AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

వార్తల్లో వ్యక్తులు ఆగష్టు 2017

వార్తల్లో వ్యక్తులు ఆగష్టు 2017
విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీఆర్‌కే ప్రసాద్ కన్నుమూతఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్ర సర్వీసుల్లో వివిధ హోదాల్లో పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీఆర్‌కే ప్రసాద్ (77) ఆగస్టు 21న హైదరాబాద్‌లో కన్నుమూశారు. దివంగత ప్రధాని పీవీ నర్సింహారావు సమాచార సలహాదారుగా ప్రసాద్ పనిచేశారు. టీటీడీ ఈవోగా తిరుమల విశిష్టతపై పలు రచనలు చేశారు.

‘లింక్‌డ్ ఇన్ ప్రొఫైల్స్’లో మోదీ, ప్రియాంకప్రముఖ సామాజిక మాధ్యమం లింక్‌డ్ ఇన్ అత్యంత శక్తిమంతమైన ప్రొఫైల్స్ జాబితాలో ప్రధాని నరేంద్రమోదీ, నటి ప్రియాంక చోప్రాలు చోటు సంపాదించారు. 2017 సంవత్సరానికి గాను భారత్‌కు సంబంధించి అత్యంత శక్తిమంతమైన ప్రొఫైల్స్, ఎక్కువమంది చూసిన ప్రొఫైల్స్ జాబితాను లింక్‌డ్ ఇన్ సంస్థ ఆగస్టు 23న విడుదల చేసింది. ఈ జాబితాలో మోదీ వరుసగా మూడో సారి చోటు సంపాదించారు. లింక్‌డ్ ఇన్‌లో ఆయనను 22 లక్షలు మంది అనుసరిస్తున్నారు. జాబితాలో మొత్తం 50 మంది చోటు సంపాదించగా, వారిలో నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యార్థి , కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, సిప్లా సీపీఓ ప్రబీర్ ఝా, షయోమీ టెక్నాలజీ వైస్ ప్రెసిడెంట్, ఎండీ మను కుమార్ జైన్ తదితరులు ఉన్నారు. 

రైల్వే బోర్డు చైర్మన్‌గా అశ్వని లోహని రైల్వే బోర్డు నూతన చైర్మన్‌గా అశ్వని లోహని ఆగస్టు 23న నియమితులయ్యారు. ప్రస్తుత రైల్వే బోర్డు చైర్మన్ ఏకే మిట్టల్ ముజఫర్‌నగర్ రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేయడంతో.. ఆయన స్థానంలో లోహాని ఆగస్టు 23న నియమితులయ్యారు. ప్రస్తుతం ఈయన ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్‌గా ఉన్నారు. ఇండియన్ రైల్వే సర్వీస్ ఆఫ్ మెకానికల్ ఇంజినీర్స్ (ఐఆర్‌ఎస్‌ఎంఈ) ఉన్నతాధికారి అయిన అశ్వని లోహని గతంలో న్యూఢిల్లీలోని నేషనల్ రైల్ మ్యూజియం డైరక్టర్‌గా పనిచేశారు.
క్విక్ రివ్యూ: ఏమిటి : రైల్వే బోర్డు కొత్త చైర్మన్ 
ఎప్పుడు : ఆగస్టు 23
ఎవరు : అశ్వని లోహని 
ఎందుకు : ముజఫర్‌నగర్ రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తు ఏకే మిట్టల్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో

ఇన్ఫోసిస్ చైర్మన్‌గా నందన్ నీలేకని ఇన్ఫోసిస్‌లో నెలకొన్న సంక్షోభ పరిస్థితులకు తెరదించుతూ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించారు. ఇప్పటిదాకా చైర్మన్‌గా ఉన్న ఆర్.శేషసాయి స్థానంలో ఆయన బాధ్యతలు చేపడతారు. నాన్ ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డెరైక్టరుగా కూడా వ్యవహరిస్తారు. ఈ మేరకు ఆగస్టు 24న బోర్డు సమావేశం అనంతరం ఇన్ఫోసిస్ పలు కీలక నిర్ణయాలు ప్రకటించింది. 
రవి వెంకటేశన్ సహ-చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన ఇకపై స్వతంత్ర డెరైక్టర్‌గా కొనసాగుతారు. ఇటీవల సీఈవో పదవికి రాజీనామా చేసినా.. వారసుడి ఎంపిక దాకా వైస్-చైర్మన్‌గా కొనసాగుతున్న విశాల్ సిక్కా.. బోర్డు నుంచి కూడా తప్పుకున్నారు. మరో ఇద్దరు స్వతంత్ర డెరైక్టర్లు జెఫ్రీ ఎస్ లేమాన్, జాన్ ఎచ్‌మెండీ కూడా బోర్డు నుంచి వైదొలిగారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఇన్ఫోసిస్ కొత్త చైర్మన్ 
ఎప్పుడు : ఆగస్టు 24 
ఎవరు : నందన్ నీలేకని 

45వ సీజేఐగా జస్టిస్ దీపక్ మిశ్రా45వ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ దీపక్ మిశ్రా(64) ఆగస్టు 28న ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ జేఎస్ ఖేహర్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జస్టిస్ మిశ్రా చేత ప్రమాణం చేయించారు. ఆయన 2018 అక్టోబర్ 2 వరకు సీజేఐగా కొనసాగుతారు. 
జస్టిస్ మిశ్రా ప్రస్తుతం కీలకమైన కావేరీ, కృష్ణా జలాల వివాదాలు, బీసీసీఐ సంస్కరణలు, సహారా తదితర కేసులకు సంబంధించి వాదనలు వింటున్న ధర్మాసనాల్లో సభ్యునిగా ఉన్నారు. సినిమా హాళ్లలో జాతీయ గీతాన్ని పాడాలని తీర్పునిచ్చిన ధర్మాసనానికి జస్టిస్ మిశ్రా నేతృత్వం వహించారు. అలాగే నిర్భయ కేసులో నిందితులకు మరణశిక్ష విధించిన ధర్మాసనం లోనూ ఆయన సభ్యునిగా ఉన్నారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ప్రమాణ స్వీకారం చేసిన 45వ సీజేఐ 
ఎప్పుడు : ఆగస్టు 28 
ఎవరు : జస్టిస్ దీపక్ మిశ్రా

మిస్ ఇండియా ఏసియా పసిఫిక్‌గా మానస ‘మిస్ ఇండియా ఏసియా పసిఫిక్-2017’ టైటిల్‌ను గీతం యూనివర్సిటీకి చెందిన జొన్నలగడ్డ మానస సొంతం చేసుకుంది. ఈ మేరకు థాయ్‌లాండ్‌లోని పట్టాయలో జరిగిన పోటీల్లో ఆమె విజేతగా నిలిచింది. పటాన్‌చెరు మండలంలోని రుద్రారం గ్రామంలో ఉన్న గీతం హైదరాబాద్ క్యాంపస్‌లో ఆమె ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్‌ ఇంజనీరింగ్ చదువుతోంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : మిస్ ఇండియా ఏసియా పసిఫిక్ - 2017 
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : జొన్నలగడ్డ మానస

చాంపియన్స్ ఆఫ్ చేంజ్‌లో పాల్గొన్న ప్రధాని మోదీ  చాంపియన్స్ ఆఫ్ చేంజ్ కార్యక్రమం ఆగస్టు 17న న్యూఢిల్లీలో జరిగింది. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. 200 మంది యువ స్టార్టప్ వాణిజ్యవేత్తలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో క్షేత్రస్థాయి వరకు వేళ్లూనుకుపోయిన అవినీతిని పెకిలించి వేసేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
స్టార్టప్‌ల ప్రెజెంటేషన్ 
యువ వ్యాపారవేత్తల్లో సృజనాత్మకత పెంచటం, ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలను సూచించేందుకు ఈ ‘చాంపియన్స్ ఆఫ్ చేంజ్’ కార్యక్రమాన్ని ఏడాదికోసారి నిర్వహించాలని నిర్ణయించినట్లు మోదీ తెలిపారు. వ్యాపారవేత్తల్లోని వివిధ వర్గాలను ఆయా మంత్రిత్వ శాఖలకు శాశ్వత పద్ధతిలో జోడించామని తెలిపారు. సాఫ్ట్ పవర్, ఇంక్రెడిబుల్ ఇండియా 2.0, విద్య-నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం-పౌష్టికాహారం, డిజిటల్ ఇండియా, 2022 కల్లా నవభారతం ఇతివృత్తాలతో వాణిజ్యవేత్తలు ప్రజెంటేషన్ ఇచ్చారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : చాంపియన్స్ ఆఫ్ చేంజ్ కార్యక్రమం 
ఎప్పుడు : ఆగస్టు 17
ఎక్కడ : న్యూఢిల్లీలో 
ఎందుకు : యువ స్టార్టప్ వాణిజ్యవేత్తలను ప్రోత్సహించేందుకు 

జయలలిత మరణంపై విచారణ కమిషన్అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి ఆగస్టు 17న న్యాయ విచారణకు ఆదేశించారు. మద్రాసు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జయ కన్నుమూసిన తరువాత ఆమె మరణంపై పలు అనుమానాలు వ్యక్తమవడంతో వాటి నివృత్తి కోసమే ఈ విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు పళనిస్వామి చెప్పారు. అలాగే జయలలిత నివసించిన చెన్నై పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయం ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని స్మారక మందిరంగా మార్చనున్నట్లు వెల్లడించారు. 
ముఖ్యమంత్రిగా ఉండగానే 2016 సెప్టెంబరు 22న అనారోగ్యంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరిన జయలలిత... 75 రోజులు వైద్యశాలలోనే ఉండి డిసెంబరు 5న గుండెపోటుతో మరణించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : జయలలిత మరణంపై విచారణ కమిషన్ ఏర్పాటు
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : తమిళనాడు ప్రభుత్వం 
ఎందుకు : జయలలిత మరణంపై అనుమానాల నివృత్తి కోసం 

ఫోర్బ్స్ జాబితాలో తొలి స్థానంలో ఎమ్మా స్టోన్ ప్రముఖ అంతర్జాతీయ మేగజైన్ ఫోర్బ్స్ 2017 ఏడాదికి గాను విడుదల చేసిన అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల జాబితాలో హాలీవుడ్ నటి ఎమ్మా స్టోన్ తొలి స్థానంలో నిలిచింది. ఎమ్మా 26 మిలియన్ డాలర్ల పారితోషకంతో మొదటి స్థానంలో నిలిచిందని, ఈ జూన్ నాటికే అత్యధిక టాక్స్ కూడా చెల్లించేసిందని ఫోర్బ్స్ పేర్కొంది. రెండో స్థానంలో 48 ఏళ్ల నటి జెన్నిఫర్ అనిస్టోన్(25 మిలియన్ డాలర్లు) నిలిచింది. 
గతేడాది ఈ జాబితాలో స్థానం సంపాదించుకున్న బాలీవుడ్ నటి దీపికా పదుకొనే ఈసారి జాబితాలో నిలువలేదు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఫోర్బ్స్ అత్యధిక పారితోషకం పొందుతున్న హీరోయిన్ల జాబితా
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : తొలి స్థానంలో ఎమ్మాస్టోన్ 

మలాలాకు ఆక్స్‌ఫర్డ్‌లో అడ్మిషన్ పాకిస్తాన్‌కు చెందిన నొబెల్ బహుమతి గ్రహీత మలాలాకు అత్యంత ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటిలో అడ్మిషన్ లభించింది. ఆమె అక్కడ ఫిలాసఫీ, రాజనీతిశాస్త్రం, అర్థశాస్త్రం చదవనుంది. ఆడపిల్లలు చదువుకోవాలంటూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలకు మలాలా ప్రచారకర్తగా కొనసాగుతున్నారు. 

అత్యుత్తమ ప్రధానిగా నరేంద్ర మోదీ స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన ప్రధానిగా నరేంద్ర మోదీకి భారతీయులు పట్టంగట్టారు. ఇండియా టుడే- కార్వీ ఇన్‌సైట్స్ సంయుక్తంగా నిర్వహించిన మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. పెద్దనోట్ల రద్దుతో ప్రజలు ఇబ్బందులు పడ్డా.. నల్లధనంపై మోదీ ప్రయోగించిన అస్త్రంగా ప్రజలు భావించారని పేర్కొంది. ఇప్పటికిప్పుడు దేశంలో ఎన్నికలు వస్తే ఎన్డీయేకు 349 సీట్లు వస్తాయని వెల్లడించింది. 
సర్వేలో పాల్గొన్న వారిలో ప్రథమ ప్రధాని నెహ్రూ, ఇందిరా గాంధీ, వాజ్‌పేయిల కన్నా మోదీపైనే ఎక్కువ మంది సానుకూలత వ్యక్తం చేశారు. ఐదు సార్లు దేశవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించారు. తాజా (జూలై 2017) ఫలితాల్లో 33 శాతంతో మోదీ ముందంజలో ఉన్నారు. ఇందిరా గాంధీ 17 శాతంతో రెండో స్థానంలో, వాజ్‌పేయి 9 శాతం, నెహ్రూ 8 శాతంతో మూడు నాలుగు స్థానాల్లో నిలిచారు. 
తొలిసారి ఆగస్టు 2015లో జరిగిన సర్వేలో ఇందిర 21 శాతంతో తొలిస్థానంలో ఉండగా.. మోదీ 20 శాతంతో రెండో స్థానం సంపాదించారు. దేశంలో పన్నుల సంస్కరణలు తీసుకొచ్చి జీఎస్టీని అమల్లోకి తేవటం ద్వారా లంచం, పన్ను ఎగవేతలకు మోదీ చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. 
నిరుద్యోగం ఓ హెచ్చరిక ఈ సర్వే ఎన్డీయేకు, బీజేపీకి సానుకూల పవనాలను చూపించటంతోపాటుగా ప్రజల్లో పలు అంశాలపై ఉన్న అసంతృప్తినీ గుర్తుచేసింది. ఉద్యోగకల్పనపై ప్రజల్లో ఆందోళన ప్రభుత్వానికి హెచ్చరికగా పేర్కొంది. ఆగస్టు 2015లో సర్వే మొదలైనప్పటినుంచీ తాజా సర్వే (జూలై 2017) వరకు ఉద్యోగ కల్పనకు ప్రభుత్వం పెద్దగా చేసిందేమీ లేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ప్రధాని కూడా యువకులు ఉద్యోగం కోసం వెతకటం కన్నా స్వయం ఉపాధితోపాటుగా ఉద్యోగాలు సృష్టించే ఆలోచన చేయాలని చెబుతూ వస్తున్నారు. ఇందుకోసం పలు పథకాలనూ ఆయన ప్రారంభించారు. వీటి ఫలితం వచ్చే ఎన్నికల వరకు కనబడితే యువతలో అసంతృప్తి దూరం అవుతుందని సర్వే పేర్కొంది. అటు 2014 ప్రచారంలో మోదీ చెప్పిన అచ్ఛేదిన్‌పై 39 శాతం మంది సానుకూలత, 34 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత్‌లో అత్యుత్తమ ప్రధానిగా నరేంద్ర మోదీ 
ఎప్పుడు : ఆగస్తు 18
ఎవరు : ఇండియా టుడే- కార్వీ ఇన్‌సైట్స్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే
ఎందుకు : 33 శాతంతో ముందంజలో ఉన్న మోదీ 

ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ పదవికి విశాల్ సిక్కా రాజీనామా ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ పదవికి విశాల్ సిక్కా ఆగస్టు 18న రాజీనామా చేశారు. పదేపదే వ్యక్తిగతంగా మాటల దాడి చేయడంతోపాటు నిరాధార ఆరోపణలు గుప్పించడంతో తీవ్ర మనస్థాపానికి గురై రాజీనామా చేశానంటూ పేర్కొన్నారు. 
సిక్కా రాజీనామాను ఆమోదించామని.. ఆయన స్థానంలో తాత్కాలిక సీఈఓ, ఎండీగా ప్రస్తుత చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీఎఫ్‌ఓ) యూబీ ప్రవీణ్‌రావుకు తక్షణం బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఇన్ఫీ బోర్డు ప్రకటించింది. ఇక పూర్తి స్థాయి సీఈఓ-ఎండీని నియమించేందుకు 2018, మార్చి 31ని బోర్డు డెడ్‌లైన్‌గా నిర్ణయించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పదవికి రాజీనామా చేసిన ఇన్ఫోసిస్ సీఈవో, ఎండీ 
ఎప్పుడు : ఆగస్టు 18 
ఎవరు : విశాల్ సిక్కా
ఎందుకు : వ్యక్తిగత, నిరాధార ఆరోపణల నేపథ్యంలో 

యూకే ‘ఆర్థిక ఆంక్షల’ జాబితాలో దావూద్యూకే ఇటీవల విడుదల చేసిన ఆర్థిక ఆంక్షల జాబితాలో భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టైస్ట్ అయిన దావూద్ ఇబ్రహీం ఉన్నాడు. దావూద్ 21 మారు పేర్లను కూడా ఇందులో ప్రస్తావించారు. యూకే కోశాగార విభాగం సోమవారం సవరించిన ‘కన్సాలిడేటెడ్ లిస్ట్ ఆఫ్ ఫైనాన్సియల్ సాంక్షన్‌‌స టార్గెట్స్ ఇన్ యూకే’లో దావూద్‌కు పాకిస్తాన్‌లో మూడు అధికారిక చిరునామాలు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ మూడూ కరాచీలోనే ఉన్నట్లు వెల్లడించారు. దావూద్ మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లా ఖేర్‌లో జన్మించాడని, ఆయన భారత పౌరసత్వం కలిగి ఉన్నట్లు రికార్డుల్లో ఉంది. అయితే భారత్ తన పాస్‌పోర్టును రద్దుచేసిన తరువాత దావూద్ భారత్, పాక్ నుంచి ఇతరుల పేరిట పాస్‌పోర్టులు సేకరించి దుర్వినియోగం చేశాడని జాబితాలో పేర్కొన్నారు. ఈ జాబితాలో ఉన్న వ్యక్తులు, సంస్థలు ఇతరులతో ఆర్థికపర లావాదేవీలు జరపకుండా నిషేధం విధిస్తారు. అలాగే వారి ఆస్తులను స్తంభింపజేస్తారు. 

‘బాల మేధావి’ రాహుల్ దోశిబ్రిటన్‌లోని టీవీ చానల్ 4 నిర్వహించిన చైల్డ్ జీనియస్ క్విజ్ పోటీల్లో భారత సంతతికి చెందిన రాహుల్ దోశి విజేతగా నిలిచాడు. ఆగస్టు 19న నిర్వహించిన ఈ పోటీలో రాహుల్ 162 ఐక్యూ (ఇంటలిజెంట్ కోయిషెంట్) స్కోర్ సాధించాడు. ఇది అల్బర్ట్ ఐన్‌స్టీన్, స్టీఫెన్ హాకింగ్ ఐక్యూల కన్నా ఎక్కువ.

ఉపరాష్ట్రపతిగా వెంక య్య ప్రమాణ స్వీకారం 
 ముప్పవరపు వెంకయ్యనాయుడు భారత 13వ ఉపరాష్ట్రపతిగా ఆగస్టు 11న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వెంకయ్యతో ప్రమాణం చేయించారు. అనంతరం రాజ్యసభ చైర్మన్‌గా కూడా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని నరేంద్రమోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అధికార, విపక్ష పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 
అన్సారీకి రాజ్యసభ వీడ్కోలురాజ్యసభ చైర్మన్‌గా చివరి రోజైన ఆగస్టు 10న హమీద్ అన్సారీకి పార్టీలకతీతంగా ఘనంగా వీడ్కోలు పలికారు. రాజ్యాంగ ధర్మాన్ని పరిరక్షించడంలో అన్సారీ తన వంతు న్యాయం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. రాజ్యసభను సజావుగా నడపడంలో అన్సారీ పాత్రను సభ్యులు గుర్తు చేసుకున్నారు. రెండు సార్లు (2007, 2012) ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన అన్సారీ.. పదేళ్ల పాటు రాజ్యసభ చైర్మన్‌గా వ్యవహరించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : భారత 13వ ఉపరాష్ట్రపతి 
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : ఎం. వెంకయ్యనాయుడు 
ఎక్కడ : దర్బార్ హాల్, రాష్ట్రపతి భవన్ 

సీబీఎఫ్‌సీ ఛైర్మన్‌గా ప్రసూన్ జోషి జాతీయ సెన్సార్ బోర్డు(సీబీఎఫ్‌సీ) చైర్మన్ పదవి నుంచి పహ్లాజ్ నిహలానీని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఈయన స్థానంలో బాలీవుడ్ గీత రచయిత ప్రసూన్ జోషిని నియమించింది. సినీనటి విద్యాబాలన్‌కు కూడా కొత్త కమిటీలో చోటు కల్పించింది. 
బ్లాక్, తారే జమీన్‌పర్, భాగ్ మిల్కా భాగ్, రంగ్ దే బసంతి, ఢిల్లీ-6, నీర్జా చిత్రాలకు జోషి పాటలు రాశారు. పద్మశ్రీ, ఉత్తమ గీత రచయితగా జాతీయ అవార్డు అందుకున్న జోషి.. స్వచ్ఛ్ భారత్ అభియాన్‌తో పాటుగా పలు పథకాల ప్రచార గీతాలను రచించారు. జోషి నేతృత్వంలోని కమిటీలో విద్యాబాలన్‌తోపాటు గౌతమీ తాడిమల్ల, జీవితా రాజశేఖర్ తదితరులు సభ్యులుగా ఉన్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సీబీఎఫ్‌సీ కొత్త చైర్మన్‌గా ప్రసూన్ జోషి 
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : కేంద్ర ప్రభుత్వం 

డబ్ల్యూహెచ్‌వో రాయబారిగా మిల్కాసింగ్ఫ్లయింగ్ సిఖ్ మిల్కా సింగ్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు సౌహార్ధ రాయబారిగా ఎంపికయ్యారు. ఆయన సౌత్ ఈస్ట్ ఆసియా రీజియన్ (ఎస్‌ఈఏఆర్) ప్రాంతానికి వ్యాయామ రాయబారిగా ఎంపికై నట్లు ఆగస్టు 11న డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. మిల్కా సింగ్ ఎస్‌ఈఏఆర్ పరిధిలో వివిధ రకాల వ్యాధులపై అవగాహన కల్పించనున్నారు. ముఖ్యంగా శారీరక వ్యాయామం ద్వారా 10 శాతం వ్యాధులు నయమవుతాయని ఆయన ప్రచారం చేయనున్నారు. తద్వారా 2025 నాటికి నాన్ కమ్యూనికబుల్ వ్యాధులను 25 శాతం తగ్గించాలని నిర్ణయించినట్లుగా ఎస్‌ఈఏఆర్ ప్రాంతీయ డెరైక్టర్ పూనమ్ కెట్రాపాల్ సింగ్ వెల్లడించారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఎస్‌ఈఏఆర్ వ్యాయామ రాయబారిగా మిల్కాసింగ్ 
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : డబ్ల్యూహెచ్‌ఓ 
ఎందుకు : వ్యాయామంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు 

కెన్యా అధ్యక్షుడిగా ఎన్నికైన ఉహురు కెన్యట్టా కెన్యా అధ్యక్షుడిగా ఉహురు కెన్యట్టా మరోసారి ఎన్నికయ్యారు. ఆగస్టు 11న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో కెన్యట్టా 54.27 శాతం సాధించారు. ఆయన ప్రత్యర్థి రైలా ఒడింగాకు 44.74 శాతం ఓట్ల వచ్చాయి. ఉహురు కెన్యట్టా 2013లో కెన్యా 4వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : కెన్యా అధ్యక్ష ఎన్నికలు 2017
ఎప్పుడు : ఆగస్టు 11
ఎవరు : విజయం సాధించిన ఉహురు కెన్యట్టా 
ఎక్కడ : కెన్యా 

అంతరిక్షం నుంచి కనిపించేలా ‘మండేలా’జాతివివక్ష వ్యతిరేకోద్యమ నేత నెల్సన్ మండేలా శతజయంతి సందర్భంగా దక్షిణాఫ్రికా జైళ్లలోని వందలాది మంది ఖైదీలు ప్రపంచంలోనే అతిపెద్ద ముఖచిత్ర దుప్పటితో(4,500 చదరపు మీటర్లు) నివాళి అర్పించనున్నారు. ఈ మేరకు బ్లాంకెట్స్ ఫర్ మండేలా అనే సంస్థ ‘మాసివ్ మండేలా మాస్టర్‌పీస్’ పేరుతో ఈ ప్రాజెక్టును ఆగస్టు 12న జోండర్‌వాటర్ జైల్లో ప్రారంభించింది. ఈ చిత్రాన్ని ఊలు దారాలతో అల్లుతారు. వచ్చే ఏడాది జూలై 18 (మండేలా శతజయంతి) కోసం చిన్న చిన్న ఊలు దుప్పట్లను కలిపికుట్టి ఈ భారీ దుప్పటిని తయారుచేస్తారు. దీన్ని అంతరిక్షం నుంచి కూడా చూడొచ్చు. దుప్పట్లకు అవసరమయ్యే ఊలు ఖర్చు రూ. 6.6 కోట్లను ఓ అజ్ఞాత వ్యాపారి అందచేయనున్నారు. 

దేశప్రజలను ఉద్దేశించి రాష్ట్రపతి కోవింద్ తొలి ప్రసంగం 2022 నాటికల్లా నవభారత నిర్మాణం సాధించాలంటే.. ప్రజలు, ప్రభుత్వ భాగస్వామ్యం చాలా ముఖ్యమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. భారత డీఎన్‌ఏలో ఉండే మానవతావాదంతో కూడిన సుహృద్భావ సమాజనిర్మాణమే నవభారతమని ఆయన అన్నారు. భారత 71వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న దేశప్రజలనుద్దేశించి తొలిసారి రాష్ట్రపతి హోదాలో ప్రసంగించిన కోవింద్.. బ్రిటిషర్లనుంచి దేశానికి విముక్తి కల్పించటంలో పోరాడిన యోధులందరనీ గుర్తుచేసుకున్నారు. నాటి వీరుల పోరాట స్ఫూర్తితో జాతినిర్మాణంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని కోరారు. ప్రజలు-ప్రభుత్వం, వ్యక్తి-సమాజం, కుటుంబం-సంఘం సంబంధాల మధ్యే దేశం నిర్మితమైందన్నారు. 

పాకిస్థాన్ మదర్ థెరిసా రూత్ పఫావూ మృతిపాకిస్థాన్ మదర్ థెరిసాగా పేరుగాంచిన రూత్ పఫావూ(87) కరాచీలో ఆగస్టు 10న మరణించారు. జర్మనీకి చెందిన ఆమె పాకిస్థాన్‌లో కుష్టు వ్యాధి నిర్మాలనకు తన జీవితాన్ని అంకితం చేశారు. దీంతో ఆమెను పాకిస్థాన్ మదర్ థెరిసాగా అక్కడి ప్రజలు కొనియాడతారు.

ఢిల్లీ రేడియా కేంద్రం డెరైక్టర్‌గా శైలజఢిల్లీ రేడియో (ఆకాశవాణి) కేంద్రం తొలి మహిళా డెరైక్టర్‌గా శైలజా సుమన్ నియమితులయ్యారు. శైలజ 35 ఏళ్లుగా ఆకాశవాణి, దూరదర్శన్‌లో వివిధ హోదాల్లో పనిచేశారు. శైలజ ఆధ్వర్యంలో రూపొందించిన పలు కార్యక్రమాలకు ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయి. విజయవాడలో దూరదర్శన్ సప్తగిరి కేంద్రం పూర్తి స్థాయిలో ఏర్పడేందుకు ఆమె విశేష కృషి చేశారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 ఢిల్లీ రేడియో కేంద్రం తొలి మహిళా డెరైక్టర్ 
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : శైలజా సుమన్
ఎక్కడ : ఢిల్లీ 

ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు ఎన్డీయే అభ్యర్థి ముప్పవరపు వెంకయ్యనాయుడు (68) భారత 14వ ఉప రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఆగస్టు 5న జరిగిన ఎన్నికలో విజయానికి 381 ఓట్లు అవసరమవగా.. 516 ఓట్లతో (68 శాతం) ఆయన ఘన విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థిగా బరిలో దిగిన గోపాలకృష్ణ గాంధీకి 244 ఓట్లు దక్కాయి. మొత్తం 771 ఓట్లు పోలవగా 11 ఓట్లు చెల్లనివిగా తేలాయి. విజయం అనంతరం మాట్లాడిన వెంకయ్య.. ప్రజాస్వామ్య విలువలు కాపాడటంలో, రాజ్యసభ ఔన్నత్యాన్ని పెంచటంలో చిత్తశుద్ధితో పనిచేస్తానని అన్నారు.

నీతి ఆయోగ్ వైస్ చైర్మన్‌గా రాజీవ్ నీతి ఆయోగ్ కొత్త ఉపాధ్యక్షుడిగా ప్రముఖ ఆర్థికవేత్త డాక్టర్ రాజీవ్ కుమార్‌ను ప్రభుత్వం ఆగస్టు 5న నియమించింది. ప్రస్తుత ఉపాధ్యక్షుడు అరవింద్ పనగడియా ఈ పదవి నుంచి వైదొలగి, తాను అధ్యాపకుడిగా పనిచేసిన కొలంబియా వర్సిటీకి తిరిగి వెళ్లిపోతానని ఆగస్టు 1న ప్రకటించడంతో.. కొత్త ఉపాధ్యక్షుడిని నియమించారు. పనగడియా ఆగస్టు 31వరకు నీతి వైస్ చైర్మన్‌గా ఉంటారు. ఆ తర్వాత రాజీవ్ బాధ్యతలు చేపడతారు. 
నీతి వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న రాజీవ్ ఆర్థిక శాస్త్రంలో ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ, లక్నో వర్సిటీల నుంచి పీహెచ్‌డీ పట్టాలు పుచ్చుకున్నారు. ప్రస్తుతం సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్(సీపీఆర్)లో సీనియర్ ఫెలోగా ఉన్నారు. ఆయన ఇదివరకు భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య(ఫిక్కీ) ప్రధాన కార్యదర్శిగా, ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్‌(ఐసీఆర్‌ఐఈఆర్) డెరైక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేశారు. 2006-2008 మధ్య నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు సభ్యుడిగా ఉన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ)లో ప్రధాన ఆర్థికవేత్తగానూ పనిచేసిన రాజీవ్ ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, భారత పరిశ్రమల, ఆర్థిక మంత్రిత్వ శాఖల్లో ఉన్నత పదవులు నిర్వహించారు. రియాద్‌లోని కింగ్ అబ్దుల్లా పెట్రోలియం స్టడీస్ అండ్ రీసెర్చ్ సెంటర్, జకార్తాలోని ఎకనమిక్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఆసియాన్ అండ్ ఆసియా, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ తదితర జాతీయ, అంతర్జాతీయ సంస్థల బోర్డులలో ప్రస్తుతం సభ్యుడిగా ఉన్నారు.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ 
ఎప్పుడు : ఆగస్టు 5 
ఎవరు : డాక్టర్ రాజీవ్ కుమార్
ఎందుకు : ఆగస్టు 31న అరవింద్ పనగడియా కొలంబియా యూనివర్సిటీకి తిరిగి వెళ్లిపోతున్న నేపథ్యంలో 

ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి శ్రీధరన్ రాజీనామా మెట్రో రైలు ప్రాజెక్టుల పితామహుడు శ్రీధరన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేశారు. విజయవాడలో లైట్ మెట్రో నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో జూలై 5వ తేదీన శ్రీధరన్ ముఖ్యమంత్రికి లేఖ రాస్తూ లైట్ మెట్రో రైలు (ఎల్‌ఆర్‌టీ) విజయవాడకు సరిపోదని, ఇప్పుడున్న స్థితిలో మెట్రోయే సరైనదని పేర్కొన్నారు. అయినా పట్టించుకోని ముఖ్యమంత్రి ఎల్‌ఆర్‌టీ కోసం కేఎఫ్‌డబ్ల్యూతో సర్వే చేయిస్తుండడంతో మనస్తాపం చెందిన శ్రీధరన్ జూలై 12న ప్రభుత్వ సలహాదారు పదవికి రాజీనామా చేస్తూ లేఖ పంపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : 
ఏపీ ప్రభుత్వ సలహాదారు పదవికి శ్రీధరన్ రాజీనామా
ఎప్పుడు : జూలై 12 
ఎవరు : మెట్రో రైలు ప్రాజెక్టుల పితామహుడు

ప్రపంచ బ్యాంకు ఈడీగా ఐఏఎస్ అధికారిణి అపర్ణ
గుజరాత్ కేడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఎస్.అపర్ణ ప్రపంచ బ్యాంకులో కార్యనిర్వాహక సంచాలకులు(ఈడీ)గా ఆగస్టు 5న నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం గుజరాత్ సీఎంకు ముఖ్యకార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈడీ హోదాలో భారత్, బంగ్లాదేశ్, భూటాన్, శ్రీలంకలకు ప్రపంచ బ్యాంకులో ప్రాతినిథ్యం వహిస్తారు.

పేసర్ శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేత 
స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో పేస్‌బౌలర్ శ్రీశాంత్‌పై బీసీసీఐ విధించిన జీవితకాల నిషేధాన్ని కేరళ హైకోర్టు ఎత్తివేసింది. అలాగే శ్రీశాంత్‌కి వ్యతిరేకంగా బీసీసీఐ తీసుకున్న చర్యలన్నీ జస్టిస్ మొహమ్మద్ ముష్తాక్ రద్దు చేశారు. 2013 ఐపీఎల్ ఆరో సీజన్‌లో ఉద్దేశపూర్వకంగా ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడనే కారణంతో క్రికెట్ బోర్డు శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం విధించింది. అయితే ఈ విషయంలో తనను ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు నిర్దోషిగా పేర్కొన్నప్పటికీ బోర్డు మాత్రం తన వైఖరి మార్చుకోలేదని గతేడాది శ్రీశాంత్ కేరళ కోర్టులో కేసు వేశాడు. దీంతో బీసీసీఐ కూడా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసింది. సెషన్స్‌ కోర్టు ఇచ్చిన తీర్పు... తమ అంతర్గత క్రమశిక్షణ కమిటీ నిర్ణయాన్ని ప్రభావితం చేయలేదని పేర్కొంది. తమ విచారణలో అతడు దోషిగానే తేలాడని స్పష్టం చేసింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : శ్రీశాంత్‌పై జీవితకాల నిషేధం ఎత్తివేత
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : కేరళ హైకోర్టు 
ఎందుకు : బీసీసీఐ విధించిన నిషేధాన్ని ఎత్తివేసిన కోర్టు 

45వ సీజేఐగా జస్టిస్ దీపక్ మిశ్రా45వ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ దీపక్ మిశ్రా (63)ను నియమిస్తూ న్యాయమంత్రిత్వ శాఖ ఆగస్టు 8న ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్న జస్టిస్ జేఎస్ ఖేహర్ జస్టిస్ దీపక్ మిశ్రాను తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమించాల్సిందిగా జూలైలో న్యాయ మంత్రిత్వ శాఖకు సిఫారసు చేశారు. ఆయన 13 నెలలపాటు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతారు. 
సీజేఐ పదవిని చేపట్టనున్న మూడో ఒడిశా వ్యక్తి జస్టిస్ దీపక్ మిశ్రా. గతంలో ఒడిశాకు చెందిన జస్టిస్ రంగనాథ్ మిశ్రా, జస్టిస్ గోపాల వల్లభ పట్నాయక్‌లు సీజేఐలుగా పనిచేశారు. 
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మిశ్రా ఇచ్చిన కీలక తీర్పులు..
  • 1993 నాటి ముంబై పేలుళ్ల కేసులో దోషి ఉగ్రవాది యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్ష అమలు విషయంలో అర్ధరాత్రి ఒంటిగంటకు సుప్రీంకోర్టులో విచారణ జరిపిన ధర్మాసనానికి జస్టిస్ మిశ్రా నేతృత్వం వహించారు.
  • దేశాన్ని కుదిపేసిన 2012 డిసెంబరు 16 నాటి ఢిల్లీలో నిర్భయపై క్రూరమైన అత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఢిల్లీ హైకోర్టు విధించిన మరణశిక్షను సమర్థించారు.
  • సినిమా ప్రదర్శనకు ముందు థియేటర్లలో జాతీయగీతం ప్రదర్శించాలని తీర్పునిచ్చింది జస్టిస్ మిశ్రానే.
  • ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదైన 24 గంటల్లోపు వాటిని వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచాలని జస్టిస్ దీపక్ మిశ్రా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు. 1993 నాటి ముంబై పేలుళ్ల కేసులో దోషి ఉగ్రవాది యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్ష అమలు విషయంలో అర్ధరాత్రి ఒంటిగంటకు సుప్రీంకోర్టులో విచారణ జరిపిన ధర్మాసనానికి జస్టిస్ మిశ్రా నేతృత్వం వహించారు.
  • దేశాన్ని కుదిపేసిన 2012 డిసెంబరు 16 నాటి ఢిల్లీలో నిర్భయపై క్రూరమైన అత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఢిల్లీ హైకోర్టు విధించిన మరణశిక్షను సమర్థించారు.
  • సినిమా ప్రదర్శనకు ముందు థియేటర్లలో జాతీయగీతం ప్రదర్శించాలని తీర్పునిచ్చింది జస్టిస్ మిశ్రానే.
  • ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్) నమోదైన 24 గంటల్లోపు వాటిని వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచాలని జస్టిస్ దీపక్ మిశ్రా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించారు.
క్విక్ రివ్యూ: ఏమిటి : 45వ భారత ప్రధాన న్యాయమూర్తి నియామకం
ఎప్పుడు : ఆగస్టు 8
ఎవరు : జస్టిస్ దీపక్ మిశ్రా 
ఎందుకు : ప్రస్తుత సీజేఐ జస్టిస్ ఖేహర్ పదవీ విరమణ సందర్భంగా

No comments:

Post a Comment