AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Saturday 25 November 2017

క్రీడలు మార్చి 2012

క్రీడలు (1 - 7) మార్చి 2012
భారత్‌కు తొలి మహిళల కబడ్డీ ప్రపంచ ఛాంపియన్‌షిప్తొలిసారి నిర్వహించిన మహిళల కబడ్డీ ఛాంపిన్‌షిప్‌ను భారత్ గెలుచుకుంది. మార్చి 4న పాట్నాలో జరిగిన ఫైనల్‌లో భారత్,ఇరాన్ జట్టుపై 25-19 తేడాతో విజయం సాధించింది. జపాన్‌ను ఓడించి భారత్; థాయ్‌లాండ్‌ను ఓడించి ఇరాన్ ఫైనల్‌లో ప్రవేశించాయి.

ఫుట్‌బాల్ క్రీడాకారుడు సైలేన్ మృతిఒకప్పటి మేటి ఫుట్‌బాల్ క్రీడాకారుడు సైలేంద్రనాథ్ మన్నా (87) కోల్‌కతాలో ఫిబ్రవరి 27న మరణించారు. మన్నా నాయకత్వంలో న్యూఢిల్లీ ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం లభించింది. 1952 హెల్సెంకీ ఒలింపిక్స్, 1954 మనీలా ఆసియా క్రీడల్లో భారత జట్టుకు సైలేన్ నాయకత్వం వహించారు. ఆయనకు 1970లో పద్మశ్రీ లభించింది. గోస్తో పాల్ తర్వాత పద్మశ్రీ పొందిన రెండో ఫుట్‌బాల్ క్రీడాకారుడు మన్నా.

ఫెదరర్‌కు దుబాయ్ ఓపెన్దుబాయ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టెన్నీస్ టైటిల్‌ను రోజర్ ఫెదరర్ గెలుచుకున్నాడు. దుబాయ్‌లో మార్చి 3న జరిగిన ఫైనల్స్‌లో ఆండీ ముర్రేను ఫెదరర్ ఓడించాడు. ఫెదరర్ ఐదోసారి దుబాయ్ టైటిల్ సాధించాడు. 

పురుషుల డబుల్స్ టైటిల్‌ను భారత్‌కు చెం దిన మహేష్ భూపతి-రోహన్ బోపన్న జోడి గెలుచుకుంది. 
వీరు పోలెండ్‌కు చెందిన ఫిర్‌స్టెన్ బర్‌‌గ - మార్సిన్ మాట్కోవ్ స్కీలను ఓడించారు.

వెస్టిండీస్ క్రికెటర్ మోర్టాన్ మృతివెస్టిండీస్ క్రికెట్ క్రీడాకారుడు రునోక్ మోర్టాన్ మార్చి 4న కారు ప్రమాదంలో మరణించారు. 2002 నుంచి మోర్టాన్ 15 టెస్టులు, 56 వన్డేలు, ఏడు ట్వంటీ 20 మ్యాచ్‌లు ఆడారు.

క్రీడలు (8 - 14) మార్చి 2012
కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియామూడు దేశాల కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ క్రికెట్ టైటిల్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. మార్చి 8న అడిలైడ్‌లో జరిగిన ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి ఈ టైటిల్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. శ్రీలంకకు చెందిన దిల్షాన్ ‘ప్లెయర్ ఆఫ్ ద టోర్ని’గా ఎంపికయ్యాడు. ఈ పోటీలో భారత్ కూడా పాల్గొంది.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగిన ద్రావిడ్భారత క్రికెట్ క్రీడాకారుడు రాహుల్ ద్రావిడ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగుతున్నట్లు మార్చి 8న ప్రకటించాడు. గత 16 ఏళ్లుగా ద్రావిడ్ క్రికెట్ క్రీడాకారుడిగా కొనసాగుతున్నాడు. 1996లో టెస్ట్ క్రికెట్‌లో ప్రవేశించారు. టెస్టుల్లో 13,288 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన రెండో క్రీడాకారుడిగా నిలిచాడు. ద్రావిడ్ 36 సెంచరీలు, 63 అర్ధ సెంచరీలు చేశాడు. వన్డేలో 10,000 పరుగులు చేసిన మూడో భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు.

లిన్ డాన్‌కు ఆల్ ఇంగ్లండ్ టైటిల్పురుషుల సింగిల్స్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను లిన్ డాన్ (చైనా) గెలుచుకున్నారు. లండన్‌లో మార్చి 11న ముగిసిన ఫైనల్‌లో లీ చోంగ్ వీ (మలేషియా)ను లిన్ డాన్ ఓడించాడు. లిన్ డాన్‌కు ఇది ఐదో ఆల్ ఇంగ్లండ్ టైటిల్.
పురుషుల డబుల్స్: జుంగ్ జే సుంగ్, లీ యాంగ్ డే (కొరియా)లు కైయున్, పు హైఫెంగ్(చైనా)లను ఓడించి టైటిల్ సాధించారు.
మహిళల సింగిల్స్: లి యు రెయు (చైనా) గెలుచుకుంది. ఈమె వాంగ్ విహాన్ (చైనా)ను ఓడించింది. 
మహిళల డబుల్స్: లియన్ క్వింగ్, జావో యున్‌లీ (చైనా)లు వాంగ్ గ్జియోలి, యు వాంగ్ (చైనా)లను ఓడించి టైటిల్ సాధించారు.

హరికృష్ణకు క్యాపెల్లి చెస్ ఇంటర్నేషనల్ టైటిల్ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రాండ్ మాస్టర్ పెండేల హరికృష్ణ క్యాపెల్లి చెస్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ టైటిల్ సాధించాడు. ఫ్రాన్స్‌లో మార్చి 11న ముగిసిన పోటీలో హరికృష్ణ విజేతగా నిలిచాడు.

బెంగాల్‌కు విజయ్ హజారే ట్రోఫీవిజయ్ హజారే వన్డే క్రికెట్ ట్రోఫీని బెంగాల్ గెలుచుకుంది. మార్చి 12న న్యూఢిల్లీలో జరిగిన ఫైనల్స్‌లో ముంబైని బెంగాల్ ఓడించింది.

క్రీడలు మార్చి 2012
ఆసియా క ప్ విజేత పాకిస్థాన్ఆసియా కప్ క్రికెట్ టైటిల్‌ను పాకిస్థాన్ జట్టు గెలుచుకుంది. మార్చి 22న మీర్పూర్(బంగ్లాదేశ్)లో జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఓడించి రెండోసారి ఆసియా కప్‌ను సాధించింది. బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకిబుల్ హసన్ ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’గా ఎంపికయ్యాడు.

వెస్ట్‌కు దేవధర్ ట్రోఫీదేవధర్ ట్రోఫీ క్రికెట్ టైటిల్‌ను వెస్ట్‌జోన్ జట్టు గెలుచుకుంది. ధర్మశాలలో మార్చి 19న జరిగిన ఫైనల్లో నార్త్‌జోన్‌పై విజయం సాధించింది.

ఇండియానా వేల్స్ విజేత ఫెదరర్
ఇండియానా వేల్స్ ఏటీపీ టెన్నిస్ టోర్నీ టైటిల్‌ను స్విట్జర్లాండ్‌కు చెందిన రోజర్ ఫెదరర్ గెలుచుకున్నాడు. ఫైనల్లో అమెరికా ఆటగాడు జాన్ ఇస్నర్‌ను ఓడించాడు. దీంతో ఫెదరర్ ఈ ట్రోఫీని నాలుగు సార్లు గెలుచుకున్న ఏకైక ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

ఆసియా మహిళల బాక్సింగ్ మేరీకామ్‌కు స్వర్ణంఆసియా మహిళల చాంపియన్‌షిప్ 51 కిలోల విభాగంలో భారత స్టార్ బాక్సర్ మేరీకామ్ స్వర్ణ పతకం గెలుచుకుంది. ఇదే టోర్నీలో మరో భారత బాక్సర్ సరితా దేవి (60 కిలోల విభాగంలో) కూడా స్వర్ణ పతకాన్ని సాధించింది.

‘టైగర్’కు ఉడ్స్ పామెర్ టైటిల్ఆర్నోల్డ్ పామెర్ ఇన్విటేషన్ గోల్ఫ్ టైటిల్‌ను టైగర్ వుడ్స్ గెలుచుకున్నాడు. 2009 తర్వాత వుడ్స్‌కు ఇది తొలి టైటిల్. 

పంజాబ్ పోలీస్‌కు బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ కప్ పురుషుల టైటిల్బాస్కెట్ బాల్ ఫెడరేషన్ కప్ పురుషుల టైటిల్‌ను పంజాబ్ పోలీస్ గెలుచుకుంది. కోచిలో మార్చి 18న నిర్వహించిన ఫైనల్స్‌లో పంజాబ్ పోలీస్ జట్టు ఓఎన్‌జీసీని ఓడించింది. మహిళల టైటిల్‌ను చత్తీస్‌గఢ్‌ను ఓడించి సదరన్ రైల్వే సాధించింది.

 సైనా నెహ్వాల్‌కు స్విస్ ఓపెన్భారత్‌కు చెందిన సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ స్విస్ ఓపెన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ ట్రోఫీని గెలుచుకుంది. మార్చి 18న బాసెల్‌లో జరిగిన ఫైనల్‌లో చైనాకు చెందిన వాంగ్ షిగ్జియన్‌ను సైనా ఓడించింది.

జెన్సన్ బటన్‌కు ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీఫార్ములా వన్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ టైటిల్‌ను జెన్సన్ బటన్ సాధించాడు. మెల్‌బోర్‌‌నలో మార్చి 18న ముగిసిన పోటీలో బటన్ టైటిల్ సాధించగా, సెబాస్టియన్ వెటల్ రెండో స్థానంలో నిలిచాడు

 ఇండియన్ వెల్స్ డబుల్స్ రన్నరప్‌గా సానియా జోడిఇండియా వెల్స్ మహిళల డబుల్స్ టైటిల్ ఫైనల్‌లో భారత్‌కు చెందిన సానియా మీర్జా, ఎలెనా వెస్నీనా (రష్యా) జోడి ఓడిపోయింది. ఇండియన్ వెల్స్ (అమెరికా)లో మార్చి 18న జరిగిన ఫైనల్స్‌లో లీజుల్ హ్యుబర్, లీసా రేమండ్(అమెరికా)లు సానియా జోడిని ఓడించి టైటిల్ సాధించారు.

వెస్ట్ జోన్‌కు దేవధర్ ట్రోఫీక్రికెట్ దేవధర్ ట్రోఫీని వెస్ట్‌జోన్ గెలుచుకుంది. మార్చి 19న ధర్మశాలలో జరిగిన ఫైనల్లో నార్‌‌తజోన్‌ను వెస్ట్‌జోన్ ఓడించింది.

రోజర్ ఫెదరర్‌కు ఇండియన్ వెల్స్ టైటిల్ఇండియన్ వెల్స్ ఏటీపీ టోర్నమెంట్ టైటిల్‌ను రోజర్ ఫెదరర్ గెలుచుకున్నాడు. కాలిఫోర్నియాలోని ఇండియన్ వెల్స్‌లో మార్చి 19న జరిగిన ఫైనల్లో జాన్ ఇన్నర్‌ను ఫెదరర్ ఓడించాడు. ఈ ట్రోఫీని ఫెదరర్ నాలుగు సార్లు సాధించి రికార్డు నెలకొల్పాడు.
మహిళల సింగిల్స్ టైటిల్‌ను విక్టోరియా అజరెంకా గెలుచుకుంది. షెరపోవాను అజరెంకా ఓడించింది.

 100 సెంచరీలతో టెండూల్కర్ రికార్డుభారత్ క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. తన 100వ సెంచరీ మార్చి 16న బంగ్లాదేశ్‌లోని ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన ఆసియాకప్‌లో పూర్తి చేశాడు. మొత్తం 100 సెంచరీల్లో వన్డేల్లో 49, టెస్టుల్లో 51 చేశాడు. మొదటి సెంచరీ ఇంగ్లండ్‌పై 1990 ఆగస్టులో చేయగా, 99వ సెంచరీ 2011లో దక్షిణాఫ్రికాపై చేశాడు. సచిన్ వన్డే, టెస్ట్‌ల్లో మొత్తం 33,854 పరుగులు చేశారు. టెండూల్కర్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసినవారిలో రికీ పాంటింగ్ (71), జాక్ కల్లీస్ (59), బ్రియాన్ లారా (53), రాహుల్ ద్రావిడ్ (48) ఉన్నారు.
కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియామూడు దేశాల కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ క్రికెట్ టైటిల్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. మార్చి 8న అడిలైడ్‌లో జరిగిన ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి ఈ టైటిల్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. శ్రీలంకకు చెందిన దిల్షాన్ ‘ప్లెయర్ ఆఫ్ ద టోర్ని’గా ఎంపికయ్యాడు. ఈ పోటీలో భారత్ కూడా పాల్గొంది.

అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగిన ద్రావిడ్భారత క్రికెట్ క్రీడాకారుడు రాహుల్ ద్రావిడ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదొలగుతున్నట్లు మార్చి 8న ప్రకటించాడు. గత 16 ఏళ్లుగా ద్రావిడ్ క్రికెట్ క్రీడాకారుడిగా కొనసాగుతున్నాడు. 1996లో టెస్ట్ క్రికెట్‌లో ప్రవేశించారు. టెస్టుల్లో 13,288 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన రెండో క్రీడాకారుడిగా నిలిచాడు. ద్రావిడ్ 36 సెంచరీలు, 63 అర్ధ సెంచరీలు చేశాడు. వన్డేలో 10,000 పరుగులు చేసిన మూడో భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు.

లిన్ డాన్‌కు ఆల్ ఇంగ్లండ్ టైటిల్పురుషుల సింగిల్స్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను లిన్ డాన్ (చైనా) గెలుచుకున్నారు. లండన్‌లో మార్చి 11న ముగిసిన ఫైనల్‌లో లీ చోంగ్ వీ (మలేషియా)ను లిన్ డాన్ ఓడించాడు. లిన్ డాన్‌కు ఇది ఐదో ఆల్ ఇంగ్లండ్ టైటిల్.
పురుషుల డబుల్స్: జుంగ్ జే సుంగ్, లీ యాంగ్ డే (కొరియా)లు కైయున్, పు హైఫెంగ్(చైనా)లను ఓడించి టైటిల్ సాధించారు.
మహిళల సింగిల్స్: లి యు రెయు (చైనా) గెలుచుకుంది. ఈమె వాంగ్ విహాన్ (చైనా)ను ఓడించింది. 
మహిళల డబుల్స్: లియన్ క్వింగ్, జావో యున్‌లీ (చైనా)లు వాంగ్ గ్జియోలి, యు వాంగ్ (చైనా)లను ఓడించి టైటిల్ సాధించారు.

హరికృష్ణకు క్యాపెల్లి చెస్ ఇంటర్నేషనల్ టైటిల్ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రాండ్ మాస్టర్ పెండేల హరికృష్ణ క్యాపెల్లి చెస్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్ టైటిల్ సాధించాడు. ఫ్రాన్స్‌లో మార్చి 11న ముగిసిన పోటీలో హరికృష్ణ విజేతగా నిలిచాడు.

బెంగాల్‌కు విజయ్ హజారే ట్రోఫీవిజయ్ హజారే వన్డే క్రికెట్ ట్రోఫీని బెంగాల్ గెలుచుకుంది. మార్చి 12న న్యూఢిల్లీలో జరిగిన ఫైనల్స్‌లో ముంబైని బెంగాల్ ఓడించింది. 
భారత్‌కు తొలి మహిళల కబడ్డీ ప్రపంచ ఛాంపియన్‌షిప్తొలిసారి నిర్వహించిన మహిళల కబడ్డీ ఛాంపిన్‌షిప్‌ను భారత్ గెలుచుకుంది. మార్చి 4న పాట్నాలో జరిగిన ఫైనల్‌లో భారత్,ఇరాన్ జట్టుపై 25-19 తేడాతో విజయం సాధించింది. జపాన్‌ను ఓడించి భారత్; థాయ్‌లాండ్‌ను ఓడించి ఇరాన్ ఫైనల్‌లో ప్రవేశించాయి.

ఫుట్‌బాల్ క్రీడాకారుడు సైలేన్ మృతిఒకప్పటి మేటి ఫుట్‌బాల్ క్రీడాకారుడు సైలేంద్రనాథ్ మన్నా (87) కోల్‌కతాలో ఫిబ్రవరి 27న మరణించారు. మన్నా నాయకత్వంలో న్యూఢిల్లీ ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణం లభించింది. 1952 హెల్సెంకీ ఒలింపిక్స్, 1954 మనీలా ఆసియా క్రీడల్లో భారత జట్టుకు సైలేన్ నాయకత్వం వహించారు. ఆయనకు 1970లో పద్మశ్రీ లభించింది. గోస్తో పాల్ తర్వాత పద్మశ్రీ పొందిన రెండో ఫుట్‌బాల్ క్రీడాకారుడు మన్నా.

ఫెదరర్‌కు దుబాయ్ ఓపెన్దుబాయ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టెన్నీస్ టైటిల్‌ను రోజర్ ఫెదరర్ గెలుచుకున్నాడు. దుబాయ్‌లో మార్చి 3న జరిగిన ఫైనల్స్‌లో ఆండీ ముర్రేను ఫెదరర్ ఓడించాడు. ఫెదరర్ ఐదోసారి దుబాయ్ టైటిల్ సాధించాడు. 

పురుషుల డబుల్స్ టైటిల్‌ను భారత్‌కు చెం దిన మహేష్ భూపతి-రోహన్ బోపన్న జోడి గెలుచుకుంది. 
వీరు పోలెండ్‌కు చెందిన ఫిర్‌స్టెన్ బర్‌‌గ - మార్సిన్ మాట్కోవ్ స్కీలను ఓడించారు.

వెస్టిండీస్ క్రికెటర్ మోర్టాన్ మృతివెస్టిండీస్ క్రికెట్ క్రీడాకారుడు రునోక్ మోర్టాన్ మార్చి 4న కారు ప్రమాదంలో మరణించారు. 2002 నుంచి మోర్టాన్ 15 టెస్టులు, 56 వన్డేలు, ఏడు ట్వంటీ 20 మ్యాచ్‌లు ఆడారు.

No comments:

Post a Comment