AIMS DARE TO SUCCESS MADE IN INDIA

Sunday 26 November 2017

క్రీడలు ఆగష్టు 2017

క్రీడలు ఆగష్టు 2017
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో సింధుకు రజతంప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు రజతం దక్కించుకుంది. ఆగస్టు 27న గ్లాస్గోలో జరిగిన ఫైనల్లో జపాన్‌కు చెందిన ఏడో సీడ్ నోజోమి ఒకుహారా సింధును ఓడించి స్వర్ణం గెలుచుకుంది. 2013, 2014లలోను సింధు సెమీఫైనల్లో ఓడి కాంస్య పతకాలు సాధించింది. తాజాగా రజతం గెలవడం ద్వారా ఈ టోర్నమెంట్‌లో భారత్ తరఫున అత్యధికంగా మూడు పతకాలు నెగ్గిన క్రీడాకారిణిగా సింధు గుర్తింపు పొందింది.
ఇదే టోర్నీ సెమీస్‌లో ఓడిన సైనా నెహ్వాల్‌కు కాంస్యం దక్కింది. మొత్తంగా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో ఏకకాలంలో భారత్‌కు రజతం, కాంస్యం లభించడం ఇదే తొలిసారి. నాలుగు దశాబ్దాల ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో భారత్ గెలుపొందిన మొత్తం పథకాలు 7.
క్విక్ రివ్యూ: ఏమిటి : ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్-2017
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : పీవీ సింధుకు రజతం, సైనా నెహ్వాల్‌కు కాంస్యం 
ఎక్కడ : గ్లాస్గో

జాతీయ స్క్వాష్ చాంప్ జోష్నా, సౌరవ్ జాతీయ స్క్వాష్ చాంపియన్‌షిప్ మహిళల సింగిల్స్‌లో జోష్నా చినప్ప (తమిళనాడు) 15వ సారి, పురుషుల సింగిల్స్‌లో సౌరవ్ గోషాల్ (తమిళనాడు) 12వ సారి చాంపియన్స్‌గా నిలిచారు. ఫైనల్స్‌లో జోష్నా 3-1తో లక్ష్య (తమిళనాడు)పై, సౌరవ్ 3-1తో మహేశ్ (మహారాష్ట్ర)పై గెలిచారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : జాతీయ స్క్వాష్ చాంపియన్‌షిప్-2017
ఎప్పుడు : ఆగస్టు 27
ఎవరు : విజేతలు జోష్నా చినప్ప (మహిళలు), సౌరవ్ గోషాల్ (పురుషులు)

బెల్జియం గ్రాండ్‌ప్రి టైటిల్ విజేత హామిల్టన్మెర్సిడెస్ జట్టు డ్రైవర్ లూయిస్ హామిల్టన్ బెల్జియం గ్రాండ్‌ప్రి టైటిల్ గెలుచుకున్నాడు. ఆగస్టు 28న జరిగిన రేసులో గంటా 24 నిమిషాల 42.820 సెకన్లలో గమ్యాన్ని చేరుకొని విజేతగా నిలిచాడు. హామిల్టన్‌కు ఈ ఏడాది ఇది ఐదో టైటిల్ కాగా కెరీర్‌లో 200వది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : బెల్జియం గ్రాండ్‌ప్రీ - 2017 విజేత
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : లూయిస్ హామిల్టన్ 

ప్రొఫెషనల్ కెరీర్‌లో మేవెదర్‌కు 50వ విజయం అమెరికా స్టార్ బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ జూనియర్ ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో వరుసగా 50వ విజయాన్ని నమోదు చేశాడు. ఆగస్టు 28న జరిగిన ‘సూపర్ ఫైట్’ బౌట్‌లో 40 ఏళ్ల మేవెదర్ కానర్ మెక్‌గ్రెగోర్ (ఐర్లాండ్)పై టెక్నికల్ నాకౌట్ పద్ధతిలో విజయం సాధించాడు. తద్వారా పోటీపడిన 50 బౌట్‌లలోను విజేతగా నిలిచిన మేవెదర్, 49 వరుస విజయాలతో అమెరికా హెవీవెయిట్ ప్రొఫెషనల్ బాక్సర్ రాకీ మర్సియానో పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ చరిత్రలో ఖరీదైన బౌట్‌లలో ఒకటిగా గుర్తింపు పొందిన ఈ పోటీ ద్వారా మేవెదర్ సుమారు 20 కోట్ల డాలర్లు (రూ.1,277 కోట్లు)... మెక్‌గ్రెగోర్ సుమారు 10 కోట్ల డాలర్లు (రూ. 638 కోట్లు) ఆర్జించారు.
2015లో మ్యానీ పకియావ్ (ఫిలిప్పీన్స్‌)తో జరిగిన బౌట్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించిన మేవెదర్ కెరీర్‌లో 50వ విజయం సాధించాలనే ఉద్దేశంతో రిటైర్మెంట్‌ను ఉపసంహరించుకున్నాడు.
క్విక్ రివ్యూ: ఏమిటి : ప్రొఫెషనల్ బాక్సింగ్‌లో వరుసగా 50వ విజయం 
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : ఫ్లాయిడ్ మేవెదర్ జూనియర్

క్రీడల్లో ప్రతిభాన్వేషణ కోసం ప్రత్యేక పోర్టల్ క్షేత్ర స్థాయి నుంచి క్రీడల్లో విశేష ప్రతిభ ఉన్న వారిని గుర్తించేందుకు కేంద్ర క్రీడా శాఖ రూపొందించిన ‘జాతీయ క్రీడా ప్రతిభాన్వేషణ’ పోర్టల్‌ను ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆగస్టు 28న ఆవిష్కరించారు. ఎనిమిదేళ్లకు పైబడి వయస్సు కలిగిన వారు ఏదైనా క్రీడల్లో నైపుణ్యం ఉంటే www.nationalsportstalenthunt.com పోర్టల్‌లో తమ బయోడేటా లేక వీడియోలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో నుంచి క్రీడా శాఖ తగినవారిని ఎంపిక చేసి తమ ‘సాయ్’ కేంద్రాల్లో శిక్షణ ఇస్తుంది. అలాగే ఎనిమిదేళ్లపాటు రూ.5 లక్షల చొప్పున వెయి్య స్కాలర్‌షిప్‌లను అందిస్తారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : జాతీయ క్రీడా ప్రతిభాన్వేషణ పోర్టల్ ప్రారంభం 
ఎప్పుడు : ఆగస్టు 28
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
ఎందుకు : ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించేందుకు

బీసీసీఐ ఆఫీస్ బేరర్లను తొలగించండి : సీఓఏ 
 జస్టిస్ ఆర్‌ఎం లోధా ప్యానెల్ సూచించిన సంస్కరణల అమలు తీరుపై పరిపాలక కమిటీ (సీఓఏ) తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ విషయంలో ఏమాత్రం సహకారం అందించడం లేదని, బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సీకే ఖన్నా, కోశాధికారి అనిరుధ్ చౌదరి, కార్యదర్శి అమితాబ్ చౌదరి సహా ఆఫీస్ బేరర్లను తొలగించాలని సుప్రీం కోర్టును కోరింది. ఈ మేరకు తమ ఐదో స్టేటస్ రిపోర్టును కోర్టుకు అందించింది. ఈ 26 పేజీల నివేదికలో బోర్డు పనితీరుపై ఘాటుగా స్పందించింది.

బల్గేరియా ఓపెన్ సింగిల్స్ విజేత లక్ష్య సేన్ ప్రపంచ జూనియర్ నంబర్‌వన్, భారత యువ బ్యాడ్మింటన్ ఆటగాడు లక్ష్య సేన్ సీనియర్ స్థాయిలో బల్గేరియా ఓపెన్ సిరీస్ టోర్నమెంట్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆగస్టు 17న పురుషుల సింగిల్స్ ఫైనల్లో 16 ఏళ్ల లక్ష్య సేన్ 18-21, 21-12, 21-17తో రెండో సీడ్ జ్వొనిమిర్ దుర్కిన్‌జాక్ (క్రొయేిషియా)పై గెలుపొందాడు. ఇటీవలే ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్ పీటర్ గేడ్ (డెన్మార్క్) వద్ద పది రోజులపాటు శిక్షణ తీసుకున్న లక్ష్యసేన్ ఈ ఏడాది జాతీయ సీనియర్ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా కూడా నిలిచాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : బల్గేరియా ఓపెన్ - 2017
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : పురుషుల సింగిల్స్ విజేత లక్ష్యసేన్ 

ఆలిండియా ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేత శివాని పుణే వేదికగా జరిగిన ఆలిండియా ర్యాంకింగ్ సీనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలంగాణ క్రీడా కారిణి గద్దె రుత్విక శివాని చాంపియన్‌గా నిలిచింది. ఆగస్టు 20న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఖమ్మం జిల్లాకు చెందిన రుత్విక శివాని 21-10, 21-13తో ఐదో సీడ్ అనురా ప్రభుదేశాయ్ (గోవా)పై విజయం సాధించింది. విజేతగా నిలిచే క్రమంలో ఆరు మ్యాచ్‌ల్లో నెగ్గిన రుత్విక శివాని తన ప్రత్యర్థులకు ఒక్క గేమ్ కూడా కోల్పోలేదు. అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన రుత్విక నలుగురు సీడెడ్ క్రీడాకారిణులను ఓడించింది.
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆలిండియా ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 
ఎప్పుడు : ఆగస్టు 20
ఎవరు : విజేత గద్దె రుత్విక శివాని
ఎక్కడ : పుణె 

హాకీ ఆసియాకప్ స్పాన్సరర్‌గా హీరో మోటోకార్ప్ బంగ్లాదేశ్‌లో అక్టోబర్ నుంచి జరిగే ఆసియాకప్ హాకీ టోర్నీకి హీరో మోటోకార్ప్ స్పాన్సరర్‌గా వ్యవహరించనుంది. దాదాపు 32 ఏళ్ల తర్వాత బంగ్లా నిర్వహిస్తోన్న ఈ టోర్నీ ఢాకాలోని మౌలానా భషానీ జాతీయ స్టేడియంలో ప్రారంభం కానుంది. ఇప్పటికే అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్)కి తాము భాగస్వామిగా వ్యవహరిస్తున్నామని, ప్రస్తుతం దీన్ని ఆసియా హాకీ సమాఖ్య (ఏహెచ్‌ఎఫ్)కు విస్తరిస్తున్నామని హీరో సంస్థ చీఫ్ పవన్ ముంజాల్ తెలిపారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : హాకీ ఆసియాకప్ - 2017
ఎప్పుడు : అక్టోబర్‌లో 
ఎవరు : స్పాన్సరర్‌గా హీరో మోటోకార్ప్ 
ఎక్కడ : ఢాకా, బంగ్లాదేశ్ 

ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నాదల్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ సంఘం (ఏటీపీ) ఆగస్టు 21న విడుదల చేసిన పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్‌‌సలో స్పెయిన్ ప్లేయర్ రఫెల్ నాదల్ అగ్రస్థానాన్ని తిరిగి దక్కించుకున్నాడు. 2014 జూలై తర్వాత నాదల్ అగ్రస్థానానికి చేరుకోవడం ఇదే తొలిసారి. దీంతో ఇప్పటివరకు టాప్ ర్యాంకులో ఉన్న ఆండీ ముర్రే (బ్రిటన్) రెండోస్థానానికి పడిపోయాడు. ఇటీవల జరిగిన సిన్సినాటీ టోర్నీలో నాదల్ క్వార్టర్‌ఫైనల్‌కు చేరగా.. గాయం కారణంగా ముర్రే టోర్నీకి దూరమయ్యాడు. దీంతో ర్యాంకింగ్‌‌సలో నాదల్ ఎగబాకాడు. 
తాజా ర్యాంకింగ్‌‌సలో నాదల్, ముర్రే , రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), స్టాన్ వావ్రింకా (స్విట్జర్లాండ్), నోవాక్ జొకోవిచ్ (సెర్బియా), అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ), మారిన్ సిలిచ్ (క్రొయేషియా), డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా), దిమిత్రోవ్, కీ నిషికోరి (జపాన్) వరుసగా తొలి పది స్థానాల్లో నిలిచారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఏటీపీ ర్యాంకింగ్స్ 
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : పురుషుల సింగిల్స్‌లో నెంబర్ వన్‌గా రఫెల్ నాదల్ 

ఫిబా ఆసియా కప్ విజేత ఆస్ట్రేలియా ఫిబా ఆసియా బాస్కట్‌బాల్ కప్ (ఫిబా బాస్కెట్‌బాల్ చాంపియన్‌షిప్)ను ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. లెబనాన్ రాజధాని బీరుట్‌లో ఆగస్టు 21న జరిగిన ఫైనల్లో ఆసీస్ 79-56తో ఇరాన్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచింది. రెండేళ్లకోసారి జరిగే ఈ టోర్నీని ఆస్ట్రేలియా గెలుచుకోవడం ఇదే తొలిసారి. చైనా అత్యధికంగా 16 సార్లు ఈ కప్‌ను కైవసం చేసుకుంది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఫిబా ఆసియా బాస్కెట్‌బాల్ కప్ - 2017 
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : విజేత ఆస్ట్రేలియా 

‘సిన్సినాటి’ చాంపియన్స్ దిమిత్రోవ్, ముగురుజా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ సన్నాహక టోర్నీల్లో భాగమైన సిన్సినాటి మాస్టర్స్ టెన్నిస్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్‌లో గ్రిగోర్ దిమిత్రోవ్ (బల్గేరియా), మహిళల సింగిల్స్‌లో ముగురుజా (స్పెయిన్) టైటిల్స్‌ను సొంతం చేసుకున్నారు. ఫైనల్స్‌లో దిమిత్రోవ్ 6-3, 7-5తో నిక్ కిరియోస్ (ఆస్ట్రేలియా)పై... నాలుగో సీడ్ ముగురుజా 6-1, 6-0తో రెండో సీడ్ సిమోనా హలెప్ (రొమేనియా)పై విజయం సాధించారు. చాంపియన్‌‌సగా నిలిచిన దిమిత్రోవ్‌కు 9,54,225 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 6 కోట్ల 12 లక్షలు)తోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... ముగురుజాకు 5,22,450 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 3 కోట్ల 35 లక్షలు)తోపాటు 900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : సిన్సినాటి మాస్టర్స్ టోర్నమెంట్ - 2017
ఎప్పుడు : ఆగస్టు 21
ఎవరు : పురుషుల సింగిల్స్ విజేత దిమిత్రోవ్, మహిళల సింగిల్స్ విజేత ముగురుజా

ప్రపంచ అథ్లెటిక్స్‌లో బార్బరా స్పొటకోవాకు స్వర్ణం 
 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో చెక్ రిపబ్లిక్ జావెలిన్ త్రోయర్ బార్బరా స్పొటకోవా స్వర్ణం గెలుచుకుంది. ఆగస్టు 9న జరిగిన మహిళల జావెలిన్ త్రో ఫైనల్స్‌లో 36 ఏళ్ల స్పొటకోవా ఈటెను 66.76 మీటర్ల దూరం విసిరి అగ్రస్థానాన్ని సంపాదించింది. తద్వారా 2007 ఒసాకా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం గెలిచిన స్పొటకోవా పదేళ్ల తర్వాత మళ్లీ విశ్వవిజేతగా నిలిచింది. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణాలు గెలిచిన ఆమె, 2016 రియో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించింది. 
పురుషుల 400 మీటర్ల విభాగంలో ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ వేడ్ వాన్ నికెర్క్ టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. 43.98 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ - 2017
ఎప్పుడు : ఆగస్టు 9 
ఎవరు : మహిళల జావెలిన్ త్రోలో బార్బరా స్పొటకోవాకు స్వర్ణం 
ఎక్కడ : లండన్ 

పారా అథ్లెట్ సువర్ణారాజ్‌కు ఎన్‌సీపీఈడీపీ పురస్కారం ప్రముఖ పారా అథ్లెట్ సువర్ణారాజ్ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యారు. వికలాంగుల సంక్షేమానికి విశేషంగా కృషి చేస్తున్నందుగు గుర్తింపుగా National Centre for Promotion of Employment for Disabled People(NCPEDP) అందజేసే Mphasis Universal Design Award for 2017 పురస్కారానికి ఎంపికయ్యారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : పారా అథ్లెట్ సువర్ణరాజ్‌కు Mphasis Universal Design అవార్డు 
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : ఎన్‌సీపీఈడీపీ
ఎందుకు : వికలాంగుల సంక్షేమానికి కృషి చేసినందుకు గాను 

కెరీర్ చివరి రేసులో విఫలమైన ఉసేన్ బోల్డ్ జమైకా స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఆఖరి రేసుని పూర్తి చేయకుండానే కెరీర్ ముగించాడు. లండన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆగస్టు 12న జరిగిన 4 × 100 మీటర్ల రిలేలో తొడ కండరాలు పట్టేయడంతో బోల్ట్ రేసుని ముగించలేకపోయాడు.
ఈ రేసులో చిజిండు ఉజా, అడమ్ జెమిలి, డానియెల్ టాల్‌బోట్, నెథనీల్ మిచెల్ బ్లేక్‌లతో కూడిన బ్రిటన్ (37.47 సెకన్లు) జట్టు బంగారు పతకం గెలుపొందింది. రోడ్జర్స్, గాట్లిన్, బాకన్, కోల్మన్‌లతో కూడిన అమెరికా (37.52 సెకన్లు) జట్టు రజతం, జపాన్ (38.04 సెకన్లు) బృందం కాంస్యం చేజిక్కించుకున్నాయి. 
అన్నీ స్వర్ణాలే... బోల్ట్ ఒలింపిక్స్‌లో 8 స్వర్ణాలు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 11 పసిడి పతకాలు గెలిచాడు. లండన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం (100 మీ.) నెగ్గాడు. ఒసాకా ప్రపంచ చాంపియన్‌షిప్ (2007)లో రజతాలు (200 మీ., 4×100 మీ. రిలే) గెలిచాడు. మొత్తం మీద 22 పతకాల్లో 19 బంగారు పతకాలున్నాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ముగిసిన ఉసేన్ బోల్ట్ కెరీర్ 
ఎప్పుడు : ఆగస్టు 12
ఎక్కడ : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్, లండన్ 

ఆసియా షాట్‌గన్ పోటీల్లో రష్మీ జంటకు స్వర్ణంఆసియా షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్ చివరి రోజైన ఆగస్టు 13న భారత్ స్వర్ణ పతకం గెలుచుకుంది. హైదరాబాద్ షూటర్ రష్మీ రాథోడ్ తన భాగస్వామి మేరాజ్ అహ్మద్ ఖాన్‌తో కలిసి భారత్‌కు స్కీట్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో పసిడి పతకాన్ని అందించింది. ఫైనల్లో రష్మీ-మేరాజ్ ద్వయం 28-27తో లియూ జియాంగ్‌చి-గావో జియాన్‌మీ (చైనా) జోడీపై విజయం సాధించింది. ఈ పోటీల్లో ఓవరాల్‌గా భారత్ ఎనిమిది పతకాలు సాధించింది. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ఆసియా షాట్‌గన్ చాంపియన్‌షిప్
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : స్కీట్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం 
ఎక్కడ : ఆస్తానా 

జావెలిన్ త్రో ఫైనల్లో దవీందర్‌కు 12వ స్థానంప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జావెలిన్ త్రో విభాగంలో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించిన దవీందర్ సింగ్.. ఫైనల్లో 12వ స్థానంలో నిలిచాడు. అతను ఈటెను 80.02 మీటర్ల దూరం విసిరాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జావెలిన్ త్రో ఫైనల్
ఎప్పుడు : ఆగస్టు 13
ఎవరు : 12వ స్థానంలో నిలిచిన దవీందర్ సింగ్ 
ఎక్కడ : లండన్ 

విదేశీగడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భారత్ శ్రీలంకతో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌ను భారత్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. ఆగస్టు 14న ముగిసిన మూడో టెస్టులో 171 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ ఈ ఘనతను నమోదు చేసింది. తద్వారా విదే శాల్లో తొలిసారి టెస్ట్ సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. విదేశాల్లో భారత్‌కు ఇటువంటి విజయాన్ని అందించిన తొలి కెప్టెన్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. గతంలో న్యూజిలాండ్‌పై భారత్ నాలుగు టెస్టుల సిరీస్‌ను 3-1తో నెగ్గింది. మూడో టెస్టులో రాణించిన హార్దిక్ పాండ్యాకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’.. సిరీస్‌లో రెండు సెంచరీలు చేసిన శిఖర్ ధావన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : విదేశీగడ్డపై తొలిసారి టెస్ట్ సిరీస్ 3-0 తేడాతో క్లీన్ స్వీప్ 
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : భారత్ 
ఎక్కడ : శ్రీలంకలో 
ఎందుకు : శ్రీలంకను 3-0 తేడాతో ఓడించిన భారత్ 

టెస్టుల్లో ధోని రికార్డుని అధిగమించిన కోహ్లి విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన రెండో భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం ద్వారా ఈ ఘనతను నమోదు చేశాడు. గతంలో ధోని ఆరు విదేశీ టెస్టు విజయాల్ని సాధించగా శ్రీలంకపై విజయం కోహ్లీకి ఏడోది. విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన రికార్డు సౌరవ్ గంగూలీ పేరిట ఉంది. గంగూలీ తన కెరీర్‌లో 11 విదేశీ టెస్టు విజయాల్ని సాధించాడు. భారత కెప్టెన్ గా గంగూలీ 49 టెస్టులకు సారథ్యం వహించగా, ధోని 60 టెస్టులకు, కోహ్లి 29 టెస్టులకు సారథిగా పనిచేశాడు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి : విదేశాల్లో అత్యధిక టెస్టు విజయాలు సాధించిన రెండో భారత కెప్టెన్ 
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : విరాట్ కోహ్లీ
ఎందుకు : శ్రీలంకపై విజయం ద్వారా ఏడో టెస్టు విజయాన్ని సాధించిన కోహ్లీ

అలెగ్జాండర్ జ్వెరెవ్‌కు రోజర్స్ కప్ఏటీపీ మాస్టర్స్ సిరీస్ రోజర్స్ కప్ టోర్నమెంట్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ) గెలుచుకున్నాడు. మాంట్రియల్ (కెనడా)లో ఆగస్టు 15న జరిగిన ఫైనల్లో రోజర్ ఫెదరర్(స్విట్జర్లాండ్)ను అలెగ్జాండర్ జ్వెరెవ్ ఓడించాడు. పురుషుల డబుల్స్ టైటిల్‌ను హెర్బర్ట్, మహుట్ (ఫ్రాన్స్) జోడీ గెలుచుకుంది.

ఉసేన్ బోల్ట్ ఆఖరి పరుగుకు ప్రత్యేక బూట్లులండన్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ తర్వాత తాను రిటైరవుతున్నట్లు ప్రకటించిన జమైకన్ దిగ్గజ అథ్లెట్ ఉసేన్ బోల్ట్ ఆఖరి రేసుకు ప్రత్యేక బూట్లు సిద్ధమయ్యాయి. ప్రఖ్యాత షూ కంపెనీ ‘ప్యుమా’ బోల్ట్ వేగాన్ని, తేజాన్ని ఆవిష్కరించే విధంగా ఈ బూట్లను తయారు చేసింది. ఈ మేరకు ఆగస్టు 1న బోల్ట్ తల్లిదండ్రులు వెల్లెస్లీ, జెన్నిఫర్ బోల్ట్ ఈ బూట్లను అతనికి అందజేశారు. 
ఈ రెండు బూట్లు విభిన్న రంగుల్లో ఉన్నాయి. ఒక బూటు పర్పుల్ కలర్‌లో ఉంది. ఇది బోల్ట్ ఓనమాలు నేర్చుకున్న ‘విలియం నిబ్ హైస్కూల్’కు సంబంధించిన కలర్ కాగా... దీనిపై ఫరెవర్ (ఎప్పటికీ) అని రాసివుంది. మరో బూటుపై ఫాస్టెస్ట్ (వేగం) అని ఒమెగా సింబల్‌తో ఉంది. ఇది ముగింపునకు నిదర్శనమని ‘ప్యుమా’ సంస్థ తెలిపింది. ఈ రెండు షూలపై ప్రత్యేక రాతలు, గీతలు అతని కెరీర్ హైలైట్స్‌ను సూచిస్తాయి. రెండు సాక్స్ అతని ఘనతల్ని తెలిపేలా ప్రత్యేకంగా ఉన్నాయి. 
లండన్ ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆగస్టు 4న జరగనున్న రేసు బోల్ట్ కెరీర్‌లో చివరి పరుగుపందెం. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి
 : ఉసేన్ బోల్ట్ ఆఖరి రేసుకి ప్రత్యేక బూట్లు 
ఎప్పుడు : ఆగస్టు 4
ఎక్కడ : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్, లండన్

నెమార్ కోసం 1,661 కోట్లు చెల్లించిన పీఎస్‌జీబ్రెజిల్ జట్టు కెప్టెన్, స్టార్ ప్లేయర్ నెమార్ జూనియర్ కోసం ఫ్రాన్స్‌కు చెందిన పారిస్ సెయింట్-జెర్మయిన్ (పీఎస్‌జీ) క్లబ్ జట్టు భారీ మొత్తం చెల్లించింది. ప్రొఫెషనల్ లీగ్‌‌సలో ప్రస్తుతం స్పెయిన్‌కు చెందిన బార్సిలోనా క్లబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న నెమార్ ఇక నుంచి పీఎస్‌జీ జట్టుకు ఆడనున్నాడు. 2013లో బార్సిలోనా జట్టుతో చేరిన నెమార్ 2018 జూన్ వరకు బార్సిలోనాకు ఆడాల్సి ఉంది. అయితే నెమార్‌ను ఒప్పందం గడువు పూర్తికాకముందే బదిలీ చేయాలంటే తమకు 22 కోట్ల 20 లక్షల యూరోలు (రూ.1,661 కోట్లు) చెల్లించాలని పీఎస్‌జీ జట్టుకు బార్సిలోనా షరతు విధించింది. దీనికి అంగీకరించిన పీఎస్‌జీ జట్టు ఈ మొత్తాన్ని బార్సిలోనాకు చెల్లించి నెమార్‌ను కొనుగోలు చేసింది. 2022 వరకు పీఎస్‌జీ జట్టుకు ఆడనున్న నెమార్‌కు ఆ క్లబ్ ఏడాదికి 4 కోట్ల 50 లక్షల యూరోలు (రూ. 336 కోట్లు) వేతనంగా చెల్లించనుంది. దీంతో ఇది ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ఖరీదైన బదిలీగా నిలిచింది. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో ఖరీదైన బదిలీ 
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : నెమార్ కోసం రూ.1,661 కోట్లు చెల్లించిన పీఎస్‌జీ 
ఎందుకు : బార్సిలోనా నుంచి పారిస్ సెయింట్-జెర్మయిన్ జట్టుకి బదిలీ కోసం 

ఆసియా షాట్‌గన్ షూటింగ్‌లో అంకుర్‌కు స్వర్ణం 

ఆసియా షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ అంకుర్ మిట్టల్ స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకున్నాడు. కజకిస్తాన్‌లోని అస్తానాలో జరిగిన ఈ టోర్నీలో భాగంగా ఆగస్టు 5న జరిగిన పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో అంకుర్ వ్యక్తిగత విభాగంతోపాటు, టీమ్ విభాగంలోనూ భారత్‌కు పసిడి పతకాన్ని అందించాడు. ఆరుగురు పాల్గొన్న వ్యక్తిగత విభాగం ఫైనల్లో అంకుర్ 71 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. ఖాలిద్ అల్కాబి (యూఏఈ-70 పాయింట్లు) రజతం, సైఫ్ అల్‌షమ్సీ (యూఏఈ-53 పాయింట్లు) కాంస్యం సాధించారు. అంకుర్, సంగ్రామ్ దహియా, మొహమ్మద్ అసబ్‌లతో కూడిన భారత బృందానికి స్వర్ణం దక్కింది. ఈ ఏడాది మెక్సికో, న్యూఢిల్లీలలో జరిగిన ప్రపంచకప్‌లలో అంకుర్ స్వర్ణ, రజత పతకాలు గెలిచాడు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఆసియా షాట్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్ 
ఎప్పుడు : ఆగస్టు 5 
ఎవరు : పురుషుల డబుల్ ట్రాప్ ఈవెంట్‌లో అంకుర్ మిట్టల్‌కు స్వర్ణం 
ఎక్కడ : ఆస్తానా, కజకిస్తాన్ 

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఫరాకు స్వర్ణం 
లండన్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో బ్రిటిష్ అథ్లెటిక్స్ దిగ్గజం మొహమ్మద్ ఫరా స్వర్ణం సాధించాడు. ఆగస్టు 5న జరిగిన పురుషుల 10 వేల మీటర్ల ఫైనల్ రేసులో 34 ఏళ్ల ఫరా 26 నిమిషాల 49.51 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచాడు. తద్వారా ప్రపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో 10 వేల మీటర్ల విభాగంలో వరుసగా మూడో స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ 
ఎప్పుడు : ఆగస్టు 5
ఎవరు : పురుషుల 10 వేల మీటర్ల రేసులో మొహమ్మాద్ ఫరాకు స్వర్ణం 
ఎక్కడ : లండన్ 

డబ్ల్యూబీవో ‘డబుల్’ టైటిల్ విజేత విజేందర్భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్.. చైనా ప్రత్యర్థి జుల్పికర్ మైమైటియాలితో ఆగస్టు 5న జరిగిన బౌట్‌లో 3-0తో విజయం సాధించాడు. దీంతో డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌తో పాటు ప్రత్యర్థికి చెందిన ఓరియంటల్ సూపర్ మిడిల్ వెయిట్ టైటిల్‌ను విజేందర్ తన ఖాతాలో వేసుకున్నాడు. 31 ఏళ్ల విజేందర్‌కు ఇది వరుసగా తొమ్మిదో విజయం. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 డబ్ల్యూబీవో టైటిల్ పోరు 
ఎప్పుడు : ఆగస్టు 6
ఎవరు : విజేత విజేందర్ సింగ్ 
ఎందుకు : చైనా బాక్సర్ జుల్పికర్ మైమైటియాలిని ఓడించిన విజేందర్(3-0 తేడాతో). 

చివరి 100 మీటర్ల రేసులో బోల్ట్‌కు కాంస్యం 
జమైకా దిగ్గజం ఉసేన్ బోల్డ్ తన చివరి 100 మీటర్ల రేసులో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆగస్టు 5న జరిగిన పురుషుల 100 మీటర్ల ఫైనల్ రేసులో ఉసేన్ బోల్డ్ 9.95 సెకన్లతో మూడో స్థానంలో నిలిచాడు. గాట్లిన్ 9.92 సెకన్లలో గమ్యానికి చేరుకొని విజేతగా నిలువగా... క్రిస్టియన్ కోల్మన్ 9.94 సెకన్లతో రెండో స్థానంలో నిలిచాడు. 
బోల్ట్ రికార్డులు 
ఒలింపిక్స్ (2008, 2012, 2016): 8 స్వర్ణాలు 
ప్రపంచ చాంపియన్‌షిప్ (2007, 2009, 2011, 2013, 2015, 2017): 11 స్వర్ణాలు, 2 రజతాలు, 1 కాంస్యం 
ఇతర అంతర్జాతీయ పతకాలు: 4 స్వర్ణాలు, 3 రజతాలు 
బోల్ట్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డులు
100 మీ. పరుగు: 9.58 సెకన్లు
200 మీ. పరుగు: 19.19 సెకన్లు
4×100 మీ. రిలే: 36.84 సెకన్లు (జమైకా జట్టులో సభ్యుడు) 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఉసేన్ బోల్డ్ చివరి 100 మీటర్ల రేసు 
ఎప్పుడు : ఆగస్టు 5
ఎక్కడ : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్, లండన్

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో టోరి బోవికి స్వర్ణం ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో అమెరికాకు చెందిన అథ్లెట్ టోరి బోవీ స్వర్ణం సాధించింది. ఆగస్టు 7న జరిగిన మహిళల 100 మీటర్ల రేసులో ఆమె 10.85 సెకన్లలో లక్ష్యాన్ని చేరి విజేతగా నిలిచింది. ఒలింపిక్ స్వర్ణ పతక విజేత, ఫేవరేట్ ఎలైన్ థాంప్సన్ (జమైకా) 5వ స్థానంలో నిలిచింది. ఐవరీ కోస్ట్‌కు చెందిన మారి జోన్ రజతం, నెదర్లాండ్స్‌కు చెందిన షిప్పర్స్ కాంస్య పతకాలు గెలుచుకున్నారు. 
పురుషుల షాట్‌పుట్‌లో న్యూజిలాండ్‌కు చెందిన థామస్ వాల్ష్ గుండును 22.02 మీటర్ల దూరం విసిరి స్వర్ణం గెలుచుకున్నాడు.
క్విక్ రివ్యూ: ఏమిటి : ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ మహిళల 100 మీటర్ల విజేత 
ఎప్పుడు : ఆగస్టు 7
ఎవరు : టోరి బోవి (అమెరికా)
ఎక్కడ : లండన్ 

ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రోజస్‌కు స్వర్ణంప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలిసారి వెనిజులా ఖాతాలో స్వర్ణ పతకం చేరింది. మహిళల ట్రిపుల్ జంప్ ఈవెంట్‌లో వెనిజులా క్రీడాకారిణి యులీమార్ రోజస్ పసిడి పతకాన్ని దక్కించుకొని కొత్త చరిత్ర సృష్టించింది. రోజస్ 14.91 మీటర్ల దూరం దూకి విజేతగా నిలిచింది. కాటరీన్ ఇబార్‌గుయెన్ (కొలంబియా-14.89 మీటర్లు) రజతం, ఓల్గా రిపకోవా (కజకిస్తాన్-14.77 మీటర్లు) కాంస్యం గెల్చుకున్నారు. 
క్విక్ రివ్యూ: 
ఏమిటి :
 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ చరిత్రలో వెనిజులాకు తొలి స్వర్ణం 
ఎప్పుడు : ఆగస్టు 8 
ఎవరు : ట్రిపుల్ జంప్‌లో యులీమార్ రోజస్‌కు స్వర్ణం 
ఎక్కడ : లండన్ 

టెస్టుల్లో ఆల్‌రౌండర్ గా జడేజా
ఆగస్టు 8న విడుదల చేసిన అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు ర్యాంకింగ్‌‌స ఆల్‌రౌండర్ల విభాగంలో జడేజా అగ్రస్థానం అందుకున్నాడు. జడేజా 438 పాయింట్లతో తొలిస్థానం కైవసం చేసుకోగా ఇప్పటిదాకా ఈ స్థానంలో ఉన్న షకీబ్ ఉల్ హసన్ (బంగ్లాదేశ్) 431 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. బౌలర్ల ర్యాంకింగ్‌‌సలోనూ జడేజా టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు. 
బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్‌‌సలో పుజారా (888 పాయింట్లు) మూడో స్థానంలో, విరాట్ కోహ్లి (813 పాయింట్లు) ఐదో స్థానంలో, రహానే (776 పాయింట్లు) ఆరో స్థానంలో ఉన్నారు. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా), జో రూట్ (ఇంగ్లండ్) వరుసగా తొలి రెండు ర్యాంక్‌ల్లో ఉన్నారు. 
క్విక్ రివ్యూ: ఏమిటి : ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్
ఎప్పుడు : ఆగస్ట్ 8 
ఎవరు : ఆల్‌రౌండర్ల విభాగంలో అగ్రస్థానంలో జడేజా

No comments:

Post a Comment