AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు ఆగష్టు 2014

వార్తల్లో వ్యక్తులు ఆగష్టు 2014
పీఏసీ చైర్మన్‌గా థామస్పార్లమెంట్ ప్రజాపద్దుల సంఘం (పీఏసీ) కొత్త చైర్మన్‌గా కాంగ్రెస్ నాయకుడు కె.వి.థామస్ నియమితులయ్యారు. కాగ్ నివేదికలను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తర్వాత వాటి ని పీఏసీనే పరిశీలిస్తుంది. ఇక పీఏసీలో గరిష్టంగా 22 మం ది సభ్యులు ఉంటారు. వీరిలో 15 మందిని లోక్‌సభ, ఏడుగురిని రాజ్యసభ ఎన్నుకుంటుంది. కాగా పార్లమెంట్ అంచనాల కమిటీ అధ్యక్షుడిగా భాజపా సీనియర్‌నేత మురళీ మనోహర్ జోషి ఆగస్టు 22న బాధ్యతలు స్వీకరించారు.

స్టాక్ కంగ్రి శిఖరాన్ని అధిరోహించిన జాహ్నవిప్రపంచంలోని ఎత్తై శిఖరాల్లో ఒకటైన స్టాక్ కంగ్రిని హైదరాబాద్‌కు చెందిన జాహ్నవి (12) అధిరోహించింది. 6,125 మీటర్ల ఎత్తున్న ఈ శిఖర అధిరోహాన్ని ఆగస్టు 13న ప్రారంభించి 14న పూర్తి చేసింది. 

ఐబీఏ చైర్మన్‌గా టీఎం భాసిన్ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) చైర్మన్‌గా ఇండియన్ బ్యాంక్ చైర్మన్, చీఫ్ మేనేజింగ్ డెరైక్టర్ టీఎం భాసిన్ ఎన్నికయ్యారు.
యూపీఎస్సీ చైర్ పర్సన్‌గా రజినీ రజ్‌దాన్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్ పర్సన్‌గా రజినీ రజ్‌దాన్ (64) ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె కమిషన్ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. డీపీ అగర్వాల్ స్థానంలో రజినీ బాధ్యతలు చేపట్టారు. యూపీఎస్సీ చైర్మన్ పదవీ కాలం ఆరేళ్లు. 
లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా తంబిదురై
లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే ఎంపీ తంబిదురై ఆగస్టు 13న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తద్వారా లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని రెండోసారి చేపట్టిన తొలి నేతగా రికార్డులకెక్కారు. మొదటి సారిగా 1995లో డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 37 మంది సభ్యులతో ఏఐఏడీఎంకే లోక్‌సభలో మూడో అతిపెద్ద పార్టీగా ఉంది. 
వ్యయ నిర్వహణ కమిషన్ సారథి బిమల్‌జలాన్ 
వ్యయ నిర్వహణ కమిషన్ చైర్మన్‌గా భారతీయ రిజర్వ్‌బ్యాంక్ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నియమితులయ్యారు. ఆహారం, ఎరువులు, చమురుపై రాయితీల తగ్గిం పు, ద్రవ్యలోటు కట్టడికి అవసరమైన సూచనలు ఇచ్చేందు కు వ్యయ నిర్వహణ కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది.

అర్జున అవార్డుల ఎంపిక కమిటీ ఛైర్మన్‌గా కపిల్‌దేవ్
భారత మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ నిఖంజీ అర్జున అవార్డుల ఎంపిక కమిటీ చైర్మన్‌గా ఆగస్టు 7న ఎంపికయ్యారు. 2014లో దేశంలో అన్ని క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ఎంపికచేసి,అవార్డులను ప్రకటించేందుకు ఈ కమిటీ పనిచేస్తుంది.
ఎడ్వెర్డ్ స్నోడెన్‌కు రష్యా మూడేళ్ల ఆశ్రయం 
అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మాజీ నిర్వాహకుడు ఎడ్వర్డ్ స్నోడెన్‌కు మూడేళ్లపాటు తమ దేశంలో ఆశ్రయం కల్పించాలని రష్యా ఆగస్టు 7న నిర్ణయించింది. స్నోడెన్‌కు 2013లో ఏడాది పాటు ఆశ్రయం ఇచ్చింది. దాని కాలపరిమితి ఈ ఏడాది ఆగస్టు 1నాటికి ముగియడంతో, మరో మూడేళ్ల పాటు పొడిగించింది. ఇంటెలిజెన్స్ అధికారిగా పనిచేస్తూ 2013లో జాతీయ భద్రత రహస్యాలను బట్టబయలు చేసినందుకు స్నోడెన్‌పై అమెరికా కఠిన చర్యలకు ఉపక్రమించింది. వీటి నుంచి తప్పించుకునేందుకు అతడు హాంకాంగ్ పారిపోయాడు. అక్కడి నుంచి మాస్కోకు చేరుకున్నాడు. 
అంతర్జాతీయ రెజ్లింగ్ రిఫరీ సస్పెన్షన్
అంతర్జాతీయ రెజ్లింగ్ రిఫరీ వీరేందర్ మాలిక్‌ను ద రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆగస్ట్ 4న సస్పెండ్ చేసింది. గ్లాస్గోలో జరిగిన కామన్‌వెల్త్ క్రీడల్లో లైంగిక దాడి అభియోగాల కింద అరెస్ట్ అయిన విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. విచారణలో మాలిక్ దోషిగా తేలితే అన్ని జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్ల నుంచి శాశ్వత బహిష్కరణకు గురవుతాడు.

ఆర్మీ ఛీఫ్‌గా దల్బీర్ సింగ్ సుహాగ్ 
సైనిక దళాల కొత్త ప్రధానాధికారిగా జనరల్ దల్బీర్‌సింగ్ సుహాగ్ (59) జూలై 31న బిక్రమ్‌సింగ్ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు. 26వ ఆర్మీ ఛీఫ్‌గా నియామకమైన సుహాగ్ 30 నెలలపాటు ఈ హోదాలో కొనసాగుతారు. దల్బీర్‌సింగ్ సుహాగ్ ఆర్మీ చీఫ్‌గా నియమితులవ్వడంతో ఆర్మీ వైస్ చీఫ్‌గా ఫిలిప్ కంపోజ్ ఆర్మీ వైస్ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ఫిలిప్ కంపోజ్(59) బాధ్యతలు స్వీకరించారు. 

చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌గా అరూప్ రాహా చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్‌గా భారత వాయుసేన అధిపతి అరూప్‌రాహా జూలై 30న బాధ్యతలు చేపట్టారు. జనరల్ బిక్రమ్‌సింగ్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన రాహా 29 నెలలపాటు ఈ హోదాలో ఉంటారు. త్రివిధ దళాల అవసరాలను సమన్వయం చేసే ఈ కమిటీ సైనిక కార్యకలాపాలు, ఆయుధ పరికరాలు సమకూర్చుకోవడం వంటి బాధ్యతలను నిర్వర్తిస్తుంది.

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా ఎస్.ఎస్. ముంద్రా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా ఎస్.ఎస్. ముంద్రాను కేంద్ర ప్రభుత్వం జూలై 31న నియమించింది. 

సీబీడీటీ కొత్త చైర్మన్ కేవీ చౌదరి కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి నూతన చైర్మన్‌గా ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు చెందిన సీనియర్ అధికారి కె.వి.చౌదరి నియమితులయ్యారు. 1978 బ్యాచ్‌కు చెందిన ఆయన ఆగస్టు 1న బాధ్యతలు చేపట్టారు. చౌదరి స్వగ్రామం కృష్ణా జిల్లాలోని కురుమద్దాలి. ఆయన పూర్తిపేరు కొసరాజు వీరయ్యచౌదరి.

No comments:

Post a Comment