AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు జనవరి 2013

వార్తల్లో వ్యక్తులు జనవరి 2013
‘శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్’లో యు.ఆర్.రావుభారతీయ అంతరిక్ష శాస్త్రవేత్త, ఇస్రో మాజీ చైర్మన్ యు.ఆర్.రావు ప్రతిష్టాత్మక ‘శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్’ బందం సభ్యుడిగా ఎంపికయ్యారు. భూమిపై ప్రాణికోటి అభివద్ధికి ఉపగ్రహ సాంకేతికత ద్వారా విశేష కషి చేసిన ప్రముఖ శాస్త్రవేత్తలను అమెరికాలోని ‘ద సొసైటీ ఆఫ్ శాటిలైట్ ప్రొఫెషనల్స్ ఇంటర్నేషనల్(ఎస్‌ఎస్‌పీఐ)’1987 నుంచి ‘శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్’ సభ్యులుగా నియమిస్తోంది. కమ్యూనికేషన్లు, ఉపగ్రహ సంబంధ పరిశోధనలు, శాటిలైట్ టెక్నాలజీ ద్వారా అభివద్ధికి మార్గదర్శకులుగా ఈ బంద సభ్యులను గౌరవిస్తోంది. బెంగళూరుకు చెందిన రావు అహ్మదాబాద్‌లో ఇస్రోకు చెందిన ఫిజికల్ రీసెర్చ్ లేబొరేటరీ (పీఆర్‌ఎల్) పాలక మండలి చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 

యూజీసీ చైర్మన్‌గా వేద ప్రకాశ్ నియామకంయూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్‌గా వేద ప్రకాశ్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. వేద ప్రకాశ్ ప్రస్తుతం యూజీసీ తాత్కాలిక చైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2011 ఫిబ్రవరిలో ఎస్ థోరట్ యూజీసీ చైర్మన్‌గా రాజీనామా చేశారు. దీంతో రెండేళ్లుగా ఈ పదవి ఖాళీగానే ఉంది. వేద ప్రకాశ్ గతంలో యూజీసీ వైస్ చైర్మన్‌గా, కార్యదర్శిగా పనిచేశారు.

ప్రేమలత రికార్డుభారత్‌కు చెందిన ప్రేమలత అగర్వాల్ అంటార్కిటికాలోని మౌంట్ విన్‌సన్ పర్వతాన్ని అధిరోహించారు. తద్వారా ఏడు ఖండాల్లోని ఆరు ఎత్తెన పర్వతాలను అధిరోహించిన భారత మహిళగా రికార్డును సొంతం చేసుకున్నారు.

అమెరికా రక్షణ మంత్రిగా హేగెల్అమెరికా రక్షణ మంత్రిగా రిపబ్లికన్ పార్టీ మాజీ సెనెటర్ చక్ హేగెల్‌ను ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా జనవరి 8న నియమించారు. 2011లో లాడెన్‌ను మట్టుబెట్టడంలో కీలక పాత్ర పోషించిన ‘వైట్‌హౌస్’ ఉగ్రవాద నిరోధక విభాగం సలహాదారు జాన్ బ్రెన్నన్‌ను సీఐఏ (సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ) నూతన చీఫ్‌గా నామినేట్ చేశారు.

సింగపూర్ పార్లమెంట్ స్పీకర్‌గా హలిమా యాకోబ్సింగపూర్ పార్లమెంట్ స్పీకర్‌గా భారత సంతతికి చెందిన హలి మా యాకోబ్ బాధ్యతలు స్వీకరించారు. ఆ దేశ పార్లమెంట్‌కు స్పీకర్‌గా వ్యవహరించనున్న తొలి మహిళగా కూడా హలిమా ఘనత దక్కించుకున్నారు.

ఎన్‌డీఏ కమాండెంట్‌గా కుల్వంత్పుణేలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) కమాండెంట్‌గా లెఫ్టినెంట్ జనరల్ అశోక్ సింగ్ స్థానంలో ఎయిర్‌మార్షల్ కుల్వంత్ సింగ్ జనవరి 8న బాధ్యతలు స్వీకరించారు.

అమెరికా ఆర్థిక మంత్రిగా జాక్ లాఅమెరికా ఆర్థిక మంత్రిగా జాక్ లాను ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా జనవరి 11న నియమించారు. జాక్ లా గతంలో వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా వ్యవహరించారు.

యూకే కేబినెట్‌లో మొదటి గుజరాతీయూకే కే బినెట్‌లో స్థానం పొందిన మొదటి గుజరాతీగా లార్డ్ డోలర్ పాపట్ చరిత్ర సష్టించారు. పాపట్‌ను బిజినెస్-ఇన్నోవేషన్, స్కిల్స్, ట్రాన్స్‌పోర్ట్ శాఖ మంత్రిగా ఆ దేశ ప్రధానమంత్రి డేవిడ్ కామారూన్ నియమించారు.

ఐబీ ప్రధానాధికారిగా ఇబ్రహీం
ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) నూతన ప్రధానాధికారిగా నేహాచల్ సంధు స్థానంలో మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్‌ఏ ఇబ్రహీం జనవరి 1న బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లు ఈ పదవిలో కొనసాగే ఇబ్రహీం గతంలో ఐబీ ప్రత్యేక డెరైక్టర్‌గా పని చేశారు. ప్రధాన మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి ఐబీ చీఫ్‌గా నియమితులు కావడం ఇదే తొలిసారి.

షార్ డెరైక్టర్‌గా ప్రసాద్శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) డెరైక్టర్‌గా మలపాక యజ్ఞేశ్వర సత్యప్రసాద్ (ఎం.వై.ఎస్. ప్రసాద్) జనవరి 1న బాధ్యతలు స్వీకరించారు. ఈయన 1953లో పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు. 1975లో ఇస్రోలో చేరి తిరువనంతపురంలోని స్పేస్ సెంటర్‌లో జూనియర్ శాస్త్రవేత్తగా వివిధ హోదాల్లో పనిచేశారు. 2008 నుంచి షార్‌లో అసోసియేట్ డెరైక్టర్‌గా ఉన్నారు. చంద్రయాన్-1 ప్రయోగంలో కీలక పాత్ర వహించిన వారిలో ప్రసాద్ ఒకరు. 

లా కమిషన్ చైర్మన్‌గా జైన్లా కమిషన్ చైర్మన్‌గా జస్టిస్ డి.కె.జైన్ నియమితులయ్యారు. జనవరి 24న ఈయన బాధ్యతలు చేపడతారు. ఇది 20వ లా కమిషన్. దీని కాలపరిమితి 2015 ఆగస్టు 31తో ముగుస్తుంది. సంక్లిష్టమైన అంశాలపై కేంద్రానికి లా కమిషన్ సలహాలిస్తుంది.

No comments:

Post a Comment