AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు నవంబరు 2017

వార్తల్లో వ్యక్తులు నవంబరు 2017
పాక్‌లో భారత హైకమిషనర్‌గా అజయ్ బిసారియా 
 పాకిస్తాన్‌లో భారత హైకమిషనర్‌గా 1987 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి అజయ్ బిసారియా నియమితులయ్యారు. పాక్‌లో భారత హైకమిషనర్‌గా పనిచేస్తున్న గౌతమ్ బంబావలే ఇటీవల చైనా రాయబారిగా వెళ్లిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అజయ్‌ను నియమించింది. ప్రస్తుతం అజయ్ పోలెండ్‌లో భారత రాయబారిగా ఉన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పాక్‌లో భారత హైకమిషనర్ నియామకం 
ఎప్పుడు : నవంబర్ 1 
ఎవరు : అజయ్ బిసారియా 

ఆసియా కుబేరుడుగా అవతరించిన ముకేశ్ రిలయన్‌‌స ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ చైనాకు చెందిన హు కా యాన్‌ను అధిగమించి ఆసియా కుబేరుడిగా అవతరించారు. ఆర్‌ఐఎల్ షేరు ధర నవంబర్ 1న 1.22 శాతం పెరగడంతో ముకేశ్ వ్యక్తిగత సంపద విలువ ఒక్కరోజే 466 మిలియన్ డాలర్ల మేర (రూ.3,000) పెరిగింది. దీంతో 42.1 బిలియన్ డాలర్ల సంపద విలువతో (రూ.2.7 లక్షల కోట్లు) ఆసియా కుబేరుల్లో అగ్రస్థానంలో నిలిచారు. చైనా ఈవర్‌గ్రాండ్ గ్రూపు చైర్మన్ హు కా యాన్ సంపద నవంబర్ 1 నాటికి నాటికి 1.28 బిలియన్ డాలర్ల మేర తగ్గి 40.6 బిలియన్ డాలర్లు (రూ.2.60 లక్షల కోట్లు) కు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే ముకేశ్ అంబానీ 14వ స్థానంలో ఉన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆసియా కుబేరుల్లో అగ్రస్థానం 
ఎప్పుడు : నవంబర్ 1 
ఎవరు : ముఖేష్ అంబానీ (రిలయన్‌‌స ఇండస్ట్రీస్) 

దక్షిణ కొరియా కాన్సులేట్ జనరల్‌గా సురేష్ చుక్కపల్లి హైదరాబాద్‌లో దక్షిణ కొరియా గౌరవ కాన్సుల్ జనరల్‌గా ఫినిక్స్ గ్రూప్ చైర్మన్ సురేష్ చుక్కపల్లి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన నియామకాన్ని ధ్రువీకరిస్తూ విదేశాంగ శాఖ నవంబర్ 1న ఒక ప్రకటన వెలువరించింది. గతంలో ఈయన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : దక్షిణ కొరియా గౌరవ కాన్సుల్ నియామకం 
ఎప్పుడు : నవంబర్ 1 
ఎవరు : సురేష్ చుక్కపల్లి 
ఎక్కడ : హైదరాబాద్ 

ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల్లో ఐదుగురు భారతీయులుఫోర్బ్స్ పత్రిక 2017 సంవత్సరానికి ప్రకటించిన ప్రపంచ వంద మంది అత్యంత శక్తిమంతమైన మహిళల్లో జర్మనీ చాన్‌‌సలర్ ఏంజెలా మెర్కెల్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఈమె ఈ స్థానాన్ని దక్కించుకోవటం ఇది 12వ సారి. వరుసగా ఏడోసారి.
మెర్కెల్ తర్వాత రెండు, మూడు స్థానాల్లో వరుసగా యూకే ప్రధాని థెరెసా మే, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకురాలు మిలిందా గేట్స్ నిలిచారు. ఫేస్‌బుక్ సీవోవో షెరిల్ శాండ్‌బర్గ్ 4వ స్థానంలో, జనరల్ మోటార్స్ సీఈవో మేరీ బర్రా ఐదో స్థానంలో నిలిచారు. భారత సంతతికి చెందిన పెప్సికో సీఈవో ఇంద్రా నూయి 11వ స్థానం, ఇండో-అమెరికన్ నిక్కీ హేలీ 43వ స్థానంలో ఉన్నారు. జాబితాలో కొత్తగా 23 మంది స్థానం దక్కించుకోగా, అందులో ఇవాంకా ట్రంప్ (19వ స్థానం) కూడా ఉన్నారు. 
ఈ జాబితాలో బారత్ నుంచి ఐదుగురు మహిళలు చోటు దక్కించుకున్నారు. వీరిలో ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ చీఫ్ చందా కొచర్ అగ్రస్థానం (మొత్తంగా 32వ స్థానం) లో నిలిచారు. తర్వాతి స్థానాల్లో హెచ్‌సీఎల్ కార్ప్ సీఈవో రోష్ని నాడార్ మల్హోత్రా (57), బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా (71) హెచ్‌టీ మీడియా చైర్‌పర్సన్, ఎడిటోరియల్ డెరైక్టర్ శోభన భర్తియా (92) బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా (97) ఉన్నారు.
టాప్ 10 శక్తిమంతమైన మహిళలు
శక్తిమంతమైన భారత మహిళలు
ర్యాంక్
పేరు
పేరు
ర్యాంక్
1
ఏంజెలా మెర్కెల్
చందా కొచ్చర్
32
2
థెరెసా మే
రోష్ని నాడార్ మల్హోత్రా
57
3
మిలిండా గేట్స్
కిరణ్ మజుందార్ షా
71
4
షెరిల్ శాండ్‌బర్గ్
శోభన భర్తియా
92
5
మేరీ బర్రా
ప్రియాంక చోప్రా
97
6
సుసన్ వోజిస్కీ
7
అబిగెయిల్ జాన్సన్
8
క్రిస్టినా లగార్డే
9
అనా ప్యాట్రిసియా బోటిన్
10
గిన్నీ రోమెట్టీ

క్విక్ రివ్యూ:
ఏమిటి : ఫోర్బ్స్ శక్తిమంతమైన మహిళల్లో ఐదుగురు భారతీయులు
ఎప్పుడు : నవంబర్ 2
ఎవరు : చందా కొచ్చర్, రోష్ని నాడార్ మల్హోత్రా, కిరణ్ మజుందార్ షా, శోభన భర్తియా, ప్రియాంక చోప్రా
ఎక్కడ : ప్రపంచంలో 100 మంది శక్తిమంతమైన మహిళలు

మహమ్మద్ అలీ జిన్నా కూతురు కన్నుమూతపాకిస్థాన్ నిర్మాత మహమ్మద్ అలీ జిన్నా కూతురు దీనా వాడియా (99) నవంబర్ 3న అమెరికాలో కన్నుమూశారు. వాడియా గ్రూపు చైర్మన్ నుస్లీ వాడియా ఆమె కుమారుడు. దీనా తన తండ్రితో విభేదించి వాడియాను పెళ్లి చేసుకొని తండ్రికి దూరంగా ఉన్నది. 
క్విక్ రివ్యూ:
ఏమిటి : మహమ్మద్ అలీ జిన్నా కూతురు కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 3
ఎవరు : దీనా వాడియా
ఎక్కడ : న్యూయార్క్, అమెరికా

తెలుగులో ‘హిట్ రీఫ్రెష్’మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల రాసిన ‘హిట్ రీఫ్రెష్’ పుస్తకం తెలుగులో అందుబాటులోకి వచ్చింది. తెలుగుతో పాటూ హిందీ, తమిళ భాషల్లోనూ ఈ పుస్తకంను అనువదించారు.‘హిట్ రీఫ్రెష్’ పుస్తకంలో తన వ్యక్తిగత జీవితంతో పాటూ మైక్రోసాఫ్ట్‌లో తన ప్రయాణం, ఇతర అనుభవాలను నాదెళ్ల వివరించారు. పుస్తక ప్రచారం నిమిత్తం భారత్‌కు వచ్చిన నాదెళ్ల నవంబర్ 6న హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ అభివృద్ధి కేంద్రాన్ని సందర్శించారు.
క్విక్ రివ్యూ:ఏమిటి : తెలుగులో హిట్ రీఫ్రెష్ పుస్తకం
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : సత్య నాదెళ్ల 

కర్ణాటకకు తొలిసారి మహిళా డీజీపీ 
కర్ణాటక తొలి మహిళా డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా నీలమణి రాజు అక్టోబర్ 31న బాధ్యతలు చేపట్టారు. 1983 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఆమె ఈ పదవిలో 2020 జనవరి వరకు ఉంటారు. నీలమణి స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని రూర్కీ.

No comments:

Post a Comment