతగా నిలిచాడు. మహిళల టైటిల్‌ను సెరెనా విలియమ్స్ (అమెరికా) సొంతం చేసుకుంది.

ఆసియా పురుషుల వాలీబాల్ చాంప్ దక్షిణకొరియానాలుగో ఏవీసీ క్లబ్ కప్ వాలీబాల్ టోర్నమెంట్ టైటిల్‌ను దక్షిణకొరియా గెలుచుకుంది. కజకిస్థాన్‌లో ఆల్‌మాటీలో జరిగిన ఫైనల్‌లో భారత్‌ను ఓడించి స్వర్ణం గెలుచుకుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ టోర్నమెంట్‌లో భారత్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి.
చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు పతకం
చెస్ ఒలింపియాడ్‌లో భారత్ తొలిపతకాన్ని సాధించింది. నార్వేలో జరిగిన టోర్నీ చివరి రౌండ్‌లో భారత పురుషుల జట్టు ఉజ్బెకిస్థాన్‌ను ఓడించి ద్వితీయ స్థానంలో నిలిచింది. అయితే టైబ్రేక్ కారణంగా మూడోస్థానంలో భారత్ కాంస్యం గెలుచుకుంది. కాంస్యం గెలుచుకున్న జట్టులో తెలుగుతేజం లలిత్‌బాబు ఉన్నాడు. 1924లో చెస్ ఒలింపియాడ్ మొదలైన తర్వాత భారత్ పతకం గెలుచుకోవడం ఇదే తొలిసారి. 
ప్రపంచ టీమ్ బిలియర్డ్స్‌లో భారత్‌కు స్వర్ణం
మొదటి ప్రపంచ టీమ్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ స్వర్ణ, రజత పతకాలు సాధించింది. ఆగస్టు 15న గ్లాస్గోలో జరిగిన ఫైనల్‌లో భారత-బి జట్టు భారత-ఎ జట్టును ఓడించి స్వర్ణం సాధించింది. ఈ విజయంతో పంకజ్ అద్వానీ (10) అత్యధిక ప్రపంచ టైటిల్స్ సాధించిన భారత క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. ఇంతవరకు ఏ క్రీడలో ఏ ఆటగాడూ ఇన్ని ప్రపంచ టైటిల్స్‌ను గెలవలేదు. ఇంతవరకు ఏ క్రీడాకారుడూ ఇన్ని టైటిల్స్‌ను గెలుచుకోలేదు. 28 ఏళ్ల అద్వానీ 8 సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను, రెండు సార్లు ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించాడు. 
మదుగలె రికార్డు
ఐసీసీ మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలె ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇటీవల భారత్-ఇంగ్లండ్‌ల మధ్య ముగి సిన ఐదో టెస్టు ఆయనకు 150వది కావడం విశేషం. తద్వారా టెస్టు క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి రిఫరీగా మదుగలె రికార్డు సృష్టించారు. 1993లో కరాచీలో పాకిస్థాన్, జింబాబ్వే మధ్య జరిగిన టెస్టుతో ఆయన అంతర్జాతీయ రిఫరీగా మారారు. 
చైనాలో ప్రారంభమైన యూత్ ఒలింపిక్స్
చైనాలోని నాన్‌జింగ్ ఒలింపిక్ స్టేడియంలో ఆగస్టు 16న యూత్ ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు జరిగే ఈ ఒలింపిక్స్‌లో 200లకు పైగా దేశాలకు చెందిన దాదాపు 3600 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. 
పటౌడీ ట్రోఫీ విజేత ఇంగ్లండ్
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఆగస్టు 18న ముగిసిన ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. తద్వారా వరుసగా మూడో సారి (2011, 2012, 2014) పటౌడీ ట్రోఫీని గెలుచుకుంది. అండర్సన్ (ఇంగ్లండ్), భువనేశ్వర్ (భారత్)లకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
ఫోర్‌‌బ్స కోటీశ్వరుల జాబితాలో షరపోవా అగ్రస్థానం
రష్యా టెన్నిస్ క్రీడాకారిణి మరియా షరపోవా ఫోర్బ్స్ మహిళ క్రీడాకారుల కోటీశ్వరుల జాబితాలో వరుసగా పదో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. 2013 జూన్- 2014 జూన్ మధ్య కాలంలో వాణిజ్య ఒప్పందాలు, ప్రైజ్ మనీ ద్వారా సుమారు రూ. 148 కోట్లకు పైగా సంపాదనతో మహిళా అథ్లెట్లలో మొదటిస్థానం సాధించింది. చైనా టెన్నిస్ క్రీడాకారిణి లినా రూ. 143 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది.

ప్రపంచకప్ ఆర్చరీలో దీపిక బృందానికి స్వర్ణ పతకం 
పోలెండ్ దేశం వ్రోక్లా నగరంలో జరుగుతున్న ప్రపంచకప్ ఆర్చరీలో దీపిక కుమారి నేతృత్వంలోని మహిళల రికర్వ్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఆగస్టు 10న జరిగిన ఫైనల్లో దీపికా కుమారి, బొంబేలా దేవీ, లక్ష్మీరాణిలతో కూడిన భారత మహిళల జట్టు మెక్సికో జట్టుపై విజయం సాధించింది. కాగా జయంత తాలుక్‌దార్ సారథ్యంలోని భారత పురుషుల జట్టు రజతం సాధించింది. 
రద్వాన్ స్కా కు డబ్ల్యూటీఏ రోజర్స్ కప్ టైటిల్
డబ్ల్యూటీఏ రోజర్స్ కప్ టెన్నిస్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను రద్వాన్ స్కా (పోలెండ్) గెలుచుకుంది. టొరంటోలో ఆగస్టు 11న జరిగిన ఫైనల్‌లో వీనస్ విలియమ్స్ (అమెరికా)ను రద్వాన్ స్కా ఓడించింది. 
సోంగాకు ఏటీపీ రోజర్స్ కప్ టైటిల్
ఏటీపీ రోజర్స్ కప్ పురుషుల సింగిల్స్ టెన్నిస్ టైటిల్‌ను జోవిల్ ఫ్రైడ్ సోంగా (ఫ్రాన్స్) కైవసం చేసుకున్నాడు. ఆగస్టు 11న జరిగిన ఫైనల్‌లో రోజర్ ఫెదరర్(స్విట్జర్లాండ్) ను సోంగా ఓడించాడు.
లెడెకి మరో ప్రపంచ రికార్డు
అమెరికా స్వివ్ముర్ కేటీ లెడెకి మరో సంచనలం సృష్టించింది. యుఎస్ స్విమ్మింగ్ జాతీయ చాంపియున్‌షిప్‌లో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. శనివారం జరిగిన వుహిళల 400 మీటర్ల ఫ్రీస్టరుుల్ రేసును 17 ఏళ్ల ఈ అమ్మాయి 3ని.58.86 సెకన్లలో పూర్తి చేసి కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేసింది. గతంలో ఈ రికార్డు ఇటలీ స్వివ్ముర్ ఫెడ్రికా పెల్లెగ్రిని (3:59.15 సెకన్లు) పేరిట ఉండేది. హైటెక్ బాడీ సూట్‌ను నిషేధించిన తర్వాత పెల్లెగ్రిని ఈ రికార్డు నెలకొల్పింది. ఇదే టోర్నీలో 800 మీటర్లు. 1500 మీటర్ల ఫ్రీస్టరుల్‌లోనూ కొత్త ప్రపంచ రికార్డులు సృష్టించిన లెడెకి... జానెట్ ఇవాన్స్ (1998 నుంచి 2006 మధ్యలో) తర్వాత ఏకకాలంలో వుూడు విభాగాల్లో ప్రపంచ రికార్డులు నమోదు చేసుకున్న స్విమ్మర్‌గా గుర్తింపు పొందింది.

కామన్‌వెల్త్ క్రీడల్లో భారత్‌కు 5వస్థానం
స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జూలై 23న ప్రారంభమైన 21వ కామన్‌వెల్త్ క్రీడలు ఆగస్టు 3తో ముగిశాయి. కెనడాకు చెందిన రిథమిక్ జిమ్నాస్ట్ ఫ్రాంకీ జోన్స్ ఉత్తమ అథ్లెట్‌గా ఎంపికైంది. 21వ కామన్‌వెల్త్ క్రీడలు ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ నగరంలో 2018లో జరగనున్నాయి. 
మొదటి 5 స్థానాల్లో నిలిచిన దేశాలు 
దేశంస్వర్ణంరజతంకాంస్యంమొత్తం
ఇంగ్లండ్585957174
ఆస్ట్రేలియా494246137
కెనడా32164682
స్కాట్లాండ్19151953
భారత్15301964
భారత్ 2010 కామన్‌వెల్త్ క్రీడల్లో 38 స్వర్ణాలు, 27 రజతాలు, 36 కాంస్యాలతో మొత్తం 101 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది. 

కశ్యప్‌కు స్వర్ణం తెలుగు క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్ బ్యాడ్మింటన్‌లో స్వర్ణం సాధించాడు. 1978లో ప్రకాశ్ పదుకొనె, 1982లో సయ్యద్ మోడీ పురుషుల సింగిల్స్‌లో స్వర్ణం సాధించారు. స్క్వాష్‌లో మహిళల డబుల్స్‌లో భారత జోడీ దీపికా పల్లికల్, జ్యోష్న చినప్ప టైటిల్ గెలుచుకున్నారు. కామన్‌వెల్త్ క్రీడల్లో స్క్వాష్‌లో భారత్ పతకం సాధించడం ఇదే తొలిసారి. అలాగే కామన్‌వెల్త్ క్రీడల్లో జిమ్నాస్టిక్స్‌లో తొలిసారి పతకం సాధించిన భారత క్రీడాకారిణిగా దీప కర్మాకర్ రికార్డు సృష్టించింది. జూలై 31న వాల్ట్ విభాగంలో జరిగిన పోటీలో త్రిపురకు చెందిన దీప కాంస్య పతకం నెగ్గింది. కర్ణాటకకు చెందిన వికాస్‌గౌడ్ డిస్కస్‌త్రోలో తొలి స్వర్ణం సాధించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు.. ఈ విజయంతో అథ్లెటిక్స్ విభాగంలో స్వర్ణం సాధించిన రెండో వ్యక్తిగా రికార్డులకెక్కాడు. వికాస్‌గౌడ్‌కు ముందు మిల్కాసింగ్ 1958 కామన్‌వెల్త్ క్రీడల్లో ట్రాక్ ఈవెంట్ విభాగంలో తొలిసారి బంగారుపతకం సాధించాడు. 

టెన్నిస్‌లో వేగవంతమైన సర్వ్ రికార్డ్ నమోదుజర్మనీకి చెందిన సబీన్ లిసికి జూలై 30న మహిళల టెన్నిస్ విభాగంలో అత్యంత వేగవంతమైన సర్వ్ రికార్డును నెలకొల్పింది. అమెరికా వేదికగా అన్నా ఇవనోవిచ్‌తో తలపడిన మ్యాచ్‌లో మొదటి రౌండ్‌లో గంటకు 131 మైళ్ల వేగంతో సర్వ్‌ను చేసింది. కాగా ఆమె ఓటమిపాలైంది.

No comments:

Post a Comment